చారిత్రాత్మిక వేదికగా నిలిచిన విశాఖ సిఐఐ సదస్సు..

*చారిత్రాత్మిక వేదికగా నిలిచిన విశాఖ సిఐఐ సదస్సు..

*పెట్టుబడులకు ఏపీని గమ్య స్థానంగా నిలిపిన చంద్రబాబు..

*అన్ని ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు..

*వేగంగా అభివృద్ధి చెందనున్న రాయలసీమ..

*మీడియా సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి..

పలమనేరు(నేటి ధాత్రి)

 

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మిక వేదికగా విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు నిలిచిందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. విశాఖలో రెండు రోజులు పాటు జరిగిన సిఐఐ సమ్మిట్ విజయవంతం కావడంపై పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఈ సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడడం మాత్రమే కాదని మన రాష్ట్రంపై గ్లోబల్ దృష్టిని మళ్లీ కేంద్రీకరించిందన్నారు. పెట్టుబడులు ఒక ప్రాంతానికి మాత్రమే కాకుండా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు సమానంగా రావడం ప్రభుత్వ వికేంద్రీకరణ నిబద్ధతకు నిదర్శనం అన్నారు.ప్రతి రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుంటే ఏపీ అందుకు భిన్నంగా స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుండడంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు. మొత్తం 613 ఒప్పందాల ద్వారా 13,25, 716 కోట్ల పెట్టుబడులు, 16,13,188 ఉద్యోగాలు రావడం రాష్ట్ర అభివృద్ధి పట్ల పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యం అని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు మరియు మంత్రి లోకేష్ వ్యూహాత్మకంగా చేసిన కృషికి ఈ సదస్సు ప్రతిఫలంగా నిలిచిందని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి వారిరువురు ప్రధాన పరిశ్రమను తీసుకొచ్చి అభివృద్ధిలో ముందు ఉంచుతున్నారని తెలిపారు. ఈ సమ్మిట్ లో పవర్ సెక్టర్ లో కుదుర్చుకున్న అధిక శాతం పెట్టుబడులు రాయలసీమకే రావడం ఈ ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతోందన్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు డ్రోన్ హబ్ గా, అనంతపురం, కడప,కర్నూలు జిల్లాలు రెన్యూవల్ ఎనర్జీ హబ్ గా, తిరుపతి మ్యానుఫ్యాక్చరింగ్,చిత్తూరు టెక్స్ టై ల్ హబ్ లుగా నిలువనున్నయన్నారు.ఇక రాయలసీమ కేంద్రంగా ఏరో స్పేస్ రంగాల్లో 1200 కోట్లతో రేమాన్ సంస్థ పెట్టుబడులు పెట్టడం భవిష్యత్తులో రాయలసీమ ఏరోస్పెస్ సిటీగా ఎదిగేందుకు దోహదం కానందున్నారుగతంలో రాయలసీమలో పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజ వేసిన కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వ స్థిరత్వం, పారదర్శకత చూసి ముందుకు వస్తుండడంతో రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందనుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆయనతో పాటు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

వారి సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు: మాధవ్…

వారి సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు: మాధవ్

 

ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని మాధవ్ తెలిపారు.

 ఏపీకి కేంద్రం నుంచి లక్షన్నర కోట్ల సాయం అందిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ (AP BJP Chief Madhav) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. లక్షా 80వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. రూ.11,444 కోట్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు కేటాయించారని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా 15 బిలియన్ డాలర్ల్ ఒక లక్షా 25వేల కోట్లతో విశాఖకు రావడం డబుల్ ఇంజన్ గ్రోత్‌కు ఒక చిహ్నమని పేర్కొన్నారు. విశాఖను గ్లోబల్ గ్రోత్ సెంటర్‌గా మార్చేలా అనేక కంపెనీలు, ఐటీ సంస్థలు వస్తున్నాయని వెల్లడించారు మాధవ్.
ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. కర్ణాటక వంటి పక్క రాష్ట్రాలకు కంటగింపుగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు దగా కోరు రాజకీయాలు చేస్తూ.. వారి వైఫల్యాలను వారే బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటకలో ఫెయిల్ గవర్నమెంట్ ఉంది కాబట్టే.. ఆ పార్టీ తరపున వారు ఆక్రోశం వెలిబుచ్చుతున్నారని వ్యాఖ్యలు చేశారు. మోడీ, చంద్రబాబులు అసాధ్యమైన అంశాన్ని సాధించి.. ప్రపంచ వ్యాప్తంగా ఏపీ గురించి చర్చించుకునేలా చేశారని ఏపీ బీజేపీ చీఫ్ తెలిపారు.

కృత్రిమ మేధస్సుతో అనేక ప్రయోగాలకు విశాఖ వేదిక కాబోతుందన్నారు. ఎనర్జీ సోర్స్ కింద సోలార్, విండ్, హై ఎనర్జీలను వాడేందుకు గ్రీన్ ఎనర్జీ తయారవుతుందన్నారు. టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాన్ ఫ్యాక్చరింగ్‌లో యువత ప్రతిభకు చైనా తర్వాత ఏపీకే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అమెరికాలో ఆంక్షలు ఉండటంతో భారత దేశంలోనే వీరంతా ఉండబోతున్నారని అన్నారు. ఐదేళ్లల్లో ఐదు లక్షల ఉద్యోగాలు యువతకు వస్తాయని ప్రకటించారు. నరేంద్ర మోడీ, రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. వైజాగ్ – చెన్నై కారిడార్, బెంగుళూరు – చెన్నై కారిడార్, రాయలసీమ వైపు మరో కారిడార్‌లు రాబోతున్నాయని మాధవ్ అన్నారు. డిపెన్స్ క్రస్టల్స్, అతిపెద్ద రిఫైనరీ, జాతీయ రహదారుల కనెక్టివిటీ అన్ని ప్రాంతాలకు పెరగడం ద్వారా అభివృద్ధి మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఎలక్ట్రానికి వెహికల్ తయారు చేసే కంపెనీలు, జిందాల్ సంస్థలు, పవర్ హౌస్‌లు ఏపీకి రాబోతున్నాయని.. డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. మన రాజధాని అమరావతిలో గత ప్రభుత్వంలో అభివృద్ధి ఆగిపోయిందని… అమరావతితో వారంతా ఆటలాడుకుని నాశనం చేశారని మండిపడ్డారు. మోడీ సారథ్యంలో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి 15వేల కోట్లు కేటాయించారన్నారు. అమరావతి నుంచి అనంతపురం వరకు జాతీయ రహదారుల అనుసంధానం కాబోతున్నాయని తెలిపారు. ఏపీ జీవనాడి పోలవరం నిర్మాణం కోసం కేంద్రం ఐదు వేల కోట్లు కేటాయించిందని అన్నారు. కుడి, ఎడమ కాలువ పనులు పూర్తి చేసి త్వరలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తారని వెల్లడించారు. ఏపీని అన్ని విభాగాల్లో అబివృద్ధి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అడుగులు వేస్తున్నాయన్నారు. ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో.. ప్రతిఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. భారత దేశ ఆర్థికాభివృద్ధికి దేశ ప్రజలంతా సహకారం అందించాలని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కోరారు.

భారత అణుశక్తి మిషన్ పురోగతిపై వివరాలు కోరిన..

భారత అణుశక్తి మిషన్ పురోగతిపై వివరాలు కోరిన..

*తిరుపతి ఎంపి గురుమూర్తి..

తిరుపతి(నేటి ధాత్రి)అగస్టు
20:

 

 

చిన్న అణు రియాక్టర్ల పరిశోధన, అభివృద్ధి గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ముఖ్యమైన సమాచారాన్ని కోరారు. 2025-26 బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లతో ప్రకటించిన అణుశక్తి కార్యక్రమం ప్రస్తుత స్థితి, అలాగే తిరుపతి జిల్లాలోని ప్రముఖ విద్యా సంస్థలను ఈ పరిశోధనలో భాగం చేసే ఆలోచన ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రాంతాలవారీగా భాగస్వామ్యం, అలాగే 2033 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసే చిన్న అణు రియాక్టర్లను ఆంధ్రప్రదేశ్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించే అవకాశం ఉందా అనే విషయాలను కూడా ఆయన అడిగారు.
ఈ ప్రశ్నకు ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానం ఇస్తూ కేంద్ర బడ్జెట్ 2025లో అణుశక్తి కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద, చిన్న అణు రియాక్టర్ల పరిశోధన, అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. ఈ రియాక్టర్లు పర్యావరణ అనుకూల ఇంధన వనరుల కోసం దేశం యొక్క ప్రయత్నాలకు ఊతమిస్తాయని పేర్కొన్నారు.

భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్మాల్ మాడ్యులార్ రియాక్టర్ల అభివృద్ధి బాధ్యతలను చేపట్టిందని తెలిపారు. ప్రస్తుతం, ఇక్కడ ప్రస్తుతం మూడు రకాల స్మాల్ మాడ్యులార్ రియాక్టర్లను అభివృద్ధి చేస్తూన్నారని తెలియజేసారుపాత థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ల స్థానంలో, అధిక విద్యుత్ వినియోగ పరిశ్రమలకు విద్యుత్ అందించడానికి భారత్ స్మాల్ మాడ్యులార్ రియాక్టర్లు (బిఎంఎస్ఆర్-200), మారుమూల ప్రాంతాలకు, గ్రిడ్ సౌకర్యం లేని ప్రదేశాలకు విద్యుత్ అందించడానికి స్మాల్ మాడ్యులార్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్-55), రవాణా, పరిశ్రమల రంగాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి అవసరమైన హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి 5 మెగావాట్ థర్మల్ సామర్థ్యం గల హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్లను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ రియాక్టర్ల తొలి యూనిట్లను అణుశక్తి విభాగం స్థలాల్లో ఆ తర్వాత పాత విద్యుత్ కేంద్రాల వద్ద లేదా పరిశ్రమల దగ్గర నిర్మిస్తారని మంత్రి తెలిపారు. విశాఖపట్నంలో బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఒక కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేసిందని తెలియజేసారుఈ రియాక్టర్ల కోసం స్థలాలను ఒక ప్రత్యేక కమిటీ ఎంపిక చేస్తుందని,
ఈ రియాక్టర్ల నిర్మాణం, పరికరాల సరఫరా, ఇతర కార్యకలాపాల కోసం అవసరమైన ఏజెన్సీలు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలను బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారని తెలియజేసారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version