అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ప్రతీకే బీజేపీ గెలుపు
పాలకుర్తి తిరుపతి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి
పరకాల,నేటిధాత్రి
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించడం దేశ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వంపై ఉంచిన అపార నమ్మకానికి నిదర్శనం అని పాలకుర్తి తిరుపతి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని
నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం,నితీష్ కుమార్ నాయకత్వంలోని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మరొ విశ్వాస ముద్ర వేశారని పేర్కొన్నారు.మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగాలు,విద్యారంగం పురోగతి,అన్ని వర్గాల సంక్షేమం,ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణ వీటి కారణంగానే బీహార్ ప్రజలు ఎన్డీయేను తిరిగి ఎన్నుకున్నారని అన్నారు.
