ఓదెల లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
ఓదెల(పెద్దపెల్లి జిల్లా) నేటి ధాత్రి:
ఓదెల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి సూచన మేరకు ఓదెల మండల కేంద్రం లో జిల్లా ఉపాధ్యక్షులు శనిగరపు రమేష్ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గిపు నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు తో పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలుజరుగుతుందని అన్నారు.జీఎస్టీ తగ్గిపుతో దసరా పండగ ఘనంగా చేసుకునే అవకాశం ప్రతి పేదకుటుంబానికి దక్కిందని అలాగే అనేక ఔషధాల ధరలు తగ్గింపుతో జబ్బుతో బాధపడుతున్న ప్రజలకు మేలుజరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి రేణుకాదేవి పుల్లూరి పృద్విరాజ్ కుమారస్వామి చారి సత్యనారాయణ పద్మ రాచర్ల అశోక్ రామినేని రాజేంద్రప్రసాద్ సారంగం తదితరులు పాల్గొన్నారు.