కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-11T121454.577.wav?_=1

 

కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్థానిక ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ఉప సర్పంచ్ గోపాల్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ గడిచిన 21 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని ఆయన గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు ఇలా గ్రామాలన్నింటికీ చేరాయని వివరించారు. “ఈ పథకాలు అభ్యర్థుల విజయానికి ప్రధాన బలం అవుతాయి” అని అన్నారు,పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అదుబాటులో ఉండి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని, ప్రజలను ధైర్యంగా ఓటు అడుగుతామన్నారు.

కాంగ్రెస్ వ్యవహారం – బీసీలకు అన్యయం…

కాంగ్రెస్ వ్యవహారం – బీసీలకు అన్యయం.

వెల్దండ/ నేటి ధాత్రి :

 

బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు విధానంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసత్యాలతో, అబద్ధాలతో కాలయాపన చేస్తూ వచ్చింది అని వెల్దండ మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జంగిలి యాదగిరి ఆరోపించారు. ఈ రోజు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించవలసి వచ్చినప్పుడు న్యాయ నిపుణలతో సలహాలు సూచనలు తీసుకొని ప్రజలకు హామీలు ఇవ్వాలి.కోర్టులో 42% బీసీ కోటా నిలబడదు అని తెలిసినా కూడా తమ రాజకీయ లబ్దికోసం దుందుడుకు తనంతో, దూకుడు వ్యవహారంతో బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం కల్పిస్తామని అమలు కాని హామీలు ఇచ్చి, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే ఆయన ప్రజల కోసం ముఖ్యమంత్రి కాలేదు, ప్రజలను మోసం చేయడానికి ముఖ్యమంత్రి అయినట్టు అర్థమవుతుంది. స్థానిక ఎలక్షన్లు జరగకపోవడంతో గ్రామాలలో అభివృద్ధి ఎప్పుడో అటకెక్కింది, దానితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యలు ఎవరికి చెప్పాలో అర్ధం కావడం లేదు. కాబట్టి ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రితో తెలంగాణకు మరింత అన్యాయం జరిగే అవకాశం ఉంది.కావున బీసీ ప్రజలారా ఇకనైనా మేల్కోనండి రేవంత్ రెడ్డి కుట్రా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనీ కోరారు.

బీసీలకు 42 శాతం రిజర్వే షన్లకు కట్టుబడి ఉన్నాo…

బీసీలకు 42 శాతం రిజర్వే షన్లకు కట్టుబడి ఉన్నాo

బీఆర్ఎస్,బిజెపిలే అడ్డు కున్నాయి

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

న్యాయస్థానాల నుండి ఎలాంటి స్పందన ఉన్నా బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు ఇస్తామని ఇచ్చిన హామీ పై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. శుక్రవారంమండ లంలోని కొప్పుల జోగంపల్లి పెద్దకొడెపాక, గోవిందపూర్ హుస్సేన్ పల్లి ,పత్తిపాక గ్రామా లలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో కేంద్రం ఓటు చోరి కి పాల్పడుతుందని ప్రజల సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల లో బుచ్చిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాస్త్రీయంగా కులగణన చేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, శాసన సభలో బిల్లు పాస్ చేయించి గవర్నర్, రాష్ట్రపతికి పంపిస్తే బిజెపి అడ్డుకుందని ఆరోపిం చారు. అలాగే 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లను అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వం 50 శాతం మించకుండా కుదించింది. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కులగననచేసి రిజర్వేషన్లు పెంచాల్సి ఉండగా ఎందుకు పెంచ లేదో బీసీలకు సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి, బీఆర్ఎస్ లు బీసీల వ్యతిరేక పార్టీలుగా మిగిలి పోయాయని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి అధికార దుర్వినియోగానికి పాల్పడు తూ ఓటు చోరీ చేస్తుందని, ఓటు చోరి ఆపాలంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ పోరాటానికి మద్దతుగా ప్రజల వద్ద సంతకాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయ కులు పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి మారేపల్లి రవీందర్ చిందం రవి, చిట్టి రెడ్డి రాజిరెడ్డి డిటి రెడ్డి సామల మధుసూదన్ నిమ్మల రమేష్ వైనాల కుమార స్వామి హైదర్ కుమారస్వామి వెంకట్ రాజిరెడ్డి ఏరుకొండ శంకర్ కొమ్ముల సదానందం పైడి బిక్షపతి భద్రయ్య నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే..

టిఆర్పీ జిల్లా నాయకుడు రవి పటేల్..

భూపాలపల్లిలో ధర్నా, రాస్తారోకో..

లీడర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పీ)జిల్లా నాయకుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా, రాస్తారోకో చేశారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న విషయాన్ని గమనించిన ఎస్సై సాంబమూర్తి ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ సిబ్బందితో వెళ్లి ధర్నా చేస్తున్న నాయకులను బలవంతంగా లాక్కెళ్లి, అదుపులోకి తీసుకుని వదిలేశారు. ధర్నా సందర్భంగా టిఆర్పీ జిల్లా నాయకుడు రవి పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను అణిచివేయడానికి పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించి ఉద్యమాన్ని అణిచివేసే విధంగా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఏం జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదన్నారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి పార్టీలకు బీసీలపై చిత్తశుద్ధి లేదని, 42 శాతం రిజర్వేషన్లపై అన్ని పార్టీలు తమ ద్వంద వైఖరిని ప్రకటిస్తున్నాయన్నారు. 64శాతం ఉన్న బీసీలు తమ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ 9లో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా దొంగ కారణాలు చెప్పి వెనకబడేస్తున్నారని విమర్శించారు. అన్ని పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో లేదని, కావున ప్రజలంతా కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి నేతలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్పీ జిల్లా నాయకులు కరుణాకర్, చంద్రశేఖర్, సంతోష్, శ్రీను, వెంకన్న, సమ్మయ్య, నవీన్, అక్షయ్, సన్నీ, శంకర్రావు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

పదిఏళ్లలో బీసీలకోసం బిఆర్ఎస్ ఏం చేసింది…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T133534.280.wav?_=2

 

పదిఏళ్లలో బీసీలకోసం బిఆర్ఎస్ ఏం చేసింది.?
మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రం లో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ మాట్లాడుతు బి ఆర్ఎస్ పార్టీ పదిఏండ్లు అధికారంలో ఉండి.. బీసీ రిజర్వేషన్ల మీద కనీసం బిల్లు కూడా పాస్ చేయించుకోలేదు టిఆర్ఎస్ పార్టీ..?
బి ఆర్ఎస్ నాయకులంతా గొప్ప గొప్ప మేధావులు..
బిల్లు ఎలా పెట్టాలో తెలుసు..
ఆర్డినెన్సులు ఎలా తీసుకు రావాలో తెలుసు..
కేంద్రంతో ఎలా కోట్లాడలో తెలుసు.. అంటున్నారు..
మరి ఇన్ని తెలిసి పదేండ్లు అధికారం లో ఉండి.. బిసిల పట్ల మీరు చూపించిన నీతి ఏంటి?

నీతులు ప్రతి ఒక్కడూ చెప్తాడు.. ఆట ఆడే వాడికి తెలుసు ఎలా ఉంది పరిస్థితి అని.
దేశం లో, స్వాతంత్రం నుంచీ.. పేదల పట్ల చట్టాలు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ నే..
బిసి రిజర్వేషన్ల బిల్లు కూడా సాధించి తీరుతుంది.*
తెలంగాణ కోసం ఎన్నాళ్లు కోట్లాడితే తెలంగాణ వచ్చింది? అడగగానే తెలంగాణ ఇచ్చారా? ఎన్నో ఏండ్లు కోట్లాడితే వచ్చింది తెలంగాణ.. అది ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే..!!
బీసీ బిల్లు కూడా అంత సులువైన వ్యవహారం కాదు..!
కాంగ్రెస్ పోరాడుతుంది.. సాధిస్తుంది..!
బి ఆర్ఎస్ కి బీసీ ల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే పందేడ్లలో ఏనాడైనా బీసీ ల కోసం ఏమైనా చేసిందా? చెప్పండి..
కనీసం బి ఆర్ఎస్ నుంచి ఒక్కటంటే ఒక్క నాయకుడు కూడా ఇంప్లీడ్ పిటిషన్ వెయ్యలేదు బీసీ రిజర్వేషన్ల కేసులో..
నీతులు ప్రతి ఒక్కడూ చెప్తాడు..
బి సి రిజర్వేషన్లు మాత్రం కాంగ్రెస్ ద్వారానే సాధ్యం..అవుతుంది.!! స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న జీవో నెంబర్ స్టే హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బిజెపి టీఆర్ఎస్ పై ప్రజలు మండి పడుతున్నారని బిల్లు ఆపడంలో వారి కుట్ర స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాత రాజు రమేష్ విలేకరులకు కాంగ్రెస్ పార్టీవివరించారు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపింది బిజెపి ప్రభుత్వం కాదా? రిజర్వేషన్ 50% మించకుండా చట్టం చేసింది బిఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు ఇక్కడ రెండు పార్టీలు కుట్ర స్పష్టంగా కనబడుతుందని అదంతా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు

రిజర్వేషన్ల పేరుతో బేసి లను మోసం చేసిన ప్రభుత్వం….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T115912.178.wav?_=3

 

రిజర్వేషన్ల పేరుతో బేసి లను మోసం చేసిన ప్రభుత్వం….

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ ము ( సంగారెడ్డి జిల్లా) స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం పట్ల రెడ్డి జాగృతి నాయకులు కేసు వేసి అడ్డుకోవడం పట్ల స్పందించిన బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేసింది అని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి బీసీలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు . 5 శాతం లేని అగ్రవర్ణాలకు 10 శాతం EWS రిజర్వేషన్ ఇస్తే ఏ బీసీ నాయకులు అడ్డుకోలేదని అగ్ర వర్గాలలో ఉన్న పేదలకు న్యాయం చేయాలని కోరుకున్న బీసీ సమాజానికి నేడు రెడ్డి జాగృతి నాయకులు బీసీలకు వచ్చిన 42% రిజర్వేషన్లు పట్టు పట్టి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇలా అయితే రాబోయే రోజుల్లో బీసీలు అగ్ర వర్గాలతో రాజకీయ యుధం చేయడానికి సిద్ధమే అని హెచ్చరించారు.ఈ సమావేశంలో లో జహీరాబాద్ తాలూకా బీసీ నాయకులు కొండాపురం నర్సిములు, డా.పెద్దగొల్ల నారాయణ,పెద్దతోట రాచన్న ,కోహిర్ మండల్ నాయకులు,విశ్వనాథ్ యాదవ్,రమేష్ ముదిరాజ్,గొల్ల శ్రీనివాస్, ఉప్పల శ్రీకాంత్,అంబదాస్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి సైనికుల్లా పనిచేయాలి: ఎమ్మెల్యే, డిసిఎంఎస్ చైర్మన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T115143.728.wav?_=4

 

 

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి సైనికుల్లా పనిచేయాలి: ఎమ్మెల్యే, డిసిఎంఎస్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. గురువారం కోహీర్ మండల కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, బీఆర్ఎస్ శ్రేణులు ఈ మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ అభ్యర్థులకు కార్యకర్తలు అండగా నిలిచి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

రామాంజనేయ కాలనీ నుండి ఎంపీటీసీ బరిలో పోకల శ్రీలత…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T115909.986.wav?_=5

 

చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ నుండి ఎంపీటీసీ బరిలో పోకల శ్రీలత

 

బి.ఆర్.యస్ పార్టీకి కట్టుబడి నియమ నిబద్ధతతో ఉంటూ కార్యక్రమంలో ముందంజ పోకల శ్రీలత

గతంలో వార్డు నంబరు గా ఇండిపెండెట్ అభ్యర్ధి అత్యధిక మెజార్టీ తో గెలుపొందారు

గతంలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ అభ్యర్ధులు గెలవడంలో కీలకపాత్ర పోషించిన శ్రీలత

కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ నుండి

 

ఎంపీటీసీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న పోకల శ్రీలత బి.ఆర్.యస్ పార్టీకి కట్టుబడి నియమ నిబద్ధతో పార్టీకి కష్టపడి ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ పార్టీ యొక్క ప్రతి కార్యక్రమములో పాల్గొంటూ ముందజంలో ఉన్నారు పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమంలో చురుకుగా తనదైన శైలిలో కార్యకర్తలను పోగుచేయడంలో శ్రీలత కి సాటి లేరు పార్టీ ఇచ్చిన

ఆదేశానుసారం ప్రతి ఒక్క కార్యక్రమములో పాల్గొంటూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానంసంపాదించుకున్నారు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలందరికీ సుపరితురాలు అయ్యరూ,పోయిన ఎన్నికల్లో వార్డు నంబరు గా ఇండిపెండెట్ గా పోటీ చేసి అత్యధిక

మెజార్టీ తో గెలుపొందింది వార్డులో నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలుపరిష్కరించి అందరికీ ఇంటికి ఆడ బిడ్డ అయ్యారు,పోయిన ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్ధులు గెలవడంలో కీలక పాత్ర పోషించారు వార్డులో అత్యధిక మెజారిటీ

కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డ్స్ ను పంపించేసిన బీఆర్ఎస్ నాయకులు…

కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డ్స్ ను పంపించేసిన బీఆర్ఎస్ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

Vaibhavalaxmi Shopping Mall


కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డ్స్ ని ఖాసీంపల్లి 12 13 వ వార్డ్లొ ఇంటిఇంటికి పంచిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు

కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన 6 గ్యారంటీ లు 420 హామీలు అమలు చేయాలనీ పిఏసిఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్ డిమాండ్ చేసారు.
మునిసిపల్ పరిధిలోని 12 13 వ. వార్డుల్లో కాంగ్రెస్ బాకీ కార్డ్స్ పంపిణి సందర్బంగా సంపత్ యాదవ్ మాట్లాడుతూ ఎలక్షన్ హామీలొ భాగంగా అధకారం లోకి వచ్చింన 100 రోజుల్లో ఏక కాలం లొ ప్రతి రైతు కి 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి 41 వేల కోట్లలొ కేవలం 13 వేల రుణమాఫీ మాత్రమే చేసారని, రైతు బంధు క్రింద ఎకరాకి 15 వేల రూపాయలు ఇస్తామని గడిచిన 22 నెలల్లో ఒకసారి రైతు భరోసా నిధులు ఎగొట్టి అరకొర గా వేయడం జరిగింది అని అన్నారు.
అంతే కాక కల్యాణ లక్ష్మి క్రింద లక్ష రూపాయల తో పాటు తులం బంగారo ఇస్తామని చెప్పి మోసం చేసిందని అన్నారు.
మహిళలకు 2500 రూపాయలు, ఆదపిల్లల కు స్కూటి తో పాటు వృద్ధుల,వితంతు పెన్షన్లు 2 వేల రూపాయల నుండి 4 వేలు పెంచుతామని చెప్పి ఇప్పటికి కూడా కెసిఆర్ ఇచ్చిన 2 వేల రూపాయలు పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు
రైతులకు కనీస మద్దతు ధరతో పాటు వడ్ల కు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పడమే కాకుండా కనీసం యూరియా కూడా సప్లై చెయ్యలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేసారు,
అనేక హామీలు ఇచ్చి తెలంగాణా లొని అన్నీ వర్గాల ప్రజలని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వనికి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లొ ప్రజలు గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలొ బీ ఆర్ ఎస్ అర్బన్ ప్రెసిడెంట్ కటకం జనార్దన్, సెగ్గం సిద్దు, 13 వ వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ మంగళపల్లి తిరుపతి, మాజీ చైర్మన్ బండారి రవి, 12 వ వార్డ్ అధ్యక్షులు మేనం రాజేందర్, నాయకులు పోలేవేనా అశోక్, మామిడి కుమార్, బొంతల సతీష్, నలిగేటి సతీష్, ప్రతాప్ రెడ్డి, ఈశ్వర్, అర్బన్ నాయకులు బీబీ చారి తదితరులు పాల్గొన్నారు.

ఐనవోలు జడ్పిటిసి అభ్యర్థిగా గ్యాదరి భాస్కర్ ఆశాభావం

పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి అవకాశం ఇవ్వాలి
20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సైనికుడిలా పనిచేశాను
పార్టీ కోసం ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొన్నాం
కష్టాలు పెట్టినా కండువా మార్చలేదు, పార్టీ జెండా వీడలేదు
ఆర్ధికం కాదు అభివృద్ధియే ప్రధాన లక్ష్యం
కాంగ్రెస్ సీనియర్ నేత మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గ్యాదరి భాస్కర్

నేటిధాత్రి ఐనవోలు :-

Vaibhavalaxmi Shopping Mall

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ఎంపిక పారదర్శకంగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గ్యాదరి భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కష్ట కాలంలో సైతం కండువా మార్చకుండా పార్టీ గెలుపు కోసమే నిరంతరం కృషి చేసిన నిస్వార్థపూరితమైన నేతలకు అవకాశం కల్పించాలని ఆయన అధిష్టానాన్ని కోరారు. 2001లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రామ కాంగ్రెస్ పార్టీలో మమేకమై పనిచేస్తూ, 2006లో ఉడత గూడెం గ్రామ వార్డు సభ్యునిగా ఏకగ్రీవంగా గెలవడం జరిగింది.

 

 

పార్టీ అధికారంలో లేకపోయినా మొక్కవోని దీక్షతో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ కమిటీ సభ్యునిగా గ్రామానికి సేవలు అందించడం జరిగింది. 2014 సంవత్సరంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గ్రామస్తులు అంత ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

 

2018లో రెండవసారి ఏకగ్రీవంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను చేసిన సేవను గుర్తించి ఎన్నుకోవడం జరిగిందన్నారు.2018లో జరిగిన స్థానిక సంస్థ ల ఎన్నికల్లో రామ్ నగర్ ఎంపిటిసి గా నామినేషన్ వేస్తే మండల కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఇతరులకు మద్దతుగా నిలబడి గెలిపించడం జరిగింది.

 

2020 సంవత్సరంలో అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.శ్రీనివాస్ నేను చేసిన సేవలను గుర్తించి కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడుగా నన్ను నియమించడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు రెండు పర్యాయాలుగా కిసాన్ సెల్ మండల అధ్యక్షులుగా ఇప్పటికీ కొనసాగుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక రిజర్వేషన్లు కేటాయింపులో భాగంగా అయినవోలు జడ్పిటిసి స్థానం ఎస్సీ జనరల్ కు కేటాయించడం జరిగిందని ఎస్సీ రిజర్వేషన్ లో భాగంగా 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎస్సీ కులస్తుడైన నాకు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు జడ్పిటిసి గా అవకాశం కల్పించాలని కోరినట్లు భాస్కర్ తెలిపారు.

 

 

ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కర్షక కార్మిక చేతివృత్తిదారులు సబ్బండ వర్గాల ఆశీస్సులతో నన్ను జెడ్పిటిసిగా గెలిపించాల్సిందిగా భాస్కర్ కోరారు.

భారతీయ జనతా పార్టీలో చేరికలు …

 

భారతీయ జనతా పార్టీలో చేరికలు
పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి

మహాదేవపూర్ అక్టోబర్ 8 నేటి ధాత్రి *

 

Vaibhavalaxmi Shopping Mall

 

మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి అధ్యక్షతన మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన కంకణాల రాజిరెడ్డి మెరుగు లక్ష్మణ్ సారంగపని బీజేపీ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకార్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగింది, ఈ సందర్బంగా చల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎలక్షన్స్ దృష్ట్యా బీజేపీ పార్టీలో చేరికలు అవ్వడం శుభపరిణామం అని, భారత ప్రధాని గౌ ‘శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకలు, వారి పరిపాలన ఆకార్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 22 నెలలు అవుతున్న కానీ ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు చెయ్యలేదని, రాబోయే రోజులలో తెలంగాణనలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో మహాదేవపూర్ అన్నీ స్థానాలలో పోటీ చేసి, గెలిచి తిరుతామణి,కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని,అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక భారీ మూల్యం చెల్లించుకుంటుందని వారు చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్ కుమార్,కార్యదర్శి సంతోష్, మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య యాదవ్, చాగర్ల రవీందర్,దాడిగేలా వెంకటేష్,కొక్కు రాకేష్, రాము, బల్ల శ్రావణ్ కార్యకర్తలు పాల్గొన్నారు,

 

జడ్పిటిసి బరిలో షేక్ రబ్బానీ

జడ్పిటిసి బరిలో షేక్ రబ్బానీ

◆:- అధిష్టానం అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

ఝరాసంగం కేంద్రమైన మండల కేంద్రనికి చెందిన ఏఐఎంఐఎం పార్టీ నుంచి షేక్ రబ్బానీ జెడ్పిటిసి బరిలోకి దిగేందుకు ఏఐఎంఐఎం తరఫున ముందుకొచ్చారు. పార్టీ అధిష్టానం నుంచి అవకాశం లభిస్తే, ఝరాసంగం మండలాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. షేక్ రబ్బానీ 2010 లో పార్టీ మండల అధ్యక్షులుగా రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల మధ్య నుంచి వచ్చిన నేతగా, సమస్యలపై బహుళ అనుభవం కలిగి ఉన్నానని, పార్టీ టికెట్ లభిస్తే మరింత విస్తృతంగా సేవలం
దించేందుకు సిద్ధమని అన్నారు. ఝరాసంగం మండలం నుండి జెడ్పిటిసి అభ్యర్థిగా ముగ్గురి పేర్లు ఏఐఎంఐఎం అధిష్టానానికి పంపినట్టు సమాచారం. అందులో తన పేరు కూడా ఉండడం గర్వంగా ఉందని, ప్రజలు ఆశీర్వదిస్తే మరింత సేవ చేసే అవకాశం కోరుతున్నానని పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

తెలంగాణా ప్రజల గుండెల్లో కేసీఆర్

అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం లో విసుగు చెందారు

ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండకడుదాం-సుంకె రవిశంకర్

కరీంనగర్, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ ఎస్‌ సత్తా చాటాలని, ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.

 

ఈసందర్బంగా చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ రెండేళ్లకే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్నికల్లో చూపించేలా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రేవంత్‌ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని విమర్శించిరు.

 

రైతులు, మహిళా రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారని, కొన్నిచోట్ల చెప్పులు కూడా క్యూలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిందలు వేస్తూ రేవంత్‌ సర్కారు కాలం వెళ్లబుచ్చుతోందని, రేవంత్‌ సర్కారు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

 

స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా 420 హామీలను, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. యూరియా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

పింఛన్లు పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని దు య్యబట్టారు. బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు.

 

ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ ఎవరికీ వచ్చిన క్రమశిక్షణ గల పార్టీగా అందరు బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఈసందర్బంగా కోరారు.

ప్రజలు చైతన్యవంతులై అన్ని గమనిస్తున్నారు..

ప్రజలు చైతన్యవంతులై అన్ని గమనిస్తున్నారు..

ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము ఎప్పుడు అండగా ఉంటాం…
బి ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మొగుళ్ళపల్లి

నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా

Vaibhavalaxmi Shopping Mall

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి బాకీ కార్డు అందజేసిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి * మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య*

ప్రజలతో మాట్లాడుతూ….
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది అంటూ 22 నెలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కవ్యక్తికీ పడ్డ బాకీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేయండి అంటూ వచ్చే కాంగ్రెస్ నాయకుల నుండి వసూల్ చేయాలంటూ కాంగ్రెస్ బాకీ కార్డు* ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించాలని సూచించారు,
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ పరిపాలన కంటే మేము అద్భుతంగా చేస్తామని మాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలల్లోకి వెళ్ళి ఆరు గ్యారెంటీలు 420 హామీల కార్డు ఇచ్చి ప్రజలను అత్యాశకు గురి చేసి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం జరిగింది.

100 రోజులో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 22 నెలలు గడుస్తున్నా గ్యారెంటీలు అమలు చేయలేదు.

రైతులకి ఇస్తామని చెప్పిన రైతుబంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు పైగా రైతు రాజు చేస్తామని చెప్పి రైతులను రోడ్డు మీద నిలబెట్టారు.

మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దులకు, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు.

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాటలకు,ఆశపడ్డ మా మహిళా సోదరీమణులు బోల్తాపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలల్లో చేసిన అప్పుల లెక్కలు కనిపిస్తున్నాయి కానీ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి సున్నా.

ప్రజలు చైతన్యవంతులైన్నారు, అని గమనిస్తున్నారని అన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదిగో మా బాకీ కార్డు, మాకు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో, మాజీ సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కన్నెపల్లి మండలంలో బిజెపి మండల సమావేశం…

కన్నెపల్లి మండలంలో బిజెపి మండల సమావేశం

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలో జరగబోయే స్థానిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్,మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పిలుపు మేరకు కన్నెపల్లి మండల అధ్యక్షులు మైధం ఆశన్న ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కన్నెపల్లి మండల ఎన్నికల ప్రభారి జిల్లా కార్యదర్శి,రామగౌని మహీధర్ గౌడ్ రావడం జరిగింది. కన్నెపల్లి మండలంలోని 5 ఎంపిటిసి స్థానాలలో ఆశావాహుల అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించారు.ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు,ప్రజా సమస్యల పరిష్కారం కీలక అంశాలపై చర్చించి, ఎంపీటీసీ,జెడ్పిటిసి గా పోటీ చేసే అభ్యర్థుల జాబితాలు సేకరించడం జరిగింది.పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందేలా మండలం లోని ప్రతి గ్రామంలో బూత్ స్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు బేరే రామన్న యాదవ్, జిల్లా మండల నాయకులు బర్ల పోషన్న,అరికల భీమన్న,బర్ల సంతోష్,ఇందురి సత్తయ్య, పాముల మల్లేష్,ఎం. భాస్కర్,దాసరి రాజు, శ్రీనివాస్,సౌల్ల తిరుపతి, ఇందురి విజయ,గంగాధర్, పోశం,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం…

స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగ స్ఫూర్తిని, మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ దశాబ్ద కాలం పైగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను సామాజికంగా మరియు రాజకీయంగా చైతన్య పరుస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ అధినాయకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం చేయబోతుందని చిట్యాల మండల కేంద్రంలో భూపాలపల్లి జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజ్ అన్నారు.
రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సమానమైన రాజకీయ అవకాశాలు ధర్మసమాజ్ పార్టీ కల్పిస్తుందన్నారు. అగ్రవర్ణ నాయకత్వంలో నడుస్తున్న పార్టీలు మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్ని రంగాలలో అన్యాయం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్య ఉద్యోగ నామినేటెడ్ పదవులలో ముందుగా సమన్యాయం చేయాలన్నారు. తెలంగాణ బహుజన ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న అగ్రవర్ణ పార్టీలకు అభిముఖంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల స్వధర్మంతో, స్వశక్తి ఉద్యమంతో నిర్మాణమైన ధర్మసమాజ్ పార్టీ మెజారిటీ ప్రజల స్వరాజ్యకాంక్షను నెరవేర్చడానికి మాన్యశ్రీ కాన్షిరాం యుద్ధనీతితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మ యుద్ధం చేయబోతుందని శీలపాక నాగరాజ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టేవాడ కుమార్ నవాబుపేట గ్రామ కమిటీ నాయకులు చిలుముల శశి కుమార్, చిలుముల కృష్ణ,పర్లపెల్లి వంశీ బొడ్డు పాల్ చరణ్ తదితరులు పాల్గొన్నారు

న్యాల్కల్ లో స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ సమావేశం…

న్యాలకల్ మండల కాంగ్రెస్ నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల సమావేశాన్ని నిర్వహించిన

◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలంలోని ముంగి చౌరస్తా ఏ ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్ అధ్యక్షతన న్యాలకల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించటం జరిగింది.ఈ సమావేశంలో మాజీ మంత్రి డా||చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల సంధర్బంగా ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయమై న్యాలకల్ మండల కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశగా ఉన్నావారు,పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసినవారు మీ మండల అధ్యక్షులు తెలియజేసిన వెంటనే వారు మండలంలోని అన్ని గ్రామాలలో అభ్యర్థులను పరిశీలించి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నా వారి పేర్లను ఇంచార్జ్ డా౹౹చంద్రశేఖర్ ద్వారా జిల్లా పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతుంది.మరియు కచ్చితంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మరియు గ్రామాలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమా పథకాలను ప్రతి గ్రామంలో తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని, నాయకులకు వారు దిశానిర్దేశం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి పిఏసిఎస్ ఛైర్మెన్ సిద్దిలింగయ్య ఏ.యం.సి.వైస్ ఛైర్మెన్ తురుపతి రెడ్డి మాజీ జడ్పీటీసీ చంద్రప్ప మాజీ ఎంపీపీ రత్నం కాంగ్రెస్ నాయకులు మాక్సూద్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కిరణ్ గౌడ్ ఎస్సి సెల్ అధ్యక్షులు రాజేష్, తదితరులు పాల్గొన్నారు..

బహుజనులం రాజ్యాధికారం సాధించుకోవాలి…

బహుజనులం రాజ్యాధికారం సాధించుకోవాలి.

పొన్నం భిక్షపతి గౌడ్
బిఎస్పి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థగత ఎన్నికల దృష్ట్యా బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని స్థానాల గ్రామ వార్డు సభ్యులు గ్రామ సర్పంచులు అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బరిలో బీఎస్పీ ఉంటుందని
పొన్నం భిక్షపతి గౌడ్
బిఎస్పి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు
రిజర్వేషన్ల దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సీట్లను కేటాయించి పోటీ చేయబోతున్నామని అగ్రవర్ణాల రాజకీయ కుట్రలను పసిగట్టి వారిని ప్రజల్లో ఎండ కడతామని రాజ్యాధికారం యొPonnam Bhikshapathi Goud
BSP Bhupalpalli District Presidentక్క ప్రాముఖ్యతను తెలియజేసేలా ఇంటింటికి ప్రచారాన్ని తీసుకెళ్తామని రాష్ట్రంలో 92 శాతం ఉన్న బహుజనులను రాజ్యాధికార పీఠం మీద కూర్చోబెట్టడమే లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాధికారమే అణచివేయబడ్డ బహుజన కులాలకు విముక్తి కలిగిస్తుందని సమాజం యొక్క మార్పు కోరుకునే వారందరూ ఏకతాటిపైకి రావాలని ఎన్నికలలో పోటీ చేయకపోతే మన ఆస్తిత్వాన్ని కోల్పోయి అణచివేతకు గురైతామని కాబట్టి ఈ ఎన్నికలను మన భవిష్యత్తుగా భావించాలని ఈ సందర్భంగా అన్నారు

కాంగ్రెస్ హామీల అసలు స్వరూపం బహిర్గతం చేస్తాం….

కాంగ్రెస్ హామీల అసలు స్వరూపం బహిర్గతం చేస్తాం.

#బాకీ కార్డులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.

#కాంగ్రెస్ మోసాలను వెలుగులోకి తేవడమే బిఆర్ఎస్ లక్ష్యం.

#మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు,420 హామీలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచి700 రోజులు గడిచిన ఏ ఒక్క హామీ సంపూర్ణంగా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి అన్నారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని. రైతులు, కూలీలు,మహిళలు, యువకులు, నిరుద్యోగులను ఇలా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. బాకీ కార్డుల ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసగించడంపై ప్రజల సమక్షంలోనే బహిర్గతం చేస్తామని. ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ మోసం వెలుగులోకి తీసుకువచ్చి మండల, గ్రామస్థాయి నాయకులు బాకీ కార్డులను గ్రామాలలో విస్తృతంగా పంపిణీ చేయడంతో పాటు ప్రచారం చేయాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బాకీ కార్డులను బ్రహ్మస్త్రంగా వినియోగించుకొని ఎన్నికలకు సన్నద్ధం కావాలని అలాగే గ్రామాలలో రాజకీయ చైతన్యం పెంచి ప్రజలకు నిజాలను తెలియజేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వరరావు, నాయకులు పోగుల చిరంజీవి, ఇంగ్లీ శివాజీ, నాన బోయిన రాజారాం యాదవ్, మామిండ్ల మోహన్ రెడ్డి, తిరుపతి, చేరాలుగౌడ్, గుండాల కుమారస్వామి, ఊరటి అమరేందర్ రెడ్డి, నూటెంకి సూరయ్య, పోడేటి ప్రకాశం, ఖ్యాతం శ్రీనివాస్, నాగెల్లి ప్రకాష్, శ్రీనివాస్, గుమ్మడి వేణు, వై నాలా మధు, పరికినవీన్, మేడిపల్లి రాజు గౌడ్, మురాల ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికలె గ్రామాభివృద్ధికి ద్వేయంగా మారుతాయి…

స్థానిక ఎన్నికలె గ్రామాభివృద్ధికి ద్వేయంగా మారుతాయి

నేటి ధాత్రి కథలాపూర్

ఈ కాలంలో యువతరమే మార్పు తేవగల శక్తి.
గ్రామ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సిన బాధ్యత ఇప్పుడు యువతపై ఉన్నది.
స్థానిక ఎన్నికలే గ్రామాభివృద్ధికి ద్వేయంగా మారుతాయి.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని గ్రామంలో అభివృద్ధి చేసే నాయకున్ని ఎన్నుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (పౌర మరియు మానవ హక్కుల సంస్థ రాష్ట్ర కార్యదర్శి తాలూకా మల్లేష్ అన్నారు..

ఆయన మాట్లాడుతూ స్థానిక పాలనలో అభివృద్ధి లో ప్రజలు అసంతృప్తి చెందుతున్నారు నాయకులు ఒకసారి గెలిస్తే ప్రజల దగ్గరకు తిరిగి వెళ్ళరని ఆలోచన మారాలని ఆలోచన మారే విధంగా నూతనంగా ఎన్నుకోబడిన రాజకీయ నాయకుడు గ్రామ అభివృద్ధికి తోడ్పడి ఆ ఆలోచన రాకుండా చేయాలని అలాగే
ఊరికి మార్పు కావాలంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి.
ఊరిలో మార్పు రావాలంటే మొదటగా మనం మారాలి గ్రామ సమస్యలపై అవగాహన ఉన్న వారిని, అలాగే విజన్, టెక్నాలజీ, వినియోగం ఇవన్నీ గ్రామ అభివృద్ధికి పనికొచ్చే అంశాలు నిజమైన సేవ భావనతో ముందుకు వచ్చినవారు గ్రామాన్ని సక్రమ దిశలో నడిపించగలరు గ్రామ సమస్యలు ఎత్తిచూపటమే కాదు వాటి పరిష్కారం చూపే దిశగా పనిచేయగల వ్యక్తిని ఎన్నుకోవాలి అలాగే ఓటర్లు కూడా డబ్బుకు మధ్యనికి లొంగకుండా కేవలం గ్రామ అభివృద్ధి మాత్రమే కోరుకోవాలని రాష్ట్ర కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ రాష్ట్ర
కర్యదర్శి తాలూకా మల్లేష్ అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version