నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో అధికారులకు సన్మాన కార్యక్రమం…

నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో అధికారులకు సన్మాన కార్యక్రమం

రామన్నపేట నేటిదాత్రి యాదాద్రి జిల్లా

రామన్నపేట ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు
చేయాలని రామన్నపేట సాధన సమితి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు
ఈ ప్రాంతం యొక్క చరిత్రను వివరిస్తూ అధికారులుగా
వారి యొక్క సహకారం ఉండాలని సన్మాన కార్యక్రమం చేయడం జరిగినది. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత నియోజకవర్గమైన రామన్నపేట ను పరిగణలోకి తీసుకోవాలని నియోజకవర్గానికి కావలసిన అన్ని రకాల ఆఫీసులు ఉన్నాయి. నియోజకవర్గ ఏర్పాటుకు మండలంలో ఉన్న అన్ని రకాల అధికారుల సహకారం కూడా అవసరం తప్పకుండా ఉంటుంది ప్రభుత్వానికి నివేదిక ప్రభుత్వ అధికారులు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది వారి సహకారం తప్పకుండా ఉండాలని ఒకప్పుడు రామన్నపేట నియోజకవర్గం లో ఎంతోమంది గొప్ప నాయకులు అధికారులు ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారని. ఈ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలను ఈ ప్రాంతంలో ఉన్న మౌలిక సదుపాయాలను నియోజకవర్గo ఏర్పడితే అభివృద్ధికి కావలసిన వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటుకు అధికారుల అవసరం తప్పకుండా ఉండాలని నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో
రామన్నపేట సీఐ ఎన్ వెంకటేశ్వర్లుకు రామన్నపేట ఎస్సై డి నాగరాజుకు రామన్నపేట చరిత్రను వివరిస్తూ వారి యొక్క సహకారం ఉండాలని వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షులు బొడ్డుపల్లి. లింగయ్య వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎస్.కె చాంద్ ఎర్ర రమేష్ గౌడ్
నియోజకవర్గ సాధన సమితి నాయకులు వర్తక వ్యాపార సంఘం నాయకులు పోతరాజు శంకరయ్య, తెలంగాణ ఉద్యమ నాయకులు రామన్నపేట మాజీ ఉపసర్పంచ్ గంగాపురం యాదయ్య గౌడ్, పిఆర్పిఎస్ నియోజకవర్గ అధ్యక్షులు వరికల్ గోపాల్, టిడిపి మండల అధ్యక్షులు ఎండి ఫజల్, దళిత రత్న అవార్డు గ్రహీత తెలంగాణ ఉద్యమకారులు గడ్డం యాదగిరి తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ నకిరేకంటి అశోక్
బిజెపి మండల నాయకులు ఏలూరు రవి, బీఎస్పీ మండల అధ్యక్షులు నకిరేకంటి నరేష్,
సాధన సమితి నాయకులు పెండం. రవీందర్ బర్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులంతా సిద్దామవ్వాలి…

అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులంతా సిద్దామవ్వాలి

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పరకాల నియోజకవర్గ అధ్యక్షులు రావుల రంజిత్

పరకాల,నేటిధాత్రి

 

30న తెలంగాణ అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పరకాల నియోజకవర్గ అధ్యక్షులు రావుల రంజిత్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.గత8సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల హక్కులపై పోరాటం చేస్తున్నామని,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టినటువంటి హామీలు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటివరకు అమలు చేయడం లేదన్నారు,కమిటీ వేస్తానని చెప్పి సంవత్సరాలు కావస్తున్న కూడా కమిటీ వేయడం లేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు స్వచ్ఛందంగా అసెంబ్లీని ముట్టడికి సిద్ధమాయ్యమన్నారు.తెలంగాణలోని ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా కచ్చితంగా సంఘాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని పిలుపునిచ్చారు.

చట్టసభల్లో ఓంకార్ పాత్ర సభకు తరలిన ఎంసిపిఐ(యు) కార్యకర్తలు…

చట్టసభల్లో ఓంకార్ పాత్ర సభకు తరలిన ఎంసిపిఐ(యు) కార్యకర్తలు

జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

చట్టసభల్లో ఓంకార్ పాత్ర అనే అంశంపై మంగళవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరగనున్న సభకు నర్సంపేట నుండి ఎంసిపిఐ (యు) కార్యకర్తలు తరలివెళ్లారు.ఈ వాహన ర్యాలీ ని పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పెద్దారపు రమేష్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో నీతి నిజాయితీ విలువలను పెంపొందించడానికి అసెంబ్లీ టైగర్ ఓంకార్ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించే లక్ష్యంతో వారి శతజయంతి వార్షికోత్సవాల సందర్భంగా చట్టసభల్లో ఓంకార్ పాత్ర అనే అంశంపై రవీంద్రభారతి ఆడిటోరియంలో సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఓంకార్ గారి స్ఫూర్తితో నీతివంతమైన రాజకీయాల కోసం మార్క్సిజాన్ని , లెనినిజాన్ని పుణికిపుచ్చుకొని వర్గ సామాజిక ఉద్యమాలను ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ వంగాల రాగసుధ ,కుసుంబ బాపూరావు,నాగేల్లి కొమురయ్య ,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ,జిల్లా కమిటీ సభ్యులు సంగతి మల్లికార్జున్ ,ఎల్ల బోయిన రాజు, ఎండి మా షూక్ , డివిజన్ నాయకులు అనుమాల రమేష్ బుడిమే సురేందర్ , ఎండి హుస్సేన్ ,పకిడే చందర్రావు , డాక్టర్ ఘటికే కోటేశ్వర్ గణిపాక బిందు రాకేష్ మార్త నాగరాజు,సుధా,విజయ సిహెచ్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే..

టిఆర్పీ జిల్లా నాయకుడు రవి పటేల్..

భూపాలపల్లిలో ధర్నా, రాస్తారోకో..

లీడర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పీ)జిల్లా నాయకుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా, రాస్తారోకో చేశారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న విషయాన్ని గమనించిన ఎస్సై సాంబమూర్తి ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ సిబ్బందితో వెళ్లి ధర్నా చేస్తున్న నాయకులను బలవంతంగా లాక్కెళ్లి, అదుపులోకి తీసుకుని వదిలేశారు. ధర్నా సందర్భంగా టిఆర్పీ జిల్లా నాయకుడు రవి పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను అణిచివేయడానికి పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించి ఉద్యమాన్ని అణిచివేసే విధంగా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఏం జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదన్నారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి పార్టీలకు బీసీలపై చిత్తశుద్ధి లేదని, 42 శాతం రిజర్వేషన్లపై అన్ని పార్టీలు తమ ద్వంద వైఖరిని ప్రకటిస్తున్నాయన్నారు. 64శాతం ఉన్న బీసీలు తమ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ 9లో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా దొంగ కారణాలు చెప్పి వెనకబడేస్తున్నారని విమర్శించారు. అన్ని పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో లేదని, కావున ప్రజలంతా కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి నేతలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్పీ జిల్లా నాయకులు కరుణాకర్, చంద్రశేఖర్, సంతోష్, శ్రీను, వెంకన్న, సమ్మయ్య, నవీన్, అక్షయ్, సన్నీ, శంకర్రావు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version