ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. రైళ్లు, విమాన సర్వీసుల్లో అంతరాయం…

ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. రైళ్లు, విమాన సర్వీసుల్లో అంతరాయం

 

న్యూఢిల్లీని పొగమంచు దుప్పటి కప్పేసింది. ఎదురుగా ఉన్నవి కనిపించనంత దట్టంగా పొగ అలుముకుంది. వాయు నాణ్యత సూచీ 439కు పెరిగింది.

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత భారీగా పడిపోయింది. ఆదివారం ఉదయం.. రాజధాని వ్యాప్తంగా దట్టమైన పొంగ మంచు పరుచుకోవడంతో ఎదురుగా ఉన్నవేవీ కానరాని పరిస్థితి వచ్చింది. దీంతో పలు రైళ్లు, విమానాల ప్రయాణాలు వాయిదాపడ్డాయి. నేటి ఉదయం 7:30 గంటల సమయంలో ఢిల్లీలో వాయునాణ్యత సూచీ ఏక్యూఐ 439కు చేరింది. కాలుష్యం కట్టడి కోసం ఢిల్లీ అధికార యంత్రాంగం జీఆర్ఏపీ-4 నిబంధనలను శనివారం నుంచి అమలు చేస్తోంది.ఢిల్లీలోని సఫ్దర్‌ గంజ్‌లో దట్టమైన పొగమంచు కారణంగా విజిబులిటీ పూర్తిగా తగ్గిపోయింది. పాలమ్ ప్రాంతంలో 100 మీటర్లకు మించి దూరంలో ఉన్నవేవీ కనిపించని పరిస్థితి నెలకొందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దట్టమైన పొగ మంచు కారణంగా ఎయిర్ ఇండియా, ఇండిగో సహా పలు ఎయిర్‌లైన్స్‌ విమాన జర్నీలను వాయిదా వేశాయి. ఈ విషయంపై కస్టమర్లను కూడా అప్రమత్తం చేశాయి. తమ విమానం ఎప్పుడు బయల్దేరుతుందనేది ఒకసారి చెక్ చేసుకుని ఎయిర్‌పోర్టులకు రావాలని సూచించాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 35 శాతం విమాన ప్రయాణాలు ఆలస్యం అవుతున్నాయి.
అయితే.. ఈ పరిస్థితి ప్రస్తుతం క్రమంగా కుదురుకుంటోందని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఉదయం 8 గంటల సమయంలో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఉత్తర భారతంలో ఢిల్లీతోపాటు బరేలీ, లఖ్నవూ, కుషీనగర్‌లలోనూ దృశ్య మాన్యత పూర్తిగా తగ్గిపోయింది. ఇక అమృత్‌సర్, గోరఖ్‌పూర్‌లలో 100 మీటర్ల దూరంలో ఉన్నవీ కనిపించే పరిస్థితి లేదని ఐఎమ్‌డీ తెలిపింది. ప్రయాగ్‌రాజ్‌లో 200 మీటర్ల దూరంలో ఉన్నవీ కనిపించనంతగా పొగ మంచు అలుముకుందని పేర్కొంది.

పొగ మంచు కారణంగా రైళ్ల సర్వీసుల్లోనూ అంతరాయం ఏర్పడింది. రాజధాని, దురంతో, గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ వంటి అనేక రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి

 మౌని అమావాస్య అని ఎందుకు పిలుస్తారో తెలుసా..

 మౌని అమావాస్య అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

 

మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజు గోదావరి నదిలోని ఏడు సాగర సంగమాల వద్ద స్నానం ఆచరిస్తారు. దీనిని సప్త సాగర యాత్ర అని అంటారు.

Mouni Amavasya
నేటితో పుష్యమాసం ముగుస్తోంది. పుష్య బహుళ అమావాస్యను మౌని అమావాస్య అని కూడా అంటారు. ఇది ఉత్తరాయణంలో వచ్చే తొలి అమావాస్య. అసలు దీనికి మౌని అమావాస్య అని పేరు రావడానికి గల కారణాలను వేద పండితులు వివరిస్తున్నారు. ఉత్తరాయణ కాలంలో వచ్చే ఈ రోజున ఉపాసకులు, సాధువులు తదితరులు మౌనంగా వారి వారి సాధనను కొనసాగిస్తారు. ఉత్తర భారతదేశంలో మౌనవ్రతం ఆచరించే సంప్రదాయం ఉంది. అందుకు ఈ మౌనవ్రతానికి ప్రతీకగా దీనిని మౌని అమావాస్య అని పిలుస్తారు. తపస్సిద్ధి పొందిన వారిని మౌని అని అంటారు. తపస్సు అనగా తప ఆలోచన అని అర్థం. ఇంకా చెప్పాలంటే.. సంకల్పించిన విషయం మీద తప్ప వేరే ఆలోచన లేకపోవడం అని అంటారు. ఈ రోజు సముద్ర లేదా నదీ స్నానం చేయడం మంచిదని అంటారు.
చొల్లంగి అమావాస్య..

ఈ మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. గోదావరి నదిలోని ఏడు సాగర సంగమాల వద్ద స్నానం ఆచరిస్తారు. దీనిని సప్త సాగర యాత్ర అని అంటారు. ఇలా గోదావరిలో స్నానం చేయడం వల్ల చేసిన పాపాలు తొలగుతాయంటారు. ఈ సప్త సాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య రోజు చొల్లంగి వద్ద గోదావరి సంగమ స్నానంతో ముగుస్తుంది. అందుకే దీనిని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు.

సూర్యభగవానుడు..

ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడికి ఆదివారం అత్యంత ఇష్టమైన రోజు. ఈ ఏడాది జనవరి 18వ తేదీ మౌని అమావాస్య.. ఆదివారం వచ్చింది. ఈ రోజు విశేషమైన దినంగా చెబుతారు. జాతకంలో గ్రహదోషాలు ఉన్నవారు ఈ మౌని అమావాస్య రోజు.. సముద్ర లేదా నదీ స్నానం చేసి సూర్యడికి అర్ఘ్యం సమర్పించి.. ఎర్రని పువ్వులు, ఎర్ర చందనంతో అర్చన చేయాలి. దీనివల్ల సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కుజడితోపాటు రాహుకేతు గ్రహ దోషాలు తొలగి.. ఆరోగ్య ప్రదాయకుడైన ప్రత్యక్ష భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు.. బ్రహ్మీ ముహూర్తంలో.. సూర్యోదయానికి ముందు ఆ తర్వాత 90 నిమాషాల్లోపు స్నానం చేయడం మంచిదని అంటారు.

పితృ కార్యాలు..

మౌని అమావాస్య రోజు.. పితృ శాపాలు, జాతకంలో పితృ దోషాలు ఉన్న వారు అన్నదానం చేస్తే మంచిదని చెబుతారు. సంక్రాంతి రోజు ఆచరించవల్సిన దానాలు చేయలేకుంటే.. ఈ అమావాస్య రోజు చేయడం వల్ల మంచి ఫలితాన్ని అందుకుంటారని పండితులు అంటున్నారు.

సమ్మక్క తీర్థం..భూతల మహిమాన్వితం!

`మేడారం మిల మిల..కొత్త తోరణాలతో తళ తళ.

`ఆదివాసీ గిరిజన జాతర వైభవం!

`ఏడు వందల ఏళ్ల చరిత్రకు నిదర్శనం.

medaram 2026

`రాజులపై సామాంతుల తొలి తిరుగుబాటు సంతకం.

`వీర వనితల పోరు చరిత్రకు సజీవ సాక్ష్యం.

`వీర వనితలు దేవతలు గా అదృష్యమైన గొప్ప వేదిక మేడారం.

`ప్రజలకు రక్షణగా నిలుస్తూ దీవెనలిస్తున్న దైవాలా గద్దెలు.

`మేడారం వ్యాప్తంగా ప్రజలను చల్లగా చూస్తున్న అమ్మల దీవెనలు.

medaram 2026

అమ్మల వేడుకకు ప్రజా ప్రభుత్వంలో సరికొత్త హంగులు!

`పతిష్టమైన అద్భుత కట్టడాలు.

`వందల ఏళ్ల దాకా చెక్కు చెదరకుండా నిర్మాణాలు.

మంత్రులు శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్కల పట్టుదలకు నిదర్శనాలు.

`మంత్రులు దగ్గరుండి పనుల పర్యవేక్షణలు.. పరిశీలనలు.

`ఎప్పటికప్పుడు సమీక్షలు.. సంప్రదింపులు.

`ఆదివాసీలా సంసృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణ పనులు.

ఆరు నెలలుగా మంత్రులు పడుతున్న శ్రమకు నిదర్శనాలు.

`అద్భుతమైన రోడ్లు… దశబ్దాలైనా చెక్కు చెదరకుండా ప్రాంగణ పరిసరాలు.

`నిరంతరం భక్తులకు సకల సౌకర్యాలు.

`ఒకప్పుడు జాతర సమయం లోనే భక్తులు వచ్చేవారు.

`ఇప్పుడు నిరంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

`అమ్మవార్ల చెంత నిద్రలు చేస్తున్నారు.

`అందుకు అనువైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్నికల ముందు సీఎం రేవంత్‌ రెడ్డి మొక్కలు కోరుకున్నాడు.

`సీఎం రేవంత్‌ మేడారం అభివృద్ధి చేస్తామని చెప్పారు.

`ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నారు.

`ఆదివాసీల ఆత్మ గౌరవం కోసం పాటుపడుతున్నారు.

`జనమే వనమై… అమ్మలు కోలువై!

`తల్లుల దీవెనల కోసం భక్తుల ఆరాటం.

`దండుగా భక్తులు చేరుకుని అమ్మలను దర్శించునే భాగ్యం.

`రెండేళ్ల కోసారి మూడు రోజుల జనారణ్యం!

`పూజలతో పులకించే పవిత్రమైన ప్రాంతం.

`అమ్మలు నడ యాడిన విశేషమైన సుందర లోకం.

గొప్ప ఆధ్యాత్మిక ప్రపంచం…అమ్మల నామస్మరణతో మార్మోగే అరణ్యం.

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:                                             

 మేడారం అంటే ఓ గుడారం కాదు. ఓ కుగ్రామం అసలే కాదు. ఆదివాసీల ప్రజల రాజ్యం. పగిడిద్ద రాజు సంస్ధానం. ఆ రాజ్యాన్ని కాపాడిన దైవాంశ సంబూతురాలు సమ్మక్క. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతానికి దేవుడిచ్చిన వరం. సమ్మక్క దేవతా రూపం. ఇప్పటికీ మేడారాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న దేవతా మూర్తి సమ్మక్క. ఆ ప్రాంతానికి ఇలవేల్పు సమ్మక్క. ఆనాటి నుంచి నేటి వరకు పాలకుల చేత పూజలందుకుంటున్న ఇష్టదై వం సమ్మక్క. ఆదిశక్తికి ప్రతిరూపం. ప్రజలను కాపాడుకుంటున్న కుల దైవం. ఇప్పటికీ కొలిచే వారందరికీ కొంగు బంగారం. అడవిలో వెలసిన ఆడబిడ్డల ప్రతిరూపం. కుంకుమ బరిణ రూపంలో దర్శనమిస్తూ రెండేళ్లకోసారి పూజలందుకుంటున్న తీర్ధం. మేడారం మహిమాన్విత ప్రాంతం. ఆత్మగౌరవ పోరాటానికి తొలి సంతకం. తొలి చైతన్యానికి నిదర్శనం. తిరుగుబాటకు సంకేతం. ఎదిరించే నిలిచే గుండె ధైర్యానికి ఆదర్శం. తరతాలకు చెరగని, తరగని గుండె నిబ్బరాన్ని నింపిన కొండంత ఆశయం. అలాంటి మేడారంలో అడుగుపెడుతుంటేనే మనసు పులకించిపోతోంది. ఏదో ఒక శక్తి ఆవహించినంత సంతోషం కలుగుతుంది. జీవితం మీద ఆశలే కాదు, ఆశయాలు, ఆరోగ్యాలు, ఆనందాలు వెల్లివిరుస్తాయి. అందుకే మేడారం అంటేనే ఒక అద్భుమైన భావన. మేడారం తీర్దమనేది గొప్ప బావన. మనసుకు అనుభూతి నింపే దీవెన. సరిగ్గా ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి రాజరిక పాలనలో పీదనకు వ్యతిరేకంగా ఆదివాసీలు సాగించిన ఆత్మగౌరవం పోరాటం. రాజులకు ఎదిరించి నిలిచిన దీర వనితల ఆత్మత్యాగం. అంత గొప్పది మేడారం చరిత్ర. అరివీర భయంకరంగా ఆదిశక్తులుగా మారి తల్లి కూతుళ్లయిన సమ్మక్క..సారక్కలు సాగిస్తున్న యుద్దాన్ని తట్టుకోలేక వెన్నుపోటు పొడిచి అమ్మలను చంపాలని చూశారు. కాకతీయ కాలంలో జరిగిన ఈ యుద్దం ఆనవాలు ఇంకా సజీవంగానే వున్నాయి. ఆ యుద్దంలో ప్రత్యర్ధులకు యుద్దఖైదీలుగా చిక్కకుండా వారి చేతుల్లో ప్రాణాలు పోకుండా వుండేందుకు చిలకలగుట్టమీదకు వెళ్లి అదృష్యమైన ఆదిశక్తి రూపాల అవతారాలే సమ్మక్క సారక్కలు. మేడారం గూడెంలో దైర్యం నింపారు. వారికి రక్షణగా నిలిచారు. దేవతలుగా మారి అడవినంతా కాపాడారు. కాకతీయ రాజుల నుంచి మేడారం ప్రాంతాన్ని కాపాడుకున్నారు. ఆదివాసీల రాజ్యాన్ని కాపాడారు. నాటి నుంచి నేటి వరకు ఆదివాసీలను కంటికి రెప్పలా కాపాడుకుం టున్నారు. వాళ్లే సమ్మక్క…సారక్కలు. యుద్దంలో వెన్ను చూపని వీరవనితలు, గాయాల బారిన పడిపోయారు. వెన్ను పోటును తట్టుకొని కాకతీయులకు చిక్కకుండా చిలకలగుట్టకు చేరుకున్నారు. ఆ తర్వాత మాయమైపోయారు. ఇది తెలిసిన కాకతీయ రాజులు భయపడ్డారు. అప్పటి నుంచి మేడారం వైపు చూడాలంటే జడుసుకున్నారు. ఏ కాకతీయ రాజుల మూలంగా ఎలా చనిపోయారో కాకతీయ కడపటి రాజు కూడా అలాగే చనిపోవడం ఖర్మఫలితం. సంపెంగ వాగులో దూకి చనిపోయేలా జంపన్నను ఎలా చిత్రహింసలు పెట్టారో అదే తరహాలో కాకతీయ రాజుల కడపడి రాజు ప్రతాపరుద్రుడు కూడా నర్మదా నదిలో దూకి చనిపోవాల్సిన పరిస్దితి ఎదురైంది. ఇది అమ్మల ప్రతీకారమని ఇప్పటికీ చెప్పుకుంటారు. అప్పటి నుంచి రెండేళ్లకోసారి మూడు రోజుల పాటు, ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం, ఆదివాసీ పూజారులు సమ్మక్క, సారలమ్మ తీర్దాన్ని నిర్వహిస్తుంటారు. కన్నె పల్లి గుట్టల నుంచి సారలమ్మను మొదటి రోజు తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్టిస్తారు. రెండో రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. సమ్మక్కను తీసుకొచ్చేపప్పుడు ప్రభుత్వం ఎస్పీ ఆధ్వరంలో గాలిలోకి కాల్పులు కాల్పులు జరుపుకుంటూ అమ్మవారిని తీసుకొస్తారు. ఇద్దరు తల్లులు మూడో రోజు భక్తులకు దర్శనమిస్తారు. ఇలా మూడు రోజుల పాటు సమ్మక్క, సారలమ్మ జాతర జరుగుతుంది. ప్రపంచంలోనే ఇంత పెద్ద జాతర ఒక్క మేడారంలోనే జరుగుతుంది. ఈ మూడు రోజుల పాటు సాగే జాతరకు సుమారు 10 కోట్ల మంది భక్తులు హజరౌతుంటారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ నుంచే కాకుండా, కర్నాకట, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, మధ్య ప్రదేశ్‌, ఒరిస్సాల నుంచి పెద్దఎత్తున ఆదివాసీ గిరిజనునలతోపాటు, ప్రజలు కూడా హాజరౌతుంటారు. 1996లోనే సమ్మక్క జాతరను రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వంగుర్తించింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అదికారికంగా మరోసారి ప్రకటించింది. కుంభమేలను తలపించేలా జనం తండోపతండాలుగా కోట్లలో హజరౌతుంటారు. అమ్మకు మొక్కులు చెల్లిస్తుంటారు. అమ్మవారికి అంత్యంత ప్రీతిపాత్రమైన బంగారాన్ని నిలువెత్తు సమర్పిస్తారు. ఆమ్మను తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ నిలువెత్తు బెల్లం సమర్పిస్తామని మొక్కుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే పేరుకు ఆదివాసీ జాతరే అయినా కోట్లాది మంది ప్రజలకు ఇలవేల్పులుగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా సమ్మక్క తల్లి కొలువబడుతోంది. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. 

తాడ్వాయి మండలంలోని మేడారానికి వెళ్లాలంటే ఓ ముప్పై నలభై ఏళ్ల క్రితం వరకు కొంత గగనమే.. అడవిలో వున్న సమ్మక్క, సారలమ్మల దర్శనానికి భక్తులు కేవలం జాతర సమయంలోనే వెళ్లేవారు. మిగతా సమయాల్లో వెళ్లాలంటే భయపడేవారు.చుట్టూ వుండే అడవిలో క్రూరమృగాలు సంచరిస్తూ వుండేవి. సమ్మక్క , సారలమ్మ గద్దెల సమీపంలో కూడా పులులు సంచరిస్తూ వుండేవని పెద్దలు చెబుతుంటారు. పైగా అక్కడ వసతులు వుండేవి కాదు. మేడారం జాతర సమ యంలో తప్ప ప్రభుత్వ బస్సులు కూడా నడిచేవి కాదు. ప్రజలకు కూడా ఇప్పటిలాగా కార్లు అందుబాటులో లేవు. రోడ్లు కూడా సరిగ్గా వుండేవి కాదు. 1990 తర్వాత సౌకర్యాల కల్పన మొదలైంది. అయితే జాతర సమయాల్లో తాత్కాలిక సదుపాయాలు కల్పించేవారు. ఇలా ప్రతి రేండేళ్లకోసారి యుద్దప్రాతిపదికన పనులు చేపట్టేవారు. ఎందుకంటే ఆ సమయంలో మాత్రమే భక్తులు వచ్చేవారు. నాలుగో రోజు ప్రజలు అక్కడ వుండడానికి కూడా భయపడేవారు. మూడు రోజుల పాటు వనమంతా నిండిన జనం, నాలుగో రోజు మేడారం నిర్మాణుష్యమయ్యేది. ప్రభుత్వం కూడా ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపొమ్మని కోరేది. కాని ఇప్పుడు శాశ్వత సౌకర్యాల కల్పన జరిగింది. మూడువందల అరవైఐదు రోజుల పాటు భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మల సన్నిదిలో నిద్రలు చేస్తున్నారు. మొక్కులు తీర్చుకొని అక్కడే బస చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం అదికారంలోకి వస్తే, సమ్మక్క, సారక్క జాతరలను నభూతోన భవిష్యతి అనేలా నిర్వహిస్తామని, మేడారాన్ని శాశ్వత నిర్మాణాలతో అభివృద్ది చేస్తామని, మేడారానికి భక్తులు రావడానికి అవసరమైన రోడ్డు రవాణా సౌకర్యాలు అద్భుతంగా కల్పిస్తామని సిఎం. రేవంత్‌ రెడ్డి మొక్కుకున్నారు. ఆ మొక్కులు తీరేలా ఆదివాసీ సంప్రదాయాలు ఉట్టిపడేలా మేడారానికి కొత్త కొత్త హంగులు తీసుకొచ్చారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి సురేఖలు గత ఆరు నెలలుగా మేడారాన్ని దగ్గరుండి అభివృది చేయిస్తున్నారు. రాష్ట్ర ఫ్రభుత్వం అందుకోసం రూ.300 కోట్లు కేటాయించింది. గత రెండేళ్ల క్రితం జాతరకు వచ్చిన భక్తులు కూడా ఇప్పుడున్న మేడారం పరిసరాలను గుర్తుపట్టలేరు. కొన్ని సంవత్సరాలైనా సరే చెక్కు చెదకుండా వుండేలా రోడ్లతోపాటు, మేడారం గద్దెల ప్రాంగణాలతోపాటు, చుట్టుపక్కల పరిసరాలన్నీ పటిష్టమైన నిర్మాణాలతో తీర్చిదిద్దుతున్నారు. పైగా ఇప్పటి వరకు గద్దెల చుట్టూ ఇనుప కంచెలు వుండేవి. ఇప్పుడు గ్రానైట్‌ రాయితో కూడిన, శతాబ్దాల పాటు చెక్కుచెదరని గద్దెల నిర్మాణం చేపట్టారు. గద్దెల నుంచి మొదలు, ఆలయ ప్రాంగణమంతా గ్రానైట్‌ రాయితో ఆలయ స్వరూపం తీసుకొచ్చారు. తోరణాలను నిర్మాణం చేశారు. ఆ తోరణాలపై ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయలను ఆదివాసీ బాషలో చెక్కడం జరిగింది. సమ్మక్క సారక్కల కుటుంబ చరిత్రలోపాటు, వారి వంశస్తులు, పూర్వీకుల గురించి తెలిసేలా బొమ్మల లిపిలో వుండే ఆదివాసీ బాషలో రాయిపై వాటిని చెక్కారు. శతాబ్దాలపాటు చెక్కు చెదరకుండా, భవిష్యత్తు తరాలు ఆదివాసీ చరిత్రను మర్చిపోకుండా గుర్తు చేసేలా నిక్షిప్తం చేశారు. మేడారాన్ని ఇలా తీర్చిదిద్ది సిఎం. రేవంత్‌ రెడ్డి తన మొక్కులు చెల్లించుకున్నారు. జాతర చరిత్రలోనే తొలిసారి ప్రజా ప్రభుత్వం క్యాబినేట్‌ మీటింగ్‌ కూడా ఏర్పాటు చేశారు. మేడారం రాజ్యంలో తల్లుల సన్నిధిలో తెలంగాణ ప్రభుత్వ మంత్రుల సమావేశం…అధ్భుత నిర్ణయం.

మంథని పట్టణంలోని పలు కుటుంబాలను పరామర్శించిన

మంథని పట్టణంలోని పలు కుటుంబాలను పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

మంథని :- నేటి ధాత్రి

 

 

 

మంథని పట్టణంలోని పోచమ్మవాడ లో కురిమిల్ల కమలమ్మ ఇటివల మరణించగ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వారి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి మరియు బోయిన్ పేట లో కొంతం పెద్ద సమ్మయ్య, ప్రయాకర్ రావు మనోహర్ లు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను పరామర్శించి మరియు అనారోగ్యంతో బాధపడుతున్న దాసరపు సమ్మయ్య ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట నాయకులు కార్యకర్తలు వున్నారు

పిఎసిఎస్,ఎఫ్ ఎస్ సి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ…

పిఎసిఎస్,ఎఫ్ ఎస్ సి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఆవిష్కరించిన డిసిఓ నీరజ

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

 

ప్రాథమిక సొసైటీ సహకార సంఘాల పిఎసిఎస్ మరియు ఎఫ్ ఎస్ సి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వరంగల్ జిల్లా డిసిఒ నీరజ చేతుల మీదగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల అసోసియేషన్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షుడు మోడం సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకాయల సురేష్, కోశాధికారి రాచమల్ల రమణ చారి, కార్యదర్శి ప్రదీప్, దామోదర్ ,మురళి, ఈగ వెంకటేశ్వర్లు, రవి కిరణ్, రాజు, సోమశేఖర్, మేఘన, తదితరులు పాల్గొన్నారు.

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష వద్దు…

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష వద్దు.

# కెనాల్ హద్దుల నిర్ణయంలో అధికారుల తీరు ఏకపక్షం.

#బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.

# బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డా. బానోతు సారంగపాణి.

​నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

ఎస్సారెస్పీ డిబిఎం 38 కెనాల్ భూముల పరిరక్షణ విషయంలో ఇరిగేషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి విమర్శించారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల తీరుపై పలు ప్రశ్నలు సంధించారు.
​గీసుకొండ నుంచి భూపాలపల్లి జిల్లా వరకు విస్తరించి ఉన్న ఈ కెనాల్‌కు సంబంధించి, అధికారులు కేవలం నల్లబెల్లి గ్రామానికే పరిమితమై హద్దులు కేటాయించడం అన్యాయమని అన్నారు. కెనాల్ ప్రారంభం నుంచి చివరి వరకు కుడి ఎడమ హద్దులను శాస్త్రీయంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పట్టా భూములు కలిగిన రైతులను, ఇళ్లలో నివసిస్తున్న సామాన్యులను నోటీసులతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లిలోనే ఈ తరహా చర్యలు చేపట్టడం వెనుక రాజకీయ కోణం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేవలం కొంతమందిని లక్ష్యంగా చేసుకుని నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న రాజకీయ ఒత్తిళ్లపై అధికారులు సమాధానం చెప్పాలన్నారు. కాలువ భూముల పరిరక్షణకు బీఆర్ఎస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, పట్ట దారుల నుండి కొనుగోలు చేసిన బాధితులకు పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, నిబంధనల పేరుతో కేవలం ఒకే ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే బాధితుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీటీసీ జన్నుజయరావు, మాజీ సర్పంచ్ గుండాల కుమార స్వామి,సర్పంచ్ లు నాగెళ్ళి జ్యోతి ప్రకాష్, పులి రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, వార్డు సభ్యులు పరికి కోర్నేలు , కనకం నవీన్, నాగేల్లి అనిల్, పిట్టల ప్రవీణ్, బూస లక్ష్మణ మూర్తి, మైలగని కుమార స్వామి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగేల్లి శ్రీనివాస్, సట్ల శ్రీనివాస్ గౌడ్,గోనెల నరహరి, బత్తిని బిక్షపతి,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వేలాల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు…

వేలాల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో ప్రతిమ హాస్పటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు.వేలాల గ్రామ ప్రజలకు సేవ చెయ్యాలని మంచి సంకల్పంతో గ్రామ సర్పంచ్ డేగ స్వప్న- నగేష్, ఉప సర్పంచ్ సుందిళ్ల రాజలింగు ఉచిత వైద్య శిబిరానికి శ్రీకారం చుట్టారు.ప్రతిమ హాస్పిటల్ వైద్య సిబ్బంది 300 వందల మందికి ఉచిత ఓపి చూసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.అలాగే ఉచిత పరీక్షలు నిమిత్తం 40 మందిని హాస్పటల్ కి రిఫర్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్,పంచాయతీ కార్యదర్శి,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు.అలాగే ప్రతిమ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ కౌశిక్,మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జనగామ నాగరాజు,సంతోష్, సదానందం,హాస్పిటల్స్ డాక్టర్స్ పాల్గొని గ్రామ ప్రజలకు ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుని ఘనంగా జన్మదిన వేడుకలు….

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుని ఘనంగా జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన శుభాకాంక్షలు , సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొనిదొడ్డి నరసింహ సంగారెడ్డి జిల్లా కార్య కార్యదర్శి వరప్రసాద్ కార్యక్రమంలో మండల మొగుడంపల్లి అధ్యక్షుడు శ్రీను, మొగుడంపల్లి మండల ప్రధాన కార్యదర్శి లతీఫ్ షాప్, అధ్యక్షుడు , మొగుడంపల్లి యూత్ అధ్యక్షులు మహేష్ మండల్ సోషల్ మీడియా కన్వీనర్ సుభాష్ సాగర్ పాల్గొన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో ధనసిరి గ్రామంలో వివిధ పార్టీల నుంచి భారీగా చేరికలు 60 మంది చేరడం జరిగింది తెలంగాణ రాజాధికారి పార్టీలో అందరూ కలిసి తీన్మార్ మల్లన్న జన్మదినాలు జరుపుకోవడం జరిగింది,

గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత…..

గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్ర అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు తోడ్పాటు అందివ్వాలని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా ఎస్ ఆర్ ఎస్ పి భూముల ఆక్రమణ జరగడంతో అక్రమంగా భూములను ఆక్రమించుకున్న వారిపై న్యాయంగా చట్టబద్ధంగా పోరాటం చేయటంతో సంబంధిత అధికారులు స్పందించి సరిహద్దులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భూముల ఆక్రమణ అంశంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించి సొంత గ్రామ అభివృద్ధికి సహకరించి కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులకు అడ్డుకట్ట వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. రాజకీయ కక్ష సాధింపు తోనే ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నానని కొందరు నాపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని. నా సొంత స్వలాభం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ముందు వేసుకొని చేయాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదని గ్రామ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పోరాడతానని. దానికోసం మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి గ్రామ ప్రజల వెంట ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికైనా గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి గ్రామ అభివృద్ధి కొరకై పని చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని స్పష్టం చేశారు.

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 9 వార్డు పదో వార్డ్ కు సంబంధించిన…

నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

 

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 9 వార్డు పదో వార్డ్ కు సంబంధించిన సిసి రోడ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూలు జిల్లాకు జూనియర్ కళాశాలకు 9 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి 19వ తారీకు డిప్యూటీ సీఎం రాజనర్సిమతో కలిసి శంకుస్థాపన చేస్తున్నట్లు అదేవిధంగా కొత్త బస్టాండ్ కు 14 కోట్లు మంజూరయ్యాయని అది కూడా త్వరలో శంకుస్థాపన చేస్తామని నాగర్ కర్నూల్ జిల్లా ను ఒక ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు తొమ్మిదో వార్డ్ మాజీ కౌన్సిలర్ లలిత భాస్కర్ 10 వార్డ్ మాజీ కౌన్సిలర్ బాదం సునీత నరేందర్ వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు…

ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదినాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని అమృత వర్షిణి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అక్కడ నివసిస్తున్న వృద్ధులు తీన్మార్ మల్లన్న ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రజలకు మరింత సేవ చేయాలని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు.
అనంతరం భూపాలపల్లి జిల్లా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ చేసి మానవతా సేవను చాటారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ —
ప్రతి సంవత్సరం తీన్మార్ మల్లన్న జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఎల్లవేళలా ప్రజల సేవకే తాము అంకితమని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి కోసం తీన్మార్ మల్లన్న గారు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ గడపగడపకు పార్టీ నినాదాన్ని తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎస్‌పీకే సాగర్, జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, బండి సునీల్, సుంకరి సందీప్, జింకల శ్రీను, రొడ్డ శ్రీనివాస్, అనంతుల సంపత్ (బొట్టు), అశోక్, సంతోష్, రంజిత్, నవీన్, సమ్మయ్య, సాయి రాజేందర్, శ్రీధర్, రాంబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

యువతకు క్రీడలతోనే మానసిక ఉల్లాసం….

యువతకు క్రీడలతోనే మానసిక ఉల్లాసం….

ఓటమి గెలుపుకు నాంది కావాలి…

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

మంగపేట నేటిధాత్రి

 

యువతకు క్రీడలతోనే మానసిక ఉల్లాసం ఉత్తేజం కలుగుతాయని నేటి ఓటమి రేపటి గెలుపుకు నాంది కావాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు శనివారం జిల్లా సరిహద్దు గ్రామాలైన మంగపేట మండలం అకినేపల్లి మల్లారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ కొత్తగూడెం గ్రామ సర్పంచ్ కనితి సుమలత అధ్యక్షతన జరిగిన యూత్ క్రీడల విజేతల బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ యువత క్రీడా పోటీలతో పాటు విద్యా ఉపాధి రంగాల్లో రాణించాలని సేవా మార్గం అనుసరించి పేదలకు అండగా నిలవాలని అన్నారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా అకినేపల్లి మల్లారం మరియు టీ కొత్తగూడెం యూత్ సభ్యులు యువతకు క్రీడలు నిర్వహించటం మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించి యువత ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు అనంతరం క్రికెట్ షటిల్ మరియు ముగ్గుల పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో టీ కొత్తగూడెం గ్రామ సర్పంచ్ కనితి సుమలత గ్రామ రైతు పాడి ఈశ్వర్ రెడ్డి యువజన సంఘం సభ్యులు పాడి హేమంత్ రెడ్డి గాలి వేణు చిట్టిమల్ల ప్రసాద్ బోడెంపూడి శివ ప్రకాష్ గిద్ద వరుణ్ డబ్బుల ముత్యాలరావు రాట్నాల నరేష్ రెడ్డి రెండు గ్రామాల మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

వనపర్తి లో2024 సర్వే ఆదారంగ వార్డుల రిజర్వేషన్లు ఖరారు…

వనపర్తి లో2024 సర్వే ఆదారంగ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి

వనపర్తి నేటిదాత్రి .

, సీప్-2024 సర్వే ఆధారంగా వనపర్తి మున్సిపల్ ఎన్నికలకు వార్డులలో రిజర్వేషన్లను ఖరారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియను రాజకీయ పార్టీల నేతల సమక్షంలో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ సంస్థలు యాదయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సీప్-2024 సర్వే జనాభా ప్రతినిథ్య ప్రాతిపదికన మున్సిపల్ ఎన్నికలకు వార్డుల వారీ రిజర్వేషన్లను అత్యంత పారదర్శకంగా ఖరారు చేశామని కలెక్టర్ తెలిపారు. నిబంధనల ప్రకారం వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ కేటగిరీలలో మహిళలకు కేటాయించాల్సిన వార్డులను లక్కీ డ్రా సిస్టం ద్వారా ఎంపిక చేశామన్నారు . రిజర్వేషన్ల ఖరారు అనంతరం గెజిట్ విడుదల చేసి, తదుపరి జాబితా ప్రతులను కలెక్టరేట్ మున్సిపల్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ప్రదర్శించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులు, ప్రతినిధులు మరియు ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

భూపాలపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి…

భూపాలపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను శనివారం ఐడీఓసి కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నిర్వహించారు.
ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ, 30 వార్డులకు గాను ఎస్టీ – 2, ఎస్సి – 6, బిసి – 7, అన్ రిజర్వ్డ్ – 15 స్థానాలు కేటాయించినట్లు తెలిపారు.
అలాగే ఎస్టీ వార్డుల్లో 1 మహిళకు,
ఎస్సి వార్డుల్లో 3 మహిళలకు,
బిసి కేటాయించిన 7 స్థానాల్లో 3 మహిళలకు,
అన్ రిజర్వ్డ్ 15 స్థానాల్లో 8 మహిళలకు రిజర్వేషన్లు కేటాయించినట్లు వివరించారు.
రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వీడియో గ్రఫీ మధ్య లాటరీ పద్ధతిలో నిర్వహించామని, ఈ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా సాగిందని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

నూతన తాసిల్దార్ ను సన్మానించిన సర్పంచ్ నాగేందర్ పటేల్…

నూతన తాసిల్దార్ ను సన్మానించిన సర్పంచ్ నాగేందర్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల తహసీల్దార్ గా సి. భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బోరేగౌ గ్రామ నూతన సర్పంచ్ నాగేందర్ పటేల్ నాయకులు శనివారం తహసీల్దార్ ను కలిసి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. రైతుల, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తహసీల్దార్ ను కోరారు. పాలనకు పార్టీ తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు నవాబ్ సంగమేశ్వర్, నాయకులుబ్పల్గొన్నారు.

ఓట్ల కోసం కులసంఘాలను మోసం చేస్తున్న మంథని ఎమ్మెల్యే…

ఓట్ల కోసం కులసంఘాలను మోసం చేస్తున్న మంథని ఎమ్మెల్యే…
– కుల సంఘ భవన నిర్మాణాల్లో కుల వివక్ష చూపించిండు
– మంథని దాటి రాష్ట్రాన్ని మోసం చేస్తున్న దుద్దిళ్ల శ్రీధర్‌
– ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటా
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

 

ఎన్నికలు వస్తేనే అభివృద్ది పనులు గుర్తుకు వచ్చే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ ఈసారి ఓట్ల కోసం కుల సంఘాలను మోసం చేస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. శనివారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అక్టోబర్‌ మాసంలో కుల సంఘాలకు భవనాలు మంజూరు చేశానంటూ పాలాభిషేకాలు చేయించుకున్న మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్‌ ఆ భవనాలకు జనవరి 12న శంఖుస్థాపనలు చేశారని అన్నారు. అయితే మంథని పట్టణంలోని పోచమ్మ గుడి వద్ద మేర, పూసల, స్వర్ణకార, కుమ్మరి, నాయిబ్రాహ్మణ కుల సంఘాలకు ఒకే చోట భవన నిర్మాణాల కోసం శిలాఫలకాలు వేసి శంఖుస్థాపన చేశారని, అయితే ఆ ప్రాంతమంతా వాగు ఒడ్డున ఉందని, ముంపుకు గురయ్యే ప్రాంతంలో కులసంఘ భవనాలు నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. బఫర్‌ జోన్‌, నాలా నద్దీ ప్రాంతాల్లో నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తున్న క్రమంలో ఇక్కడ భవనాలు నిర్మిస్తామనడంలో అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సాధారణంగా టెండర్లు పూర్తయి సైట్‌ ఆధీనంలోకి వచ్చి కాంట్రాక్ట్‌ చేతికి సైట్‌ అందిన తర్వాతనే శిలాఫలకాలు వేసి శంఖుస్థాపనలు చేస్తుంటారని, ఒక్కోసారి కాంట్రాక్ట్‌ వచ్చి సైట్‌ ఆదీనంలోకి రాకపోసే క్యాన్సల్‌ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని ఆయన వివరించారు. కానీ ఇక్కడ ఏమీ లేకుండానే కేవలం టెండర్లు పిలిచి శంఖుస్థాపనలు చేసి కుల సంఘాలను మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ మోసం చేశాడని అన్నారు. అంటే వాగు ఒడ్డున ఉన్న కులసంఘా భవనాలన్నీ వాగులో కొట్టుకుపోవాలన్నదే ఆయన ఆలోచననా అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ కులసంఘ భవనాలు గ్రామస్థాయిలోనా లేక మండల స్థాయిలోనా నియోజకవర్గ స్థాయిలోనా అనేది ఏదీ చెప్పడం లేదని, స్పష్టత లేకుండా కుల సంఘాలకు శిలా ఫలకాలు వేసి ఆ సంఘాల్లో లొల్లి పెట్టించడమే మంథని ఎమ్మెల్యే ఆలోచన అని ఆయన అన్నారు. పోచమ్మగుడి ప్రాంతంలో భవనాలు నిర్మించాలంటే ముందుగా వాగుకు సీసీవాల్స్‌ కట్టి రక్షణ ఉందని తేలిన తర్వాతనే శంఖుస్థాపనలు చేయాల్సి ఉండగా ఆ దిశగా చేయలేదన్నారు. ఓట్లు వస్తనే ఇవన్నీ మంథని ఎమ్మెల్యేకు గుర్తుకు వస్తాయని, రెండేళ్ల కాలంలో కులసంఘ భవనాలు ఎందుకు గుర్తుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం ఓట్లు మాత్రమే దుద్దిళ్ల కుటుంబానికి కావాలని, ప్రజలపై ఎలాంటి చిత్తశుద్ది లేదని తేలిందన్నారు. అంతేకాకుండా బీద కులాలన్నింటిని ఊరి బయటపడేసి వాళ్లకు కావాల్సిన కుల సంఘాలకు మాత్రం మంథనిలో చోటు ఇచ్చారని, అంటే ఇక్కడ కులవివక్ష చూపినట్లే కదా అని అన్నారు. కాపు కుల సంఘానికి కూచిరాజ్‌పల్లి వద్ద కేటాయింపు చేశారని ఆయన వివరించారు. కులాలు లేవని అంటూనే వివక్ష చూపిస్తున్నాడని ఆయన అన్నారు. ఇప్పటికే 420హమీల చైర్మన్‌గా మంథని నియోజకవర్గాన్ని దాటి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాడని, రాబోయే రోజుల్లో రాహుల్‌ గాంధీ పక్కన చేరి రాష్ట్రం దాటి దేశాన్ని సైతం మోసం చేస్తాడని ఆయన విమర్శించారు. శిలాఫలకాలు వేసినవన్నీ కులసంఘాల భవనాల కోసం కాదని అవన్నీ ఓట్ల సంఘ భవనాలని ఆయన ఎద్దేవా చేశారు. సమాజం మేల్కొనే వరకు ప్రజలను అప్రమత్తం చేయడంలో అలసత్వం వహించకుండా నా పాత్రను పోషిస్తానని ఆయన ఈసందర్బంగా స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాలో పైసాలేవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓవైపు మొత్తుకుంటుంటే నగర అభివృద్ది సంస్థ పేరిట నిధులు ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే బిల్లులు రాక ఎంతో మంది కాంట్రాక్టర్‌లు పనులు మధ్యలోనే ఆపేస్తున్నారని ఆయన వివరించారు,. ఇప్పటికైనా కుల సంఘాల నాయకులు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ మాటలకు మోసపోవద్దని, ఈనాడు శిలాఫలకాలు వేసి మున్సిపల్‌ ఎన్నికల పూర్తయ్యాక మిమ్మల్ని పట్టించుకోడని, మళ్లీ ఎన్నికలు వచ్చాకనే మరోరూపంలో వచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడని తెలిపారు. మోసాలకు మారుపేరు అబద్దాలకు నిలువెత్తు సాక్ష్యం మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ అని ఆదారాలతో సహ ఈ సమాజం ముందు చూపుతున్నానని, మనం ఎప్పటి వరకు చైతన్యవంతులం కామో అప్పటి వరకు ఓట్ల కోసం మోసం చేస్తూనే ఉంటాడని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

అడవి శ్రీరాంపూర్ గ్రామ కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షునిగా దేశిని రాజేశం ఎన్నిక

అడవి శ్రీరాంపూర్ గ్రామ కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షునిగా దేశిని రాజేశం ఎన్నిక

ముత్తారం :- నేటి ధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు మరియు టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుదిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో అడవి శ్రీరాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన శాఖ అధ్యక్షుడిగా దేశిని రాజేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కమాన్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, ముత్తారం మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు వాజీదు పాషా, గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ ఉపేందర్, ఉప సర్పంచ్ అనవేనా హరిత తిరుపతి, వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నూతన అధ్యక్షుడు దేశిని రాజేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలని, గ్రామంలో కాంగ్రెస్‌ను మరింత బలపడేలా చేయాలని సూచించారు.

డాక్టర్ మాధవరెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన…

డాక్టర్ మాధవరెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన

రాష్ట్ర ప్రణాలిక సంఘము వైస్ చైర్మన్ చిన్నారెడ్డి

వనపర్తి నేటిదాత్రి .

 

హైదరాబాద్ ఉస్మానియా హాస్పటల్ డాక్టర్ జిల్లెల మాధవరెడ్డి 77 వ జయంతి సందర్భంగా వనపర్తి నియోజకవర్గ o జయన్న తిరుమలాపురం రోడ్డులో దివంగత డాక్టర్ జిల్లెల మాధవరెడ్డి విగ్రహాన్ని డాక్టర్ మాధవరెడ్డి సోదరుడు రాష్ట్ర ప్రణాళిక సంఘంవైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆవిష్కరిం చారు డాక్టర్ మాదవరెడ్డి జయంతి సందర్భంగా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈసందర్భంగాచిన్నారెడ్డి మాట్లాడుతూ
మా సోదరుడు డాక్టర్ మాధవ రెడ్డి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి డాక్టర్ అయి పేద ప్రజలకు వనపర్తి ప్రజలకు సేవ చేశారని తెలిపారు . వనపర్తి పట్టణంలో ప్రతి ఆదివారం ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేవారు ని పేర్కొన్నారు వనపర్తి పట్టణంలో గత సంవత్సరం మార్చి 2వ తేదీన జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కాశీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జిల్లెల మాధవ రెడ్డి గారి పేరును ఖరారు చేయడం మాధవరెడ్డి సేవలకు దక్కిన గౌరవం అని చిన్నారెడ్డి తెలిపారు. వైద్య పరంగా మాధవ రెడ్డి వనపర్తి కి చేసిన సేవలు మరువలేనివి అని దానికి గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.ఈకార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీమాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కిరణ్ కుమార్, రాష్ట్ర మైనారిటీ నాయకులు కమర్ మియా అక్తర్ జిల్లామైనారిటీ అధ్యక్షులు సమద్ మియా, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏఐపిసి అధ్యక్షులు నాగార్జునవనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షుడు రోహిత్, మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామాల సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ విభాగాల నాయకులు, కార్యకర్తలు జయన్న తిరుమలాపురం గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ తొమ్మిదో వార్డ్ బరిలో గోపతి..

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ తొమ్మిదో వార్డ్ బరిలో గోపతి..?

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ తొమ్మిదో వార్డ్ బరిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ వార్డ్ మెంబర్ గోపతి భానేష్ భార్య గోపతి కమల బరిలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. తొమ్మిదో వార్డ్ కు జనరల్ మహిళ రిజర్వేషన్ ప్రకటనతో బరిలో నిలుస్తారని తెలుస్తోంది. గోపతి భానేష్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కి అత్యంత సన్నిహితుడు కావడం,కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తుండడం తో మంత్రి ఆశీస్సులు ఉన్న నేపథ్యంలో గోపతి కమలకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

కొత్త, పాత తిమ్మాపూర్, అమ్మ గార్డెన్ ఏరియాలలో గోపతి భానేష్ కు ప్రజా ఆదరణ ఉన్న నేపథ్యంలో టికెట్ వరించి గెలిస్తే చైర్పర్సన్ రేసులో సైతం నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పలు వార్డులలో రిజర్వేషన్లు మార్పులు చేర్పులు చేసింది .గతంలో చైర్ పర్సన్ గా ఎస్సీ మహిళ రిజర్వేషన్ ఉండగా ప్రస్తుతం జనరల్ మహిళ గా ఖరారయింది. కాంగ్రెస్ పార్టీలో చైర్ పర్సన్ రేసులో బడా నేతలు ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా రానున్న రోజుల్లో మునిసిపాలిటీలో పోరు రసవత్తరంగా ఉండబోతోంది.

విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమం…

విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమం.

సీఐ మల్లేష్

చిట్యాల, నేటిదాత్రి :

 

‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శనివారం చిట్యాల మండలంలోని వెలుగు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ (పీఎం శ్రీ) పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్యాల సీఐ మల్లేష్, ఎస్ఐ శ్రావణ్ కుమార్ కలిసి హాజరయ్యారు.
అరైవ్ అలైవ్’ మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ‘రంగోలి’ (ముగ్గుల) పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రోడ్డు నిబంధనలను ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా సీఐ మల్లేష్ మాట్లాడుతూ:
ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని,
విద్యార్థులు కేవలం తామే కాకుండా, తమ కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు రోడ్డు భద్రత మరియు హెల్మెట్ ప్రాధాన్యత గురించి వివరించాలని, చిన్న వయస్సు నుంచే ఇలాంటి నిబంధనలపై అవగాహన పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ భిక్షపతి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

error: Content is protected !!
Exit mobile version