సైబర్ క్రైమ్ ఫై అధికారులు పలుమార్లు హెచ్చరిస్తున్న మోసపోతున్న స్థానికులు
మందమర్రి పట్టణంలో నివసిస్తున్నటువంటి వివాహిత సైబర్ కేటుగాళ్ల వల్ల లొ పడింది. తన మొబైల్ ఫోన్లో ఇంస్టాగ్రామ్ చూస్తుండగా జాబు ఆఫర్లు రావడంతో ఆ లింకును ఓపెన్ చేయగా వాట్సాప్ లో సైబర్ క్రైమ్ కేటుగాడు వివాహిత ఒకరికొకరు జాబు గురించి చర్చించుకొని ముందుగా 300 రూపాయలు ఆ కేటుగాడు వివాహితకు పంపించడం జరిగింది. దీనితో వివాహిత ఆ సైబర్ క్రైమ్ కేటుగాడిని సులువుగా నమ్మింది. ఆసరాగా తీసుకున్న సైబర్ దొంగ మాయమాటలు చెప్పి ఈ జాబులో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతకు డబల్ డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పడంతో వివాహిత ముందుగా 5000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ తర్వాత సైబర్ దొంగ ఇలాంటి మాయమాటలు ఎన్నో చెప్పి 27 వేల రూపాయల దాకా ఆ వివాహిక వద్ద నుండి డబ్బులు దోచుకోవడం జరిగింది. నాలాంటి పరిస్థితి మరి ఎవరికి రాకూడదు అని తను బాధతో కుమిలిపోతుంది.
మరొక బాధాకరమైన విషయము ఏమిటి అంటే తన పిల్లల స్కూలు ఫీజు కోసం దాచుకున్న ఫీజు మొత్తాన్ని సైబర్ మోసగాడి మాయలో పడి ఆ వివాహిత పోగొట్టుకోవడం జరిగింది.
జహీరాబాద్ నియోజకవర్గము (సంగారెడ్డి జిల్లా) మొగుడంపల్లి మండలంలో మండల బీసీ కుల సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ విషయం పై చేస్తున కుట్రల పై చర్చించారు. దీనికి సంబంధించి ఈ నెల 14 న తెలంగాణ రాష్ట్ర బంధుకు , పార్టీలకు అతీతంగా సంపూర్ణ మద్దతు తెలిపారు. బిసి లంగా ఐక్యం అయ్యి రాబోవు ఎన్నికల్లో కూడా అన్ని గ్రామాల్లో బిసి అభ్యర్థులనే గెలిపించుకోవాలి. ఈ కార్యక్రమంలో .పెద్దగొల్ల నారాయణ,కొండాపురం నర్సిములు, శంకర్ సాగర, నారాయణ బీసీ సంఘం ప్రతినిధి, వాడే శేఖర్, ఆర్.ఈశ్వర్, గొల్ల దశరత్ శ్రీకాంత్ ముదిరాజ్, మాదిరే వీరేశం, గోవింద్ గుండు, వాడే చెన్నూ, బాయిని సుభాష్, నర్సింలు గుడిసె, శ్రీనివాస్ గొల్ల, సుభాష్ సతోలి, మంగలి రాములు, సిద్దు, నరసింహ గౌడ్, తదితరులు పాల్గొనారు
అకాల వర్షాలకు నెక్కొండలోని పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలగగా ఆరబెట్టుకున్నటువంటి ధాన్యం వర్షానికి కొట్టుకపోవడంతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు ప్రధానంగా నెక్కొండ నుండి కేసముద్రం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై తోపనపల్లి వెంకటాపురం గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు కు వరద నీరు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అంతేకాక మొక్కజొన్నలు రోడ్లపై ఆరబెట్టడంతో సోమవారం తెల్లారిజామున హఠాత్తుగా ఒక్కసారిగా కురిచిన వర్షానికి ధాన్యం కొట్టుకపోవడంతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లనే చెప్పవచ్చు. చంద్రుగొండ గ్రామంలోని దాసరి సంపత్ అనే రైతు కు సంబంధించిన రెండు పాడి గేదలు పిడుగుపాటుతో మృతిచెందగా రైతు కుటుంబ సభ్యులు బోరుణ విలపించారు. అనంతరం రెండు పాడి గేదెల విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.
వివాహ వేడుక లో వేడుక లో పాల్గొన్న రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ఫ్రెండ్స్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మొగుడంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ తాజుద్దీన్ గారి కుమార్తె వివాహ వేడుక లో పాల్గొని నూతన వరునికి వివాహ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితోపాటు వెంకట్ రెడ్డి మొహమ్మద్ కుతుబుద్దీన్ మహమ్మద్ తాజోద్దీన్ సుభాష్ సందీప్ తదితరులు ఉన్నారు,
అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా దాసరి అనిల్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్ష పదవి ఎన్నికలకు దాసరి అనిల్, రేణుకుంట అశోక్ లు తలపడగా మొత్తం నూట తోంబై ఎనిమిది ఓట్లు పోలవ్వగా రేణుకుంట అశోక్ బ్యాట్ గుర్తుకు ఎనభై ఏడు ఓట్లు, దాసరి అనిల్ బాల్ గుర్తుకు నూట పదకొండు ఓట్లు వచ్చాయి. దాసరి అనిల్ ఇరవై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసందర్భంగా దాసరి అనిల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మాట్లాడుతూ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగం మండలం ఈదుల పల్లి గ్రామం చర్చి లో గ్రామ సంఘాస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పాస్టర్ డే సెలబ్రేషన్ వేడుకలు ఈ సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా పాస్టర్స్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా సంతోషకరం అని అన్నారు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పట్టణాల్లో అందరికీ పాస్టర్స్ డే శుభాకాంక్షలు స్థానిక సంఘ కాపరి వారి కుటుంబ సభ్యులకు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు సంఘస్తులు చిన్నపిల్లలు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని మహేంద్ర కాలనీ లో ని కేంద్రాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమం లో యువ నాయకులు మీదొడ్డి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పోలియో రహిత భారతదేశం నిర్మించడమే మన అందరి లక్ష్యం అని తెలిపారు ఈ కార్యక్రమం లో .అంగన్వాడీ టీచర్లు తుక్కమ్మ అనిత, ఆశ వర్కర్ జ్ఞానలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగం మండల పరిధిలో పలు గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఝరాసంగం – మేదపల్లి ఈదులపల్లి నుండి దిగ్వాల్ వెళ్లే రహదారి రోడ్డుపై వర్షపు నీరు రోడ్డుపైకి చేరుకోవడంతో గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రాత్రి సమయాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదులపల్లి నుండి దిగ్వాల్ రహదారిపై ఏర్పడిన గుంతల వల్ల వాహనాలు ఒక పక్కకు ఒరిగి వెళ్లే పరిస్థితి దాపురించింది.కాగా, రీబీటీ వేసి ఇబ్బందులు తొలగించాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. రోడ్డుపై కంకర తేలి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి వెంట మేదపల్లి ఈదులపల్లి కు చెందిన ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రివేళ ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. కొత్త ప్రభుత్వం మండలంలోని రహదారుల మరమ్మతులకు నిధులు కేటాయించి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మరమ్మతులు చేయించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రమాదకరంగా రహదారులు
రహదారులపై ప్రమాదకరంగా గుంత లు ఏర్పడటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఝరాసంగం మేదపల్లి ఈదులపల్లి రహదారిపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. రాత్రివేళ ఈ రహదారిపై వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఈదులపల్లి వద్ద మురుగు రోడ్డుపైకి చేరడంతో గుంతలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టాలి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు గెలిపించుకోవాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందని, ఎన్నికలు జరగక గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు పదవి కాలం పూర్తయి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందని దీంతో అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో రిజర్వేషన్లు 50 శాతం మించారాదని హైకోర్టు స్టే విధించడంతో ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడ్డాయ న్నారు. దేశంలో 65శాంతం బీసీలు ఉన్నారని ప్రభుత్వం దానికి 42 శాతం రిజర్వేషన్ కేటాయించడంతో కోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లు 50 శాతం మించరాదని నిబంధనలు ఉన్నాయని దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేదంటే కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం అనేది కాలయాపన తప్ప మరేం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు లేక గ్రామాలు, మున్సిపాలిటీల కాల పరిధి ముగిసి సుమారు రెండు సంవత్సరాలు అవుతుందని, రాష్ట్రానికి రావలసిన నిధులు రాక అభివృద్ధి స్తబ్దతగా మారిందన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీగా స్థానిక సంస్థ ఎన్నికల్లో జిల్లాలో రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లి మండలాల్లో పోటీ చేయడం జరుగుతుందని ఎంపీటీసీ జెడ్పిటిసి సర్పంచులు అధిక స్థానాలు గెలుచుకునే విధంగా మా ప్రయత్నం ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని పోరాటాలు నిర్వహించే పార్టీలను ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా రాజ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్,క్యాతరాజ్ సతీష్,కోరిమీ సుగుణ,గంగసరపు శ్రీనివాస్ ,నేరెళ్ల జోసెఫ్ ,గోలి లావణ్య ,మహేశ్,పీక రవికాంత్ తదితరులు పాల్గొన్నారు
రెచ్చిపోయిన కానిస్టేబుల్ దంపతులు.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
రహదారిపై క్రికెట్ ఆడితే.. తన ఇంట్లోని పిల్లలకు బంతి తగులుతుందంటూ ఒక మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కానిస్టేబుల్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేసి.. దాడి చేశారు.ఇంటి ముందు క్రికెట్ ఆడితే.. బంతి పిల్లలకు తగులుతుందంటూ మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ దంపతులు.. ఆ మహిళలపై దాడి చేశారు. దీంతో బాధితురాళ్లు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్గా హరినాథ్ విధులు నిర్వహిస్తున్నారు. అతడి భార్య పేరు హారిక. వీరి పిల్లలు.. రహదారిపై క్రికెట్ ఆడేందుకు యత్నించారు.
ఆ క్రమంలో ఇంటి ముందు క్రికెట్ ఆడితే.. తమ ఇంట్లో పిల్లలకు బంతి తగులుతుందంటూ ఆ ప్రాంతంలో నివసిస్తున్న నిర్మల, కల్యాణి అనే మహిళలు అభ్యంతరం చెప్పారు. ఈ విషయాన్ని ఆ పిల్లలు.. తమ తల్లిదండ్రులు హరినాథ్ దంపతులకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన వారు.. కల్యాణిపై దాడి చేశారు. దీంతో ఆమె అనంతపురం నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఈ విషయం తెలుసుకున్న హరినాథ్ భార్య హరిక ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంట్లో ఉన్న కళ్యాణిని బయటకు లాక్కొచ్చి ఆమెపై హరిక దాడి చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. తనపై మరోసారి దాడి చేశారంటూ కల్యాణి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ వద్దకు వారు పురుగుల మందు డబ్బాతో సహా చేరుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
దాంతో ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్, అతడి భార్య హరికపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ దీపావళికి మీ చర్మ సౌందర్యం రెట్టింపు అవ్వాలంటే ఇలా చేసి చూడండి
ఈ దీపావళి పండుగకు కొత్త అందంతో మెరిసిపోవాలనుకుంటున్నారా? చర్మం కాంతులీనేలా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ న్యూట్రిషనిస్టు చెబుతున్న సూచనలను ఓసారి ఫాలో అయ్యి చూడండి.
ఇంటర్నెట్ డెస్క్: మరి కొద్ది రోజుల్లో దీపావళి. ఈ పండగకు అద్భుతమైన చర్మ సౌందర్యంతో మెరిసిపోవాలని కోరుకునే వారు కొన్ని చిట్కాలు పాటించాలని సాక్షి లాల్వానీ అనే న్యూట్రిషనిస్టు తెలిపారు. ఆమె షేర్ చేసిన అప్డేట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఆమె సూచనల ప్రకారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం పదండి (Skin Care Tips for Diwali).
పండుగ నాటి వరకూ ప్రతి రోజు ఉదయం టీస్పూను ఉసిరి జ్యూస్, అర టీస్పూను అలోవిరా జ్యూస్, చిటికెడు పసుపు, కప్పు నీళ్లలో కలిపి తాగితే చర్మం కాంతివంతం అవుతుంది. ఉసిరి వల్ల చర్మం ముడతలు తగ్గుతుంది. ఆలోవిరా వల్ల స్కిన్ ఇరిటేషన్ మటుమాయం అవుతుంది. పుసుపులోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.
రోజువిడిచి రోజు జామ, వాల్నట్స్, ఒక టీస్పూన్ గుమ్మడి గింజలను తింటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
ఇక పండుగ వరకూ ప్రతి రోజు సాయంత్రం.. సొంపు, కొత్తిమీర, జీలకర్ర వేసి మరిగించిన నీటిని తాగితే లివర్లోని విషతుల్యాలు తొలగిపోతాయి. చర్మంపై నల్లమచ్చలు మటుమాయం అవుతాయి. మొటిమల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
రాత్రంతా నానబెట్టిన గోండ్ కతిరాకు రోజు వాటర్, సబ్జా గింజలు, నిమ్మరసాన్ని జోడించి వారానికి మూడు నాలుగు సార్లు తాగితే శరీరానికి తగినంత తేమ అందుతుంది. నిస్సారంగా కనిపిస్తున్న చర్మానికి కొత్త జీవాన్ని అందిస్తుంది. చర్మం ఉబ్బినట్టు ఉండటాన్ని తొలగిస్తుంది.
పెసరపప్పు, మెంతికూరతో చేసిన కిచిడీకి ఒక టీస్పూను నెయ్యి జోడించి తింటే శరీరానికి జింక్, యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా అంది చర్మంలో డల్నెస్ తొలగిపోతుంది. రాబోయే పది రోజులు ఈ జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటిస్తే చర్మం కాంతులీనుతూ ఉంటుందని సదరు న్యూట్రిషనిస్టు తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ రెసీపీలను ఎంజాయ్ చేయండి.
కొందరు కిలేడీలు పెళ్లిళ్లు చేసుకొని భర్తను చంపి డబ్బునంతా స్వాహా చేస్తుంటే.. మరికొందరు వింత వింత ఆలోచనలతో డబ్బును లూటీ చేసే పనిలో పడ్డారు. రూ.కోట్లు కొల్లగొడుతూ అక్కడినుంచి చెక్కేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఏడాదిపాటు నమ్మకంగా ఉండి, డబ్బు మళ్ళీ తిరిగి ఇస్తానని నమ్మించి రూ.కోట్లు కొల్లగొట్టి అక్కడినుంచి ఓ ఖిలాడీ లేడి చెక్కేసిన ఘటన ఇది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలుగు రాష్ట్రాల్లో మోసాలు మరీ పెరిగిపోతున్నాయి. రొటీన్గా చోరీ చేయడం కంటే స్కెచ్ వేసీ మరీ చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు, స్కాములు ఇవి మాత్రమే కాకుండా ఎలా వీలైతే అలా మోసాలకు పాల్పడుతున్నారు. మగవాళ్లకు తీసిపోకుండా ఆడవాళ్లు కూడా నమ్మించి మోసం చేస్తున్నారు. కొందరు కిలేడీలు పెళ్లిళ్లు చేసుకొని భర్తను చంపి డబ్బునంతా స్వాహా చేస్తుంటే.. మరికొందరు వింత వింత ఆలోచనలతో డబ్బును లూటీ చేసే పనిలో పడ్డారు. రూ.కోట్లు కొల్లగొడుతూ అక్కడినుంచి చెక్కేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఏడాదిపాటు నమ్మకంగా ఉండి, డబ్బు మళ్ళీ తిరిగి ఇస్తానని నమ్మించి రూ.కోట్లు కొల్లగొట్టి అక్కడినుంచి ఓ ఖిలాడీ లేడి చెక్కేసిన ఘటన ఇది.
బాగా డబ్బులు ఉన్న ఇళ్ల పక్కనే రెంట్కి ఉండటం, తియ్యగా మాటలు కలుపుతూ బంధుత్వం ఏర్పాటు చేసుకోవడం, అక్కా, పిన్నీ అంటూ డబ్బున్న వారికి దగ్గర అవుతూ ఈ లేడీ మోసం చేస్తుంది. వారికి అవసరం ఉన్నా లేకున్నా సాయం చేస్తూ వాళ్లకు తనపై నమ్మకం కలిగేలా చేస్తుంది. చుట్టుపక్కల వాళ్లందరికీ తాను మంచిదని నమ్మిస్తుంది. డబ్బున్న మహిళలకు ఎర వేస్తూ వాళ్ళతో కొన్నాళ్ల పాటు నమ్మకంగా ఉంటుంది. వడ్డీకి ఇస్తానని, మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తానని, తాను బిజినెస్ చేస్తే లక్షకు రెండు లక్షలు వస్తాయని నమ్మించి డబ్బున్న వాళ్ళ దగ్గరనుంచి రూ.లక్షలు కాదు కాదు ఏకంగా రూ. కోట్లే కాజేసింది. ఈ వింత బాగోతం హైదరాబాద్లో వెలుగుచూసింది. ఒక్కొక్కరి దగ్గర పట్టుమని 10 నెలల కాలం కూడా ఉండకుండా జాగ్రత్తగా డబ్బులతో ఎస్కెప్ అవుతుంది. మొదట ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో విద్య అనే మహిళ మోసాలకు పాల్పడుతూ వచ్చింది. ఆనోటా ఈ నోటా పాకి ఈమె గురించి అక్కడ అందరికి తెలియడంతో.. ఏకంగా హైదరాబాద్కు మకాం మార్చింది.
ఇక్కడ డబ్బున్న వాళ్ళు బాగా ఉంటారని, డబ్బున్న మహిళలకు గాలం వేసి రూ.కోట్లు కొల్లగొట్టాలని భావించి తన మోతపూరిత వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తుంది. తిరుపతికి చెందిన మహిళ విద్యకు మాటల గారెడీతో మహిళలను బుట్టలో వేయడం వెన్నెతో పెట్టిన విద్య. తమకు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయని చెప్పి తాను వ్యాపారాలు చేస్తానని చెప్పి పెద్ద ఎత్తున అప్పులు చేసి మెల్లగా జారుకుంటుంది. బాధితులు తమ డబ్బు తమకు ఇవ్వాలని ప్రశ్నించగా.. రౌడీలతో కొట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు న్యాయం చేయాలని, పోలీసులు ఈ ఖిలాడీ లేడి అకృత్యాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
బయట దొరికే పనీర్లో సాధారణంగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని అన్బ్రాండెడ్ పనీర్లలో నాణ్యత పెంచడానికి పిండి కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే వీలైనంతవరకు ఇంట్లోనే తాజా పనీర్ తయారు చేసి వాడటం ఉత్తమం.
బయట దొరికే పనీర్లో సాధారణంగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని అన్బ్రాండెడ్ పనీర్లలో నాణ్యత పెంచడానికి పిండి కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే వీలైనంతవరకు ఇంట్లోనే తాజా పనీర్ తయారు చేసి వాడటం ఉత్తమం. ఇంట్లో, టోన్డ్ లేదా కొవ్వు మితంగా ఉన్న పాలతో తయారు చేసినప్పుడు పనీర్ను రోజూ తినవచ్చు, కానీ తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా బాగా నూనెలో వేపిన రూపంలో కాకుండా కూరగాయలతో కలిపి వండితే మరింత ఆరోగ్యకరం. ఉదాహరణకు మిక్స్ ్డవెజిటబుల్ కర్రీ, పాలకూర పనీర్ వంటి వంటకాలు రుచికరంగానే కాకుండా పోషకవిలువలతో కూడినవిగా ఉంటాయి. పాలల్లో లాగానే పనీర్లో ప్రోటీన్, క్యాల్షియం, ఫాస్ఫరస్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎముకల అభివృద్ధికి, శరీరానికి బలాన్ని అందించడానికి చాలా సహాయపడతాయి.
పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
స్థానికుల సమచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను వేగంగా వచ్చిన లారీ ఢికొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష తర్వాత మృతదేహాలను వారి కుంటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు తెలిపారు. బైక్పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని, అలాగే కారు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని పోలీసులు వెల్లడించారు. రోడ్డు భద్రత వాహనదారులు సహకరించాలని కోరారు.
ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ పోచంపల్లితో కలిసి కార్యకర్తలకు దిశానిర్దేశం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి ముఖ్య కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశీస్ కుమార్ యాదవ్,మంగళారపు లక్ష్మణ్,పుస్తె శ్రీకాంత్,వాసాల వెంకటేష్,పర్వతం సతీష్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ (టి జి ఎస్ సి ఎస్ సి ఎల్ ) చర్యలు
21 మందిపై శాయంపేట పిఎస్ లో కేసు నమోదు
శాయంపేట నేటిధాత్రి:
2024 – 25 రబీ సీజన్ కు సంబంధించి శాయంపేట మండల కేంద్రంతో పాటు శాయంపేట మండలం కాట్రపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యాలు కొనుగోలు కేంద్రాల్లో భారీ అవినీతి జరిగినట్లు గుర్తిం చారు సీజన్ ఐకెపి ఆధ్వర్యం లో నిర్వహించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పెద్ద మోసం బయటపడింది. కొందరు అధికారులు మరియు ప్రైవేట్ వ్యక్తులు నకిలీ రైతు లను సృష్టించి ప్రభుత్వానికి నిజమైన రైతుల కోసం కేటా యించిన నిధులను మోసపూ రితంగా దోచుకున్నారు. నమ్మదగిన సమాచారంపై ఆధారంగా ఎన్ఫోర్స్ మెంట్ టాస్క్ ఫోర్స్(ఈ ఎఫ్ టి)చీఫ్ సీవీ & ఇ.ఓ. పర్యవే క్షణలో కమిషనర్ (సివిల్ సప్లైస్) ఆదేశాల మేరకు ఈ ఎఫ్ టి టీమ్-IV సమగ్ర విచారణ చేపట్టింది.ఈ విచారణలో శాయంపేట మరియు కాట్రపల్లి గ్రామాల ఐకెపి ధ్యాన్యం కొనుగోలు కేంద్రాలలో (పీపీసీఎస్) పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలింది.ఈ మోసానికి బెజ్జంకి శ్రీనివాస్ సాంబశివ మినీ మోడ్రన్ రైస్ మిల్ కమలాపూర్ (వి & ఎం) యజమాని ప్రధాన సూత్రధారి అని తేలింది. ఇతను తన కుటుంబ సభ్యు లు, మధ్యవర్తులు, వ్యవసా య శాఖ సిబ్బందితో కలిసి ఆన్లైన్ ప్యాడీ ప్రోక్యూర్ మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఒపీఎంఎస్) ద్వారా 12 నకిలీ రైతుల పేర్లను సృష్టించాడు.
ఈ నకిలీ రైతులు 278 ఎకరాల్లో పంట పండించారని, 8,049.6 క్వింటాళ్ల ధాన్యం సరఫరా చేశా రని రికార్డుల్లో చూపించారు. కానీ వాస్తవానికి ఒక్క క్వింటా ధాన్యం కూడా కొనుగోలు చెయ్యలేదు.ఈ మోసపూరిత లావాదేవీల ద్వారా రూ.1,86,63,088/- (ఒక కోటి ఎనభై ఆరు లక్షల అరవై మూడు వేల ఎనభై ఎనిమిది రూపాయలు) ప్రభుత్వ ఖాతాల నుంచి నకిలీ రైతుల పేర్లతో మోసపూరితంగా బదిలీ చేయబడ్డాయి.వీరిలో బండ లలిత మధ్యవర్తిగా పనిచేసి ఒపీఎంఎస్ లో నకిలీ ఎంట్రీలు చేయడంలో సహకరించింది. వంకుదోత్ చరణ్ – ప్రైవేట్ ట్యాబ్ ఆపరేటర్, వ్యవసాయ అధికారుల లాగిన్ వివరాలు దొంగిలించి ఒపీఎంఎస్ లో అక్రమంగా లాగిన్ అయ్యాడు. హైమావతి ఐకెపి శాయంపేట పిపిసి ఇన్చార్జ్,తన అధికారిక ట్యాబ్ను అనధికారికంగా ఇత రులకు వినియోగానికి ఇచ్చిం ది..అనిత –ఐకెపి కాట్రపల్లి పి పి సి ఇన్చార్జ్, ఇదే విధంగా తన ట్యాబ్ను ఉపయోగించేం దుకు ఇచ్చింది.వ్యవసాయ అధికారులు (ఎ ఓ & ఎ ఈ ఓ లు)కె. గంగా జమున (ఎ ఓ), అర్చన మరియు ఎం. సుప్రి యా (ఎఈఓ లు) లాగిన్ వివరాలు పంచుకోవడం మరియు ధృవీకరణ నియమాలను లెక్కచేయకపో వడం ద్వారా మోసానికి పాల్పడ్డారు.రవాణా కాంట్రాక్టర్ సుధాటి రాజేశ్వర్ రావు 27 ట్రక్ షీట్లకు రవాణా చార్జీలు క్లెయిమ్ చేసుకున్నాడు, కానీ వాస్తవంగా ఒక్క ట్రక్ కూడా రవాణా చేయలేదు. నకిలీ ట్రక్ షిట్లు, టోకెన్ బుక్స్ తయారు చేసి బియ్యం రవాణా జరిగిన ట్టు రికార్డుల్లో చూపించా రు.ఇలా కాగితాలపై మాత్రమే రవాణా చూపి కార్పొరేషన్ నుంచి భారీ మొత్తాలను అక్రమంగా పొందారు. నకిలీ రైతుల సంఖ్య 12, తప్పుడు భూ సమాచారం 278 ఎకరా లు, తప్పుడు ధాన్యం పరిమా ణం 8,049.6 క్వింటాళ్లు అక్రమంగా క్లెయిమ్ చేసిన మొత్తం ₹1,86,63,088/-, బోనస్ క్లెయిమ్ చేయడానికి ప్రయత్నం ₹500 ప్రతి క్వింటా కు. భారతీయ న్యాయ సంహిత (బి ఎన్ ఎస్), సంబం ధిత చట్టాల ప్రకారం అందరి మీద న్యాయపరమైన చర్యలు సిఫార్సు చేయబడ్డాయి. అక్ర మంగా పొందిన రూ.1.86 కోట్లు మరియు రవాణా చార్జీలు వెంటనే వసూలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.12 నకిలీ రైతు లకు బోనస్ చెల్లింపులు నిలిపి వేయబడ్డాయి.నకిలీ భూసమా చారాన్ని ఓపిఏం ఎస్ పోర్టల్ నుండి తొలగించాలని ఆదేశిం చారు.ఈ కేసు ధాన్యం కొను గోలు వ్యవస్థలో ఉన్న మిల్లర్లు, మధ్యవర్తులు, వ్యవసాయ అధికారులు, పీపీసీ ఇన్చా ర్జీలు కలసి చేసిన అవినీతిని బహిర్గతం చేసింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రజా నిధులను కాపాడేందుకు, పారదర్శకతను కాపాడేందుకు కఠిన చర్యలు చేపట్టింది.ఇలాం టి వ్యక్తుల ఉనికి కొనుగోలు వ్యవస్థను దెబ్బతీస్తుంది. నిజమైన రైతుల ప్రయోజనా లను దెబ్బతీస్తుంది. అందు వల్ల, కేవలం అధికారిక సిబ్బంది, నమోదు చేసిన రైతులు, పీపీసి సిబ్బంది, ప్రభుత్వ అధికారులు మాత్రమే పి పి సి ఆపరేషనల్ ప్రాంతా లకు ప్రవేశం కలిగి ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలి. తదుపరి విచారణ మరియు క్రిమినల్ కేసు దర్యాప్తు హనుమకొండ జిల్లా సివిల్ సప్లైస్ శాఖ పర్యవేక్షణలో శాయంపేట పీఎస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు
మ్యాచ్లో గాయపడ్డ సాయి సుదర్శన్.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ
వెస్టిండీస్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ గాయపడ్డాడు. అతడి గాయం తీవ్రమైనది కాదని బీసీసీఐ తాజాగా హెల్త్ అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్ రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ టీమిండియా క్రికెటర్ సాయి సుదర్శన్ ఆరోగ్యంపై బీసీసీఐ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. అతడు ప్రస్తుతం బాగానే ఉన్నాడని పేర్కొంది. రెండో రోజున విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ కొట్టిన బంతిని సాయి సుదర్శన్ అద్భుత రీతిలో అందుకుని అతడిని పెవిలియన్ బాట పట్టించాడు. ఈ క్రమంలో చేతికి కాస్త పెద్ద దెబ్బతగలడంతో తట్టుకోలేకపోయిన అతడు వెంటనే మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో దేవదూత్ పడిక్కల్ సబ్స్టిట్యూట్గా వచ్చిన విషయం తెలిసిందే (Sai Sudarshan BCCI Health Update).
విండీస్తో తాజా చివరి టెస్టు మూడో రోజున కూడా సాయి సుదర్శన్ బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో అతడు ఆరోగ్యంపై బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. అతడి గాయం తీవ్రమైనది కాదని తెలిపింది. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడని తెలిపింది. తమ మెడికల్ టీమ్ అతడి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొంది. ఇక ప్రస్తుత టెస్టులో గడ్డు పరిస్థితిలో పడిపోయిన ఫాలో ఆన్ ముప్పును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఇక రెండో టెస్టు తొలి రోజున సాయి సుదర్శన్ ఆట తీరుతో జనాల విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. 87 పరుగులతో నిలకడైన ఆటతో రాణించాడు. అయితే, వైస్ కెప్టెన్ జోమెల్ వారికన్ వేసిన బంతిలో బ్యాక్ ఫుట్ షాట్కు ప్రయత్నించి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈజిప్టు వేదికగా జరగనున్న గాజా శాంతి ఒప్పందానికి ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు.
ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈజిప్టు వేదికగా జరగనున్న గాజా శాంతి ఒప్పందానికి ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. అయితే ఈ ఒప్పందానికి రావాలంటూ ప్రధాని మోదీకి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్ సిసి సైతం ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ధృవీకరించలేదు. సోమవారం ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం జరగనుంది. ఈ ఒప్పందానికి వివిధ దేశాధినేతలు హాజరుకానున్నారు.
దాదాపు రెండేళ్లుగా ఇజ్రాయెల్, తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో వేలాది మంది మరణించారు. కోట్లాది రూపాయిల ఆస్తి నష్టం సంభవించింది. అయితే గాజాగా ఈ యుద్ధాన్ని ముగించేందుకు ఈ రెండు సుముఖత వ్యక్తం చేశాయని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. ఈ యుద్ధం ముగింపు కోసం 20 సూత్రాల శాంతి ఒప్పందాన్ని ట్రంప్ తెరపైకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.
శాయంపేట మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ ఆవర ణంలో ఐదుసంవత్సరాల లోపు చిన్నారు లందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నియోజక వర్గం గ్రామపంచాయతీ కార్యాల యంలో నిర్వహించిన పోలి యో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేస్తూ, చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదం డ్రులు తమ పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాలని పిలుపు నిచ్చారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో రహిత సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత
ఈ మహత్తర లక్ష్యం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు,స్థానిక ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బిసిలంతా ఏకమైతేనే బలపడాతారన్న సత్యాన్ని ఇప్పటికైనా గ్రహించాలి. బిసిల్లారా..ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా బిసిలంతా మేలుకోవాల్సిన తరుణం వచ్చేసింది. బేషజాలు పక్కన పెట్టి బిసిలంతా ఏకమైతే తప్ప రాజ్యాదికారం సాధ్యమయ్యేది కాదు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా బిసిల అంశం తెరమీదకు వచ్చిది. గత రెండు సంవత్సరాలుగా నానుతోంది. బిసి సంఘాలు అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ బిసి జపం చేస్తున్నాయి. అయినా బిసిలు కదలకపోతే చేసేదేమీ వుండదు. ఇంకా వెయ్యేల్లయినా బిసిలకు రాజ్యాధికారం దక్కడు. స్వాతంత్య్రానికి పూర్వం రాజరిక వ్యవస్ధ వున్నప్పుడే సర్వాయి పాపన్న లాంటి రాజు ఉద్భవించాడు. తన సొంతంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పాలించాడు. ఇతర రాజులను ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ మాత్రం పౌరుషం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎందుకు కరువౌతోంది. రాజ్యాంగం జనరల్ కేటరిగి పేరుతో బిసిలకు కూడా అవకాశం కల్పించింది. అయినా బిసిలు ముందుకు రావడం లేదు. ప్రజా ప్రతినిధులయ్యేందుకు ధైర్యం చేయడం లేదు. డెబ్బై స్వతంత్య్రంలో ఒక్క బిసి నాయకుడు కూడా ముఖ్యమంత్రి కాలేదు. బిసిలే ఎక్కువగా వున్న క్యాబినేట్ఏర్పాటు కాలేదు. నిజాం నుంచి విముక్తి జరిగిన తెలంగాణలో బిసి సిఎం. కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు అవకాశం దక్కలేదు. ఇప్పుడూ దక్కలేదు. కొట్లాడితే తప్ప బిసిలకు రాజ్యాధికారం రాదు. అధికారం వశం చేసుకుంటే తప్ప పాలకులు కాలేరు. అందుకే రాజకీయ హక్కుల సాదన దిశగా ప్రతి బిసి అడుగులేయాలి. నేనేందుకు నాయకుడిని కావొద్దని ప్రశ్న వేసుకోవాలి. మాకు అదికారం ఎందుకు రాదని ముందుకు రావాలి. అంతే తప్ప బిసిల రిజర్వేషన్ ఎవరో వేసే బిక్షలాగా ఎదురుచూడొద్దు. రిజర్వేషన్ అనేది బిసిల హక్కు. జనాభాలోనే 85శాతం వున్న బిసిలకు కనీసం 42శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే పోరాటం చేసైనా సాధించుకోవాలి. అందుకు రాజ్యాధికార సాదన దిశగా కదలాల్సిన అవసరం వుంది. బిసిలలో వున్న ప్రధానమైన లోపాన్ని అధిగమించాలి. బిసిలలో వున్న కులాల మధ్య ఆధిపత్యం తగ్గాలి. బిసిలంటే బిసిలే..అంతే కాని మేం ఎక్కువ. మీరు తక్కువ అనే భావన పోవాలి. అన్నా, తమ్ముడు, మామ, అక్క అని పిలుచుకుంటే సరిపోదు. ఇటీవల బిసిలంటే నాలుగు కులాలేనా? అనే ప్రశ్న మొదలైంది. ఇలాంటి చీలికను తీసుకొచ్చి బిసిలను విచ్చిన్నంచేయాలిన చూస్తుంటారు. వారి ఉచ్చులో పడొద్దు. పైకి కపట నాటకమాడే రాజకీయ పార్టీలు ఉచ్చును ఎప్పుడూ సిద్దం చేసి వుంచుకుంటారు. బిసిల వేలుతోనే, బిసిల కన్ను పొడుస్తారు. ఇది గమనించుకొని ముందుకు సాగాలి. బలమైన అడుగులు వేయాలి. అందువల్ల బిసిల రాజ్యాధికారం కోసం ఏకమైతే తప్ప రాజకీయ పార్టీలు ఏం చేయలేవు. ఓసిలకు ఇప్పటిదాకా చేసిన ఊడిగం చాలు. బిసిలంటే పిల్లులు కాదు. పులి పిల్లలని నిరూపించాలి. కట్టె పుల్లలం కాదు, కట్టెల మోపులమని రుచి చూపించాలి. ఎందుకంటే బిసిలంతా చీపురు పుల్లల్లా వున్నంత కాలం ఏమీ చేయలేరు. అందరూ కలిసి కట్టెల మోపులా మారి, బిసిల ఐక్యత చాటాల్సిన అవసరం వుంది. బిసిలలో వున్న సామాజిక చైతన్యం రాజకీయం కావాలి. ప్రజా ప్రతినిధులై సామాజిక న్యాయం సాదించాలి. క్షేత్రస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకు బిసిలే నాయకులు కావాలి. రాజకీయ పార్టీల వైఖరిలో మార్పులు రావాలి. బిసిలు లేకుంటే పార్టీ మనగడ అసాద్యమని తేలుసుకోవాలి. బిసిలకు దామాషా ప్రకారం సీట్ల కేటాయింపులు జరగాలి. పార్టీల కన్నా, బిసిల ఐక్యత ముఖ్యం. రాజ్యాధికారం సాదించే వరకు కలిసి సాగుదామని శపథం చేయండి మేధావుల ఆలోచనలు అమలు చేయండి. చెప్పుడు మాటలు వింటూ మళ్లీ మోసం పోకుండా జాగ్రత్తపడండి. బలమైన బిసి నాయకులను తయారు చేయండి. అన్ని కులల నుంచి ప్రాతినిధ్యం కలిగేలా కలిసి కట్టు ప్రయాణం సాగించండి బిసిల రాజ్యాధికారం సాదిద్దాం.బిసిల్లారా..ఏకం కండి! ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదు. రాజకీయ పార్టీలో ఒక భయం వచ్చేసింది. బిసిలను కాదనుకుంటే పార్టీలే వుండవన్న భయం పట్టుకున్నది. బిసిల పట్టు బిగుస్తోంది. బిసిల గొంతు బలపడుతోంది. బిసిలలో వున్న సామాజిక చైతన్యం రాజకీయం కావాలి. అప్పుడే రాజకీయ పార్టీల గుండెల్లో గుబులు పుడుతుంది. బిసిలు ప్రజా ప్రతినిధులై సామాజిక న్యాయం సాదించాలి. అందుకు క్షేత్రస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకు బిసిలే నాయకులు కావాలి. రానున్న స్ధానిక సంస్దల ఎన్నికల్లో అన్ని జనరల్ స్ధానాలలో బిసిలు పోటీ చేయాలి. ఇప్పటి వరకు జనరల్ స్ధానమంటే ఓసిలకు రిజర్వేషన్ అనే అపోహ వుంది. అగ్రకులాలు అలా ప్రచారం చేసుకున్నాయి. బిసిలను రాజకీయానికి దూరం చేశాయి. జనరల్ స్దానాల్లో ఓసిలు పాగా వేసి, బిసిలకు స్ధానం లేకుండా చేశారు. ఓసిలు నాయకులౌతూ బిసిలను కార్యకర్తలుగా మార్చుకొని అందలమెక్కారు. ఇంత కాలానికి తెలంగాణ ఉద్యమం లాంటి చైతన్యం వచ్చింది. అది ఉప్పెనలా మారాలి. చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అసరం లేదు. రాజకీయంగా కూడా సీట్లు కేటాయించొచ్చు. అందుకు ఏ చట్టం అడ్డుపడదు. జనరల్ స్దానాలన్నీ బిసిలకు ఇవ్వొచ్చు. కనీసం దామాషా ప్రకారం పంపకాలు చేయొచ్చు. రాజ్యాంగ పరంగా ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించినా, జనరల్ స్దానాలలో బిసిలకు టిక్కెట్లు ఇవ్వొచ్చు. ఆ వెసులుబాటు వుంది. అయినా రాజకీయ పార్టీలు నాటకాలాడొచ్చు. ఈ ఐదేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా స్దానిక సంస్దల ఎన్నికల్లో బిసిలు ప్రజా ప్రతినిదులైదే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిసిలను ఎవరూ ఆపలేరు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిసి ముఖ్యమంత్రి కావాలి. అంటే ఇప్పటి నుంచే అడుగులు పడాలి. బిసిల ఐక్యతలో మరింత చైతన్యం రావాలి. రాగద్వేషాలు వీడాలి. అంతే కాకుండా రాజకీయ పార్టీల వైఖరిలో మార్పులు రావాలి. బిసిలు లేకుంటే పార్టీ మనగడ అసాద్యమని తేలుసుకోవాలి. అంతగా బలమైన ఒత్తిడి బిసి సంఘాల నుంచి, బిసి నాయకుల నుంచి రావాలి. అవసరమైతే బిసిల నాయకులు ఆయా పార్టీల నుంచి బైటకు రావాలి. రాజకీయ పార్టీలలో వున్న బిసి నాయకులంతా బైటకువస్తే రాజకీయ పార్టీలలో వనుకు పుట్టాలి. ఇప్పుడు స్దానిక సంస్దల ఎన్నికల్లోనే కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిసిలకు దామాషా ప్రకారం సీట్ల కేటాయింపులు జరగాలి. బిసిలుముందుగా చేయాల్సిన పని పార్టీల కన్నా, బిసిల ఐక్యత ముఖ్యమనే ఆలోచన చేయాలి. అందుకు కట్టుబడి వుండాలి. తన సీటు తనకు వస్తే చాలు అనుకునే స్వార్ధపరులను బిసి సంఘాలు కూడా వెలివేయాలి. బిసిలు వారిని తిరస్కరించాలి. అప్పుడు గాని బిసిలలో మరింత ఐక్యత సాద్యం కాదు. బిసిల వేలుతోనే బిసిల కన్ను పొడుస్తారు. అందుకు జాగ్రత్తగా వుండాలి. అవకాశవాద బిసి నాయకులను దూరం పెట్టాలి. ఆయా పార్టీలపై ఒత్తిడి తెచ్చే నాయకులను మాత్రమే తెలంగాణ సమాజం నమ్మాలి. వారిని స్వాగతించాలి. వారిచేత తెలంగాణలో బిసిల రాజ్యాధికారం సాదించే వరకు కలిసి సాగుదామని శపథం చేయించాలి. ప్రజలు, ప్రజా సంఘాలు, బిసిలంతా ప్రమాణం చేయాలి. అంతే కాకుండా మేధావుల ఆలోచనలు అమలు చేసుకుంటూ ముందుకు సాగాలి. రాజకీయాలలో వెన్నుపోట్లు ఎక్కువ. తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు వినేవారు చాల మంది వుంటారు. అలాంటి వారి మాటలు వింటూ మళ్లీ మోసం పోకుండా జాగ్రత్తపడాలి..బలమైన బిసి నాయకులను తయారు చేసుకోవాలి. అన్ని కులల నుంచి ప్రాతినిధ్యం కలిగేలా కలిసి కట్టు ప్రయాణం సాగించాలి. బిసిల రాజ్యాధికారం సాదించాలి. బిసిలంతా కలిసి బరిగీసి నిలబడాలి.అప్పుడే ముందుకు రాగలరు. బిసిలంగా ముందుకు వస్తేతప్ప ఓసిలు వెనుకడుగు వేయరు. వారిని వెనక్కి నెట్టే పరిస్ధితి రాదు. డెబ్బై ఏళ్లు బిసిలు వెనకే వున్నారు. ఓసిలకు రాజకీయ ఊడిగం చేశారు. ఇప్పటికైనాసరే బిసిలు ముందుకు రావాలి. ముందడుగు వేయాలి. జనరల్ అంటే ఓసిలు కాదు. జనరల్ అంటే అందరూ..ఈ విషయం తెలిసినా, బిసిలు ముందుకు రాలేదు. అణగారిన వర్గాలు అని చెప్పడం తప్ప వారిని పైకి తీసుకొచ్చే ఆలోచనలు ఇప్పటి వరకు ఏ రాజకీయపార్టీ పూర్తి స్ధాయిలో చేయలేదు. ఎంత సేపు మోచేతికి బెల్లం పెట్టి నాకించడం తప్ప ఏమీ చేయలేదు. పేరు వేల కోట్లు, వందల కోట్లు అంటూ సబ్ ప్లాన్లు పెట్టినా ఎవరికి మేలు జరిగిందో చెప్పింది లేదు. ఇటు నిధులు కేటాయించడం..అటు మళ్లించడం..సబ్ ప్లాన్లపేరుతో రాజకీయాలకు బిసిలను దూరం చేయడం బాగా అలవాటు చేసుకున్నారు. ఇప్పటికైనా బిసిలు అసలు రహస్యం తెలుసుకోవాలి. కావాల్సింది సబ్ ప్లాన్లు కాదు. రాజకీయాలు. పదవులు. అదికారం. అప్పుడు తప్ప బిసిలకున్యాయం జరగదు. సామాజిక న్యాయానికి అర్దం వుండదు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.