డ్రైవర్లు వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకండి…

డ్రైవర్లు వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకండి
వనపర్తి నేటిదాత్రి .

రోడ్డుప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో సరైన సహాయం అందిస్తే మరణాల సంఖ్యను తగ్గించవచ్చు అని ప్రథమ చికిత్స, అత్యవసర స్పందనపై కనీస అవగాహన కలిగి ఉండాలని ఐజిపి డాక్టర్ గజరావు భూపాల్ అన్నారు.
కొత్తకోటలో రాష్ట్ర, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో కార్యక్రమానికి ఐజీపీ గజరావు భూపాల్ వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,వనపర్తి జిల్లా ఇంచార్జి ఎస్పీ డా. వినీత కార్యక్రమాన్ని ప్రారంబిం చారు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, అంబులెన్స్ డ్రైవర్లు, ఆటోలారీ డీసీఎం డ్రైవర్లు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, యువత, విద్యార్థులకు 1000 మందికి నిపుణులచే గోల్డెన్ అవర్ సమయంలో ఎలా స్పందించాలి, ప్రాథమిక చికిత్స ఎలా అందించాలి, బాధితులను ఎలా తరలించాలి వంటి అంశాలపై నిపుణులైన డాక్టర్లచే సమగ్ర శిక్షణ అందించారు
అనంతరం డ్రైవర్లకువాహన డ్రైవర్లకు సీపీఆర్ శిక్షణ మరియు కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారుకలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ..రోడ్డు భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. గోల్డెన్ అవర్ సమయంలో సమయానికి స్పందిస్తే ప్రమాదాల తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చు. ఈ తరహా శిక్షణా కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు విస్తరించి, అవగాహనను పెంపొందించడం అత్యంత అవసరం.అని అన్నారు
ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు వనపర్తి డిసిఆర్బి డిఎస్పి, బాలాజీ నాయక్, కొత్తకోట మున్సిపల్ చైర్మన్,పోతులపల్లి అరుణ, మున్సిపల్ వైస్ చైర్మన్,పల్లవి,మదనాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, ప్రశాంత్, కొత్తకోట సీఐ, రాంబాబు వనపర్తి సిఐ రత్నం ఆత్మకూరు, శివకుమార్ కొత్తకోట ఎస్సై, శివానందం, వనపర్తి జిల్లాలోని ఎస్సైలు, ప్రజా ప్రతినిధులు యువకులువిద్యార్థులు, డ్రైవర్లు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287 వ జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే కలెక్టర్…

సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287 వ జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే కలెక్టర్
వనపర్తి నేటిధాత్రి .

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి ఉత్సవాలను బుధవారం వనపర్తి జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నాగవరం దగ్గర సేవా లాల్ బంజారా భవన్ లో సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు వనపర్తి జిల్లాలో తాండాల నుండి గిరిజనులు పాల్గొన్నారు ముందుగా సేవాలాల్ మహారాజ్, మేరమ యాడి దేవతకు మహాబోగ్ హోమం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్, లంబాడి పూజారులు రాజ్ పవార్, బిక్ష్యా నాయక్ తో కలిసి సాంప్రదాయ బద్దంగా హోమంలో నెయ్యి కడావ్ ప్రసాదం వేసి నైవేద్యం సమర్పించారు. జిల్లాలోని సమస్త ప్రజలు ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలతో వర్ధిల్లె విధంగా ఆశీర్వదించాలని మొక్కారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ అందరికీ ఆదర్షప్రాయుడని, జీవ హింస చేయరాదనిఅబద్ధం మాట్లాడవద్దుదొంగతనాలు చేయవద్దు,మాంసాహారం చేయవద్దని బోధించారని గుర్తు చేశారుబంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చూపిన సన్మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని అన్నారు ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ 287వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారువనపర్తి నియోజకవర్గానికి రూ.2.68 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దౌర్జన్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన యోధుడని అన్నారు.దొంగతనాలు చేయొద్దు, మాంసాహారం తినొద్దు అని బోధించారని గుర్తు చేశారు
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పిసీతారాం నాయక్ గిరిజన అభివృద్ధి అధికారి అధికారులు వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మిడిదొడ్డి మాధవి రమేష్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ మార్కెట్ యార్డు చైర్మన్ బిన్ శ్రీనివాస్ గౌడ్ శంకర్ నాయక్ , గిరిజన సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు, గిరిజన మహిళలు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు

వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా మీడిదొడ్డి మాధవి రమేష్…

వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా మీడిదొడ్డి మాధవి రమేష్

,వైస్ చైర్మన్ గా మధుసూదన్ గౌడ్

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి మున్సిపాలిటీ నుండి కొత్తగా ఎన్నికైన 33 మంది కౌన్సిలర్ల చే ప్రత్యేక అధికారి ఆర్ డి ఓ ప్రమాణ స్వీకారం ఆర్డీఓ సుబ్రమణ్యం చేయిoచారు
మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నికైన 33 మంది సభ్యులను జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు వనపర్తి మున్సిపాలిటీలో పరోక్ష విధానం ద్వారా చైర్ పర్సన్,వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక కొరకు సోమవారం మున్సిపల్ కార్యాలయ ములో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు
33 మంది సభ్యులున్న వనపర్తి మున్సిపాలిటీ లో ​చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు చట్ట ప్రకారం 17 మంది సభ్యుల కోరం అవసరం ఉండగా సమావేశానికి 22 మంది20 మంది కాంగ్రెస్ ఇద్దరు స్వతంత్రులుసభ్యులు హాజరయ్యారు కోరం సభ్యుల ప్రతిపాదన మేరకు అధికారులు చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించా రు మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి మీడిదొడ్డి మాధవి పేరును వనపర్తి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి పరుశురాం ప్రతిపాదించగా 4వ వార్డు కౌన్సిలర్ గంధం శరవంద బలపరిచారు మరో అభ్యర్థి పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో మీడిదొడ్డి మాధవి ని చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ఆర్ డి ఓ సుబ్రహ్మణ్యం ప్రకటించారు అనంతరం వైస్ చైర్ పర్సన్ గా గురకొండ మధుసూదన్ గౌడ్ పేరును 5వ వార్డు కౌన్సిలర్ బాపన్ పల్లి వెంకటేశ్వర్లు ప్రతిపాదించగా, 31వ వార్డు కౌన్సిలర్ బి. విజయలక్ష్మి బలపరిచారు. మరో పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో వైస్ చైర్ పర్సన్ గా గురుకొండ మధుసూదన్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ప్రకటించారు. అనంతరం ప్రత్యేక అధికారి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లను ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు డి పి ఆర్ ఓ వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి,ఎన్నికల అధికారులు,మున్సిపల్ అధికారులు ఎన్నికైన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.S

వనపర్తి లో2024 సర్వే ఆదారంగ వార్డుల రిజర్వేషన్లు ఖరారు…

వనపర్తి లో2024 సర్వే ఆదారంగ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి

వనపర్తి నేటిదాత్రి .

, సీప్-2024 సర్వే ఆధారంగా వనపర్తి మున్సిపల్ ఎన్నికలకు వార్డులలో రిజర్వేషన్లను ఖరారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియను రాజకీయ పార్టీల నేతల సమక్షంలో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ సంస్థలు యాదయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సీప్-2024 సర్వే జనాభా ప్రతినిథ్య ప్రాతిపదికన మున్సిపల్ ఎన్నికలకు వార్డుల వారీ రిజర్వేషన్లను అత్యంత పారదర్శకంగా ఖరారు చేశామని కలెక్టర్ తెలిపారు. నిబంధనల ప్రకారం వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ కేటగిరీలలో మహిళలకు కేటాయించాల్సిన వార్డులను లక్కీ డ్రా సిస్టం ద్వారా ఎంపిక చేశామన్నారు . రిజర్వేషన్ల ఖరారు అనంతరం గెజిట్ విడుదల చేసి, తదుపరి జాబితా ప్రతులను కలెక్టరేట్ మున్సిపల్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ప్రదర్శించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులు, ప్రతినిధులు మరియు ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version