నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎనిమిదో వార్డులో ఊపందుకున్న…

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎనిమిదో వార్డులో ఊపందుకున్న ప్రచారం కాంగ్రెస్ అభ్యర్థి బాదం రమేష్

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

 

నాగర్ కర్నూల్ పట్టణంలోని ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బాదం రమేష్ ఇంటింటి ప్రచారంలో భాగంగా సిసి రోడ్స్ మిషన్ భగీరథ వాటర్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని నాకు ఒక్కసారి అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు గెలిచిన వెంబడి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజలంతా పోయిన మాజీ వార్డ్ కౌన్సిలర్ రెండు సంవత్సరాల కాల పరిధిలో జాబు వచ్చినందున కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయాడనిఅప్పటినుంచి కాలనీ అభివృద్ధి జరగలేదని చెప్పారు ఈసారి నీకు అవకాశం ఇస్తానని ప్రజలందరూ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పదో వార్డు మాజీ కౌన్సిలర్ బాదం సునీత కాలనీ ప్రజలు ఇన్చార్జిలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

నాగర్ కర్నూలులో 650 పడకల ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం

235 కోట్ల రూపాయలతో మంజూరైన 650 పడకు ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

నాగర్ కర్నూలు జిల్లాలో మెడికల్ కాలేజీకి అనుసంధానంగా 10 ఎకరాల స్థలంలో 235 కోట్లతో మంజూరు అయిన 650 పడకల ఆసుపత్రిని ఈరోజు నవ తేజ నిర్మాణ సంస్థ యజమాన్యంతో కలిసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు
వీలైనంత త్వరగా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే గారు సంస్థ వారికి సూచించడం జరిగింది ఎక్కడ కూడా పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు సూచించారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు ప్రిన్సిపల్ సంబంధిత అధికారులు పట్టణ మాజీ కౌన్సిలర్ నాయకులు పాల్గొన్నారు

నాగర్ చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్ నేటి ధాత్రి

మున్సిపాలిటీ నాగనూ లు చెరువుకు అమృత్ పథకం కింద 3.14 కోట్ల రూపాయలతో చెరువు సుందరీకరణకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులను ఆరు నెలల్లో పని పూర్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రామారావు మున్సిపల్ కమిషనర్ ఏ ఈ మాజీ కౌన్సిలర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 9 వార్డు పదో వార్డ్ కు సంబంధించిన…

నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

 

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 9 వార్డు పదో వార్డ్ కు సంబంధించిన సిసి రోడ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూలు జిల్లాకు జూనియర్ కళాశాలకు 9 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి 19వ తారీకు డిప్యూటీ సీఎం రాజనర్సిమతో కలిసి శంకుస్థాపన చేస్తున్నట్లు అదేవిధంగా కొత్త బస్టాండ్ కు 14 కోట్లు మంజూరయ్యాయని అది కూడా త్వరలో శంకుస్థాపన చేస్తామని నాగర్ కర్నూల్ జిల్లా ను ఒక ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు తొమ్మిదో వార్డ్ మాజీ కౌన్సిలర్ లలిత భాస్కర్ 10 వార్డ్ మాజీ కౌన్సిలర్ బాదం సునీత నరేందర్ వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

శ్రీపురంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రంగనాయక స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు

నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

 

నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు మరియు ఆయన సతీమణి సరిత రాజేష్ రెడ్డి గారు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు కళ్యాణోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు శ్రీపురం గ్రామ సర్పంచ్ గీతా నర్సింహారెడ్డి నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పదో వార్డు మాజీ కౌన్సిలర్ బాదం సునీత ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

వైభవంగా ముగ్గుల రంగవల్లి పోటీలు

నేటి దాత్రి నాగర్కర్నూల్ జిల్లా

 

వెంకటేశ్వర కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల రంగవల్లి పోటీలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి దంపతులు ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని ప్రతి పండుగ వెనుక గొప్ప పరిమార్తం ఉందని సంక్రాంతి రైతుల పండుగని నాగర్ కర్నూల్ నియోజవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ రంగవల్లిలో ప్రతిభ చూపిన మహిళలకు అభినందనలు తెలిపారు 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు కాలనీవాసులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

తాడూర్ రైతు సంబరాల్లో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎద్దుల బండ లాగుట ప్రారంభం

నాగర్ కర్నూలు జిల్లా నేటి ధాత్రి

తాడూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు సంబరాల్లో భాగంగా ఎద్దుల బండ లాగుట పోటీలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల పండుగ అని రైతుల శ్రమ ఫలించిన ఆనందాన్ని ప్రతిభంబించేదే ఈ సంబరాలు అని అన్నారు గ్రామీణ క్రీడలు సాంప్రదాయ కార్యక్రమాలు మన సంస్కృతికి ప్రతి కలాని వీటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి పైన ఉందని తెలిపారు
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తూ రైతులను ఆదుకుంటుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు
ఈ కార్యక్రమానికి మార్కెట్ చైర్మన్ రమణ రావు తాడూర్ సర్పంచ్ మల్లయ్య చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఎండబెట్లలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బాలసదన్ భవనం శంకుస్థాపన

నాగర్ కర్నూల్ జిల్లా నేటి దాత్రి

 

నాగర్ కర్నూల్ ఎండబెట్ల గ్రామంలో కోటి 30 లక్షల మంజూరైన బాల సదన్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బాలసదన్ భవన నిర్మాణం ద్వారా అనాధ మరియు ఆశ్రయంలేని పిల్లలు కు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు
అభివృద్ధి పనుల్లో భాగంగా నాగర్ కర్నూల్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు
ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మాజీ పట్టణ కౌన్సిలర్లు ఎండబెట్ల ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

నాగర్‌కర్నూల్‌లో సీసీ రోడ్ శంకుస్థాపన

నాగర్‌కర్నూల్‌లో సీసీ రోడ్ శంకుస్థాపన

నేటి దాత్రి నాగర్కర్నూల్ జిల్లా

 

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పదో వార్డు లో 10 లక్షల రూపాయలతో సిసి రోడ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు మంజూరైనవి మున్సిపల్ అన్ని వార్డుల్లో సిసి రోడ్లు డ్రైనేజీలు త్వరగా పూర్తిచేస్తామని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు మాజీ కౌన్సిలర్ బాదం సునీత కౌన్సిలర్స్ వార్డు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు

సీసీ రోడ్లు–డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

నేటి ధాత్రి నాగర్ కర్నూలు జిల్లా

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో నాలుగో వార్డ్ ఐదో వార్డులో సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మించుచున్న సిసి రోడ్ స్ డ్రైనేజీలు వ్యవస్థలకు సంబంధించి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు
త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్న దున్న త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు
వారితోపాటు మార్కెట్ చైర్మన్ రమణారావు ఆర్టిఏ మెంబర్ గోపాల్ రెడ్డి గారు మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

నాగర్ కర్నూల్.లో లబ్ది దారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి…

నాగర్ కర్నూల్.లో లబ్ది దారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్.నేటిదాత్రి .

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తాడూర్ బిజనపల్లి తిమ్మాజ్ పెట్ మాండ లాలకు చెందిన లబ్దిదారులకు సి ఎం ఆర్ కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీనేతలు సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారుa

నాగర్ కర్నూలు లో రహదారి భద్రత పై సమావేశంలో ఎమ్మెల్యేఏ ఏ స్పీ..

నాగర్ కర్నూలు లో రహదారి భద్రత పై సమావేశంలో ఎమ్మెల్యేఏ ఏ స్పీ
నాగర్ కర్నూలు నేటిదాత్రి .

 

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ మైదానంలో జిల్లా పోలీసు శాఖ అద్యర్యము లో రహదారి భద్రత సమావేశం నిర్వహించారు ఈసమావేశంలో ఎమ్మెల్యే కుచుకుళ్ల డాక్టర్ రాజేష్ రెడ్డి కలెక్టర్ బాదావత్ సంతోష్ ఏ ఎస్పీ వెంకటేశ్వర్లు డీఎస్పీ శ్రీనివాసులు రవాణ డి టి ఓ బాలు మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావ్ పోలీస్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు అనంతరం పోలీస్ స్టేషన్ నుండి హెల్మెట్ పెట్టుకొని వాహనాల పై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version