నాగర్ చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్ నేటి ధాత్రి

మున్సిపాలిటీ నాగనూ లు చెరువుకు అమృత్ పథకం కింద 3.14 కోట్ల రూపాయలతో చెరువు సుందరీకరణకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులను ఆరు నెలల్లో పని పూర్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రామారావు మున్సిపల్ కమిషనర్ ఏ ఈ మాజీ కౌన్సిలర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 9 వార్డు పదో వార్డ్ కు సంబంధించిన…

నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

 

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 9 వార్డు పదో వార్డ్ కు సంబంధించిన సిసి రోడ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూలు జిల్లాకు జూనియర్ కళాశాలకు 9 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి 19వ తారీకు డిప్యూటీ సీఎం రాజనర్సిమతో కలిసి శంకుస్థాపన చేస్తున్నట్లు అదేవిధంగా కొత్త బస్టాండ్ కు 14 కోట్లు మంజూరయ్యాయని అది కూడా త్వరలో శంకుస్థాపన చేస్తామని నాగర్ కర్నూల్ జిల్లా ను ఒక ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు తొమ్మిదో వార్డ్ మాజీ కౌన్సిలర్ లలిత భాస్కర్ 10 వార్డ్ మాజీ కౌన్సిలర్ బాదం సునీత నరేందర్ వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

శ్రీపురంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రంగనాయక స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు

నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

 

నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు మరియు ఆయన సతీమణి సరిత రాజేష్ రెడ్డి గారు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు కళ్యాణోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు శ్రీపురం గ్రామ సర్పంచ్ గీతా నర్సింహారెడ్డి నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పదో వార్డు మాజీ కౌన్సిలర్ బాదం సునీత ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

తాడూర్ రైతు సంబరాల్లో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎద్దుల బండ లాగుట ప్రారంభం

నాగర్ కర్నూలు జిల్లా నేటి ధాత్రి

తాడూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు సంబరాల్లో భాగంగా ఎద్దుల బండ లాగుట పోటీలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల పండుగ అని రైతుల శ్రమ ఫలించిన ఆనందాన్ని ప్రతిభంబించేదే ఈ సంబరాలు అని అన్నారు గ్రామీణ క్రీడలు సాంప్రదాయ కార్యక్రమాలు మన సంస్కృతికి ప్రతి కలాని వీటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి పైన ఉందని తెలిపారు
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తూ రైతులను ఆదుకుంటుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు
ఈ కార్యక్రమానికి మార్కెట్ చైర్మన్ రమణ రావు తాడూర్ సర్పంచ్ మల్లయ్య చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.!

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ చైర్మన్

కేసముద్రం/ నేటి దాత్రి

కల్వల గ్రామానికి చెందిన ఆరేపు వెంకటమ్మ భర్త కనకయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. కావున వారి యొక్క కుటుంబానికి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, 50kgs బియ్యం అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గండి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెరమాండ్ల ఎల్ల గౌడ్, పెదగాని రవి, మేక వెంకన్న, దాసరి వీరస్వామి, వేల్పుల యాకయ్య, జల్లే వెంకటయ్య, ఆరేపు వీరయ్య, పారానంది శ్రీను, జల్లే పుల్లయ్య మరియు యూత్ సభ్యులు ఆరేపు అనూఫ్, ఆరేపు ప్రవీణ్, జల్లె భాష తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version