కోహీర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులు…

కోహీర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, సీనియర్ నాయకులు కలిమ్, యువ నాయకులు మిథున్ రాజ్ కోహీర్ పట్టణం లోని వివిధ వార్డ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చైర్మన్ నాయకులు మాట్లాడుతూ ,ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారంటీలు ఎక్కడ అని నిలదీయాలన్నారు, బి ఆర్ ఎస్ హయాంలో చేసిన పనులకు రంగులు వేసి మేమే చేసాము అని గొప్పలు చెప్పుకుంటున్నారు,ప్రజల ఆశీస్సులతో కోహీర్ గడ్డ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు,నాయకులు ,కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు..

“కోహిర్‌లో కాంగ్రెస్ ఘన ప్రచార ర్యాలీ”

కోహిర్ లో మునిసిపల్ ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహించిన

◆-: రాష్ట్ర మైనారిటీ సంక్షేమా శాఖ మంత్రివర్యులు మహమ్మద్ అజారోద్దీన్

◆-: మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్

◆-: రాష్ట్ర సెట్విన్ ఛైర్మెన్ గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ పట్టణ కేంద్రంలోని మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.ఈ ప్రచారానికి పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర మంత్రివర్యులు మహమ్మద్ అజారోద్దీన్ మాజీ మంత్రివర్యులు డా||చంద్రశేఖర్,మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు అయిన కోహిర్ మునిసిపాల్టీలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి ,అన్ని వార్డులను కైవసం చేసుకొని కాంగ్రెస్ విజయ దుందుభిని కొనసాగించాలని కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి,కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్ రెడ్డి,మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్, పట్టణ అధ్యక్షులు శంషీర్ తదితరులు పాల్గొన్నారు…

మజ్లిస్ పార్టీలో చేరిన కోహిర్ దళిత నాయకులు

కోహిర్ నాయకులు హైదరాబాద్ చేరుకుని మజ్లిస్ పార్టీ కండువా కప్పుకున్న దళిత నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మజ్లిస్ కోహిర్ అధ్యక్షులు మొహమ్మద్ రఫియుద్దీన్ నేతృత్వంలోని కోహిర్ టౌన్‌తో అనుబంధంగా ఉన్న దళిత నాయకులు హైదరాబాద్ కార్యాలయంలో కోహిర్ ప్రతినిధి బృందంగా కలిసి మజ్లిస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా, అసెంబ్లీ సభ్యుడు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ మజ్లిస్ పార్టీ ఖాండ్వాను ధరించడం ద్వారా కోహిర్ దళిత నాయకులు గాబ్రియేల్ ప్రవీణ్ కుమార్ ఇతరులను మజ్లిస్ పార్టీలో అధికారికంగా చేర్చుకున్నారు. ఈ సందర్భంగా, అసెంబ్లీ సభ్యుడు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహయోద్దీన్ మాట్లాడుతూ, దేశంలోని ప్రస్తుత పరిస్థితిలో ముస్లిం దళిత ఐక్యత అత్యంత ముఖ్యమైన అవసరం అని అన్నారు. రాబోయే కోహిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలలో కోహిర్ మజ్లిస్ పార్టీ నాయకులు ఐక్యంగా పనిచేయాలని పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లను గెలిపించడం ద్వారా కొత్తగా ఏర్పడిన కోహిర్ లో మజ్లిస్ పార్టీ జెండాను ఎగురవేయాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా, కోహిర్ మున్సిపల్ కౌన్సిల్‌తో సంబంధం ఉన్న మజ్లిస్ పార్టీ నాయకులు, మహ్మద్ బాబా మహ్మద్ మోయిన్ మరియు ఇతరులు కూడా హాజరయ్యారు.

కోహిర్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం విజయం లక్ష్యం

*కోహిర్ మున్సిపల్ ఎన్నికలు: ఎంఐఎం విజయం అసదుద్దీన్ కు బహుమతి*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కోహిర్ మున్సిపాలిటీ లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినొద్దీన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కోహిర్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించి, పార్టీ జెండా ఎగురవేయాలని, ఈ విజయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి బహుమతిగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మొహమ్మద్ సలావుద్దీన్ మొహమ్మద్ సమీర్ పల్వాన్ మొహమ్మద్ ఇస్సా ఎంఐఎం పార్టీలో చేరారు. రానున్న ఎన్నికల్లో కోహిర్ లో ప్రజాబలంతో ఎక్కువ మున్సిపల్ కౌన్సిలర్లు గెలుస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమం…

విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమం.

సీఐ మల్లేష్

చిట్యాల, నేటిదాత్రి :

 

‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శనివారం చిట్యాల మండలంలోని వెలుగు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ (పీఎం శ్రీ) పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్యాల సీఐ మల్లేష్, ఎస్ఐ శ్రావణ్ కుమార్ కలిసి హాజరయ్యారు.
అరైవ్ అలైవ్’ మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ‘రంగోలి’ (ముగ్గుల) పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రోడ్డు నిబంధనలను ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా సీఐ మల్లేష్ మాట్లాడుతూ:
ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని,
విద్యార్థులు కేవలం తామే కాకుండా, తమ కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు రోడ్డు భద్రత మరియు హెల్మెట్ ప్రాధాన్యత గురించి వివరించాలని, చిన్న వయస్సు నుంచే ఇలాంటి నిబంధనలపై అవగాహన పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ భిక్షపతి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

కోహీర్ పురపాలక సంఘంలో 10,859 మంది ఓటర్లు..

కోహీర్ పురపాలక సంఘంలో 10,859 మంది ఓటర్లు

◆-: మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన కోహీర్ పురపాలక సంఘం పరిధిలో మొత్తం 10,859 మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పురపాలక సంఘం 16 వార్డులతో విస్తరించి ఉంది. ఓటర్ల సంఖ్యపై స్పష్టత రావడంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కోహిర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్

కోహిర్ మున్సిపాలిటీ ఎన్నికలు తొలిసారి జరగనున్న నేపథ్యంలో, చైర్మన్ సీటును ఎస్సీ జనరల్ కు రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో ఆశావహుల ఆశలు వమ్మయ్యాయి. ఎస్సీ కేటగిరీకి చెందిన నాయకులు చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇక్కడ పోటీ తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version