ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. రైళ్లు, విమాన సర్వీసుల్లో అంతరాయం…

ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. రైళ్లు, విమాన సర్వీసుల్లో అంతరాయం

 

న్యూఢిల్లీని పొగమంచు దుప్పటి కప్పేసింది. ఎదురుగా ఉన్నవి కనిపించనంత దట్టంగా పొగ అలుముకుంది. వాయు నాణ్యత సూచీ 439కు పెరిగింది.

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత భారీగా పడిపోయింది. ఆదివారం ఉదయం.. రాజధాని వ్యాప్తంగా దట్టమైన పొంగ మంచు పరుచుకోవడంతో ఎదురుగా ఉన్నవేవీ కానరాని పరిస్థితి వచ్చింది. దీంతో పలు రైళ్లు, విమానాల ప్రయాణాలు వాయిదాపడ్డాయి. నేటి ఉదయం 7:30 గంటల సమయంలో ఢిల్లీలో వాయునాణ్యత సూచీ ఏక్యూఐ 439కు చేరింది. కాలుష్యం కట్టడి కోసం ఢిల్లీ అధికార యంత్రాంగం జీఆర్ఏపీ-4 నిబంధనలను శనివారం నుంచి అమలు చేస్తోంది.ఢిల్లీలోని సఫ్దర్‌ గంజ్‌లో దట్టమైన పొగమంచు కారణంగా విజిబులిటీ పూర్తిగా తగ్గిపోయింది. పాలమ్ ప్రాంతంలో 100 మీటర్లకు మించి దూరంలో ఉన్నవేవీ కనిపించని పరిస్థితి నెలకొందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దట్టమైన పొగ మంచు కారణంగా ఎయిర్ ఇండియా, ఇండిగో సహా పలు ఎయిర్‌లైన్స్‌ విమాన జర్నీలను వాయిదా వేశాయి. ఈ విషయంపై కస్టమర్లను కూడా అప్రమత్తం చేశాయి. తమ విమానం ఎప్పుడు బయల్దేరుతుందనేది ఒకసారి చెక్ చేసుకుని ఎయిర్‌పోర్టులకు రావాలని సూచించాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 35 శాతం విమాన ప్రయాణాలు ఆలస్యం అవుతున్నాయి.
అయితే.. ఈ పరిస్థితి ప్రస్తుతం క్రమంగా కుదురుకుంటోందని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఉదయం 8 గంటల సమయంలో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఉత్తర భారతంలో ఢిల్లీతోపాటు బరేలీ, లఖ్నవూ, కుషీనగర్‌లలోనూ దృశ్య మాన్యత పూర్తిగా తగ్గిపోయింది. ఇక అమృత్‌సర్, గోరఖ్‌పూర్‌లలో 100 మీటర్ల దూరంలో ఉన్నవీ కనిపించే పరిస్థితి లేదని ఐఎమ్‌డీ తెలిపింది. ప్రయాగ్‌రాజ్‌లో 200 మీటర్ల దూరంలో ఉన్నవీ కనిపించనంతగా పొగ మంచు అలుముకుందని పేర్కొంది.

పొగ మంచు కారణంగా రైళ్ల సర్వీసుల్లోనూ అంతరాయం ఏర్పడింది. రాజధాని, దురంతో, గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ వంటి అనేక రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి

దారిపై మంచు భూతం..

దారిపై మంచు భూతం..

 

 

 

గత కొద్దిరోజులుగా మంచు విపరీతంగా పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పొగమంచు కారణంగా ప్రధానంగా రహదారులపై వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

చలితీవ్రత పెరగడంతో జిల్లా వ్యాప్తంగా పొగ మంచు కమ్మేస్తోంది. కనీసం పదడుగుల దూరంలోని మనుషులు, వాహనాలు సైతం కనిపించనంతగా పొగమంచు ఉంటోంది. ఉదయం 8 గంటలు దాటినా దీనిప్రభావం ఉంటోంది. ఈనేపథ్యంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో 44వ జాతీయ రహదారి దాదాపు వంద కిలోమీటర్ల మేర ఉంది. కొడికొండ చెక్‌పోస్టు నుంచి శిర జాతీయరహదారి, మడకశిర నుంచి కళ్యాణదుర్గం రహదారి, కదిరి జాతీయరహదారి విశాలంగా ఉన్నాయి. దీంతో వాహనాలు అతివేగంగా పరుగులు తీస్తుంటాయి. ఈక్రమంలో రోడ్డుపై ఎక్కువ భాగం పొగమంచు కప్పివేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రతిఏటా డిసెంబరు, జనవరి మాసాల్లో తెల్లవారుజామున, ఉదయం జరిగే రోడ్డు ప్రమాదాలు అధిక పొగమంచు కారణంగానే జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

వారం కిందట మడకశిర-బెంగళూరు రహదారిపై తెల్లవారుజామున మంచు అధికంగా ఉండటంతో దారి కనిపించక వేగంగా వెళ్తున్న ఓ కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.

– గతవారం జాతీయరహదారిపై తెల్లవారుజామున బెంగళూరు నుంచి అనంతపురం వెళ్తున్న కారు మంచు ప్రభావంతో మలుపు గుర్తించ లేకపోవడంతో నేరుగా వెళ్లి ప్రమాదానికి గురైంది. కారులో ఉన్నవారు గాయపడ్డారు.

– కొద్దిరోజుల క్రితం కదిరి, అనంతపురం హైవేపై కదిరి సమీపంలో పొగమంచు ప్రభావంతో రోడ్డు దాటుతున్న మహిళ కనిపించక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version