క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం గ్రామంలో జహీరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మాణిక్ రావు, గ్రామ పెద్దల సహకారంతో సందర్భంగా నిర్వహించిన గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. శాసనసభ్యులు మాణిక్ రావు మాట్లాడారు. గ్రామ ప్రజలందరికీ వచ్చే మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆటల వల్ల శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం సామాజిక నైపుణ్యాలు పెంపొందుతాయి ఇవి కండరాల బలం గుండె ఆరోగ్యం మెరుగైన రక్త ప్రసరణను అందిస్తూ ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే బృంద కృషితో కూడిన ఆటలు యువకుల్లో నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ జట్టుగా పని చేసే నైపుణ్యాన్ని (Team Work) అభివృద్ధి చెందుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఉప సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ మండల అధ్యక్షుడు వెంకటేశం మాజీ ఎంపీపీ సంగమేశ్వర్ తాజా మాజీ సర్పంచ్ జగదీశ్వర్ మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియ టౌన్ ప్రెసిడెంట్ ఎజస్ బాబా నాగన్న పటేల్ సర్జన్ నాగేశ్వర్ శీను పటేల్ సద్దాం సజావుద్దీన్ మరియు ఆయా గ్రామాల సర్పంచులు కార్యకర్తలు మెంబర్ పాల్గొన్నారు.

యువతకు క్రీడలతోనే మానసిక ఉల్లాసం….

యువతకు క్రీడలతోనే మానసిక ఉల్లాసం….

ఓటమి గెలుపుకు నాంది కావాలి…

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

మంగపేట నేటిధాత్రి

 

యువతకు క్రీడలతోనే మానసిక ఉల్లాసం ఉత్తేజం కలుగుతాయని నేటి ఓటమి రేపటి గెలుపుకు నాంది కావాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు శనివారం జిల్లా సరిహద్దు గ్రామాలైన మంగపేట మండలం అకినేపల్లి మల్లారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ కొత్తగూడెం గ్రామ సర్పంచ్ కనితి సుమలత అధ్యక్షతన జరిగిన యూత్ క్రీడల విజేతల బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ యువత క్రీడా పోటీలతో పాటు విద్యా ఉపాధి రంగాల్లో రాణించాలని సేవా మార్గం అనుసరించి పేదలకు అండగా నిలవాలని అన్నారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా అకినేపల్లి మల్లారం మరియు టీ కొత్తగూడెం యూత్ సభ్యులు యువతకు క్రీడలు నిర్వహించటం మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించి యువత ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు అనంతరం క్రికెట్ షటిల్ మరియు ముగ్గుల పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో టీ కొత్తగూడెం గ్రామ సర్పంచ్ కనితి సుమలత గ్రామ రైతు పాడి ఈశ్వర్ రెడ్డి యువజన సంఘం సభ్యులు పాడి హేమంత్ రెడ్డి గాలి వేణు చిట్టిమల్ల ప్రసాద్ బోడెంపూడి శివ ప్రకాష్ గిద్ద వరుణ్ డబ్బుల ముత్యాలరావు రాట్నాల నరేష్ రెడ్డి రెండు గ్రామాల మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

రామన్ పాడు గ్రామంలో క్రికెట్ పోటీలు ప్రారంభం

రామన్ పాడు గ్రామంలో క్రికెట్ పోటీలు ప్రారంభించిన సర్పంచ్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కొత్త కోట మండలం రామన్ పాడు గ్రామములో
క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సర్పంచ్ అఫ్రీన్ బేగం అంజాద్ అలీ ప్రారంభించారు
గ్రామ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ మూడు రోజులపాటు ఆడుతున్న సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్అఫ్రీన్ బేగం అంజాద్ అలీ ప్రారంభించి టాస్ ఎగర వేసారు ఈ సందర్భంగా సర్పంచ్ యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆటలు మానసిక ప్రశాంతతనం ఏకాగ్రతను ఇస్తూ శారీరక దృఢత్వని ఇస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామ యువకులు పాల్గొన్నారు

సంక్రాంతి ముగ్గుల పోటీలు ప్రారంభించిన మల్లారెడ్డి

సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టాలి : మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

* మూడు చింతలపల్లి అలియాబాద్ మున్సిపాలిటీలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
* పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

 

సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా పండగలు నిర్వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి అన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని మహిళలను చైతన్య పరిచేందుకు యాడారంలో బిఆర్ఎస్ పార్టీ అశోక్, హనుమాన్ దాస్, మూడు చింతలపల్లి లో మాజీ సర్పంచ్ జాము రవి, లక్ష్మాపూర్ లో మాజీ సర్పంచ్ సింగమాంజనేయులు మాజీ ఎంపీటీసీ నాగరాజు, గౌటే గోపాల్, అలియాబాద్, లాల్ గాడి మలక్పేట్, తుర్కపల్లి నాగిశెట్టిపల్లి తదితర గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లారెడ్డి ముగ్గుల పోటీలను సందర్శించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ పండగలను సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ప్రోత్సహించడం కోసమే బిఆర్ఎస్ పార్టీ ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా యువతను ప్రోత్సహించడం కోసం ఈనెల 16 నుంచి 19 వరకు క్రికెట్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జహంగీర్, డిసిఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మాజీ వైసీపీ ఎల్లుభాయి, మాజీ జెడ్పిటిసి అనిత, బిఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షులు సరస మోహన్ రెడ్డి, మల్లేష్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు సదాశివరెడ్డి, ఆనంద్ గౌడ్, లింగం, కార్యకర్తలు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.

భూపాలపల్లిలో ఘనంగా కైట్ ఫెస్టివల్

భూపాలపల్లిలో ఘనంగా కైట్ ఫెస్టివల్

గాలిపటాలు ఎగరేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

పండుగల ద్వారానే కుటుంబాల అనుబంధాలు మరింత బలపడతాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ భూపాలపల్లి సుభాష్ కాలనీలోని మున్సిపల్ గ్రౌండ్ లో ఘనంగా కైట్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫెస్టివల్ లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పాల్గొని పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు. అనంతరం జంగేడు – భూపాలపల్లి గెట్ టు గెదర్ క్రికెట్ టోర్నమెంట్ టీషర్ట్ ఆవిష్కరించారు.

 

ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి పండుగల పాత్ర ఎంతో ముఖ్యమని, పిల్లలు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇందులో పిల్లలతో గడిపిన ఈ క్షణం చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశాయని తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి, ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త కాంతి నింపాలని కోరుతూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని సందడి చేశారు

మండపల్లిలో సంక్రాంతి క్రికెట్ పోటీలు

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని.మండేపల్లిలో క్రికెట్ పోటీలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. మండపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ గాధగోని సాగర్ ముఖ్య అతిథిగా హాజరై సంక్రాంతి పండుగ పురస్కరించుకుని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలువురు యువత నాయకులు మాట్లాడుతూ. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నా ఎందరో వచ్చి పోతున్న కూడా గ్రామంలో యువతకు క్రీడా ప్రాగణం లేకపోవడంతో యువత గ్రామంలో క్రీడలు ఆడుకోవడానికి స్థలం లేకపోవడంతో ఈ పాలకవర్గమైన గ్రామ పరిసరాల్లో యువతకు అనుకూలంగా క్రీడలకు స్థలం కేటాయించవలసిందిగా దాని ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి ఒక మినీ స్టేడియం నిర్మించాలని గ్రామంలోని ప్రతి ఒక్కరు యువత ప్రజలు నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గాన్ని కోరడం జరిగిందని దీనిపై స్పందించిన సర్పంచ్ సాగర్ సాధ్యమైనంత త్వరలో క్రీడా ప్రాగానం నిర్మాణం చేపట్టే విధంగా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి యువతకు ఆటలు ఆడుకునే విధంగా ప్రాగణం ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా యువతకు గ్రామ ప్రజలకు యువకులకు నాయకులకు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని తదనంతరం క్రికెట్ పోటీలు ప్రారంభించడం జరిగిందని ఇట్టి పోటీలలో గెలుపొందిన జట్లకు తగిన పారితోషకం బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ యువత క్రీడాకారులు క్రికెట్ కు సంబంధించిన పలు గ్రామాల జట్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

క్రీడాకారులకు టి-షర్ట్ లను పంపిణి….

క్రీడాకారులకు టి-షర్ట్ లను పంపిణి

భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహారావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో సంక్రాంతి సందర్బంగా ములుగు జిల్లా కొత్తూరు లో జరిగే క్రికెట్ టోర్నమెంట్ కోసం గణపురం క్రికెట్ క్రీడాకారులకు టి-షర్ట్ లను పంపిణి చేసిన భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూక్రీడలు శారీరక, దృఢత్వమే కాకుండా మానసిక ఉల్లాసానిస్తాయన్నారు
క్రీడా కార్యక్రమాలు యువతను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచి, శారీరకంగా మానసికంగా బలంగా తీర్చిదిద్దుతాయి.
క్రీడలు గెలుపోటములు తట్టుకునే మానసిక ధైర్యాన్ని ఇస్తాయాన్నారు
క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు,క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన వంటి విలువలను పెంపొందిస్తాయి.
అలాగే యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్‌లు కీలక పాత్ర పోషిస్తాయి అన్నారు
భవిష్యత్తులో కూడా
ఇలాంటి క్రీడా కార్యక్రమాలకు తన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.అలాగే ఎమ్మెల్యే ని పలు మార్లు క్రీడా మైదానం క్రీడాకారులను గురించి కలవడం జరిగింది ఈ సందర్బంగా గణపురం లో ఒక క్రీడా మైదాన్నన్ని ఏర్పాటు చేయాలనీ క్రీడకారుల తరపున కోరడం జరిగింది ఈ సందర్బంగా క్రీడాకారులు లక్ష్మీ నరసింహారావు ని శాలువాతో సన్మానించడం జరిగింది
ఈ కార్యక్రమంలో గణపురం బి ఆర్ ఎస్ టౌన్ అధ్యక్షులు హఫీజ్, క్రీడాకారులు నిమ్మ సురేందర్, తాళ్లపెల్లి సాయి వర్ధన్, వాజిత్, ఇమ్రాన్,పూజారి రాకేష్, ముజ్జు,తాళ్లపెల్లి హర్ష,రమేష్, వహీద్, రోహన్, సాజిత్,మండ రాజు, అభి,షఫీ, వెంకటేష్, కృష్ణ, సోన్ను,బన్నీ, సర్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకే ఆటల పోటీలు..

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకే ఆటల పోటీలు..

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

క్రీడలు మానసికొల్లాసానికి దోహదపడతాయి….

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి మెమోరియల్ టి20 లీగ్ మ్యాచ్ ఖమ్మం,హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను చెన్నూర్ ఎమ్మెల్యే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. క్రీడలు మానసికొల్లాసానికి దోహదపడతాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకా వెంకటస్వామి మెమోరియల్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నామని ఈనెల 17న ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లో జరుగుతుందని తెలిపారు.క్రీడలలో గెలుపు ఓటములు సహజమని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ టోర్నీలు నిర్వహిస్తున్నామని అన్నారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ టోర్నమెంట్ లు నిర్వహిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో మహిళల క్రికెట్ మ్యాచ్ లు సైతం నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిపి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి రఘునాథరెడ్డి రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ,మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ అలీ, క్రీడాకారులు,నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేసిన యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు..

క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేసిన యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో గల గడికోట మైదానంలో జరుగుతున్న రామడుగు మండలం విలేజ్ టూ విలేజ్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా రామడుగు గ్రామానికి చెందిన రామడుగు రాయల్స్ టీమ్ జట్టుకు యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్ టిషర్ట్స్ అందజేయడం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మామిడి దిలీప్ కుమార్, బసరవేణి అజయ్, పూరెల్ల రాహుల్ , ఎడవెల్లి సాగర్, రామడుగు గ్రామస్తులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రగతి స్టేడియంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్.

ప్రగతి స్టేడియంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్.

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో కొక్కిరాల రఘుపతి రావు జ్ఞాపకార్థంగా ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు యువసేన శ్రీరాంపూర్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. యువకులలో క్రీడా స్ఫూర్తినీ పెంచడంకోసం,మానసిక వికాసం కోసం,స్నేహభావాన్ని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నూకల రమేశ్,ధర్ని మధు 21 వార్డు ఇంచార్జీ
,మాజీ కౌన్సిలర్లు పుదరీ కుమార్,తెనుగు దేవేందర్,మాజి ఎంపీటీసీ ఎల్పుల రవీందర్,చిలుకా మల్లేష్ వార్డు ఇన్చార్జులు అత్కాపూర్ సతీష్,నియోజక వర్గ యూత్ అధ్యక్షుడు నారిగే నరేష్,అంగిడి ,రాజేష్,ఉప్పల్ రమేష్ మారు మల్లన్న నాగార్జున,ఆర్గనైజర్ భీమిని రాజేష్,కొండే రజినీ కాంత్,గుర్రపు సురేష్,మూట శేఖర్,ప్రదీప్,ప్రశాంత్ తదితర పాల్గోన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version