తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుని ఘనంగా జన్మదిన వేడుకలు….

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుని ఘనంగా జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన శుభాకాంక్షలు , సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొనిదొడ్డి నరసింహ సంగారెడ్డి జిల్లా కార్య కార్యదర్శి వరప్రసాద్ కార్యక్రమంలో మండల మొగుడంపల్లి అధ్యక్షుడు శ్రీను, మొగుడంపల్లి మండల ప్రధాన కార్యదర్శి లతీఫ్ షాప్, అధ్యక్షుడు , మొగుడంపల్లి యూత్ అధ్యక్షులు మహేష్ మండల్ సోషల్ మీడియా కన్వీనర్ సుభాష్ సాగర్ పాల్గొన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో ధనసిరి గ్రామంలో వివిధ పార్టీల నుంచి భారీగా చేరికలు 60 మంది చేరడం జరిగింది తెలంగాణ రాజాధికారి పార్టీలో అందరూ కలిసి తీన్మార్ మల్లన్న జన్మదినాలు జరుపుకోవడం జరిగింది,

గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత…..

గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్ర అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు తోడ్పాటు అందివ్వాలని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా ఎస్ ఆర్ ఎస్ పి భూముల ఆక్రమణ జరగడంతో అక్రమంగా భూములను ఆక్రమించుకున్న వారిపై న్యాయంగా చట్టబద్ధంగా పోరాటం చేయటంతో సంబంధిత అధికారులు స్పందించి సరిహద్దులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భూముల ఆక్రమణ అంశంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించి సొంత గ్రామ అభివృద్ధికి సహకరించి కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులకు అడ్డుకట్ట వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. రాజకీయ కక్ష సాధింపు తోనే ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నానని కొందరు నాపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని. నా సొంత స్వలాభం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ముందు వేసుకొని చేయాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదని గ్రామ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పోరాడతానని. దానికోసం మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి గ్రామ ప్రజల వెంట ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికైనా గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి గ్రామ అభివృద్ధి కొరకై పని చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని స్పష్టం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version