పత్రికా వేలేఖరి తల్లీ పార్థివదేహానికి చిలువేరు సమ్మి గౌడ్.

పత్రికా వేలేఖరి తల్లీ పార్థివదేహానికి చిలువేరు సమ్మి గౌడ్ నివాళులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కూన శ్రీను, సతీష్ ల మాతృమూర్తి సరోజన మరణించగా వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఘన నివాళులర్పించారు.సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి వారిని ఓదార్చి మనో ధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమంలో కొండేటి కళాధర్,ఎసల్ల సత్యనారాయణ, మోరపాక జగన్, చంద్రగిరి వంశీకృష్ణ, గాజుల రవి, కమటం స్వామి కొంతం రవి తదితరులు ఉన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం.!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం, భీమ్ రావు మాల సంఘం కొత్వాల్ గూడ నూతన కమిటీ ఎన్నిక…

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ గ్రామం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం, భీమ్ రావు మాల సంఘం నూతన అధ్యక్షులు, కమిటీ సభ్యుల ఎన్నిక గురువారం జరిగింది.
అంబేద్కర్ యువజన సంఘం, భీమ్ రావు మాల సంఘం నూతన అధ్యక్షులుగాచేవెళ్ల గిరి,ప్రధాన కార్యదర్శిగా చేవెళ్ల రాకేష్,కోశాధికారిగా : పిల్లి రాహుల్ కుమార్, ఉపాధ్యక్షులుగా పత్యర రాములు , సిద్ధం విజయ్, చెరుకుల శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ నిరటినరసింహ,
చేవెళ్ల రాజేష్,పత్తి నర్సింగ్ రావు, పత్యారాశ్రీనివాస్, పంబాల చంద్రయ్య, పత్యారా శేఖర్,
ఆవుల బెంజ్ మేన్, చేవెళ్ల కృష్ణ,
చేవెళ్ల రమేష్,పిల్లి ప్రేమ్ రాజు, పత్యార ఎలీషానవీన్ కుమార్, అవుల కళేబ్, పంబల రాజు, చేర్కుల నర్సింహ, చెర్కుల అంజయ్య పెద్దలకు సమక్షంలో నూతన అధ్యక్షులు కమిటి సభ్యులను ఎన్నుకొన్నారు.

పెషా, 1/70 చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి..

పెషా, 1/70 చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి..

ఆపరేషన్ కగార్ నిలుపు దల చేయాలి.

ప్రభుత్వాలు పార్లమెంట్ చట్టాలను కాపాడాలి…

ఏజెన్సీ లో ఆదివాసీలను భయబ్రాతులకు గురించి చేయకండి.

ఆదివాసీ సంక్షేమ పరిషత్, ములుగు జిల్లా అధ్యక్షులు, తాటి నాగరాజు.

నూగూర్ వెంకటాపురం
నేటి ధాత్రి / మే 1 ములుగు జిల్లా

 

 

వెంకటాపురం మండల కేంద్రంలో గురువారం నాడు వెంకటాపురం మండలం కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా కొమరం భీం విగ్రహం దగ్గర ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో బొగ్గుల సమ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు తాటి నాగరాజు గారు పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన ప్రదేశాల్లో ఆదివాసీలు ఇల్లు కట్టుకొని నివాసాలు ఏర్పాటు చేసుకుని సహజసిద్ధమైన అడివిలో దొరికే పండ్లు కాయలు మందులు లేని వ్యవసాయం చేసుకో నీ పండిన టువంటి పంటలు తిని జీవితాన్ని గడుపుతున్న ఆదివాసీలు ఇప్పుడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు లను ఏరివేత పేరుతో తెలంగాణ రాష్ట్ర భూభాగంలో కర్రి గుట్టల ప్రాంతంలో కేంద్ర బలగాల తో కగా ర్ ఆపరేషన్, హెలికాప్టర్ ద్వారా బాంబుల వర్షం కురిపించడం వలన ఎప్పుడు ఏమి జరుగుతుందో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కర్రీ గుట్టలో చేపట్టిన కగార్ ఆపరేషన్ ను నిలుపుదల చేసి ప్రశాంతమైన వాతా వ ర ణ నీ నెలకొల్పాలని తాటి నాగరాజు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నూగు రు వెంకటాపురం,వాజేడు మండలాలు భూభాగం ఛ త్తీస్ ఘడ్ రాష్ట్రం ఆనుకొని దట్టమైన అడవి గుట్టలు కొండలు కలిగి వి స్తీ ర్ణ మైన భూభాగం కలిగిన కర్రి గుట్టలు లో ఖనిజ సంపద కలిగి ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని కార్పొరేట్ల కంపెనీల బడా బాబు లు ఆ దాని అంబానీ లకు దోచి పెట్టడానికి ఏజెన్సీ ప్రాంతంలో పేసా చట్టం అడవి హక్కుల చట్టాలు ఎల్ టి ఆర్ 1/70 చట్టాలు పార్లమెంట్ లో చేసినటువంటి చట్టాలను ఉల్లంఘించి ఈ ప్రాంత భూభాగాన్ని కొల్ల గొట్ట డానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుందని తాటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా గౌరవ అధ్యక్షులు పీర్ల మల్లి ఖా ర్జు న్ రావు గారు శ్యామల వెంకటేశ్వర్లు బొగ్గుల సమ్మయ్య ఉ యి క గోపి శ్యామల వంశి కణితి శేషు సోడి సారయ్య శ్యామల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఎస్ఎస్సి ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థి.!

ఎస్ఎస్సి ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థినిలకు సన్మానం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం విద్యార్థినిలు టాపర్లుగా నిలవడంతో అధికారులు వారికి గురువారం ఘనంగా సన్మానం చేశారు.2024 – 2025 పదో తరగతి విద్యా సంవత్సరం ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో జెడ్పి హైస్కూల్ లో చదువుతున్న ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం విద్యార్థిని సముద్రాల నక్షత్ర 600 మార్కులకు 523 మార్కులు సాధించి మొదటి టాపర్ గా నిలవడంతో 600 మార్కులకు 495 మార్కులు సాధించిన దేవిక రెండవ టాపర్ గా నిలిచినట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని,అలాగే ప్రభుత్వ పాఠశాలలో అత్యంత విద్య లభిస్తుందని హాస్టల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులకు పోషకమైన ఆహారంతో పాటు నాణ్యమైన విద్య లభిస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాపూరావు,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సునీత,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సుధా లక్ష్మి,విద్యార్థినిల తల్లిదండ్రులు,స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు.

కులగణన పై కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.

కులగణన పై కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో
దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు మాట్లాడుతూ చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ,దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని ,బీసీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించాలని ,కేంద్రంలో బీసీలకు ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అనేక దశాబ్దాలుగా బీసీలుగా ఉద్యమిస్తున్నామని అన్నారు. దేశంలోని అనేకమైన ఓ బి సి సంఘాలు, ప్రజాసంఘాల పోరాటo, ఉద్యమాల వల్ల కేంద్ర ప్రభుత్వం తలోగ్గి బీసీ కులగనన నెరవేరుస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగనన డిమాండ్ ను జాతీయస్థాయిలో ఒక ఎజెండా అంశంగా తీసుకొచ్చారని అందుకు రాహుల్ గాంధీ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
11 సంవత్సరాల నుండి బీసీల కొరకు ఒక్క మంచి పని కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేయలేదని, ఏ గణనా బీజేపీ చరిత్రలో ఒక చారిత్రాత్మక నిర్ణయమని,కేంద్ర ప్రభుత్వానికి, పి ఎం నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం సామాజిక రిజర్వేషన్లపై 50% రిజర్వేషన్ ఎత్తివేయాలని, తెలంగాణలో 42 శాతం, బీహార్లో 65 రిజర్వేషన్ కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరవేని మల్లేష్ యాదవ్,పట్టణ అధ్యక్షుడు కమలాకర్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బోప్పదేవయ్య ,సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడ్క కమలాకర్,ఇల్లంత కుంట తిరుపతి , బచ్చు ప్రసాద్ ,సామల తిరుపతి,కొండ విజయ్,తొట్ల మల్లేశం,తొట్ల మల్లేశం,రోహిత్ యాదవ్ ,కొండయ్య,దామోదర్ ,శ్రీనివాస్ ,నరేందర్,శ్రీధర్ తదితరు పాల్గొన్నారు.

తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ .

తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ( ఐ ఎన్ టి సి 327) ఘనంగా మేడే వేడుకలు

తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి

 

 

 

ఈరోజు తొర్రూరు డివిజన్లో ఐ ఎన్
టి సి 327
సంఘం ఆధ్వర్యంలో మే డేను ఘనంగా నిర్వహించారు. తొర్రూర్ డివిజన్ అధ్యక్షుడు కే భోజలు జెండా ఆవిష్కరించి శ్రమజీవుల కృషిని గుర్తు చేసుకున్నారు. కార్మికుల హక్కులను సాధించే దిశగా సంఘటితం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు.
ఇకార్యక్రమంలో మహబూబాబాద్ సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ పాషా, మరియు జిల్లా నాయకులు పసుపులేటి మధు తొర్రూరు డివిజన్ కార్యదర్శి డి సికిందర్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి నాగరాజు, డీసెంట్ ట్రెజరర్ కే రవికుమార్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పి రాజశేఖర్, డివిజన్ ఆఫీస్ సెక్రటరీ పి సునీల్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చించు సంతోష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, మాజీ ఎంపీపీ శ్యాంసుందర్ గారు, ఎస్టీ సెల్ అధ్యక్షులు రవి గారు మరియు తొర్రూర్ డివిజన్ కార్మికులు డోలు వెంకటస్వామి, సైదులు, యాకుబ్ రెడ్డి, లింగారెడ్డి, సతీష్ ,హరిప్రసాద్, ఖాజాబీ, సంధ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా మే డే ఉత్సవం.!

భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే ఉత్సవం.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

మే డే ఉత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పార్టీ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, భగత్ సింగ్ స్టాచ్ దగ్గర పట్టణ అమాలి సంఘం జెండాను రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, ఏరియా హాస్పిటల్ జెండాను జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేష్, భవన నిర్మాణ సంఘం జెండాను భవన నిర్మాణ కార్మిక సంగం జిల్లా కార్యదర్శి జాడి పోచం, రైల్వే స్టేషన్ జెండాను మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు బొల్లం సోనీ, ఇంక్లైన్ జెండాను పట్టణ కార్యవర్గ సభ్యులు బొంకూర్ రామచందర్, రైల్వే రధగంబాల జెండాను శాఖ కార్యదర్శి ఎన్ రాజన్న పాత బెల్లంపల్లి జెండాను జిల్లా సమితి సభ్యులు మేకల రాజేశం అరుణ పతాక ఆవిష్కరణలు చేసినారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి, రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేష్ ప్రసంగిస్తూ చికాగో అమరుల రక్తంతో తడిసి ఎర్రజెండాగా అవతరించింది. కార్మికులను 16 గంటలు పని చేస్తూ కట్టు బానిసలుగా తయారు చేస్తూ నీరం కుశంగా అణచివేస్తున్నందుకు నిరసనగా 1886లో అమెరికాలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ నిర్వహించినారు. అట్టి రాలిపై పోలీసులు జరిపిన కాల్పులలో ఎంతోమంది కార్మికులు వీర మరణం పొందారు. వారి పోరాట ఫలితంగా ప్రపంచమంతా ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసి నారు. వారి పోరాట స్ఫూర్తితో భారతదేశంలో కార్మిక వర్గ పోరాటాలు చేస్తూ 44 కార్మిక చట్టాలను సాధించాము. మోడీ ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ 44 చట్టాలను నాలుగు కోడు లుగా మారుస్తూ కార్మిక హక్కులను హరించు చున్నది. కావున దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గమంతా సంగటితమై కేంద్ర ప్రభుత్వ విధానం కు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను రక్షించుకొనటానికి సమరశీల పోరాటాలు చేయవలసి ఉన్నదని కేంద్ర ప్రభుత్వం దేశంలో నక్సలైట్లను లేకుండా చేస్తామని ఆపరేషన్ కగారు పేరిట కేంద్ర బలగాలతో కర్రెగుట్టలను ఆక్రమించుకొని జల్లేడపడుతూ జీవించే హక్కును హరించవద్దని మరియు నక్సలైట్లు కూడా జనజీవన స్రవంతిలో కి రావాలని వారితో చర్చలు జరపాలని వామపక్ష పార్టీలు ఈ సందర్భంగా కోరుతున్నాయి. కార్యక్రమంలో మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు అక్క పెళ్లి బాబు, డిఆర్ శ్రీధర్, గుండా చంద్ర మాణిక్యం, బియ్యాల ఉపేందర్, మేకల రాజేశం, పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్, ఏ ఐ టి యు బ్రాంచి సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు బొల్లం సోని, పట్టణ కార్యవర్గ సభ్యులు మంతెన రమేష్, రత్నం రాజం, రామచందర్, బొల్లం తిలక్ అంబేద్కర్, దాసరి అనిల్ కుమార్, పట్టణ లోడింగ్ అన్లోడింగ్ అమాలి సంఘం కార్యదర్శి కుందేళ్ళ శంకర్, కా సిపేట మైన్ 1 పిట్ కార్యదర్శి మీనుగులక్ష్మీనారాయణ, కా సిపేట మైన్ 2 ఫిట్ కార్యదర్శి గొల్ల శ్రీనివాస్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

వడగళ్ల వర్షానికి మామిడి తోట నేలమట్టం.

వడగళ్ల వర్షానికి మామిడి తోట నేలమట్టం

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం బుర్రకాయల గూడెం గ్రామ శివారు రత్న బాబు రైతు కు చెందిన 7 ఎకరాల మామిడి తోట 4 ఎకరాల వరి పొలం బుధవారం రాత్రి కురిసిన వడగళ్ళ వర్షానికి గాలి దుమారానికి నష్టం జరిగింది 7 ఎకరాల మామిడి తోట 500 ల చెట్లకు ఉన్న మామిడి కాయలు మొత్తం రాలిపోయాయి శుక్రవారం మామిడితోట కొద్దామనుకునే సమయానికి వర్షానికి పూర్తిగా నేల పాలయాయ్యాయి మామిడి ఒక ఎకరానికి లక్ష యాభై వెయిల చొప్పున మొత్తం 7 లక్షల యాబై వేయిలు నష్టం జరిగింది 4 ఎకరాల వరి పంట మొత్తం నేల మట్టం అయ్యింది అధికారులు స్పందించి తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు

-పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు.

-పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు

జర్నలిస్టుల హక్కులకై సమిష్టిగా పోరాడుదాం

 

పాలకుర్తి నేటిధాత్రి

 

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కార్యదర్శి చెరిపెల్లి అశోక్ మహర్షి (ఎస్6 న్యూస్ ) మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను వెలికితీస్తున్న క్రమంలో ప్రభుత్వాల కుట్రలకు బలైపోయిన కలం కార్మికులకు నివాళులర్పిస్తూ కలం కార్మికుల స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. జర్నలిస్టు యోధులు షేక్ బందగీ, ఎన్ కౌంటర్ దశరథ రామ్, గౌరీ లంకేష్, ల ఆశయాలను కొనసాగించాలని కోరారు. కలం కార్మికుల హక్కుల కోసం సమిష్టిగా ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు బండిపెల్లి మధు (జర్నలిస్టు సూర్య), ప్రెస్ క్లబ్ కోశాధికారి కొత్తకొండ వాసు (బెస్ట్ వాయిస్ రిపోర్టర్), కార్యవర్గ సభ్యులు కమ్మగాని నాగన్న (పయనించే సూర్యుడు), గజ్జి సంతోష్ కుమార్ ( నేటి దిన పత్రిక సూర్య ), వన్నాల ధనుంజయ (నేటిధాత్రి), అబ్బోజు యాక స్వామి (ఐ న్యూస్), సీనియర్ జర్నలిస్ట్ చిట్యాల మధు (నమస్తే తెలంగాణ) పాల్గొన్నారు.

* సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్.!

* సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్*

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

 

ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది. మొన్న జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల డి.సి.సి సమావేశంలో ప్రభుత్వ విప్ చీప్ ఆది శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తల ముందు చిటి ఉమేష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి దానిపై ఈరోజు కాంగ్రెస్ మండల స్థాయి నాయకులు సమావేశం నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎప్పుడో ఒకసారి వచ్చే చీటీ ఉమేష్ రావు ఏ నాయకులను గాని ఏ కార్యకర్తలను గాని పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి. సిరిసిల్లలోని కాంగ్రెస్ కార్యకర్తలపై
పార్టీ పరంగా గాని వ్యక్తిగతంగా గాని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైనది కాదని అందువల్ల అతనిపై టీ.పి.సీ.సీకి ఫిర్యాదు చేస్తూ చర్యలు తీసుకునే విధంగా చూస్తామని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ టోనీ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, మరియు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగినది.

క్రీడాకారులకు టీ షర్ట్లు బహుకరణ.

క్రీడాకారులకు టీ షర్ట్లు బహుకరణ

నేటిధాత్రి అయినవోలు:-

 

అయినవోలు మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. టోర్నమెంట్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా అయినవోలు మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండల నాయకులు పల్లకొండ కుమార్ క్రీడాకారులకు గురువారం టీ షర్టులను బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత క్రీడల్లో నైపుణ్యం సాధించి మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల యువ నాయకులు బొల్లె పెల్లి బిక్షపతి గౌడ్ పల్లకొండ రమేష్ టోర్నమెంట్ నిర్వాహకులు క్రీడాకారులు పాల్గొన్నారు.

కామ్రేడ్ లక్ష్మయ్య కు ఘన నివాళి.

కామ్రేడ్ లక్ష్మయ్య కు ఘన నివాళి

కమ్యూనిస్టు కుటుంబాలకు అరుదైన గౌరవం
లక్ష్మయ్య స్మారక స్తూపం ఎదుట అరుణ పతాకావిష్కరణ

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

 

పీడిత తాడిత శ్రామిక వర్గాల కోసం కమ్యూనిస్టులు చేసిన త్యాగాలు మరవలేనివని, ఎందరో నాయకులు భౌతికంగా దూరమైన వారిని స్మరిస్తూ వారి కుటుంబాలకు ఇప్పటికీ సమాజంలో అరుదైన గౌరవం లభిస్తున్నదని సిఐటియు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య ఏఐటిఈసి జిల్లా అధ్యక్షులు కందిక చెన్నకేశవులు, ఎంసీపీఐ మండల కార్యదర్శి గాజుల వెంకటయ్య, బీఆర్ఎస్ మండల నాయకులు మారం రాము, ఈదునూరి వెంకన్న, తెలంగాణ గిరిజన రత్న వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ అన్నారు.నెక్కొండ మండల కేంద్రంలో స్థానిక జిపిఎస్ పాఠశాల ఎదురుగా కమ్యూనిస్టు దివంగత నేత కామ్రేడ్ బూరుగుపల్లి లక్ష్మయ్య స్మారకస్తూపం ఎదుట అరుణ పతాకాన్ని ఎగురవేసి దివంగత కమ్యూనిస్టు నేత లక్ష్మయ్యకు ఘన నివాళులు అర్పించారు. నెక్కొండ మండలంలో అన్ని కమ్యూనిస్టు పార్టీలు, అనుబంధ ట్రేడ్ యూనియన్ల నాయకులు లక్ష్మయ్య సేవలను స్మరించి ఎందుకు ఒకే వేదికను పంచుకోవడం అద్భుతమైన ఘట్టమన్నారు. విభిన్న సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పీడిత వర్గాల పక్షాన తుది శ్వాస విడిచే వరకు పోరాడిన లక్ష్మయ్య సేవలను స్మరించేందుకు ఒక వేదిక పైకి రావడం తమకు ఆనందంగా ఉందన్నారు. మూడు దశాబ్దాలు గడిచినప్పటికీ శ్రామిక వర్గాల గుండెల్లో బూరుగుపల్లి లక్ష్మయ్య చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
చాగంటి వెంకటయ్య, సిఐటియు మండల అధ్యక్షులు భూక్య నరేశ్ ఉపాధ్యక్షులు ఈదునూరి సాయిలు, నాయకులు మదార్ కృష్ణ ,భస్క శ్రీను, మోహన్ బిర్రు రమేష్, దేవేందర్, హైమ, సూరమ్మ, ఉపేంద్ర, సబిత, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, సిపిఐ మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు, గుమస్తా సంఘం నాయకులు, భావన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మార్త మధుసూదన్,సురేష్,కందిక వెంకన్న, లక్ష్మణ్ ,రాజు, సొసైటీ మాజీ చైర్మన్ , బిఆర్ఎస్ నాయకులు మారం రాము, ఈదునూరి వెంకన్న, ఎంసీపీఐ మండల నాయకులు జల్లి బుచ్చయ్య, గాజుల వెంకటయ్య ,సొల్లేటి రామబ్రహ్మం, ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాస్ నాయక్, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన లబ్ధి దారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి.

అర్హులైన లబ్ధి దారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి.

బిజెపి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి రాజేశ్వర్.

బెల్లంపల్లి, నేటిధాత్రి:

 

 

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని బెల్లంపల్లి బిజెపి మాజీ ఎమ్మెల్యే ఆమురాజుల శ్రీదేవి రాజేశ్వర్ అన్నారు.బెల్లంపల్లి పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కేవలం ఇందిరమ్మ కమిటీ, కాంగ్రెస్ నాయకులకు సిఫారసు చేసిన జాబితానే సర్వే చేస్తూ అధికార దుర్వినియోగానికి పాలు పడుతున్నారని ఆమె మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చేసిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలుపుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.ఇందిరమ్మ ఇండ్ల కోసం సర్వే చేసినప్పుడే అధికారులు అర్హుల జాబితాను తప్పుల తడకగా అనర్హులతో తయారు చేశారన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి వారికి మాత్రమే ఇండ్లను మంజూరు చేయాలని, ఇలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని ఆమె డిమాండ్ చేశారు.లేనియెడల బిజెపి ఆధ్వర్యంలో లబ్ధిదారులయిన నిరుపేదలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

జీతాల కోసం 4 నెలలుగా ఎదురుచూపులు.

జీతాల కోసం 4 నెలలుగా ఎదురుచూపులు.. ఉపాధి ఫీల్డ్ హామీ అసిస్టెంట్ల పస్తులు!

◆ సుమారు 10.000 మందికి అందని వేతనాలు.

◆ అప్పులతో కుటుంబాలను పోషిస్తున్న సిబ్బంది.

◆ ఏడాదైనా పేస్కేల్‌ హామీని నెరవేర్చని ప్రభుత్వం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రాష్ట్ర ఉపాధి హామీ జాయింట్ యాక్షన్ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పే స్కేల్, పెండింగ్ జీతాలు పరిష్కారం కోసం ఎంపిడిఓ సుధాకర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగినది. ఏపీవో రాజ్ కుమార్ మాట్లాడుతూ
 క్రమం తఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి సకాలంలో వేతనాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పస్తులతో కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు ఎక్కడా పొంతనలేదని, ఇందుకు తమ దుస్థితే నిదర్శనమని చెప్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలతో పనులు చేయించడం, సకాలంలో వేతనాలు అందించడంలో సాంకేతిక, క్షేత్రస్థాయి సిబ్బంది విధులు నిర్వహిస్తారు.ప్పకుండా కూలీలతో పనులు చేయిస్తూ కేంద్రం నుంచి వీలైనంత మేరకు నిధులు రప్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. కానీ వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు.

మహాప్రస్థానంలో పని చేస్ కార్మికులుకు సన్మానం.

మహాప్రస్థానంలో పని చేస్ కార్మికులుకు సన్మానం
శేరిలింగంపల్లి,నేటి ధాత్రి :-

 

కార్మికుల దినోత్సవం సందర్బంగా రాయదుర్గం లోని వైకుంఠ మహా ప్రస్థానం లో పనిచేసేవారందరికీ శాలువాతో సత్కరించిన శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కార్మికులు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహా ప్రస్థానంలో పనిచేసేవారందరికీ బహుమతులను మరియు స్వీట్ బాక్స్ లను అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ “ప్రతి మనిషి ఆఖరి మజిలీ చావు, అట్టి ఆఖరి గమ్యంలో మీరంతా అందించే సేవలు ఆదర్శప్రాయం అని, అతి ముఖ్యంగా కరోనా సమయం లో మహా ప్రస్థానం సిబ్బంది అందించిన సేవలను ఎప్పటికి మర్చిపోలేమనీ కొనియాడారు.

Corona

 

ఒక మనిషి చనిపోతే సొంత కుటుంబికులే రాలేని రోజుల్లో మీరే అన్ని అయ్యి అంత్యక్రియలు చేయడం ఎంతో ఆదర్శం. మీరు అందించే సేవలకు మేము మా తృప్తి కొరకు అందిస్తున్న ఈ చిన్న కానుక”.భవిష్యత్తులో ఏవరికి ఏ అవసరం వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహాప్రస్థానం మేనేజర్ రాజ్ కుమార్, మహా ప్రస్థానం సిబ్బంది మరియు నాయకులు అంజమ్మ, దారుగుపల్లి నరేష్, రమేష్ గౌడ్, శామ్లెట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బాల్యవివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత..

బాల్యవివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత..

జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రాజు..

రామాయంపేట మే 1 నేటి ధాత్రి (మెదక్)

 

 

బాల్యవివాహాలను అరిక ట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జస్టెట్స్ ఫర్ చిల్డ్రన్స్ విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఎన్జీఓ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ రాజు అన్నారు. ఎన్జీఓ డైరెక్టర్ వంగరీ కైలాస్ ఆదేశానుసారం బాల్య వివాహాలపై జిల్లాలోని దేవాలయాలు, మజీదులు, చర్చిలు, కాలనీలు, అంగన్వాడీ కేంద్రా ల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Coordinator Raju.

 

ఈ సం దర్భంగా రాజు మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడమంటే చిన్న పిల్లలపై అత్యా చారాలు ప్రోత్సహించడం లాంటిదన్నారు. పూజారులు, ఫాస్టర్లు, ముస్లిం మతపెద్దలు పెళ్లిళ్లు చేసే సమయంలో అమ్మాయి, అబ్బాయి మేజర్లు అయితేనే వివాహాలు జరిపించాలన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే రూ. లక్ష జరిమానతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.

Coordinator Raju.

ఈ సందర్భంగా ఆలయాలు, చర్చిలు మజీద్ లలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ ప్రతిజ్ఞ చేయించామన్నారు.
ప్రతిజ్ఞ చేస్తున్న భక్తులు, పూజారులు.
వంగరీ కైలాస్
విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ

నందనంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు.

నందనంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు
గ్రామ లారీ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

నేటిధాత్రి ఐనవోలు :-

 

 

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా అయినవోలు మండలం నందనంలో కార్మికులు కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ నెత్తురును చెమటగా మార్చి అవరోధాలను అభివృద్ధికి మెట్లుగా మార్చుతూ దేశ అభివృద్ధికి వారదులుగా నిలుస్తున్న కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం కార్మికుల దినోత్సవం సందర్భంగా ఎర్ర జెండాలు ఆవిష్కరిస్తూ సంబరాలు చేసుకున్నారు. అలాగే గ్రామంలో లారీ యజమానులు డ్రైవర్స్ అంతా కలిసి తమకంటూ ఒక యూనియన్ ఉండాలని గురువారం లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది.లారీ యూనియన్ అధ్యక్షుడుగా బర్ల బలరాం ఉపాధ్యక్షులు ఇసురం అనిల్ ప్రధాన కార్యదర్శి యాకర లక్ష్మణ్ కార్యదర్శి బర్ల భాస్కర్ పోశాధికారి ఆకులపల్లి భాస్కర్ సలహాదారుడు బర్ల నాగరాజ్ సలహాదారుడు బర్ల రవి లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు తమ ఎన్నికకు సహకరించిన యజమానులకు డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమకొండ ఏరియా ఆకులపల్లి అశోక్ యాకర కుమార్ దోమకొండ రాజ్ కుమార్ యాకర నరహరి ఇస్రం రఘు యాకర రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

రిస్క్ టీం సభ్యులకు ఘనంగా సన్మానం.

రిస్క్ టీం సభ్యులకు ఘనంగా సన్మానం

మందమర్రి నేటి ధాత్రి

 

 

మే 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా, తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ మార్కెట్లోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా, ఫిబ్రవరి 22న నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ ఎల్ బి సి) టన్నెల్లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యల్లో పాల్గొన్న సింగరేణి రెస్క్యూ టీం సభ్యులు రెడ్డి శ్రీనివాస్, సానబోయిన శ్రీనివాస్ వర్కర్స్ షేర్ గ్రూప్ తరఫున ఘనంగా సన్మానించారు.

ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదం భారతదేశంలో అత్యంత క్లిష్టమైన రక్షణ చర్యలలో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సింగరేణి కొలియరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సి సి ఎల్) నుండి 60 మంది ప్రత్యేకంగా శిక్షణ పొందిన రెస్క్యూ సిబ్బంది పంపించబడ్డారు. ఈ సిబ్బంది అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ బాడీ (ఐ ఎం ఆర్ బి) సభ్యులుగా ఉన్నారు .
ప్రమాదం జరిగిన తర్వాత, రక్షణ చర్యలు 63 రోజులపాటు కొనసాగాయి. ఈ సమయంలో రెండు మృతదేహాలు వెలికితీయబడ్డాయి, అయితే మిగిలిన ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి .

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి రెస్క్యూ టీం సభ్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, సహచరుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలను గుర్తించి, మే డే సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ సన్మానం కార్మికుల సేవలను గుర్తించి, వారికి గౌరవం చూపించే ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో వాకర్ టీం సభ్యులు అందరూ పాల్గొన్నారు

రెడ్ స్టార్ కుంగ్ పూ ఇండియా అకాడమి .

రెడ్ స్టార్ కుంగ్ పూ ఇండియా అకాడమి ఆశ్వర్యంలో సమ్మర్ శిక్షణ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

ముత్తాపురం ప్రాథమిక పాఠశాల ఆవరణ లో విధ్యార్థులకు సెల్ఫ్ డిపెన్స్ నిమిత్తం అమ్మాయిలకు, అబ్బాయిలకు కుంగ్ పూ శిక్షణ శిభిరాన్ని గురువారం ప్రారంబించారు. శిక్షణ ఇచ్చువారు మంక్కిడి సుధాకర్, ఇన్ చార్జి, పెనక సిమయ్య గ్రాండ్ మాస్టర్ పౌండర్ బి వెంకట్ బాబు హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో విధ్యార్థుల యొక్క శారీరక దృఢత్యానికి మంచి ఆరోగ్యానికి క్రమ శిక్షణ కొరకు ఈ విద్యను వెనుకబడిన విద్వార్థులకు అందజేయాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మోకాళ్ళ వీరాస్వామి, మార్తా రామకృష్ణ, మోకాళ్ళ క్రిష్ణ తదితరులు గ్రామస్థులు పాల్గొన్నారు.

శ్రమ గొప్పదనాన్ని చాటి చెప్పే రోజే ఈ మే డే.

‘శ్రమ గొప్పదనాన్ని చాటి చెప్పే రోజే ఈ మే డే’

‘శ్రమను గౌరవిద్దాం కార్మికులకు అండగా ఉందాం’

 

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు కార్మికులు ఎంతగానో శ్రమిస్తారని, వారి శ్రమతోనే ప్రజలందరికీ ఆనందం, ఆరోగ్యం సమకూరుతాయని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మే డే వేడుకలలో పాల్గొని కార్మికులతో కలిసి భోజనం చేశారు. మే డే కానుకగా మున్సిపల్ కార్మికులందరికీ దుస్తులను పంపిణీ చేసారు. మున్సిపాలిటీలో గాని, గ్రామాలలో గాని పరిసరాల పరిశుభ్రత కోసం కార్మికులు అహర్నిశలు పాటుపడతారని ఆయన ప్రస్తావించారు. ఒక్క రోజు ఈ కార్మికులు పని చేయకపోయినా పరిసరాలన్నీ కంపు కొడతాయని, ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని చెప్పారు. అందుకే వారు చేసే సేవలు అమూల్యమైనవని అభిప్రాయపడ్డారు. పట్టణాల్లో, గ్రామాల్లో పని చేసే ఈ కార్మికుల కృషివల్లే అందరికీ ఆరోగ్యం సమకూరుతుందని పేర్కొన్నారు. మురికి కాలువలను శుభ్రం చేస్తూ, చెత్త ఎత్తివేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు కార్మికులు ఎంతో కష్టపడతారన్నారు.

Hard Work.

 

అలాంటి కార్మిక సోదరులతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నానని అనిరుధ్ రెడ్డి చెప్పారు. కార్మిక సోదరులకు నా వంతుగా అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో AMC చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత గారు, మున్సిపల్ కమిషనర్, AMC వైస్ చైర్మన్ రాజు గౌడ్, కౌన్సిలర్లు,AMC డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version