తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ పకడ్బందీగా అమలు చేయాలి.

తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ పకడ్బందీగా అమలు చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సీఎం డౌన్ డౌన్’ అంటూ రోడ్డెక్కిన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ విద్యార్థిని విద్యార్థులు
ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన పెండింగ్లో నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థుల ర్యాలీ ‘ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం’ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులు.ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని కోహిర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. దిగ్వల్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం రాయడం చదవడంతో పాటు గుణింతాలు పూర్తిస్థాయిలో చేసేలా చూడాలని చెప్పారు.

తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ పకడ్బందీగా అమలు చేయాలి..

తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ పకడ్బందీగా అమలు చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని కోహిర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. దిగ్వల్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం రాయడం చదవడంతో పాటు గుణింతాలు పూర్తిస్థాయిలో చేసేలా చూడాలని చెప్పారు.

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

నిజాంపేట్, నేటి ధాత్రి

 

 

 

 

నస్కల్ గ్రామంలో
విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని,విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలను అందజేసి, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించాలని దళిత బహుజన ఫ్రంట్(డిబీఎఫ్)జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్ డిమాండ్ చేశారు.
శుక్రవారం నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో డిబీఎఫ్ ఆధ్వర్యంలో విద్యా హక్కుల పరిరక్షణకై ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించి,విద్య హక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేటు విద్యాసంస్థలలో కూడా పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. పాఠ్యపుస్తకాలలో మహనీయుల జీవిత చరిత్రను పొందపరచాలని ప్రభుత్వ కళాశాలలో కూడా చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.విద్యారంగ సమస్యల సాధన కోసం డిబిఎఫ్ ఆధ్వర్యంలో పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు సత్యం రెడ్డి తో పాటు ఉపాధ్యాయ బృందము పిల్లలు పాల్గొన్నారు తదితరులు పాల్గోన్నారు.

గోవధ నిషేధం అమలు కఠినంగా అమలు చేయాలి.

గోవధ నిషేధం అమలు కఠినంగా అమలు చేయాలి – భజరంగ్ దళ్.

అచ్చంపేట/నేటి దాత్రి:

 

 

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం డీఎస్పీని కలిసి, గోవధ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ అచ్చంపేట ప్రఖండా సంయోజక్ శివ చంద్ర మాట్లాడుతూ, గోవధ వల్ల సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. గోవులను రక్షించడం మనందరి బాధ్యత అని, దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్పీ గారు వినతి పత్రాన్ని స్వీకరించి, సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో భజరంగ్ దళ్ కమిటీ సభ్యులు శివాజీ నరేష్, చందులాల్ చౌహాన్, అమర్, అజయ్, చైతన్య చారి, బాలకోటి తదితరులు పాల్గొన్నారు.

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి…

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి…

ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడిని నియంత్రించాలి…

పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి బోనగిరి మధు…

నేటి ధాత్రి -మహబూబాబాద్ :-

 

 

 

 

 

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అద్వానంగా ఉండి, బడిబాట కార్యక్రమం మొక్కుబడిగా కొనసాగుతున్నదనీ తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి బోనగిరి మధు డిమాండ్ చేశారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ ను కలిసి విద్యారంగ సమస్యలపై పి డి ఎస్ యు ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్బంగా మధు మాట్లాడుతూ,విద్యార్థులు లేరనే సాకుతో మూసివేతకు గురవుతున్న పాఠశాలలకు లోతైన పరిశీలన చేసి మూసివేతకు గురికాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.మరోపక్క ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలిశాయనీ తమ ఇష్టానుసారం ఫీజులు దండుకుంటూ హంగు ఆర్భాటాలు చూపించే విధంగా కరపత్రాలు పట్టుకొని గ్రామాలపై దండయాత్ర వలె అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారనీ తెలిపారు.ఉన్నత అధికారులు ఫీజుల దోపిడిని నియంత్రించి, కార్పొరేటు,ప్రైవేటు అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.వివిధ రకాలుగా టై, బెల్టు, పాఠ్యపుస్తకాల పేరుతో వసూలు చేస్తున్న జీరో దందాను నిలువరించాలని, పేద,మధ్యతరగతి కుటుంబాల పిల్లల తల్లిదండ్రులను ఆర్ధిక భారం నుండి బయటపడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు విజయ్,పట్టణ నాయకులు శేఖర్, దీపక్, సుందర్,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

పెషా, 1/70 చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి..

పెషా, 1/70 చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి..

ఆపరేషన్ కగార్ నిలుపు దల చేయాలి.

ప్రభుత్వాలు పార్లమెంట్ చట్టాలను కాపాడాలి…

ఏజెన్సీ లో ఆదివాసీలను భయబ్రాతులకు గురించి చేయకండి.

ఆదివాసీ సంక్షేమ పరిషత్, ములుగు జిల్లా అధ్యక్షులు, తాటి నాగరాజు.

నూగూర్ వెంకటాపురం
నేటి ధాత్రి / మే 1 ములుగు జిల్లా

 

 

వెంకటాపురం మండల కేంద్రంలో గురువారం నాడు వెంకటాపురం మండలం కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా కొమరం భీం విగ్రహం దగ్గర ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో బొగ్గుల సమ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు తాటి నాగరాజు గారు పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన ప్రదేశాల్లో ఆదివాసీలు ఇల్లు కట్టుకొని నివాసాలు ఏర్పాటు చేసుకుని సహజసిద్ధమైన అడివిలో దొరికే పండ్లు కాయలు మందులు లేని వ్యవసాయం చేసుకో నీ పండిన టువంటి పంటలు తిని జీవితాన్ని గడుపుతున్న ఆదివాసీలు ఇప్పుడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు లను ఏరివేత పేరుతో తెలంగాణ రాష్ట్ర భూభాగంలో కర్రి గుట్టల ప్రాంతంలో కేంద్ర బలగాల తో కగా ర్ ఆపరేషన్, హెలికాప్టర్ ద్వారా బాంబుల వర్షం కురిపించడం వలన ఎప్పుడు ఏమి జరుగుతుందో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కర్రీ గుట్టలో చేపట్టిన కగార్ ఆపరేషన్ ను నిలుపుదల చేసి ప్రశాంతమైన వాతా వ ర ణ నీ నెలకొల్పాలని తాటి నాగరాజు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నూగు రు వెంకటాపురం,వాజేడు మండలాలు భూభాగం ఛ త్తీస్ ఘడ్ రాష్ట్రం ఆనుకొని దట్టమైన అడవి గుట్టలు కొండలు కలిగి వి స్తీ ర్ణ మైన భూభాగం కలిగిన కర్రి గుట్టలు లో ఖనిజ సంపద కలిగి ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని కార్పొరేట్ల కంపెనీల బడా బాబు లు ఆ దాని అంబానీ లకు దోచి పెట్టడానికి ఏజెన్సీ ప్రాంతంలో పేసా చట్టం అడవి హక్కుల చట్టాలు ఎల్ టి ఆర్ 1/70 చట్టాలు పార్లమెంట్ లో చేసినటువంటి చట్టాలను ఉల్లంఘించి ఈ ప్రాంత భూభాగాన్ని కొల్ల గొట్ట డానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుందని తాటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా గౌరవ అధ్యక్షులు పీర్ల మల్లి ఖా ర్జు న్ రావు గారు శ్యామల వెంకటేశ్వర్లు బొగ్గుల సమ్మయ్య ఉ యి క గోపి శ్యామల వంశి కణితి శేషు సోడి సారయ్య శ్యామల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

పంచాయతీ విధులను పకడ్బందీగా నిర్వహించాలి..

పంచాయతీ విధులను పకడ్బందీగా నిర్వహించాలి

– రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

– 100% ఆస్తి పన్ను వసూలు చేయాలి

– గ్రామాలలో ఆస్తుల రీ అసెస్మెంట్ కు ప్రణాళికాబద్ధంగా చర్యలు

– గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

– పంచాయతీ రాజ్ చట్టం పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి

– పంచాయతీ కార్యదర్శుల పని తీరు పై రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల, మార్చి 13(నేటి ధాత్రి):

గ్రామాలలో ప్రభుత్వ విధులను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పంచాయతీ శాఖ పని తీరు పై పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ నిర్వహించారు. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ, పన్నుల వసూలు, ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల ఫీజుల వసూళ్ల పై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, గ్రామాలలో ఉన్న రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలు, ఇండ్ల ఆస్తి పన్ను 100% వసూలు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 17 రోజులు సమయం మాత్రమే ఉందని,ఆస్తి పన్ను వసూలు లక్ష్యాలను చేరుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా వ్యాప్తంగా తక్కువ ఆస్తి పన్ను వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ ప్రత్యేకంగా రివ్యూ చేశారు. ఆస్తి పన్ను చెల్లించిన వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని అన్నారు.గ్రామాలలో అవసరమైన చోట ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆస్తి పన్ను విలువ పెంచాలని, రీ – అసెస్మెంట్ చేసి సరైన ఆస్తుల విలువ ప్రకారం పన్ను వసూలు చేయాలని కలెక్టర్ సూచించారు.

గ్రామాలలో వ్యాపారాల ట్రెడ్ లైసెన్స్ రెన్యువల్ సకాలంలో జరిగేలా చూడాలని, ట్రెడ్ లైసెన్స్ లేకుండా ఎక్కడైనా వ్యాపారాలు నిర్వహిస్తే సీజ్ చేయాలని అన్నారు. ట్రెడ్ లైసెన్స్ రెన్యువల్ పన్ను ముందుగా వసూలు చేయాల్సి ఉంటుందని అన్నారు. గ్రామాలలో మల్టీ పర్పస్ సిబ్బంది వేతనాలు ఎప్పటికప్పుడు పంచాయతీ నిధుల నుంచి చెల్లించాలని అన్నారు.

గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాల పరిసరాలలో అపరిశుభ్రత అధికంగా గమనిస్తున్నామని, దీన్ని నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భవనాల పరిసరాల్లో పరిశుభ్రత పట్ల శ్రద్ద పెట్టాలని అన్నారు.రోడ్లను రెగ్యులర్ గా శుభ్రం చేయాలని, ప్రతి రోజు ప్రజల నుంచి చెత్త సేకరణ జరగాలని అన్నారు.

గ్రామాలలో పెండింగ్ ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులు క్లియర్ చేయాలని అన్నారు. ఆమోదించిన ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల నుంచి ఫీజు వసూలు చేయాలని, దరఖాస్తుదారులను ఫాలో అప్ చేస్తూ మార్చి 31 లోపు ఫీజు చెల్లించేలా చూడాలని, ప్రజలు ప్రభుత్వం కల్పించిన 25% రీబెట్ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.

ఎల్.ఆర్.ఎస్ చేసుకోకపోతే ఇంటి నిర్మాణం అనుమతులు, ఇతరులకు అమ్మేందుకు ఆస్కారం ఉండదని, ఎల్.ఆర్.ఎస్. చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.

ఈ సమావేశంలో డి.పి.ఓ. శరిపుద్దీన్, డి.ఎల్.పి.ఓ. నరేష్, డి.టి.సి.పి.ఓ. ఆన్సర్, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version