శ్రమ గొప్పదనాన్ని చాటి చెప్పే రోజే ఈ మే డే.

‘శ్రమ గొప్పదనాన్ని చాటి చెప్పే రోజే ఈ మే డే’

‘శ్రమను గౌరవిద్దాం కార్మికులకు అండగా ఉందాం’

 

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు కార్మికులు ఎంతగానో శ్రమిస్తారని, వారి శ్రమతోనే ప్రజలందరికీ ఆనందం, ఆరోగ్యం సమకూరుతాయని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మే డే వేడుకలలో పాల్గొని కార్మికులతో కలిసి భోజనం చేశారు. మే డే కానుకగా మున్సిపల్ కార్మికులందరికీ దుస్తులను పంపిణీ చేసారు. మున్సిపాలిటీలో గాని, గ్రామాలలో గాని పరిసరాల పరిశుభ్రత కోసం కార్మికులు అహర్నిశలు పాటుపడతారని ఆయన ప్రస్తావించారు. ఒక్క రోజు ఈ కార్మికులు పని చేయకపోయినా పరిసరాలన్నీ కంపు కొడతాయని, ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని చెప్పారు. అందుకే వారు చేసే సేవలు అమూల్యమైనవని అభిప్రాయపడ్డారు. పట్టణాల్లో, గ్రామాల్లో పని చేసే ఈ కార్మికుల కృషివల్లే అందరికీ ఆరోగ్యం సమకూరుతుందని పేర్కొన్నారు. మురికి కాలువలను శుభ్రం చేస్తూ, చెత్త ఎత్తివేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు కార్మికులు ఎంతో కష్టపడతారన్నారు.

Hard Work.

 

అలాంటి కార్మిక సోదరులతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నానని అనిరుధ్ రెడ్డి చెప్పారు. కార్మిక సోదరులకు నా వంతుగా అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో AMC చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత గారు, మున్సిపల్ కమిషనర్, AMC వైస్ చైర్మన్ రాజు గౌడ్, కౌన్సిలర్లు,AMC డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version