గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ ప్రారంభం.

బుద్ధారంలో గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ ప్రారంభం

గణపురం నేటి ధాత్రి 

గణపురం మండలం బుద్దారం గ్రామం లో భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు భాగ్యలక్ష్మి గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకేపీ పీపీసీ సెంటర్ ను మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగపెల్లి భాస్కర్ వివో అధ్యక్షులు బిక్కినేని రజిత కలసి ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ డీపీఎం నారాయణ సీసీ బాబా సభ్యులు బియ్యాల కవిత.. అల్లెపు మంజుల. మల్లెవెని పుష్పలిల. వివో ఏ పద్మ.విజేందర్. రైతులు  హాజరైనారు

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఇబ్బందులు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం.. లబ్ధిదారుల ఇబ్బందులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఈ పథకం అమలులో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు, సరఫరా సమస్యలు, నిర్మాణ వ్యయం పెరుగుదల వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పునాది రుణాలు, ఉచిత ఇసుక సరఫరా, నమూనా ఇళ్లపై స్పష్టత లేకపోవడం, ఐకేపీలపై అవగాహన లోపం సమస్యలుగా ఉన్నాయి. లబ్ధిదారులు ఈ సమస్యల పరిష్కారాన్ని కోరుతున్నారు. ఈ వారంలో రెండో విడత లబ్ధిదారుల జాబితా విడుదల కానుంది.

100% ఉత్తీర్ణతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

‘100% ఉత్తీర్ణతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

బాలానగర్ /నేటి ధాత్రి.

 

 

బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..

ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్రత సాధించిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి 100% ఉత్తీర్ణత సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు.

Students

 

 

అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ.

జహీరాబాద్ లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని చెప్పారు.

హిందువులను చైతన్యం చేసేందుకే ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో మీద పీఠాధిపతులు, బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

నిజాంపేట నూతన ఎమ్మార్వో గా శ్రీనివాసులు.

నిజాంపేట నూతన ఎమ్మార్వో గా శ్రీనివాసులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

నిజాంపేట మండల కేంద్రానికి నూతన ఎమ్మార్వోగా శ్రీనివాసులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సిసిఎల్ కమిషనర్ ఆఫీసులో పనిచేసిన ఆయన బదిలీపై నిజాంపేట మండలనీకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

బిజెపి ఆధ్వర్యములో మోడిచిత్ర పటానికి పాలాభిషేకం.

బిజెపి ఆధ్వర్యములో మోడిచిత్ర పటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

దేశవ్యాప్త కుల గణన చారిత్రాత్మక నిర్ణయం అని బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు గత రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గం దేశవ్యాప్త కులగనన చేయడం హర్షించదగ్గ విషయమని శుక్రవారంనాడు చిట్యాల మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది, అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి బీసీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి రుణపడి ఉన్నారని ఎన్నో సంవత్సరాలుగా బీసీలను జెండాలు మోసే బానిసలుగానే వివిధ రాజకీయ పార్టీలు చూసాయని కానీ భారతీయ జనతా పార్టీ బీసీలకు రాజ్యాధికారం అందాలని ప్రతి ఒక్క బిసి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎదగాలని ఆశించి ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉన్నారని ఆయన అన్నారు భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే పార్టీ అని ఆయన అన్నారు ఇప్పటికైనా మిత్రులందరికీ ఏకతాటి మీద నిలబడి నరేంద్ర మోడీ కి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు తీగల జగ్గయ్య బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య గుండ సురేష్ గజనాల రవీందర్ ఓదెల శ్రీహరి నల్ల శ్రీనివాస్ రెడ్డి, మైదం శ్రీకాంత్ అనుప మహేష్ వల్లల ప్రవీణ్ కేంసారపు ప్రభాకర్ రావుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

₹.5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులను ప్రారంభం.

ఎమ్మెల్యే సహకారం తో ₹.5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులను ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి

 

జహీరాబాద్ మండలం మల్చేల్మా గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సహకారం తో ₹.5 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఆదేశాల మేరకు గ్రామస్థుల కోరిక మేరకు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ గారు*ఇప్పేపల్లి PACS చైర్మన్ మచ్చండర్ ,మరియు మండల గ్రామ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తో కలిసి ప్రారంభించారు .ఈ సంధర్బంగా గ్రామ నాయకులు,ప్రజలు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి,మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ గార్లకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఆనందం మాజీ ఎంపీటీసీ లు ఇస్మాయిల్,మోయిన్,రాములు, ప్రేమ్ సింగ్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు వహీద్ అలీ, అధ్యక్షులు,మండల బిసి సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్,మండల యూత్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి మాజీ సర్పంచులు చిన్నారెడ్డి,నాయకులు గోరెప్ప,భీమ్ రావ్, దత్తు రెడ్డి,మోహన్ రాథోడ్,శ్రీకాంత్, పిజి శంకర్,యేసు, శ్రీనివాస్, పాపన్న కయ్యుమ్, నసీర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రెస్ మీట్.!

సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రెస్ మీట్

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

 

 

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది. సిరిసిల్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ జూడో యాత్రలో భాగంగా భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బడుగు బలహీన వర్గాల కులాల గురించి అన్ని గ్రామాల్లో కులగణన చేపడతామని, జనగణన తో పాటు కులాల వారీగా
కుల గణన చేపడతామని, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్య, వైద్య ఉపాధి, ఉద్యోగ, అవకాశాలపై ఏ కులాలకు ఎంత వాటాల రూపంలో తీర్చేందుకే ఈ కుల గణనను చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అని తెలిపారు. ఈ కుల గణన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచన విధానం నుంచి వచ్చిందని, అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం ద్వారా కులగణన తెలంగాణ ప్రభుత్వంలో చేపట్టడం జరిగినదని.
ఈ కులగణలలో 1,50,000 మంది సర్వేలో పాల్గొనడం జరిగింది అని తెలిపారు. అంతేకాకుండా ఈ కులగణలో బీసీల రిజర్వేషన్ శాతం 56.36%
శాతం ఉన్న బీసీలకు విద్య, వైద్య, ఉపాధి కల్పనా రాజకీయంగా గాని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో 42% శాతం అసెంబ్లీ ఆమోదం నిర్ణయించడం జరిగింది . అంతేకాకుండా కరీంనగర్ బీసీ ముద్దుబిడ్డ, బీసీ సంక్షేమ శాఖ, రోడ్డు రవాణా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కులగణన ప్రవేశపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలించే రాష్ట్రంలో కర్ణాటక తెలంగాణ వంటి రాష్ట్రాలలో బీసీ కులగనున చేపట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను తోపాటు మన తెలంగాణ రాష్ట్రంలోని బిసి సంఘాలను ఏకం చేసుకుంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా కుల గణన నిరసన తెలుపడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిరసన ఒత్తిడి తెచ్చింది అని అందుకు కేంద్ర ప్రభుత్వం కులగననకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమైందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ పార్టీ పిసిసి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూసా రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, ఎండి హమీద్, చుక్క శేఖర్, వెంగళ అశోక్, అడ్డగట్ల శంకర్, పైసా ఆంజనేయులు, నేరెళ్ల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

పెద్దకోడేపాకలో ఇష్టాను సారంగా ఇందిరమ్మ ఇండ్.!

పెద్దకోడేపాకలో ఇష్టాను సారంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక

ఏకపక్ష నిర్ణయాలతో ఐదుగురు కమిటీ సభ్యుల హవా

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం పెద్దకోడే పాక గ్రామంలో ఇష్టానుసా రంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్ల జాబితా విషయంలో ఏకపక్ష నిర్ణయాలతో ఐదుగురు కమిటీ వెనుక రహస్యమేముంది. బహుజన స్టూడెంట్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఇల్లు ఇప్పించా లని ఎమ్మెల్యే ప్రధానంగా కార్యకర్తలకు చెబితే కార్యకర్తలు స్వార్థ స్వభావాల తో ఇల్లు లేని గ్రామ ప్రజలకు గుర్తించకుండా ఐదుగురు కమిటీ సభ్యులకు సంబంధిం చిన కుటుంబ సభ్యులకు మరియు వాళ్ళ పేర్లు పెట్టుకుని ఏకపక్ష తీర్మానం చేయడం ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండా ఒకేచోట కూర్చుం డబెట్టి తీర్మానం చేసి పై అధికా రులకు పంపించడం జరిగింది. కావున తక్షణమే ఐదుగురు కమిటీ సభ్యులను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఇల్లు లేని నిరు పేదలను గుర్తించి ఇల్లు వచ్చే విధంగా చేయాలని ప్రధా నంగా ఎమ్మెల్యే,కలెక్టర్ ను కోరుతున్నాం.లేనిపక్షంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళలకు షీ టీం.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళలకు షీ టీం బృందం అవగాహన కార్యక్రమం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్

సిరిసిల్ల టౌన్  (నేటిధాత్రి):

 

విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు భరోసా ఇచ్చారు.జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో,పాఠశాలల్లో విద్యార్థినిలకు గ్రామాల్లో,పని చేసే ప్రదేశాల్లో మహిళలకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ మహిళ చట్టలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
ఏప్రిల్ నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 03 FIRలు,05 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల,కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.

District SP.

 

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…విద్యార్థినులు,మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని , ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని.

ప్రధానంగా మహిళలు,విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని,వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాసంస్థలల్లో కానీ,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్100 లేదా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ గారు తెలిపారు.

 

ఈదురు గాలుల బీభ త్సానికి ఇల్లు ధ్వంసం.

ఈదురు గాలుల బీభ త్సానికి ఇల్లు ధ్వంసం..

దిక్కుతోచని స్థితిలో కుటుంబం..

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి ఈదురు గాలుల. బీభత్సవo సృష్టించ డంతో బీసీ కాలనీ చెందిన బాసాని రామకృష్ణ ఇల్లు పూర్తి స్థాయిలో ధ్వంసం అయ్యాయి తృటిలో తప్పించుకొని ప్రాణాలను కాపాడుకున్న వారు ప్రకృతి ప్రకోపంతో ఇల్లు ధ్వంసమవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.రెక్కాడితే కాని డొక్కాడని దయనీయ స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభు త్వం ఇందిరమ్మ ఇల్లు మం జూరు చేసి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. 

సింగరేణి మండల కేంద్రము సిపిఐ పార్టీ ఘనంగా.

సింగరేణి మండల కేంద్రము సిపిఐ పార్టీ ఘనంగా మేడే నిర్వహన.

ప్రపంచ కార్మికులారా ఏకంకండి 139 వ మేడే పిలుపు.

కారేపల్లి నేటి ధాత్రి.

 

 

 

భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 139 వ మే డే సందర్భంగా సింగరేణి మండల కేంద్రంలో పలు గ్రామాలలో ఘనంగా మేడే జెండాలను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ సినియర్ మండల నాయకులు తాతా వేంకటేశ్వర్లు మాట్లాడుతూ 18 86 లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో వేలాదిమంది కార్మికులు 8 గంటల పని దినాలు ఉద్యోగ భద్రతకై పెట్టుబడిదారీ వర్గం మీద తిరుగుబాటు చేసి ఆరుగురు కార్మికులు అమరత్వం పొంది ఏడుగురు ఉరిశిక్షలకు గురి అయ్యి ఫాసిస్టు పోలీస్ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో వేలాదిమంది గాయాలపాలై చరిత్రకెక్కిన సందర్భంగా అంతర్జాతీయ శ్రామిక వర్గ దినోత్సవం గా మేడేను ప్రకటించింది నాటి అమరత్వం పోరాటాల సందర్భంగా భారత కార్మిక వర్గం 8 గంటల పరిధినాలను ఉద్యోగ భద్రతను హక్కులను చట్టాలను కార్మిక వర్గం పొందినది ఎన్నో త్యాగాలతో సాధించుకున్న వివిధ కార్మిక రైతాంగ చట్టాలను మతోన్మాద బిజెపి మోడీ ప్రభుత్వం 44 కోడులుగా ఉన్న కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి 8 గంటల పని దినాలను మార్చి 12 గంటల పని దినాల అమలుకు పూనుకున్నది దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు వ్యక్తులకు సంస్థలకు బహుళజాతి కంపెనీలకు భూములతో సహా ఆదాని అంబానీలకు తాకట్టు పెట్టింది నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచి పోషిస్తుందని కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు గతంలో సాధించుకున్న వన్ ఆఫ్ సెవెంటీ వీసా 2006 అటవీ హక్కుల చట్టాలను అమలు చేయకపోగా 2022 నూతన అటవీ సంరక్షణ నియమావళి చట్టాన్ని తీసుకువచ్చి పై వాటి రద్దుకు పూనుకుంది ఢిల్లీ రైతాంగానికి ఇచ్చిన హామీలను మూడు నల్ల చట్టాలను నాలుగు లేబర్ కోడలు రద్దు చేస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా తిరిగి వాటి అమలుకు పూనుకున్నది దేశంలో రాష్ట్రంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ కవులు కళాకారులు అభ్యుదయవాదులపై ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ పై దాడులకు హత్యలకు పూనుకొని ప్రశ్నించే గొంతులను నొక్కువేస్తుంది ఆపరేషన్ కగార్ పేరుతో మద్య భారతదేశంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో 20 లక్షల లక్షల పోలీస్ బలగాలను దింపి వందలాదిమంది అమాయక ఆదివాసి గిరిజన పేద ప్రజలపై గ్రామాలపై దాడులు హత్యాకాండను నిర్బంధాలను కొనసాగిస్తున్నది నక్సలిజం 2006 వరకు నిర్మూలన పేరుతో అమిత్ షా మోడీ 500 మంది అమాయకులను ఆదివాసులను బలి తీసుకున్నది ఎన్కౌంటర్లను కొనసాగిస్తున్న వీటన్నిటికీ వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఈ చర్యలను ఖండించి ఐక్యమై సాధించుకున్న హక్కులకై మేడే స్ఫూర్తితో ముందు బాగాన నిలబడి పోరాటాలలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సినియర్ నాయకులు తాతా వేంకటేశ్వర్లు ఉంగరాల సుధాకర్ పాటి అనంత రామయ్య పుచ్చకాయల శ్రీను మాంగు హర్సింగ్ నాగళ్ళ చంద్రం లచ్చయ్య తనకేం విజయ్ తనకేం చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత..

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణం లోని సింగరేణి ఏరియా హాస్పిటల్ సమీపంలో నివాసం ఉండే అరికపురం రాజేశ్వరి అనే నిరుపేద మహిళ ఇటీవల అనారోగ్య రీత్యా మరణించింది.దశదినకర్మ సైతం చేయలేని దిన స్థితిలో ఉన్న కుటుంబానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి పదివేల ఆర్థిక సహాయం అందించారు. ఈకార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సట్ల మహేందర్,కోశాధికారి తూముల సురేష్ , ఉపాధ్యక్షుడు బొద్దుల సతీష్ సభ్యులు జెట్టి శ్రీనివాస్, జె సతీష్, మోటం తిరుపతి , కొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు

వందల చెట్లు నరికిన కరెంటు కాంట్రాక్టర్.

వందల చెట్లు నరికిన కరెంటు కాంట్రాక్టర్
ప్రకృతి పెంచమంటుంది కరెంటు స్తంభం తుంచుమంటుంది
చోద్యం చూస్తున్న అధికారులు
ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరుకుతున్న కాంట్రాక్టర్

జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట మండల పరిధిలోగల కోరపల్లి గ్రామంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం జరిగింది ఇట్టి సబ్స్టేషన్ ప్రారంభించడానికి సన్నద్ధమై ఉంది ఈ సబ్ స్టేషన్ కు కరెంటు సప్లై కోసం జమ్మికుంట నుండి ప్రత్యేకంగా పోల్స్ ద్వారా కరెంటు తీసుకురావడం జరిగింది తీసుకువచ్చే క్రమంలో దాదాపు రెండున్నర కిలోమీటర్లు సైదాబాద్ శివారు కోరపల్లి శివారు ఆర్ అండ్ బి రోడ్డు ప్రక్కన పెట్టినటువంటి పెద్ద పెద్ద చెట్లను అనుమతి లేకుండా ఏ అధికారి పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారంగా చెట్లను నరకడం జరిగింది . దాదాపు పది సంవత్సరాల క్రితం పెట్టినటువంటి చెట్లు ఎన్జీఎన్ఆర్ఇజేఎస్ పథకం కింద ప్రభుత్వం వ్యయం చేసి చెట్లను పెంచడం జరిగింది . వాస్తవానికి అటవీ శాఖ మరియు రెవెన్యూ శాఖ అనుమతులు తీసుకుని టెండర్ ద్వారా ఈ చెట్లను తొలగించాలి కానీ వాళ్లు చెట్టు ఉన్నది తెలిసి కూడా చెట్టు పైన లైన్ వచ్చే విధంగా ఫోల్స్ పాతడం అది కావాలని తప్పు చేయడమే ఎందుకంటే రోడ్డు పక్కన చాలా స్థలంఉంది చెట్లను వదిలిపెట్టి కూడా పోల్స్ వేయచ్చు గతంలో కూడా నిర్మాణ సమయంలో ఇట్టి నిర్మాణం చెరువులో చేస్తున్నారని కోరపల్లి గ్రామస్తులు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్టి నిర్మాణం మొట్టమొదటి నుండి వివాదాస్పదంగానే జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి తప్పును గుర్తించి చర్యలు తీసుకోవాలని రహదారి వెంటే పోయేటువంటి ప్రయాణికులు కోరుతున్నారు.

మే డే సందర్బంగా జెండా ఎగరావేసిన ఓసీ త్రి కార్మికులు.

మే డే సందర్బంగా జెండా ఎగరావేసిన ఓసీ త్రి కార్మికులు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం పరశురాంపల్లి గ్రామ పరిధిలో సింగరేణి ఓసీ త్రి ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతుంది ఓసీ లో పనిచేసే ప్రైవేట్ కార్మికులు నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్. అధ్యక్షులు మాచర్ల కనకయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు దిడ్డి బాలకృష్ణ పటేల్ బుర్ర శంకర్ గౌడ్ మొదటి సారి (మే డే) పురస్కరించుకొని కార్మికులు ఉత్సాహంగా జెండా ఎగరవేశారు.ఓసీ త్రి లో నూతనంగా ఏర్పడిన యూనియన్ కార్యవర్గం, కార్మికులు పాల్గొన్నారు.

మేడే స్పూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడుదాం.

మేడే స్పూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడుదాం

మే 20న సార్వత్రిక సమ్మె లో కార్మికులందరూ భాగస్వాములు కావాలి

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి )

 

 

సిరిసిల్లా పట్టణ కేంద్రంలోని ఈరోజు జరిగిన మేడే బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ తమ హక్కుల సాధన కోసం తుపాకీ గుళ్ళకు ఎదురేగిన కార్మికులు, ఉరికంబాలెక్కిన నాడు సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలను కార్మిక వర్గం ఐక్యంగా ప్రతిఘటించాలని సి.ఐ.టి.యు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ పిలుపునిచ్చారు.

గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సి.ఐ.టి.యు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం 139 వ. మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలో లేబర్ అడ్డా వద్ద , రైతు బజార్ వద్ద , మున్సిపల్ ఆఫీస్ వద్ద , సివిల్ హాస్పిటల్ వద్ద , నెహ్రు నగర్ , చంద్రంపేట , గణేష్ నగర్ , బి.వై. నగర్ ఏరియాలలో సిఐటియు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేశారు బి.వై. నగర్ లో మేడే అమరవీరుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఇట్టి బహిరంగ సభకు సి.ఐ.టి.యు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మేడే అమరవీరులు సాధించిన హక్కులను నేటి కేంద్ర బిజెపి సర్కార్ హరించి వేస్తుందని ఆ హక్కుల రక్షణ కోసం మే 20న జరుగు సార్వత్రిక సమ్మె లో అన్ని రంగాల కార్మికులు , కష్టజీవులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.కార్మికులు ఉదయం 10 గంటలకు పనికి వెళ్లి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తున్నారంటే కారణం నాడు మేడే కార్మికులు చిందించిన రక్తం నేనని చెప్పారు అందులో అధికారంలో ఉన్న బిజెపి కార్మికులు పోరాడి సాధించుకుంటున్న ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతూ కార్పొరేట్ దిగ్గజాలకు కార్మికుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు 29 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ సర్కారు ఒక కలం పోటుతో రద్దుచేసి నాలుగు లేబర్ కోడులు తీసుకొచ్చిందని విమర్శించారు అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం పిఎఫ్,ఈఎస్ఐ వంటి కనీస హక్కులు కూడా లేవన్నారు దుర్బర దారిద్రం అనుభవిస్తున్నారని చెప్పారు.

మేడే కార్మిక దినోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదని అది ఒక వర్గ పోరాట స్ఫూర్తి దినమని పేర్కొన్నారు.

కార్మిక వర్గం ఆర్థిక పోరాటాలకే పరిమితం కాకుండా సమాజంలోకి అన్ని రకాల అంతరాలను నుండి విముక్తి చేయటానికి కృషి జరపాలన్నారు రోజువారీగా పెరుగుతున్న ధరలు కార్మికులకు వస్తున్న చాలీచాలని జీతాలు తో కార్మిక వర్గం దుర్భర దారిద్రాన్ని అనుభవిస్తుందన్నారు బిజెపి పాలిత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచి పెంచిందన్నారు మే 20 న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం చేస్తున్న సమ్మెతో మోడీ మెడలు వంచి కార్మిక వర్గ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.

ఇట్టి కార్యక్రమాలలో CITU జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ , మూషం రమేష్ , అన్నల్దాస్ గణేష్ , సూరం పద్మ , మిట్టపల్లి రాజమల్లు , రాపెల్లి రమేష్ , నక్క దేవదాస్ , సిరిమల్ల సత్యం , కుమ్మరికుంట కిషన్ , గుండు రమేష్ , కుడిక్యాల కనకయ్య , బెజుగం సురేష్ , ఎక్కల్దేవి జగదీశ్ , ఉడుత రవి , బాస శ్రీధర్ , స్వర్గం శేఖర్ , సుల్తాన్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

గాంధీనగర్ లో వరి ధాన్యాన్ని కొనుగోలు ప్రారంభించిన.

గాంధీనగర్ లో వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జి.ఎస్.ఆర్

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ కన్నె బోయిన కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు.

పత్రికా వేలేఖరి తల్లీ పార్థివదేహానికి చిలువేరు సమ్మి గౌడ్.

పత్రికా వేలేఖరి తల్లీ పార్థివదేహానికి చిలువేరు సమ్మి గౌడ్ నివాళులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కూన శ్రీను, సతీష్ ల మాతృమూర్తి సరోజన మరణించగా వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఘన నివాళులర్పించారు.సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి వారిని ఓదార్చి మనో ధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమంలో కొండేటి కళాధర్,ఎసల్ల సత్యనారాయణ, మోరపాక జగన్, చంద్రగిరి వంశీకృష్ణ, గాజుల రవి, కమటం స్వామి కొంతం రవి తదితరులు ఉన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం.!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం, భీమ్ రావు మాల సంఘం కొత్వాల్ గూడ నూతన కమిటీ ఎన్నిక…

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ గ్రామం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం, భీమ్ రావు మాల సంఘం నూతన అధ్యక్షులు, కమిటీ సభ్యుల ఎన్నిక గురువారం జరిగింది.
అంబేద్కర్ యువజన సంఘం, భీమ్ రావు మాల సంఘం నూతన అధ్యక్షులుగాచేవెళ్ల గిరి,ప్రధాన కార్యదర్శిగా చేవెళ్ల రాకేష్,కోశాధికారిగా : పిల్లి రాహుల్ కుమార్, ఉపాధ్యక్షులుగా పత్యర రాములు , సిద్ధం విజయ్, చెరుకుల శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ నిరటినరసింహ,
చేవెళ్ల రాజేష్,పత్తి నర్సింగ్ రావు, పత్యారాశ్రీనివాస్, పంబాల చంద్రయ్య, పత్యారా శేఖర్,
ఆవుల బెంజ్ మేన్, చేవెళ్ల కృష్ణ,
చేవెళ్ల రమేష్,పిల్లి ప్రేమ్ రాజు, పత్యార ఎలీషానవీన్ కుమార్, అవుల కళేబ్, పంబల రాజు, చేర్కుల నర్సింహ, చెర్కుల అంజయ్య పెద్దలకు సమక్షంలో నూతన అధ్యక్షులు కమిటి సభ్యులను ఎన్నుకొన్నారు.

పెషా, 1/70 చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి..

పెషా, 1/70 చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి..

ఆపరేషన్ కగార్ నిలుపు దల చేయాలి.

ప్రభుత్వాలు పార్లమెంట్ చట్టాలను కాపాడాలి…

ఏజెన్సీ లో ఆదివాసీలను భయబ్రాతులకు గురించి చేయకండి.

ఆదివాసీ సంక్షేమ పరిషత్, ములుగు జిల్లా అధ్యక్షులు, తాటి నాగరాజు.

నూగూర్ వెంకటాపురం
నేటి ధాత్రి / మే 1 ములుగు జిల్లా

 

 

వెంకటాపురం మండల కేంద్రంలో గురువారం నాడు వెంకటాపురం మండలం కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా కొమరం భీం విగ్రహం దగ్గర ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో బొగ్గుల సమ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు తాటి నాగరాజు గారు పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన ప్రదేశాల్లో ఆదివాసీలు ఇల్లు కట్టుకొని నివాసాలు ఏర్పాటు చేసుకుని సహజసిద్ధమైన అడివిలో దొరికే పండ్లు కాయలు మందులు లేని వ్యవసాయం చేసుకో నీ పండిన టువంటి పంటలు తిని జీవితాన్ని గడుపుతున్న ఆదివాసీలు ఇప్పుడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు లను ఏరివేత పేరుతో తెలంగాణ రాష్ట్ర భూభాగంలో కర్రి గుట్టల ప్రాంతంలో కేంద్ర బలగాల తో కగా ర్ ఆపరేషన్, హెలికాప్టర్ ద్వారా బాంబుల వర్షం కురిపించడం వలన ఎప్పుడు ఏమి జరుగుతుందో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కర్రీ గుట్టలో చేపట్టిన కగార్ ఆపరేషన్ ను నిలుపుదల చేసి ప్రశాంతమైన వాతా వ ర ణ నీ నెలకొల్పాలని తాటి నాగరాజు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నూగు రు వెంకటాపురం,వాజేడు మండలాలు భూభాగం ఛ త్తీస్ ఘడ్ రాష్ట్రం ఆనుకొని దట్టమైన అడవి గుట్టలు కొండలు కలిగి వి స్తీ ర్ణ మైన భూభాగం కలిగిన కర్రి గుట్టలు లో ఖనిజ సంపద కలిగి ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని కార్పొరేట్ల కంపెనీల బడా బాబు లు ఆ దాని అంబానీ లకు దోచి పెట్టడానికి ఏజెన్సీ ప్రాంతంలో పేసా చట్టం అడవి హక్కుల చట్టాలు ఎల్ టి ఆర్ 1/70 చట్టాలు పార్లమెంట్ లో చేసినటువంటి చట్టాలను ఉల్లంఘించి ఈ ప్రాంత భూభాగాన్ని కొల్ల గొట్ట డానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుందని తాటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా గౌరవ అధ్యక్షులు పీర్ల మల్లి ఖా ర్జు న్ రావు గారు శ్యామల వెంకటేశ్వర్లు బొగ్గుల సమ్మయ్య ఉ యి క గోపి శ్యామల వంశి కణితి శేషు సోడి సారయ్య శ్యామల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version