జీతాల కోసం 4 నెలలుగా ఎదురుచూపులు.. ఉపాధి ఫీల్డ్ హామీ అసిస్టెంట్ల పస్తులు!
◆ సుమారు 10.000 మందికి అందని వేతనాలు.
◆ అప్పులతో కుటుంబాలను పోషిస్తున్న సిబ్బంది.
◆ ఏడాదైనా పేస్కేల్ హామీని నెరవేర్చని ప్రభుత్వం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాష్ట్ర ఉపాధి హామీ జాయింట్ యాక్షన్ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పే స్కేల్, పెండింగ్ జీతాలు పరిష్కారం కోసం ఎంపిడిఓ సుధాకర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగినది. ఏపీవో రాజ్ కుమార్ మాట్లాడుతూ
క్రమం తఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి సకాలంలో వేతనాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పస్తులతో కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు ఎక్కడా పొంతనలేదని, ఇందుకు తమ దుస్థితే నిదర్శనమని చెప్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలతో పనులు చేయించడం, సకాలంలో వేతనాలు అందించడంలో సాంకేతిక, క్షేత్రస్థాయి సిబ్బంది విధులు నిర్వహిస్తారు.ప్పకుండా కూలీలతో పనులు చేయిస్తూ కేంద్రం నుంచి వీలైనంత మేరకు నిధులు రప్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. కానీ వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు.