టీమిండియా వల్ల నిద్రపట్టలేదు..

టీమిండియా వల్ల నిద్రపట్టలేదు.. మార్క్రమ్ ఎమోషనల్!

 

 

 

 

 

ఐసీసీ ట్రోఫీ దాహాన్ని ఎట్టకేలకు తీర్చుకుంది సౌతాఫ్రికా. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకుంది ప్రొటీస్.

సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకు రావడం ఖాళీ చేతులతో ఇంటిదారి పట్టడం.. గత రెండు దశాబ్దాలుగా ఐసీసీ టోర్నమెంట్లలో సౌతాఫ్రికా పరిస్థితి ఇది. టీ20లు, వన్డేలు, టెస్టులు అనే తేడాల్లేకుండా ప్రతి ఫార్మాట్‌లోనూ అదరగొట్టడం, మేజర్ టోర్నమెంట్స్‌లో నాకౌట్స్ వరకు దూసుకురావడం.. కీలకపోరులో చతికిలపడటం వాళ్లకు ఓ సంప్రదాయంలా మారింది. దీంతో వాళ్లపై చోకర్స్ అనే ముద్ర పడింది. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ మొదలైనప్పుడు సఫారీలకు మరో ఓటమి తప్పదని చాలా మంది అనుకున్నారు. అయితే అంతా రివర్స్ అయింది. చెలరేగి ఆడిన బవుమా సేన.. కంగారూలను చిత్తు చేసి 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకున్నారు. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాచ్ హీరో ఎయిడెన్ మార్క్రమ్ కూడా ఎమోషనల్ అయ్యాడు.

ఆసీస్‌పె చిరస్మరణీయ విజయం సాధించడంతో మార్క్రమ్ భావోద్వేగానికి లోనయ్యాడు. సహచర ఆటగాళ్లతో కలసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్-2025 ఫైనల్‌ను తలచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్ చేతుల్లో ఓడటంతో తనకు నిద్రపట్టలేదన్నాడు. ఆ పోరులో ఔట్ ‌అయ్యాక ఒంటరిగా కూర్చొని ఉండిపోయానని, ఆ క్షణం చాలా నిస్సహాయంగా అనిపించిందన్నాడు. అప్పుడే నిర్ణయించుకున్నానని, ఇలాంటి సమయం వస్తే అలా కూర్చోకూడదని, అటో ఇటో తేల్చేయాలని డిసైడ్ అయ్యానని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.

‘నిన్న మొత్తం టీ20 ప్రపంచ కప్ గురించి ఆలోచించా. ఔట్ అయ్యాక నిస్సహాయంగా ఎలా కూర్చున్నానో గుర్తొచ్చింది. అందుకే మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకురావొద్దని నిర్ణయించుకున్నా. ఇది నాలో స్ఫూర్తిని నింపింది. అందుకే ఆసీస్‌తో పోరులో క్రీజులో పాతుకొనిపోయా. నా బాధ్యత నేను నిర్వర్తించాలి, జట్టు గెలుపు కోసం సాధ్యమైనంతగా పోరాడాలి అనేది దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్ చేశా’ అని మార్క్రమ్ వ్యాఖ్యానించాడు.

 రాజాసాబ్‌కు కష్టం టీమ్‌ హెచ్చరిక.

 రాజాసాబ్‌కు కష్టం టీమ్‌ హెచ్చరిక…

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. ఇప్పుడీ చిత్రానికి  లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్‌ చేశారు. దీనిపై టీమ్‌ స్పందించింది.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. (The raja saab) జూన్‌ 16న ఈ సినిమా టీజర్‌ విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇప్పుడీ చిత్రానికి  లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్‌ చేశారు. దీనిపై టీమ్‌ స్పందించింది.
లీక్‌ కంటెంట్‌ను షేర్‌ చేసే వాళ్లపై  కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్‌ హెచ్చరించింది. ఎవరైనా ‘రాజాసాబ్‌’ కంటెంట్‌కు సంబంధించిన అనధికారక వీడియోలు, ఫొటోలు, షేర్‌ చేస్తే వారి సోషల్‌ మీడియా అకౌంట్‌ను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సినిమాటిక్‌ అనుభూతి అందించేందుకు చిత్రబృందం ఎంతో కష్టపడుతోందని దానికి అందరూ సహకరించాలని కోరింది.
ప్రభాస్‌ నటిస్తున్న తొలి హారర్‌ చిత్రమిది. దీంతో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. టీజర్‌ను ఈ నెల 16న విడుదల చేయనున్నట్లు టీమ్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్‌లో ఈవెంట్‌ చేయాలను కుంటున్నారని తెలిసింది. మాళవిక మోహనన్‌, నిధీ అగర్వాల్‌, రిద్థికుమార్‌ కథానాయికలు. సంజయ్‌దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

మొదలుపెట్టిన టీమిండియా..

మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్‌బంప్స్!

 

నేటిధాత్రి:

 

 

 

 

భారత జట్టు వేట మొదలుపెట్టేసింది. 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా కుర్రాళ్లు.. బంతి, బ్యాట్ చేతపట్టి ప్రాక్టీస్ ప్రారంభించారు.

వేట మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్‌బంప్స్!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.. ఈ ముగ్గురూ లేని భారత టెస్ట్ జట్టును ఊహించడం కష్టమే. గత కొన్నేళ్లుగా టీమిండియాకు అన్నీ తామై నిలిచారీ త్రిమూర్తులు. మన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే తక్కువ వ్యవధిలోనే ముగ్గురూ రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీంతో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఎలా ఆడుతుందో అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టారు టీమిండియా ప్లేయర్లు. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని కుర్రాళ్ల బృందం ఉరిమే ఉత్సాహంతో ప్రాక్టీస్ సెషన్‌ను మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

 

బెండు తీయడం ఖాయం!

ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో గిల్ అండ్ కో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా తీసిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. ఇందులో జట్టు ఆటగాళ్లంతా పరుగులు తీస్తూ చెమటోడ్చుతూ కనిపించారు. రన్నింగ్‌‌తో పాటు ఫుట్‌బాల్ సాధన చేస్తూ దర్శనమిచ్చారు. కెప్టెన్ గిల్‌, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ డ్రిల్స్ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. హెడ్ కోచ్ గౌతం గంభీర్ అటు ఫీల్డింగ్ సెషన్స్‌తో పాటు ఇటు ఫిట్‌నెస్ డ్రిల్స్‌ను కూడా దగ్గరుండి గమనిస్తూ కనిపించాడు.ఇంగ్లండ్ గ్రౌండ్స్‌కు తగ్గట్లు ఫీల్డింగ్‌లో చేసుకోవాల్సిన మార్పులపై కోచ్ టి దిలీప్ కుర్రాళ్లతో చర్చిస్తూ కనిపించాడు. అటు పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో మాట్లాడుతూ దర్శనమిచ్చాడు. ఇంగ్లండ్ జట్టు బెండు తీసేందుకు లండన్‌లో ల్యాండ్ అయిన భారత బృందం.. ఇలా జోరుగా ప్రాక్టీస్ చేస్తూ తాము వేటాడేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పేశారు.

 

డీఎస్పీని కలిసిన ఎన్హెచ్ఎరిసి బృందం.

డీఎస్పీని కలిసిన ఎన్హెచ్ఎరిసి బృందం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ డిఎస్పీని ఎన్హెన్ఆర్సి బృందం కలవడం జరిగింది. వారికి జహీరాబాద్ నియోజకవర్గంలో విద్యార్థులు, యువకులు మాదకద్రవ్యాలకు పాల్పడకుండా, మైనర్లు టూవీలర్స్ కానీ పోర్ వీ లర్స్ వాహనాలు నడపటం జరుగుతుంది. తద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతు న్నాయి. కావున వీటిపై దృష్టి సారించాలని కోరారు. లైసెన్స్ లేని వాహనాలు ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఐర్సి సంగారెడ్డి జిల్లా చైర్మన్ వినయ్పవర్, వారితోపాటు సంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి, జిల్లా ప్రదాన కార్యదర్శి సి. వీరేందర్, న్యాల్కల్ మండల చైర్మన్ రాజనర్సింహా, ఏఐటీఎఫ్ మొగుడంపల్లి ఇంచార్జీ రవీందర్ రాథోడ్, మహేష్, ధన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలిపిన దేశిని కోటి బృందం.

నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలిపిన దేశిని కోటి బృందం

జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట పట్టణ సిఐ గా బాధ్యతలు తీసుకున్న రామకృష్ణ సిఐని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన దేశిని స్వప్న కోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ తాజా మాజీ కౌన్సిలర్లు బొంగోని వీరన్న, మారెపల్లి బిక్షపతి, దేశిని రాధా సదానందం ఎలగందుల స్వరూప శ్రీహరి, పిట్టల శ్వేతా రమేష్, పొన్నగంటి సారంగం, కుదాడి రాజయ్య, బుల్లి పూలమ్మ మొగిలి,దిడ్డి రామ్మోహన్,రావికంటి రాజు,తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపి నారు.

క్రికెట్ టోర్నమెంట్ 2025 విన్నర్ గా ఈగల్ టీం .!

పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 విన్నర్ గా ఈగల్ వారియర్స్ టీం

విజేతలకు బహుమతులు అందజేసిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి:

 

ఎల్తూరి సమృత వర్ధన్ చిన్ను ఆధ్వర్యంలో చింతల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 ఆదివారం రోజు ఫైనల్ కు చేరుకుంది.ఫైనల్ లో పరకాల ఈగల్ వారియర్స్ టీం విన్నర్ గా పైడిపల్లి టీం రన్నర్ ఆఫ్ గా నిలిచారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి హాజరై ఫైనల్ లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో పరకాల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,వినాయక హాస్పిటల్ యజమాని సతీష్,ఎన్ఎస్ఆర్ పవన్ కుమార్,మంద టునిట్,టాటా ఏఐజి పరకాల టీం మామిడి చక్రపాని,దారా సతీష్,పిట్టా సునీల్,అఖిల్,సిద్దు,ఏకు బాబు తదితరులు పాల్గొన్నారు.

రిస్క్ టీం సభ్యులకు ఘనంగా సన్మానం.

రిస్క్ టీం సభ్యులకు ఘనంగా సన్మానం

మందమర్రి నేటి ధాత్రి

 

 

మే 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా, తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ మార్కెట్లోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా, ఫిబ్రవరి 22న నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ ఎల్ బి సి) టన్నెల్లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యల్లో పాల్గొన్న సింగరేణి రెస్క్యూ టీం సభ్యులు రెడ్డి శ్రీనివాస్, సానబోయిన శ్రీనివాస్ వర్కర్స్ షేర్ గ్రూప్ తరఫున ఘనంగా సన్మానించారు.

ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదం భారతదేశంలో అత్యంత క్లిష్టమైన రక్షణ చర్యలలో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సింగరేణి కొలియరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సి సి ఎల్) నుండి 60 మంది ప్రత్యేకంగా శిక్షణ పొందిన రెస్క్యూ సిబ్బంది పంపించబడ్డారు. ఈ సిబ్బంది అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ బాడీ (ఐ ఎం ఆర్ బి) సభ్యులుగా ఉన్నారు .
ప్రమాదం జరిగిన తర్వాత, రక్షణ చర్యలు 63 రోజులపాటు కొనసాగాయి. ఈ సమయంలో రెండు మృతదేహాలు వెలికితీయబడ్డాయి, అయితే మిగిలిన ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి .

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి రెస్క్యూ టీం సభ్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, సహచరుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలను గుర్తించి, మే డే సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ సన్మానం కార్మికుల సేవలను గుర్తించి, వారికి గౌరవం చూపించే ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో వాకర్ టీం సభ్యులు అందరూ పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version