కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే…!

కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే… మడమ తిప్పదు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మొదటి విడత లక్ష మంజూరు

డి సి సి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం సప్పిడి గుట్ట గ్రామపంచాయతీ కి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద 6 గురు లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను మంజూరు చేయగా 4 గురు లబ్ధిదారులు బానోతు నీలా, సపావట్. కౌంసల్య, బానోతు రజిత, తేజావత్ కాంతమ్మ లు బేస్మెంటు బెడ్ నిర్మాణం పూర్తి అయి వారి ఎకౌంట్లో మనిషికి లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద జమ చేయడం జరిగింది. జమ అయిన లక్ష రూపాయలకు సంబంధించిన వారి ఎకౌంట్ స్టేట్ మెంటును లబ్ధిదారులకు ఇస్తూ విషయాన్ని చెప్పిన కేసముద్రం సింగిల్ విండో వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి వి .వినయ్ కుమార్, ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డికి, మహబూబాబాద్,శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ , లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోఇందిరమ్మ కమిటీ సభ్యులు బానోత్ బద్రు నాయక్,బానోత్ వాలు, రవీందర్, లచ్చిరాం, లాలు, సుమన్ పాల్గొన్నారు.

కేసముద్రం లోఇందిరమ్మ లబ్ధిదారుల సంబరాలు..

కేసముద్రం లోఇందిరమ్మ లబ్ధిదారుల సంబరాలు

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ కేసముద్రం విలేజ్ కి చెందిన వెన్ను పార్వతి రాంబాబు కి ఇందిరమ్మ ఇల్లు బిల్లు మొదటి విడత లక్ష రూపాయలు వచ్చిన సందర్భంగా లబ్ధిదారులైన వెన్ను పార్వతీ రాంబాబులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లబ్ధిదారుల ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ కు కృతజ్ఞతలు చెప్పుతూ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మిఠాయి పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కేసముద్రం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్ మండల ఓబీసీ ప్రెసిడెంట్ చిట్ల సంపత్ మండల ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ల రవి ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సొసకండ్ల సుభాష్ రెడ్డి మాజీ వార్డ్ మెంబర్ గుండు లక్ష్మీనారాయణ బోళ్ల కట్టయ్య పెండ్యాల లక్ష్మణ్ గుబ రాజు జీలకర్ర బాబు కీర్తి వేణు తదితరులు పాల్గొన్నారు ఇందిరమ్మ ఇంటి బిల్లు మొదటిసారి రావడంపై మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి కి మరియు మున్సిపల్ సిబ్బంది ప్రభాకర్ రోమన్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇందిరమ్మ కాలనీలో శ్రీ అంబా భవాని టెంపుల్..

ఇందిరమ్మ కాలనీలో శ్రీ అంబా భవాని టెంపుల్ దగ్గర బోరు మోటర్ ప్రారంభోత్సవం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో శ్రీ అంబా భవాని ఆలయం వద్ద కొత్త మోటారు బోరు వేయించిన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో స్థానిక అంబ భవాని టెంపుల్ దగ్గర బోరు మోటర్ ప్రారంభోత్సవానికి నిధులు రావడానికి కృషి చేసి న. కేకే మహేందర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ. అలాగే తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి ఇందిరమ్మ కాలనీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గుల్లపల్లి అనూష. దేవాలయ పంతులు శ్రీ పొద్దుల శ్రీనివాస్ తో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి శ్యామ్. బల్ల లక్ష్మీపతి. అంబటి అంజయ్య. దిడ్డి శ్రీనివాస్. బండారి కిషన్. అడిగొప్పుల శంకర్. వడ్డేపల్లి రాజు. చిలుక సత్యం. ఎనగందులశ్రీకాంత్. యమునా రుక్మిణి పద్మ కవిత కళ్యాణి భద్రవ రమ గ్రామ ప్రజలకు తదితరులు పాల్గొన్నారు

ఇటిక్యాలలోఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు పత్రాలు పంపిణీ.

ఇటిక్యాలలోఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు పత్రాలు పంపిణీ. . .

రాయికల్ జూలై 18, నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-32.wav?_=1

రాయికల్.మండలం ఇటిక్యాల గ్రామంలో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆదేశానుసారం శుక్రవారం రోజున గ్రామపంచాయతీ .ఆవరణలో ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజేష్, నాయకులు, ఆదిరెడ్డి, జలంధర్ రెడ్డి, గంగారెడ్డి, సాయ గౌడ్, స్వామి రెడ్డి, గంగాధర్, లక్ష్మణ్, మహేష్, ముత్తన్న, శేఖర్,హనుమాన్లు, రాజారాం, జాకీర్, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు ఏలేటి సౌమ్య, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన.!

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఈనెల 13 నాటికి వేరిఫికేషన్ వంద శాతం పూర్తి కావాలి

సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు,

 

 

 

 

ఎంపీడీఓలు, ఎంపీఓలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల,రేషన్ కార్డుల వేరిఫికేషన్,భూభారతి దరఖాస్తుల పరిష్కరణ,వన మహోత్సవంలో నాటే మొక్కల ప్రగతి,సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 8750 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 4806 గ్రౌండింగ్ అయి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని , మిగిలిన ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వారంలోగా నిర్మాణ పనుల గ్రౌండింగ్ చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో  ప్రోత్సహించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజరులో ప్రధానమంత్రి అవాస యోజన గ్రామీన్ (పీఎంఏవైజి)

 

 

 

 

పథకం క్రింద గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన ఇండ్ల వివరాలు పంచాయతీ సెక్రెటరీ లు సర్వే చేసి వెంటనే పీఎంఏవైజి ఆప్ లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

 

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణపు పనులు పూర్తి చేయడంలో జిల్లాను ముందు వరుసలో ఉంచాలని కోరారు.ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు కూడా అందిస్తామని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. లక్ష్యానికి అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఒక్కో మునిసిపల్, మండలాల వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరీలు తెలిపిన వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ విషయంలో వెనుకంజలో ఉన్న మండలాలను గుర్తించి, లక్ష్య సాధన కోసం అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.

 

 

 

ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో లబ్దిదారులను నేరుగా కలిసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలని, ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను నిశిత పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు నిధుల సమస్య ఎంతమాత్రం లేదని, నిర్మాణాలు చేపడుతున్న లబ్దిదారులకు ఆయా దశలను బట్టి వెంటవెంటనే వారి ఖాతాలలో నిధులు జమ చేయడం జరుగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.  నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ముగ్గు పోసి,ఇల్లు పునాది తీసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు.ప్రజాపాలన దరఖాస్తుల రేషన్ కార్డుల జారీ వేరిఫికేషన్ పై మునిసిపల్, మండలాల వారిగా. కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లావ్యాప్తంగా 58,841 దరకాస్తులలో 41,836 దరకాస్తులు వేరిఫికేషన్ పూర్తయిందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెల 13 నాటికి వేరిఫికేషన్ వంద శాతం పూర్తి కావాలని ఆదేశించారు. మీ సేవలో రేషన్ కార్డుల కొరకు జిల్లాలో 17866 దరకాస్తులు రాగా 7331 మంజూరు చేయడం జరిగిందని, మిగిలినవి వెంటనే వేరిఫికేషన్ చేయాలని సూచించారు.

 

 

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 31 లక్షల
మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించుటకు ప్రణాళిక ప్రకారం అనువైన ప్రదేశాన్ని  గుర్తించాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రణాళిక లను సిద్ధం  చేసుకొని మన మహోత్సవ కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలన్నారు. నాటిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు జియో కో-ఆర్డినేట్స్ తో ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో సెంట్రల్ మీడియన్ లలో పెద్దఎత్తున ప్లాంటేషన్ కు చర్యలు తీసుకోవాలని సూచించారు.భూ భారతి లో జిల్లావ్యాప్తంగా 50 850 వేల దరకాస్తులు రాగా అందులో 10 వేల 7 దరకాస్తులు మాత్రమే ఆర్ ఓ ఎఫ్ ఆర్ ప్రకారం చేయడం జరుగుతున్నదని,

 

 

 

 

మిగిలిన దరకాస్తులలో 47843 సాడబైనమా, ఇతర సమస్యలకు సంబంధించినవి ఉన్నాయని అన్నారు.ఆర్ ఓ ఆర్ పరిధిలో ఉన్న పదివేల దరఖాస్తులను ఆగస్టులో 15లోగా వేరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు  చేపట్టాలన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ఫాగింగ్ , పెద్ద ఎత్తున ఆయిల్ బాల్స్ అందుబాటులో ఉంచుకొని ఎక్కడైతే నీరు నిల్వ ఉండి దోమలు వ్యాపిస్తాయో అక్కడ ఆయిల్ బాల్స్ ఉపయోగించాలన్నారు. గ్రామాలలో ప్రతి  ఫ్రై డే ను–డ్రై డే గా తూచా తప్పకుండా పాటించాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీ సీఈఓ రామిరెడ్డి,డిఆర్డీఓ కౌసల్యాదేవి, గృహ నిర్మాణ శాఖ పిడి గణపతి, డిపిఓ కల్పన,రెవిన్యూ డివిజనల్ అధికారులు సత్యపాల్ రెడ్డి, రమాదేవి,మండల ప్రత్యేక అధికారులు,జిల్లా అధికారులు,మున్సిపల్ కమిషనర్లు,బల్దియా ఉప కమిషనర్, తహశీల్దార్లు, ఎంపిడిఓలు,ఎంపిఓలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పేదవారి కళను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ .!

పేదవారి కళను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో
ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజా, నిర్మాణం పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థ సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇండ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన నిరుపేదల అందరికీ అందే
విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, ఎంపిడిఓ రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటి సబ్యులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి.

రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి

గ్రామా ల్లో తక్షణమే హెల్త్ క్యాంపులు నిర్వహించాలి

నర్సంపేట నేటిధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలకు ఇండ్లను కేటాయించాలని ఎం సిపిఐ( యు)పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగ సుధా , నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు.
ఈ మేరకు నర్సంపేట తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటి రెండు తప్ప మిగతా హామీలు ఏవి కూడా అమలు కావడం లేదన్నారు.సీజనల్ వ్యాధులు విజ్రింబిస్తున్న క్రమంలో గ్రామాల్లో తక్షణమే హెల్త్ క్యాంపులు నిర్వహించాలని డిమాండ్ చేశారు .ప్రజాస్వామిక హక్కులపై గత పాలకుల వలె నిర్బంధాలు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకుడు కర్నె సాంబయ్య ,జన్ను విజయ,దొమ్మాటి విమల,గొడిశాల లక్ష్మి,సోలంకి భాగ్య,సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

ఝరాసంగం ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

ఝరాసంగం ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మండల కేంద్రంలో సోమవారము పేదలకు గ్రామ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ ఎంపీడీవో సుధాకర్ ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శేఖర్ పటేల్
గ్రామపంచాయతీ సెక్రెటరీ వీరన్న మాజీ సర్పంచ్ రుద్రప్ప పటేల్ మాజీ సర్పంచ్ పెంటయ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సయ్యద్ గోసుద్దీన్ అష్రఫ్ అలీ ల్యాఖత్ అలీ నిస్సార్ అహ్మద్ రాజేందర్ సింగ్ మొహమ్మద్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో దళారీల చేతివాటం.

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో దళారీల చేతివాటం:-

పొన్నం బిక్షపతి గౌడ్ జయశంకర్ భూపాలపల్లి బిఎస్పి అధ్యక్షులు:-

టేకుమట్ల, నేటిధాత్రి:-

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శనివారం నాడు టేకుమట్ల మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ గార్లు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పేరుతో అధికార పార్టీ నాయకులను అందలం ఎక్కిస్తూ వారు చెప్పిన వారికే ఇండ్లను మంజూరు చేస్తూ, గ్రామంలో లేని వారికి స్థిరమైన గృహాలు ఉన్నవారికి కూడా ఇండ్లను మంజూరు చేస్తున్నారని అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ నిజమైన నిరుపేదలను ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా గుర్తించకుండా చేస్తున్న అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులతో కుమ్మక్కై ఇట్టి దందా నడిపిస్తున్నారని అన్నారు. తక్షణమే ఇట్టి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని లేని ఎడల పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవోలు కలెక్టరేట్ ముందు ఇందిరమ్మ ఇండ్లకు అర్హులయ్యే పేదలతో ధర్నా రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ మండల తదితర నాయకులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన

కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రం గౌడ్.

మరిపెడ కురవి నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ని
జుజ్జూర్ తండాలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రం ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది, ఈ కార్యక్రమ నికి ముఖ్య అతిథిగా హాజరైన కురవి మండల అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేద వాడికి సొంత ఇంటి నిర్మాణం అని ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలని ద్రుడ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు,జిల్లాలో జూన్ పదవ తారీకు వరకు ప్రోసిడింగ్ కాపీలు మంజూరు చేసి బేస్మెంట్ లెవెల్ పూర్తిచేసిన అన్నిటికీ డబ్బులు వెంటనే ఇస్తామన్నారు , గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి పేదవారికి సొంత ఇల్లు నిర్మాణ పథకం ప్రవేశ పెట్టలేదని, ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కావలసిన ఇసుక రిచ్ ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి శ్రీనివాస్ గౌడ్, జుజుర్ తండా గ్రామ అధ్యక్షుడు బానోత్ రవి, ఉపాధ్యక్షుడు ధరావత్ మోతిలాల్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు డాక్టర్ ధరావత్ వీరన్న నాయక్, పూల్ సింగ్ నాయక్ , నవీన్ గ్రామ పంచాయతీ కార్యదర్శి భవాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామంలో శుక్రవారం పేదలకు గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకటేశం ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్, మల్లన్న నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం

-ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

-కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్

-మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

-గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

-పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే

-మొగుళ్ళపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, లబ్దిదారులకు మంజూరీ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

మొగులపల్లి నేటి ధాత్రి

 

 

 

 

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.

మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు ఇప్పలపల్లి, పోతుగల్, కొర్కిశాల, గణేష్ పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, మొట్లపల్లి, గుండ్లకర్తి, మెట్టుపల్లి, నర్సింగాపూర్, వేములపల్లి, బంగ్లాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, పిడిసిల్ల, ముల్కలపల్లి, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, వాగొడ్డుపల్లి, చింతలపల్లి, రంగాపురం గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్, ఎంపీడీఓ, ఎమ్మార్వోలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.

కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు. గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు.

మొగుళ్ళపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ..

పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు.

గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ మొగుళ్ళపల్లి మాజీ చైర్మన్ ఫోలీనేని లింగారావు, పీఏసీస్ మొగుళ్ళపల్లి వైస్ చైర్మన్ కొమురోజు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మంద సాంబయ్య, కేతిపల్లి తిరుపతిరెడ్డి, రొంటాల సంపత్, చర్లపల్లి శ్రీధర్ గౌడ్, క్యాతరాజు లింగమూర్తి, పొన్నాల విజయేందర్ రెడ్డి, ఎలేటి శివారెడ్డి, పడిదల ప్రకాష్ రావు, మల్సాని రాజేశ్వర్ రావు తదితరులున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇళ్లు మోడల్ హౌస్ ను ఎమ్మెల్యేలు కశిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి పట్టణంలోని CKR (చింతల కొండా రెడ్డి) ఫంక్షన్ హాల్ లో కల్వకుర్తి పట్టణం, కల్వకుర్తి మండలం, వెల్దండ మండలం, చారకొండ మండాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి జిల్లా ఇంచార్జిలు తెజావత్ బెల్యా నాయక్, రాజశేఖర రెడ్డి, ప్రవీణ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.

ఇదే నిజమైన ఇందిరమ్మ రాజ్యం…

ఇదే నిజమైన ఇందిరమ్మ రాజ్యం…

ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్

కేసముద్రం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై పనిచేస్తున్నదని మహబూబాబాద్ శాసనసభ్యులు డా.మురళీ నాయక్ స్పష్టం చేశారు.

శుక్రవారం కేసముద్రం మండల కేంద్రంలోని పలు గ్రామాలు మరియు రైతు వేదికలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు.

 

This is the real Indiramma Rajyam…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళీ నాయక్ మాట్లాడుతూ, ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం. ఇక్కడ ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతోంది. ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఈ పట్టాలు వారి కలలను సాకారం చేస్తున్నాయి. తలదాచుకునే చోటు కలిగిన ప్రతి కుటుంబం సమాజంలో గౌరవంతో బతికే అవకాశం పొందుతుంది, అని పేర్కొన్నారు..

అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆశ్రయమైన ఇంటిని కల్పించడంలో ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం పట్టా కాదు, పేదల భవిష్యత్తుకి బలమైన బునియాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదేశాల మేరకు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తలదాచుకునే ఇంటి కోసం భూమిని, నిర్మాణానికి ఆర్థికసహాయాన్ని అందిస్తోంది, అని వివరించారు..

పట్టాలు అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

ఇన్నేళ్లుగా అద్దె ఇంట్లో జీవితం గడిపాం. ఇప్పుడు మా కుటుంబానికి ఓ గౌరవం వచ్చినట్టు ఉంది,” అంటూ ఒక లబ్ధిదారుడు ఆనందంతో చెప్పారు.

కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, మాజీ జడ్పిటిసి బండారి వెంకన్న,రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ.

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

మెట్ పల్లి జూన్ 4 నేటి దాత్రి

 

 

 

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీతో ఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేదవారి సొంతింటి కల నెరవేరిన వేళ
ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయంగా
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల పట్టణ జిఎస్ గార్డెన్లో పట్టణానికి చెందిన 33 వార్డుల ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు విచ్చేసి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ తో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి పట్టణానికి చెందిన 33 వార్డుల్లో అర్హులైన 502 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని ప్రజా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజల సొంతింటి కల సహకారం చేయడం కోసం ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేయకుండా కేవలం తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే పంపిణీ చేసిందన్నారు కోరుట్ల పట్టణంలో కేవలం 80 ఇల్లు మాత్రమే మంజూరు చేయగా అది కూడా తమ నాయకులకు కార్యకర్తలకు కట్టబెట్టారన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల వ్యవధిలోనే జనాభా ప్రాతిపదికన అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు పేదవారు కూడా సన్న బియ్యంతో కడుపునిండా తినాలని సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందన్నారు కొండ్రికర్ల బ్రిడ్జి నిర్మాణం కేవలం ఎన్నికల్లో ఓట్లు దండు పోవడం కోసం తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే బ్రిడ్జి నిర్మాణం చేపడతామని బాండ్ పేపర్ రాసి ఇచ్చింది కానీ గెలిచిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం ఊసే లేకుండా పోయిందన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 నెలల వ్యవధిలోనే 6 కోట్ల 80 లక్షల రూపాయల మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణ పనులకు పునాది వేసిందన్నారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వార్డు ఆఫీసర్ల కృషి అభినందనీయమన్నారు ఇందిరమ్మ ఇంటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాజీ మంత్రివర్యులు స్వర్గీయ రత్నాకర్ రావు హయాంలో కోరుట్ల పట్టణంలో సుమారు 500 ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 80 మాత్రమే మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ద్వారా పట్టణంలోని 33 వార్డుల ద్వారా 502 మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రోస్డింగ్ పత్రాలు అందజేస్తున్నామన్నారు ఇంకా ఎవరైనా లబ్ధిదారులు రాని వారు ఉంటే వారికి కూడా త్వరలోనే అందేలా కృషి చేస్తామన్నారు కోరుట్ల నియోజకవర్గం లో ఇప్పటివరకు సుమారు మూడు కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు ఎవరికి ఏ సమస్య ఉన్న నేరుగా తన వద్దకు వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తోపాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు వార్డు ఆఫీసర్లు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క నూతన రేషన్ కార్డును కూడా పంపిణీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల వ్యవధిలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ.

తొర్రూరు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు.

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి:

 

ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై పనిచేస్తున్నదని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు స్పష్టం చేశారు. తొర్రూరు మండల కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు స్వయంగా ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం. ఇక్కడ ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతోంది. ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఈ పట్టాలు వారి కలలను సాకారం చేస్తున్నాయి. తలదాచుకునే చోటు కలిగిన ప్రతి కుటుంబం సమాజంలో గౌరవంతో బతికే అవకాశం పొందుతుంది, అని పేర్కొన్నారు..

అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆశ్రయమైన ఇంటిని కల్పించడంలో ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం పట్టా కాదు, పేదల భవిష్యత్తుకి బలమైన బునియాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తలదాచుకునే ఇంటి కోసం భూమిని, నిర్మాణానికి ఆర్థికసహాయాన్ని అందిస్తోంది, అని వివరించారు..

కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

ఇన్నేళ్లుగా అద్దె ఇంట్లో జీవితం గడిపాం. ఇప్పుడు మా కుటుంబానికి ఓ గౌరవం వచ్చినట్టు ఉంది,” అంటూ ఒక లబ్ధిదారుడు ఆనందంతో చెప్పారు..

పట్టాల పంపిణీ అనంతరం, ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి మండలంలో పథకాల అమలు, నిర్మాణ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు..

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో జిల్లా ఫస్ట్.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో జిల్లా ఫస్ట్

జిల్లా కలెక్టర్ కు మంత్రుల అభినందనలు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా అధికారులను మంత్రులు అభినందించారు.
జిల్లాకు మంజూరు అయిన 7862 ఇండ్లకు గాను 7808 అలాట్మెంట్ ఆర్డర్లు లబ్దిదారులకు అందజేశారు. వేములవాడ నియోజకవర్గంలో ఫేజ్-1,2 లో కలిపి 2575 ఇండ్లు, సిరిసిల్ల నియోజకవర్గంలో ఫేజ్-1,2 లో కలిపి 3608 ఇండ్లు, చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలంలో ఫేజ్-1,2 లో కలిపి 820 ఇండ్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యంతో కలిసి, మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో ఫేజ్-1లో 42 ఇండ్ల మంజూరు పత్రాలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి కలెక్టర్ పంపిణీ చేశారు. ఫేజ్- 2లో 763 మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. ఫేజ్ 1 కింద జిల్లాలో మొత్తం 439 ఇండ్లు మంజూరు చేయగా, 135 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాలోని 11 మండలాల్లో మొదలు పెట్టిన మోడల్ హౌస్ లలో బేస్మెంట్ లెవెల్ లో మూడు, రూఫ్ లెవెల్లో రెండు, స్లాబ్ లెవెల్ లో ఆరు ఇండ్లు ఉన్నాయి.ఈ సందర్బంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశాన్ని కరీంనగర్ లో గురువారం నిర్వహించగా, జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు హాజరై ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల జారీలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేలా విశిష్ట సేవలు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను, జిల్లా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడంలో రేటు కట్టడి చేయాలి.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడంలో రేటు కట్టడి చేయాలి

హౌజింగ్ పిడి రవీందర్

పరకాల నేటిధాత్రి:

 

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హోసింగ్ పీడీ. రవీందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ఇట్టి ఇండ్లు నిర్మాణంలో ఎక్కువ ఖర్చు కాకుండా కట్టడి చేయాలని
పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.

Labor

ఇంటి నిర్మాణం విషయంలో ప్రభుత్వం నియమ నిబంధనల మేరకే నిర్మించాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు,పంచాయతీ కార్యదర్శులు,హౌసింగ్ డీఈ,యంపీడీఓ జిల్లా కలెక్టర్ వరకు పర్యవేక్షణ చేస్తారని డైరక్టర్ హౌజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చెక్ చేసి ఏలాంటి అవకతవకలు జరిగినా సంబందిత అధికారుల పై చర్యలు తీసుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల లేబర్ అధికారి జి.వినోద్ కుమార్,హౌజింగ్ ఏఈ ఆకాంక్ష,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం.

ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్ లను పంపిణి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనీ కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో పంక్షన్ హల్ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ద్వారా మైనారిటీలకు ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం ద్వారా మంజూరు అయిన 150 కుట్టు మిషన్ ల పంపిణి కార్యక్రమం రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుళ్ల కొత్వాల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి పాల్గొని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి,రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుళ్ల కొత్వాల్ కలిసి మైనారిటీ మహిళకు కుట్టు మిషన్ లను పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు,పొల్యూషన్ బోర్డు మెంబెర్ బాలాజీ సింగ్ గారు కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తాజా &మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

దళితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని.

దళితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని
ఆగిన దళిత బంధు ఇవ్వాలని
…,. జిల్లా కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి….

జమ్మికుంట :నేటిధాత్రి

 

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో జరుగుతున్న అక్రమాలు గురించి, హుజురాబాద్ నియోజకవర్గంలో నిలిపి వేయబడిన రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, స్పోర్ట్స్ గ్రౌడ్ పనులు వెంటనే ప్రారంభించాలి అని, దళితుల అందరికి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని కరీంనగర్ జిల్లాలో నిలిపివేయబడిన అభివృద్ది పనులను వెంటనే పూర్తి చేయాలని మరియు కరీంనగర్ జిల్లాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన

MLA Padi Kaushik Reddy

ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ గారు, సుంకే రవిశంకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు గారు, జిల్లా అధ్యక్షులు GV రామాక్రిష్ణా రావు గారు. మరియు మాజీ మున్సిపల్ చెర్మన్ లు కౌన్సెలర్స్ మాజీ ఎంపీపీ లు మాజీ జడ్పీటీసీలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version