మండల కేంద్రానికి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి నన్నేసాహెబ్ తల్లి అనారోగ్యంతో మృతిచెందగా. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతురాలి స్వగృహానికి చేరుకొని ఆమె పార్థివ దేహం పై పూలమావిసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగడ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్ నాయకులు నాన బోయిన రాజారాం, సట్ల శ్రీనివాస్ గౌడ్, ఖ్యాతం శ్రీనివాస్ గుమ్మడి వేణు పాండవుల రాంబాబు ముదిరాజ్ తదితరులు ఉన్నారు.,
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఏక్ పెడ్ మాకే నామ్ సర్టిఫికెట్లను తల్లిదండ్రుల సమావేశంలో మొక్కలు నాటిన తల్లులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏక్ పేడ్ మాకేనాం (అమ్మ కోసం ఒక చెట్టు) అనే కార్యక్రమాన్ని తీసుకొని విద్యార్థులలో చెట్ల పెంపకానికి ఉన్న ప్రాధాన్యతను పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.మొక్క తల్లితో సమానమని విద్యార్థులు అమ్మని ఎలాగైతే ఇష్టపడతారో అలాగే మొక్కను నాటి ఇష్టపడి ఆ మొక్కను కాపాడుతూ ఉండాలని విద్యార్థులను భాగస్వామ్యం చేయడం జరిగిందని అన్నారు.చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థిని,విద్యార్థులు అందరూ తమ తల్లులతో మొక్కలు నాటి తమ ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేసినందుకు గాను మరి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను అప్రిషియేట్ చేస్తూ సర్టిఫికెట్ను ఇవ్వడం జరిగిందనీ ఆ సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసి విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం పాఠశాలలో బతుకమ్మ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పటు చేసి బతుకమ్మలతో వచ్చి ఆడి పాడిన తల్లులకు ప్రథమ, ద్వితీయ,తృతీయ బహుమతులుగా చీరలను ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్కవత్ దేవా,కంచ రాజకుమార్,మేకల సత్యపాల్,పుల్లూరి రామకృష్ణ,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ,అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ, నందిపాటి సంధ్య మరియు తల్లిదండ్రులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఢిల్లీలో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. 39 ఏళ్ల మద్ ఫిరోజ్, అలియాస్ సుహెల్, తన తల్లిని అత్యాచారం చేసిన ఆరోపణలతో అరెస్టు అయ్యాడు. తల్లి ఇటీవల సౌదీ అరేబియాకు యాత్ర చేసి తిరిగి వచ్చారు. అతను ఆమెను ఒక గదిలో లాక్ చేసి, చాకూ మరియు కత్తులతో కొట్టడం తో పాటు గత conduct కోసం శిక్షగా అత్యాచారం చేశాడని ఆరోపణ. భయంతో ఆమె మొదట పోలీసులు దగ్గరకు వెళ్లలేదు, కానీ తర్వాత ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అడవి తల్లి బాటపై ప్రత్యేక ఫోకస్.. అధికారులకు పవన్ కళ్యాణ్ సూచనలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.
అమరావతి: రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆయన సూచించారు. పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందని తెలిపారు.
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో గురువారం రోజున పెద్దవాగు నది తీరాన గంగమ్మ కమిటీ ఆధ్వర్యంలో గంగాదేవి, మరియు పరమశివుని విగ్రహల ప్రతిష్టలు పండితులు కృష్ణ ప్రసాద్ శర్మ, సంతోష్ లు ఘనంగా నిర్వహించారు.. మహిళలు బెల్లపు అన్నం వండుకొని బోనం నెత్తిపై పెట్టుకుని జంబి గద్దె నుండి పురవీధుల గుండా డప్పు చప్పుళ్ల మధ్య, భక్తి పాటలతో పెద్దవాగు గంగమ్మ తల్లికి, మా పిల్లలు, మా కుటుంబాలు, బాగుండాలని మనసారా మొక్కుకొని నైవేద్యం సమర్పించారు.. అనంతరం భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, గంగమ్మ తల్లి కమిటీ సభ్యులు, గ్రామ సేవా సమితి కార్యవర్గ సభ్యులు, గంగపుత్ర సంఘ సభ్యులు, దాతలు, డాక్టర్ కాటిపెల్లి నారాయణరెడ్డి, కొడిమ్యాల భూoరావు, సురభి భూo రావు, విగ్రహ దాతలు ఉట్నూరి రవి, మరిపెళ్లి నారాయణ గౌడ్, చెన్నమనేని వంశీయులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, యువకులు, మహిళా సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన చేపట్టిన బీసీ హక్కుల పోరాట సమితి
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్ లో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర శనివారం రోజున జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.నాయకులు మాట్లాడుతూ.. పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నుండి 32 పార్టీలు బిసి రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయి.అలాగే దేశంలోని తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ బీసీ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రవేశ పెట్టలేదో బీసీ సమాజానికి చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న బీసీలకు ప్రజాస్వామ్య వాటా దక్కకపోవడం అత్యంత బాధాకరమని,దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే దేశాన్ని రాష్ట్రాన్ని 78 సంవత్సరాలుగా పాలిస్తున్నారని,దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగా మారిందని, ఇంకెంతకాలం బీసీలకు అన్యాయం చేస్తారని,ఇదేనా ప్రజాస్వామ్యం,ఇదేనా సామాజిక న్యాయమని ప్రశ్నిస్తున్నామన్నారు.ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా అని రాజ్యాంగం చెప్తుంటే ఈ అగ్రకులాలు బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందనీ,ఇప్పటికైనా బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని,లేని పక్షంలో పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్,కర్రె లచ్చన్న సీనియర్ రాష్ట్ర నాయకులు,గజెలి వెంకటయ్య జిల్లా కార్యదర్శి,శాఖపురి భీమ్సేన్,నాయకులు అంకం సతీష్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పిల్లలతో సహా తల్లి అదృశం, కేసు నమోదు చేసిన పోలీసులు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
పిల్లలతో సహా తల్లి అదృశ్యం పై కేసు నమోదు చేసి నట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై కే వినయ్ కుమార్ తెలిపారు.ఈ కేసులో అమ్రేన్ బేగం (30)తో పాటు ఆమె పిల్లలు అలియా(9) మాహేర (7), ఆహిల్ (5) ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమ్రేన్ తన భర్త మహమ్మద్ నూర్ ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆ గొడవల కారణంగా తన పిల్లలతో పాటు రాంనగర్ లోని తన అన్న మహమ్మద్ హర్షద్ వద్దకు 20 రోజుల క్రితం వచ్చింది. గత 15వ తేదీ మధ్యాహ్నం కిరాణా షాప్ వె ళ్తానని చెప్పి తన ముగ్గురు పిల్లలతో సహా ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఇప్పటివరకు తిరిగి రాలేదని ఆమె అన్న హర్షద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ.కే.వినయ్ కుమార తెలిపారు.
మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు పరిధిలోని జాతీయ రహదారి పక్కన గల గాంధారి మైసమ్మ,సంతాన నాగదేవతలు కొలువై ఉన్నారు.ఈ నెల 20 ఆదివారం రోజున అంగరంగ వైభవంగా జాతర నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. టెంట్లువేసి బారికేడ్లు ఏర్పాటు చేసింది. జంతుబలుల కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్ నిర్మించింది. జిల్లా నలుమూలలతో పాటు ఆసిఫాబాద్ జిల్లా నుండి కోల్ బెల్ట్ ప్రాంతాల నుండి కార్మిక కుటుంబాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశమున్నది.భక్తులు మేకలు, కోళ్లు బలి ఇచ్చి సల్లంగ సూడు గాంధారి మైసమ్మ తల్లీ అని బోనాలతో మొక్కులు చెల్లించుకోనున్నారు. మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్,మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, ఆర్కేపి ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
Gandhari Maisamma Ashada month Bonala
20 ఏండ్ల క్రితం మైసమ్మ ఆలయం ఏర్పాటు…
మంచిర్యాల నుండి మందమర్రి మీదుగా చంద్రపూర్ వెళ్లే జాతీయ రహదారిపై బొక్కలగుట్ట అటవీ సమీపంలోని పాలవాగు వంతెన వద్ద తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. అనేక మంది ప్రాణాలు కోల్పోయేవారు. దీంతో బొక్కలగుట్ట, పులిమడుగు గ్రామస్తులు చారిత్రక గాంధారి కోటలోని మైసమ్మ దేవతకు పూజలు చేసి 20 ఏండ్ల క్రితం ప్రతిష్ఠించారు. అనంతరం గుడి నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు.అప్పటి నుండి రోడ్డు ప్రమాదాలు తగ్గిపోయాయి. ఆనాటి నుండి ఆషాఢమాసంలో గాంధారి మైసమ్మ ఆలయానికి వచ్చి బోనాలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తల్లికి నూటొక్క బోనాలతో జాతర నిర్వహించి మొక్కులు చెల్లించుకోవడం ఆచారంగా వస్తుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా 20వ తేది ఆదివారం గాంధారి మైసమ్మ బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది.
జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించండి
Gandhari Maisamma Ashada month Bonala
ఏసిపి రవికుమార్, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్
ఈనెల 20 ఆదివారం రోజున గాంధారి మైసమ్మ బోనాల జాతర జరిగే ప్రదేశం జాతీయ రహదారి కావడంతో మంచిర్యాల,రామకృష్ణాపూర్ నుండి వచ్చే భక్తులు కుర్మపల్లి స్టేజ్ వద్ద నుండి వాహనదారులు ఎట్టి పరిస్థిటీలో రాకూడదని, పులిమడుగు వద్ద నుండి యూ టర్న్ తీసుకుని ఆలయం సమీపంలో ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రదేశంకు చేరుకొని పోలీసులకు సహకరించాలని, ఆలయం వద్ద ఏర్పాటుచేసిన క్యూలైన్లో భక్తులు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ లు తెలిపారు.
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని 23వ వార్డులో ఆదివారం ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు అమ్మవారికి సమర్పించినట్లు ఆలయ కమిటీ వారు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేడుకలు జరపడం తృతీయ సంవత్సరమని ప్రతి సంవత్సరం అమ్మవారిని అలంకరించి బోనాలతో అమ్మవారికి మొక్కలు చెల్లిస్తామని అన్నారు.అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి వద్ద పెద్ద ఎత్తున బోనాల సందడి నెల కోవడం జరిగింది.నస్పూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి పోచమ్మ దేవాలయం వరకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకొని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి మొక్కులు సమర్పించుకున్నారు.డప్పు చప్పుళ్ళు తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మారు మోగింది.శివ సత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది.ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందని,అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని అమ్మవారికి ఆలయ కమిటీ వారు ప్రత్యేక పూజలు సమర్పించారు.
ఎస్వీ వైద్య కళాశాల, స్విమ్స్ ఆసుపత్రి లో కందారపు. రాజమ్మ అనారోగ్యం తో చికిత్స పొందుతూ మరణించారు, చనిపోయిన కందారపు రాజమ్మ సుమారు 80 సంవత్సరాలు , యశోద నగర్, తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తి. స్విమ్స్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది.ఆమె కుమారులు కందారపు .మురళి, కందారపు సురేంద్ర తన తల్లి నేత్రాలను దానం చేయడానికి ముందుకు రావడం జరిగినది. రుయా కంటి విభాగము విభాగాధిపతి డాక్టర్. చలపతి రెడ్డి అధ్వర్యంలో నేత్రాలను సేకరించి నేత్ర విభాగ, నేత్ర నిధి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగినది, నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, చనిపోయిన వ్యక్తి కుమారులు సమ్మతితో ఆమై నేత్ర లు తీసుకోవడం జరిగినది. వెంటనే నేత్ర విభాగ టెక్నీషియన్ ఎస్,రమేష్, నేత్రాలను సేకరించి, నేత్ర బ్యాంకులో భద్రపరచడం జరిగినది.తన తదనంతరం అవయవ దానాలకు, నేత్ర దానాలకు, ముందుకు రావడం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేత్రాలను సేకరించడం జరుగుతున్నదిఅని నేత్ర విభాగాధిపతి డాక్టర్ చలపతి రెడ్డి తెలిపారు. రుయా ఆసుపత్రి అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు సూపరిటెండెంట్ డాక్టర్ జే. రాధా మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులు,ఈ విధంగా ప్రభుత్వ వైద్యశాలలకు నేత్రాలు, అవయవాలు దానం చేయడం వలన పేద రోగులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఈ అవయవాలను వారికి ఉచితముగా అమర్చడానికి ఇలాంటి అవయవ దానాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పుర ప్రజలు ఎవరైనా నేత్ర దానం చేయాలంటే ఈ క్రిందిఫోను నెంబర్ కు సంప్రదించవచ్చును. సెల్ నెంబర్: 8500880126,ఈ కార్యక్రమంలో ఎల్.వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ఎస్, రమేష్,మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర.ఓ. వీర కిరణ్ పాల్గొన్నారు.
అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి.
చిట్యాల, నేటిధాత్రి :
భూపాలపల్లి మండలం: గూడాడుపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్రీజ (14) చిన్నతనంలోనే శ్రీజ ను వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది అప్పటినుండి వాళ్ళ నాన్న మానసికంగా కృంగిపోయి తాగుడుకు బానిస అయ్యాడు అప్పటినుండి శ్రీజను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవడంతో స్కూల్ బంద్ చేసి వేరే ఊరిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ ఉండిపోయింది శ్రీజ పరిస్థితిని చూసి గూడాడుపల్లికి చెందిన చంద్రగిరి శ్రీకాంత్ అనే యువకుడు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారికి విషయం చెప్పడంతో వెంటనే స్పందించిన
ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారు ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి శ్రీజ పరిస్థితి తెలుసుకొని వెంటనే ఆ చిన్నారికి బట్టలు, బుక్స్ పెన్నులు, మిగతా సామాను కొనిచ్చి, చిట్యాల కస్తూర్బా హాస్టల్ లో జాయిన్ చేయించడం జరిగింది అలాగే శ్రీజ పూర్తి బాధ్యతలు మేమే చూసుకుంటామని శ్రీజ పై చదువులకు కూడా సహాయక సహకారాలు అందిస్తామని భవిష్యత్తులో ఆమెతల్లి వదిలేసి చదువు మానేసిన చిన్నారికి చేయూత.
అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి.
గూడాడుపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్రీజ (14) చిన్నతనంలోనే శ్రీజ ను వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది అప్పటినుండి వాళ్ళ నాన్న మానసికంగా కృంగిపోయి తాగుడుకు బానిస అయ్యాడు అప్పటినుండి శ్రీజను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవడంతో స్కూల్ బంద్ చేసి వేరే ఊరిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ ఉండిపోయింది శ్రీజ పరిస్థితిని చూసి గూడాడుపల్లికి చెందిన.
చంద్రగిరి శ్రీకాంత్ అనే యువకుడు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారికి విషయం చెప్పడంతో వెంటనే స్పందించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారు ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి శ్రీజ పరిస్థితి తెలుసుకొని వెంటనే ఆ చిన్నారికి బట్టలు, బుక్స్ పెన్నులు, మిగతా సామాను కొనిచ్చి, చిట్యాల కస్తూర్బా హాస్టల్ లో జాయిన్ చేయించడం జరిగింది
అలాగే శ్రీజ పూర్తి బాధ్యతలు మేమే చూసుకుంటామని శ్రీజ పై చదువులకు కూడా సహాయక సహకారాలు అందిస్తామని భవిష్యత్తులో ఆమె పెళ్లి కూడా మేమే చేస్తామని చైర్మన్ అయిలి మారుతి గారు తెలియజేశారు అలాగే శ్రీజ పరిస్థితి గురించి తెలియజేసిన.
చంద్రగిరి శ్రీకాంత్ గారిని చైర్మన్ అయిలి మారుతి గారు ప్రత్యేకంగా అభినందించారు ఇలాగా ఇంకా ఎవరైనా ఉంటే మా ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి తెలపమని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చిట్యాల మండల ఇంచార్జ్ లౌడియ రాజునాయక్, దుగ్యాల స్వామి తదితర సభ్యులు పాల్గొన్నారు.
పెళ్లి కూడా మేమే చేస్తామని చైర్మన్ అయిలి మారుతి గారు తెలియజేశారు అలాగే శ్రీజ పరిస్థితి గురించి తెలియజేసిన చంద్రగిరి శ్రీకాంత్ గారిని చైర్మన్ అయిలి మారుతి గారు ప్రత్యేకంగా అభినందించారు ఇలాగా ఇంకా ఎవరైనా ఉంటే మా ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి తెలపమని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చిట్యాల మండల ఇంచార్జ్ లౌడియ రాజునాయక్, దుగ్యాల స్వామి తదితర సభ్యులు పాల్గొన్నారు.
అప్పు తీరుస్తామని చెప్పినా వదల్లేదని బాధితురాలు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. కన్నప్ప కుటుంబ సభ్యులు.. తనను తీవ్రంగా కొట్టడంతో చెయ్యికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని శిరీష తెలిపారు.
చిత్తూరు, జూన్ 17: అప్పు కట్టలేదని మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కూడా సీరియస్ అయ్యాయి.
తాజాగా ఈ దారుణ ఘటనపై బాధితురాలు శిరీష స్పందిస్తూ.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పు తీర్చలేదని మహిళ అని చూడకుండా నడిరోడ్డుపై తాడుతో చెట్టుకు కట్టేశారంటూ శిరీష కన్నీరు పెట్టుకున్నారు.
తనకు ఇద్దరు ఆడ బిడ్డలు, ఒక మగ బిడ్డ ఉన్నారని తెలిపారు.
‘బెంగళూరు నుంచి నారాయణపురంలో నా బిడ్డ టీసీ కోసం గ్రామానికి వచ్చాను.
టీసీ తీసుకుని పాఠశాల నుంచి బయటకు నడుచుకుంటూ వస్తుండగా అప్పు ఇచ్చిన కన్నప్ప కుటుంబ సభ్యులు ఎదురుపడి రూ.80,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కఠినంగా వ్యవహరించారు’ అని తెలిపారు.
పాఠశాల వద్ద నుంచి తనను లాక్కుని వచ్చి చెట్టుకు తాడుతో కట్టేశారన్నారు.
అప్పు తీరుస్తామని చెప్పినా వదల్లేదన్నారు. కన్నప్ప కుటుంబ సభ్యులు..
తనను తీవ్రంగా కొట్టారని ఆవేదన చెందారు.
కన్నప్ప కుటుంబ సభ్యుల దాడిలో తన చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.
తన కళ్ళ ఎదుటే బిడ్డలు అమ్మా అంటూ ఏడుస్తున్నా పక్కకు లాగి పారేశారని కన్నీటి పర్యంతమయ్యారు.
దాదాపు గంటసేపు చెట్టుకు కట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు.
‘మా అమ్మ, నా ముగ్గురు బిడ్డలు ఏడుస్తున్నా వారు పట్టించుకోలేదు’ అని తెలిపారు.
ఎవరో ఒక పెద్దాయన బుల్లెట్పై వచ్చి మహిళను అలా చేయకూడదని చెప్పినా వినలేదన్నారు.
కొంత మంది సహాయంతో కట్లు విప్పుకొని వచ్చేసినట్లు చెప్పారు.
ఈ వీడియో ఎవరు తీశారో తనకు తెలియదని..
మొత్తం వైరల్ అయిందన్నారు.
తన కట్లు విప్పేసిన తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశానని బాధితురాలు శిరీష చెప్పుకొచ్చారు.
కాగా.. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది.
అప్పు కట్టాలంటూ శిరీష అనే మహిళను గ్రామానికి చెందిన మునికన్నప్ప, అతడి కుటుంబసభ్యులు చెట్టుకు కట్టేయడంతో పాటు దాడి చేశారు.
ఈ ఘటనను కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది.
మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు.
మహిళను చెట్టుకు కట్టేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
భవాని సాహిత్య వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో పితృదినోత్సవం సందర్భంగా నాన్నకు ప్రేమతో. కవితా సంకలనం పుస్తకం లో నాన్న గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ (ఉషోదయ భానుడు నాన్న)అనే అంశంపై రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కవయిత్రి తాళ్లపల్లి భాగ్యలక్ష్మి కవితా గానం చేసినందుకు గాను సభఅధ్యక్షులు, నాన్నకు ప్రేమతో కవితా సంపుటి సంపాదకులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, ముఖ్య అతిథి ఎన్వీ రఘువీర్ ప్రతాప్, విశిష్ట అతిథులు కృషిరత్న బుస్స శ్రీనివాస్, విశ్రాంత ఉపాధ్యాయులు నరహరి లక్ష్మారెడ్డి, సమీక్షకులు కూర చిదంబరం, ఆధ్యాత్మికవేత్త బొమ్మకంటి కిషన్,తెలుగు సాహితీవేత్త ,విమర్శకులు డాక్టర్ మోతుకుల నారాయణ గౌడ్ చేతుల మీదుగా ప్రముఖ తెలుగుసాహితీవేత్త, కవి,రచయిత్రి శ్రీమతి తాళ్లపల్లి భాగ్యలక్ష్మి (ఝాన్సీ) ఆమె తల్లి శ్రీమతి తాళ్లపల్లి బాలవ్వలను ఆత్మీయతతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కవయిత్రి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఇంటి నుండి తప్పిపోయిన మూడు సంవత్సరాల పాపను తల్లిదండ్రుల వద్దకు చేర్చిన మందమర్రి బ్లూ కోల్ట్ పోలీసులు
పచ్చిక రాజు, పచ్చిక జమున సి ఎస్ ఐ చర్చి, మందమర్రి మార్కెట్ లో గల వారి కుమార్తె మూడు సంవత్సరాల ఆరాధ్య వాళ్ళ అమ్మగారు ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఇంటి ముందర ఆడుకుంటూ, తప్పిపోయి మందమర్రి మార్కెట్ లోని సాయిబాబా గుడి వద్దకు రాగా పాపను గమనించిన స్థానికులు పాపా వివరాలు తెలుసుకోనగా పాప వివరాలు తెలుపకపోయేసరికి స్థానికులు డయల్ 100 కు ఫోన్ చేయగా బ్లూ కోర్టు కానిస్టేబుళ్లు చిరంజీవి, శ్రీనివాస్ లు పాప యొక్క తల్లిదండ్రుల గురించి చుట్టుపక్కల ఏరియాలలో వేతగా ఎలాంటి ఫలితం లేకపోయేసరికి, మందమర్రి ఎస్సై ఆదేశాల మేరకు పాప యొక్క ఫోటోను సోషల్ మీడియాలో స్థానిక వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయగా, పాప తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి పోలీస్ స్టేషన్ కు రాగా, ఆరాధ్యను వాళ్ళ తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడం జరిగింది.
శ్రీరేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకొన్న తెలంగాణ గౌడ సంక్షేమ సంఘ నాయకులు
కరీంనగర్ నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలోని శ్రీరేణుక ఎల్లమ్మ జాతర సందర్బంగా శ్రీ రేణుక మాత ను గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ నాయకులు దర్శనం చేసుకొని సందర్శించడం జరిగింది. ఈసందర్భంగా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ మాట్లాడుతూ రేణుకా మాత ఆశీస్సులు ప్రతి ఒక్క గౌడ బిడ్డకు ఉండాలని ఆ తల్లి ఆశీర్వాదం తోటి సుఖశాంతులు ప్రజలకు వెదజల్లాలని, అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్లు కలకాలం జీవించాలని ఆభగవంతుని ప్రార్థించారు. ఎంతో నిష్టతో చేసే రేణుకా మాత బోనాల కార్యక్రమాలు ఘనంగా బొమ్మకల్ గ్రామంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈసంవత్సరం రేణుకా మాత ఆశీర్వాదంతో గౌడ కులస్తులు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలు అందించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో కరీంనగర్ మండలం అధ్యక్షులు బుస శ్రీనివాస్ గౌడ్, తిమ్మాపూర్ మండలం అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడ్, మానకొండూర్ నియోజకవర్గం ఇంచార్జి గోపాగోని నవీన్ గౌడ్, బొమ్మకల్ గ్రామ గౌడ సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
అమ్మ.. పేరులో ప్రేమని.. పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి అమ్మ అమ్మ. ప్రేమ అంత తీయన కనుకనే ఆ భగవంతుడు తనకు కూడా అమ్మ కావాలనుకున్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడు కూడా అమ్మ కడుపునే పుట్టాడు. అంత గొప్పది అమ్మ. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. త్యాగం. ప్రేమ కలిస్తే అందులో నుంచే అమ్మే పుట్టుకొస్తుంది. అమ్మకు ప్రత్యామ్నయం లేదు. అమ్మ ఉన్నచోట అదృష్టం పురివిప్పి ఆడుతుంది. ప్రపంచంలో కనిపించే భగవత్ స్వరూపులు తల్లిదండ్రులు.. ఇందులో మొదటి స్థానం అమ్మకే. అందుకే మాతృదేవోభవ అంటూ కొనియాడుతుంటారు. కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవలసిన బాధ్యత బిడ్డలందరిపైనే ఉంది. అందుకోసమే ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటూ అమ్మను గౌరవించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారాన్ని మాతృ దినోత్సవం గా జరుపుకుంటున్నాం. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా జన్మించిన తల్లిని ఆరాధిద్దాం.. పూజిద్దాం..
రామాయంపేట మే 10 నేటి ధాత్రి (మెదక్)
తను పునర్జన్మనేత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే తన్యమిచ్చి ఆకలి తీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వ పెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే ఆమె ప్రేమ ఈ జగాన్ని మురిపింప జేస్తుంది. ఆ పదానికి అంతటి మహాత్మామ్యం ఉంది. అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు. మన పెద్దలు ప్రపంచంలో కనిపించే భగవత్ స్వరూపులు తల్లిదండ్రులు.. ఇందులో మొదటి స్థానం అమ్మకే.. అందుకే మాతృదేవోభవ అంటూ కొనియాడుతుంటారు. తల్లిదండ్రులను గౌరవించని వారు వాడు సమాజాన్ని కూడా గౌరవించడం లేదు.. అందుకే కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవలసిన బాధ్యత బిడ్డలందరి పైన ఉంది. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా జన్మనిచ్చిన తల్లిని ఆరాధిద్దాం.. పూజిద్దాం..
పొగబారిన బతుకుతో ప్రేమను పంచుతూ…
A templeless god..mother..
-బతుకు చక్రం నడుపుతున్న మర్కు సంతోష.
కడుపున పుట్టిన కన్నవారే ఆనందంగా భావిస్తూ తన మాతృత్వాన్ని పంచుతూ రోజంతా బీడీలు చుడుతూ బతుకు చక్రాన్ని నడుపుతున్న మాతృమూర్తి రామాయంపేటకు చెందిన మర్కు సంతోష, తాళికట్టిన భర్త మర్కు సత్యనారాయణ మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని వెళ్లధీస్తుండగా 2017లో రోడు ప్రమాదం రూపంలో భర్త ప్రాణాలు హరించింది. దీంతో ఒక్కసారిగా ఒంటరితనంతో పాటు కండ్లముందు చిన్నారులైన ఇద్దరు కుమారులు కండ్లముందు మెదిలారు. ఎలాగైనా వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని భావించి తన ఇద్దరు కన్న వాళ్లకు ఎలాంటి లోటు రాకుండా కాపాడుతుంది. మాతృ దినోత్సవం సందర్భంగా చిన్నారులు తన తల్లి పడుతున్న కష్టానికి ఫలితంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రామాయంపేట కు చెందిన మేస్త్రి దుర్గయ్య కాయ కష్టంతో సంపాదించిన దాంట్లో తృప్తిగా జీవితం సాగిస్తున్న సమయంలో అనారోగ్యంతో 2011లో మృతి చెందాడు. దీంతో కుటుంబవారం భార్య ప్రమీల మీద పడింది. తను బీడీలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. కొడుకు వెంకటేష్ ను చదివించలేక పోవడంతో ప్రస్తుతం కూలీ పనులకు వెళుతున్నారు. పెద్ద కూతురు సింధుజ మానసిక దివ్యాంగురాలు నడవలేక కుర్చీకే పరిమితమైంది. చిన్న కూతురు శిరీష ఇంటర్ చదువుతుంది తన పిల్లలు ఎవరికి భారం కాకుండా తన రెక్కల కష్టంతో వారి కడుపును నింపుతున్న ప్రమీలకు అభినందనలు తెలపాల్సిందే..
A templeless god..mother..
కుటుంబం భారమై అన్ని తానై మాతృత్వానికి నిదర్శనం.. మర్కు భాగ్య రామాయంపేట..
జీవితాంతం తోడుండాల్సిన భర్త గుండెపోటు తో మరణించడం తో అన్ని తానై.. తనువు పుండై తన కూతుర్లను ఉన్నత స్థాయిలో ఉంచాలని పరితపిస్తుంది మాతృమూర్తి వరకు భాగ్య. మెదక్ జిల్లా రామయంపేట పట్టణానికి చెందిన మరుకు భాగ్య భర్త మరుకు శ్యామ్ రాజ్ 2024లో గుండెపోటుతో మృతి చెందాడు. భర్త చనిపోయే సమయంలో ఇద్దరి కూతుర్లు చిన్న వయసు ఉండడంతో తండ్రి లేని లోటు తీర్చుతూ తాను బీడీలు చుడుతూ కూతుర్లను ఉన్నత చదువులు చదివిస్తుంది. చిన్న వయసులో భర్త చనిపోయి కూతుర్ల పోషణ చదువు తన భుజాన వేసుకుని వారిని ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసేలా భాగ్య పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. తన తనువు పుండైన కూతుర్ల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న మాతృమూర్తి మర్కు భాగ్యకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..
A templeless god..mother..
మ్యాప్ – రామాయంపేట : తను పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ఆమె ప్రేమ ఈ జగాన్ని మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్మ్యం ఉంది. అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంటారు మన పెద్దలు. ప్రపంచంలో కనిపించే భగవత్ స్వరూపులు తల్లిదండ్రులు.. ఇందులో మొదటిస్థానం అమ్మకే. అందుకే మాతృదేవోభవ అంటూ కొనియాడుతుంటారు. తల్లిదండ్రులను గౌరవించని వాడు సమాజాన్ని కూడా గౌరవించడం లేదు.. అందుకే కన్నతల్లిని కంటికిరెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత బిడ్డలందరిపైనా ఉంది. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా జన్మనిచ్చిన తల్లిని ఆరాధిద్దాం… పూజిద్దాం.
కుటుంబం భారమై.. అన్నీ తానై
మాతృత్వానికి నిదర్శనం.. సజ్జెనరలక్ష్మీ, శివ్వంపేట
జీవితాంతం తోడుండాల్సిన భర్త ఆకాల మరణం చెందడంతో అన్నీ తన కొడుకులను తానై.. తనువు పుండై
ఉన్నత స్థాయిలో ఉంచాలని పరితపిస్తుంది. మాతృమూర్తి వజ్జెవరలక్ష్మి, నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన వజ్జె వరలక్ష్మి భర్త వెంకటేశం డిసెంబర్ 2004లో చనిపోయాడు. భర్త చనిపోయే సమయంలో పెద్ద కొడుకు హనుమంతు వయస్సు 8 సంవత్సరాలు, చిన్న కొడుకు సాయికిరణ్ నాలుగేళ్ళ వయస్సు, అప్పటి నుండి తండ్రిలేని లోటు తీర్చుతూ తాను వ్యవసాయం చేస్తూ కొడుకులను ఉన్నత చదువులు చదివించింది. ప్రస్తుతం పెద్ద కుమారుడు హనుమంతు డిగ్రీ పూర్తి చేసి ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అలాగే గచ్చిబౌలిలో ఫైనాన్స్ కన్సల్టెంట్ గా పనిచేసుకుంటున్నాడు. చిన్న కొడుకు సాయికిరణ్ డిగ్రీ చదువుతున్నాడు. చిన్న వయస్సులో భర్త చనిపోయి కొడుకుల పోషణ, చదువు
కన్నవాళ్ళకు ఎలాంటి లోటురాకుండా కాపాడుతుంది. మాతృ దినోత్సవం సందర్భంగా చిన్నారులు తన తల్లి పడుతున్న కష్టానికి ఫలితంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాయకష్టంతో సంపాదించిన దాంటో తృప్తిగా జీవితం సాగిస్తున్న సమయంలో అనారోగ్యంతో
2011లో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం భార్య ప్రమీల మీద పడింది. తాను బీడీలు చేస్తూ కుటుంబాన్ని నెటుకొస్తుంది. కొడుకు వెంకటేశు చదివించలేక పోవడంతో ప్రస్తుతం అతను కూలీ పనులకు వెళ్తున్నాడు. పెద్ద కూతురు సింధూజ మానసిక దివ్యాంగురాలు. నడవలేక కుర్చీకే పరిమితమైంది. చిన్నకూతురు శిరీష ఇంటర్ చదువుతుంది. తన పిల్లలు ఎవరికి భారం కాకుండా తన రెక్కల కష్టంలో వారి కడుపులు నింపుతున్న ప్రమీలకు అభినందనలు తెలపాల్సిందే.
కుమారులు
మర్కు సిద్దార్థ. మర్కు నందులకు చదువు సంధ్యలు నేర్పిస్తుంది. ఉన్న ఒక్క గూడుతో ఎలాంటి అస్తిపాస్టులు లేకున్నా రోజంతా బీడీలు చుడుతూ పిల్లల చదువుకు వెచ్చిస్తుంది. కుమారులతో పాటు అరు సంవత్సరాల కూతురు కూడా ఉండడంతో ముగురి భవిష్యత్తును భుజాన వేసుకుంది. సంపాదన కుటుంబ పోషణకే సరిపోకున్నా తన
పత్రికా వేలేఖరి తల్లీ పార్థివదేహానికి చిలువేరు సమ్మి గౌడ్ నివాళులు
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కూన శ్రీను, సతీష్ ల మాతృమూర్తి సరోజన మరణించగా వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఘన నివాళులర్పించారు.సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి వారిని ఓదార్చి మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో కొండేటి కళాధర్,ఎసల్ల సత్యనారాయణ, మోరపాక జగన్, చంద్రగిరి వంశీకృష్ణ, గాజుల రవి, కమటం స్వామి కొంతం రవి తదితరులు ఉన్నారు.
దుర్గమ్మ తల్లి పండుగ మహోత్సవంలో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళి నాయక్
కేసముద్రం/ నేటి ధాత్రి
మంగళవారం కేసముద్రం మండలం కేంద్రంలో సప్పిడి గుట్ట తండా దుర్గమ్మ తల్లి పండుగ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా.భూక్యా మురళి నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మురళీ నాయక్, మాట్లాడుతూ.. అమ్మ వారి ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి మరియు గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తాం అని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి,డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, ఇనుగుర్తి మండల అధ్యక్షులు సతీష్ మాజీ జడ్పిటిసి బండారి వెంకన్న, మాజీ టీపీసీసీ సభ్యులు దస్రు నాయక్, మాజీ సర్పంచ్ ముదిగిరి సాంబయ్య మాజీ ఎంపీటీసీ బానోత్ బద్రి నాయక్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు తరాల వీరేష్ యాదవ్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, లింగాల నేతాజీ, దామరి అశోక్,మండల నాయకులు,డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
*గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన సినీ నటుడు సప్తగిరి తల్లి చిట్టమ్మ..
*సినీ నటుడు సప్తగిరి నివాసానికి వెళ్లి పరామర్శించిన..
*ఎమ్మెల్యేలు పులివర్తి నాని మురళి మోహన్..
తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 11:
తిరుపతి రూరల్ మండలం ఓటేరు పంచాయతికి చెందిన సినీ నటుడు సప్తగిరి తల్లి చిట్టమ్మ గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం నాడు సినీ నటుడు సప్తగిరి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యేలు పులివర్తి నాని మురళి మోహన్ అనంతరం సప్తగిరిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని తెలిపిన ఎమ్మెల్యేలు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో యాదవ సంఘం కమిటీ ఆధ్వర్వంలో శ్రీగంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ నూతన ఆలయ నిర్మాణానికి మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ను బుధవారం మరిపెడ మండలం బీచ్ రాజుపల్లి గ్రామంలో యాదవ సంఘం కమిటీ సభ్యులు కలిసి సహాయ సహకారాలు అందించాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన గుడిపూడి నవీన్ రావు గుడి నిర్మాణానికి రూ.30 వేలు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా గుడిపూడి నవీన్ రావుని యాదవ సంఘం కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ కొమ్ము నరేష్,కొమ్ము చంద్రశేఖర్,కోడి శ్రీకాంత్,వల్లపు లింగయ్య, కొమ్ము లింగయ్య,కొమ్ము ఉప్పలయ్య, కొమ్ము ఐలయ్య,కోడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.