కార్మిక చట్టాల పరిరక్షణపై ఉద్యమించాలి.

కార్మిక చట్టాల పరిరక్షణపై ఉద్యమించాలి

సివిల్ సప్లై హామాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుంపెల్లి మునీశ్వర్

కేసముద్రం నేటి ధాత్రి:

ఏఐటియూసి అనుబంధ సివిల్ సప్లై హామాలి వర్కర్స్ యూనియన్ మహబూబాబాద్ జిల్లా మహాసభ వడ్డెబోయిన లక్ష్మీనరసయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా స్టేట్ సివిల్ సప్లై హమాలీ రాష్ట్ర అధ్యక్షులు గుంపల్లి మునిశ్వర్, ఏఐటీయూసీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బి. అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని అన్నారు. సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను కుదించి, కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు చెప్పిన ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యల వారధిగా ఉంటూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యవసర వస్తువులను సరఫరా చేస్తున్న కార్మికులను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని వారు అన్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా కూలి రేట్లు లేవనీ, హమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు రేషపల్లి నవీన్, మంద భాస్కర్, చొప్పరి శేఖర్,కాసు సాయి చరణ్,పెరుగు కుమార్,వీరవెల్లి రవి, వంకాయలపాటి జకరయ్య,రాజబోయిన శ్రీను, భానోత్ రాజు, ఎల్లుట్ల నారాయణ, అల్లరి నారాయణ, కొనుకటి మల్లారెడ్డి వెలిశాల ప్రభాకర్, సరిత తదితరులు పాల్గొన్నారు.

పెషా, 1/70 చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి..

పెషా, 1/70 చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి..

ఆపరేషన్ కగార్ నిలుపు దల చేయాలి.

ప్రభుత్వాలు పార్లమెంట్ చట్టాలను కాపాడాలి…

ఏజెన్సీ లో ఆదివాసీలను భయబ్రాతులకు గురించి చేయకండి.

ఆదివాసీ సంక్షేమ పరిషత్, ములుగు జిల్లా అధ్యక్షులు, తాటి నాగరాజు.

నూగూర్ వెంకటాపురం
నేటి ధాత్రి / మే 1 ములుగు జిల్లా

 

 

వెంకటాపురం మండల కేంద్రంలో గురువారం నాడు వెంకటాపురం మండలం కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా కొమరం భీం విగ్రహం దగ్గర ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో బొగ్గుల సమ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు తాటి నాగరాజు గారు పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన ప్రదేశాల్లో ఆదివాసీలు ఇల్లు కట్టుకొని నివాసాలు ఏర్పాటు చేసుకుని సహజసిద్ధమైన అడివిలో దొరికే పండ్లు కాయలు మందులు లేని వ్యవసాయం చేసుకో నీ పండిన టువంటి పంటలు తిని జీవితాన్ని గడుపుతున్న ఆదివాసీలు ఇప్పుడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు లను ఏరివేత పేరుతో తెలంగాణ రాష్ట్ర భూభాగంలో కర్రి గుట్టల ప్రాంతంలో కేంద్ర బలగాల తో కగా ర్ ఆపరేషన్, హెలికాప్టర్ ద్వారా బాంబుల వర్షం కురిపించడం వలన ఎప్పుడు ఏమి జరుగుతుందో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కర్రీ గుట్టలో చేపట్టిన కగార్ ఆపరేషన్ ను నిలుపుదల చేసి ప్రశాంతమైన వాతా వ ర ణ నీ నెలకొల్పాలని తాటి నాగరాజు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నూగు రు వెంకటాపురం,వాజేడు మండలాలు భూభాగం ఛ త్తీస్ ఘడ్ రాష్ట్రం ఆనుకొని దట్టమైన అడవి గుట్టలు కొండలు కలిగి వి స్తీ ర్ణ మైన భూభాగం కలిగిన కర్రి గుట్టలు లో ఖనిజ సంపద కలిగి ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని కార్పొరేట్ల కంపెనీల బడా బాబు లు ఆ దాని అంబానీ లకు దోచి పెట్టడానికి ఏజెన్సీ ప్రాంతంలో పేసా చట్టం అడవి హక్కుల చట్టాలు ఎల్ టి ఆర్ 1/70 చట్టాలు పార్లమెంట్ లో చేసినటువంటి చట్టాలను ఉల్లంఘించి ఈ ప్రాంత భూభాగాన్ని కొల్ల గొట్ట డానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుందని తాటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా గౌరవ అధ్యక్షులు పీర్ల మల్లి ఖా ర్జు న్ రావు గారు శ్యామల వెంకటేశ్వర్లు బొగ్గుల సమ్మయ్య ఉ యి క గోపి శ్యామల వంశి కణితి శేషు సోడి సారయ్య శ్యామల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు…

ప్రభుత్వ పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు…

●సీనియర్ సివిల్ జడ్జి సూరి కృష్ణ,

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం ప్రభుత్వ పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలో గల జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో, కస్తూర్భా బాలికల విద్యాలయంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సూరి కృష్ణ నిర్వహించి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించి, సూచనలు చేశారు. న్యాయమూర్తి న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతీ విద్యార్ధి చదువుతోపాటు సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు నిత్యజీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురుకాకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలువస్తే వాటిని అధిగమించడానికి చట్టాలు తొడ్పాడుతాయని సూచించారు. కార్యక్రమంలో నిజజీవితంలో చట్టాల ఉపయోగం, సైబర్ క్రైమ్, సమాచార హక్కు చట్టం, మోటారు వాహనాల చట్టం, బాలకార్మిక నిర్మూలన చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, జువైనైల్ జస్టిస్ యాక్ట్, ఉచిత న్యాయసేవా సహాయంపై విద్యార్థులకు తెలియజేసారు. విద్యార్థులందరూ చట్టాలను గౌరవించాలని సూచించారు. ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ గోపాల్ , వైస్ ప్రెసిడెంట్ మానెన్న సీనియర్ న్యాయవాది పాండురంగా రెడ్డి న్యాయ వాదులు రుద్రయ్య స్వామి సయ్యద్ షకీల్ లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version