స్కాలర్ షిప్ దరఖాస్తుల ఆహ్వానం….

స్కాలర్ షిప్ దరఖాస్తుల ఆహ్వానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, 2025-26 సంవత్సరానికి దివ్యాంగ విద్యార్థుల కోసం స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. శాఖ అధికారి లలితా కుమారి తెలిపిన వివరాల ప్రకారం, ప్రీ మెట్రిక్ (9, 10 తరగతులు), పోస్ట్ మెట్రిక్ (11, 12 తరగతులు), డిగ్రీ, పీజీ, డిప్లొమా వంటి కోర్సులలో చదువుతున్న విద్యార్థులు ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

దుగ్గొండి కేజీబీవి కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం….

దుగ్గొండి కేజీబీవి కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హెడ్ కుక్ -1,అసిస్టెంట్ కుక్ – పోస్ట్..

ఈ నెల 25 న దరఖాస్తుల చివరితేదీ

మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలం పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో కుక్కు పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం పలుకుతున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల కేజీబీవి పాఠశాలలో హెడ్ కుక్ పోస్టు, అసిస్టెంట్ కుక్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నామని పేర్కొన్నారు. ఈ రెండు పోస్టులకు 18 నుండి 45 సంవత్సరాలులోపు మహిళలు అర్హులని,సామూహిక వంటలో అనుభవం కల్గిఉండాలన్నారు.హెడ్ కుక్ పోస్టు కోసం పదో తరగతి పాస్ అయ్యి,స్థానిక మండలం వారు కావాలని తెలిపారు.అసిస్టెంట్ కుక్ పోస్టు కోసం స్థానిక దుగ్గొండి మండల వాసి అయ్యి ఏడవ తరగతి పాస్ అయి ఉండాలని వివరించారు. హెడ్ కుక్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థురాలు పదవ తరగతి మెమో, అసిస్టెంట్ కుక్ ఏడో తరగతి మెమో, కుల,నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ, ఆధార్, వంటల అనుభవం ధృవీకరణ పత్రం, పాస్ ఫొటోస్ తో సంబంధిత దరఖాస్తు ఫామ్ కు జతపరిచి ఈనెల 25 సాయంత్రం 4 గంటల లోపు మల్లంపల్లి లో గల కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం పాఠశాల ప్రత్యేక అధికారినికి అందజేయాలని మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలియజేశారు.

బడుగు బలహీన వర్గాలకు అండగా సీఎం సహాయనిధి…

బడుగు బలహీన వర్గాలకు అండగా సీఎం సహాయనిధి

◆:- టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బడుగు బలహీన వర్గాలకు సీఎం సహాయనిధి చాలా అండగా నిలుస్తుందని జ్యోతి పండాల్ అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల్లో కోట్లల్లో డబ్బులు పెట్టుకొని వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా కొంతవరకైనా లబ్ధి పొందవచ్చు అని టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ అన్నారు.
మొన్న వరంగల్లో టిఆర్పి పార్టీ అధ్యక్షులు శ్రీ తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో జరిగిన టిఆర్పి రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు పేద ప్రజలకి మా పార్టీ అధికారంలోకి వస్తే, ఉచిత వైద్యం అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలన్న సంకల్పంతో మా పార్టీ అధ్యక్షులు వివిధ వర్గాల పేద ప్రజల కోసం సీఎం సహాయనిధి ద్వారా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము.కావున జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా ద్వారా సీఎం సహాయ నిధి కోసం అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను.

ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు.

ఉచిత ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ : దివ్యాంగులకు ఉచితంగా అందించే ఉపకరణాల కోసం దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు గడువు జులై 5 వరకు పొడిగించినట్లు తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు తెలిపారు. దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు, వ్యాపార వాహనాలు, వినికిడి పరికరాలు, వాకింగ్‌ స్టిక్స్, వీల్‌ఛైర్లు తదితర ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జులై 5 వరకు దరఖాస్తు గడువు ను ప్రభుత్వం పెంచినట్లు తెలిపారు. అర్హులైనవారు టీజీఓబీఎంఎంఎస్‌ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు గడువు ముగింపు.

ఏకలవ్య మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు గడువు ముగింపు

కొత్తగూడ నేటిధాత్రి:

మహబూబాబాద్ డివిజన్ లోని ( ఏకలవ్య గురుకుల మోడల్ రెసిడెన్సీయల్ స్కూల్ )కొత్తగూడ నందు ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు గడువు నేటితో ముగీయనున్నదని కొత్తగూడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ అజయ్ సింగ్ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో బైపీసీ ఎంపీసీ సీఈసీ ల ప్రవేశాల కొరకు అర్హత గల విద్యార్థులు మే 24 న నేటితో దరఖాస్తు ముగుస్తున్నందున విద్యార్థులు గమనించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్.!

తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు

పత్రికా ప్రకటన

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి) :

 

 

ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇంటర్ లో
2005- 26 . విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల, ఇందిరమ్మ కాలనీ (గా). పం). సిరిసిల్ల లో ST బాలికల నుండి ధరఖాస్తులు ఇహ్వానిస్తున్నామని ప్రాంతయ సమ్వన్వయ అధికారి D. S. వెంకన్న ఒక ప్రకటనలో
తెలియజేసారు. ఆసక్తి గల అభ్యర్ధులు కళాశాల నందు మే 16న నిర్వహించే కౌన్సిలింగ్ అన్ని ఓరిజినల్ (TC, బోనాఫైడ్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్, రెసిడెన్సి, డేట్అఫ్ బర్త్, మొదలగునవి మొగునని దృవీకరణ పత్రంలో పాటు, ఒక సెట్ జిరాక్స్ తీసుకొని వచ్చి అడ్మిషన్లు పొందవచ్చని, కళాశాల ప్రిన్సిపల్ తెలియజేశారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ : 9032170654, 8333925362

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version