ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్.. ఒక్క ఇన్నింగ్స్‌తో లెక్కలు మార్చేశాడు!

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్.. ఒక్క ఇన్నింగ్స్‌తో లెక్కలు మార్చేశాడు!

 

KL Rahul:నేటి ధాత్రి:

 

 

 

 

 

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేస్తున్నాడు. 5 టెస్టుల సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు దడ పుట్టిస్తున్నాడీ సీనియర్ ఆటగాడు.

ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధం అవుతోంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో ఈ సిరీస్‌లో టీమిండియా ఎలా ఆడుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. పేస్, స్వింగ్‌కు అనుకూలించే ఇంగ్లీష్ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంత సులువేమీ కాదు. ప్రస్తుత భారత జట్టులో ఈ వికెట్లపై ఆడిన అనుభవం ఉన్న బ్యాటర్లూ తక్కువే. దీంతో ఇంగ్లండ్‌ ఆధిపత్యం తప్పదని అనుకుంటున్న తరుణంలో స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేసే ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న టెస్ట్‌లో థ్రిల్లింగ్ నాక్‌తో అదరగొట్టాడు. సూపర్ సెంచరీతో ఆతిథ్య జట్టుకు హెచ్చరికలు పంపించాడు.

ఇది కదా కావాల్సింది..

ఇంగ్లండ్ లయన్స్‌తో పోరులో 168 బంతుల్లో 116 పరుగులు చేశాడు రాహుల్. ఇందులో 15 బౌండరీలతో పాటు 1 భారీ సిక్స్ ఉంది. ఇన్నింగ్స్ ఆసాంతం నింపాదిగా బ్యాటింగ్ చేశాడు రాహుల్. ఎలాంటి పొరపాట్లు, అలసత్వానికి తావివ్వకుండా ఆడాడు. ప్రతి బంతిని అంతే కచ్చితత్వంతో ఎదుర్కొన్నాడు. తొందరపాటుకు అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు రాహుల్. కరుణ్ నాయర్ (40)తో కలసి మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. నాలుగో వికెట్‌కు ధృవ్ జురెల్ (52)తో కలసి 121 పరుగుల భాగస్వామ్యం జతచేశాడు. ఇది చూసిన నెటిజన్స్.. తన ఫామ్, ఫిట్‌నెస్, మైండ్‌సెట్ ఎలా ఉందో రాహుల్ నిరూపించాడని మెచ్చుకుంటున్నారు. రాబోయే సిరీస్‌లో పరుగుల వర్షం కురిపిస్తానని చెప్పకనే చెప్పాడని అంటున్నారు. టీమిండియా బ్యాటింగ్‌కు ఇకపై అతడే మూలస్తంభం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లకు ఇక దబిడిదిబిడేనని చెబుతున్నారు.

ప్రభుత్వాలు మారిన పంపిణీకి నోచుకోని కుట్టు మిషన్లు.

ప్రభుత్వాలు మారిన పంపిణీకి నోచుకోని కుట్టు మిషన్లు.

పంపిణీ చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.

ఏ వై ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటి ధాత్రి :

గత ప్రభుత్వం హయాంలో అర్హులైన మహిళలకు కుట్టు
మిషన్లు పంపిణీ చేయకుండా రైతు వేదికలో ఉంచిన 60 కుట్టు మిషన్లు తుప్పు పట్టి పాడవుతున్నాయని వేంటనే తహాశీల్దార్ హేమ మహిళా దినోత్సవం రోజున అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ* చేయాలి.
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య* అన్నారు.
మంగళవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు వేదికలో ఉంచిన కుట్టు మిషన్లు పరిశీలించి అర్హులైన మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని తహాశీల్దార్ కార్యాలయంలో ఎంపీఎస్వో కి వినతి పత్రం అందజేయడం జరిగింది.
అనంతరం మల్లయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులైన మహిళలకు మండలంలో ఉన్న గ్రామాలల నుండి కొంతమందికి శిక్షణ ఇచ్చి కుట్టు మిషను ఇచ్చి వారి కుటుంబం అభివృద్ధి చెందడం కోసం కుట్టు మిషన్లు తెప్పించి రైతు వేదికలో ఉంచిందని మహిళలకు పంపిణీ చేయకుండా అది రైతు వేదికకే పరిమితం అయ్యిందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అర్హులైన మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తహశీల్దార్ హేమ చొరవ తీసుకుని తక్షణమే అర్హులైన మహిళలకు మహిళా దినోత్సవం రోజున కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల రైతు వేదికలో ఉన్న 60 కుట్టు మిషన్లు తుప్పు పట్టి పోతాయని అన్నారు. మహిళలు వీటి ద్వారా సాధికారత సాధించి అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ కుట్టు మిషన్లు పంపిణీ చేయడం వలన 60 కుటుంబాలను ఆదుకున్న వారిమి అవుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి మ్యాదరి సునీల్ మండల సహాయ కార్యదర్శి కనకం తిరుపతి కార్యవర్గం సభ్యులు పుల్యాల సురేష్ నద్దునూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version