పెబ్బేరు మండలం కంచిరావు పల్లి గ్రామానికి చెందిన ఆవుల నరేష్ తండ్రి ఆవుల నాగ శేషయ్య కు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రభుత్వం తరపున సోమవారం 1,50,000 విలువగల ఎల్ ఓ సి ని మెరుగు అయన వైద్య ఖర్చుల కోసం బాధితునికి హైదరాబాద్ లో తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు ఈమేరకు బాధితుడు ఎమ్మెల్యే మెగారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు
దేశ,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, తప్పనిసరి అవకాశం ఉన్నకాడ రిజర్వెన్లలోపోటీ చేయడానికి అవకాశం కల్పించాలని వికలాంగుల సంఘం నాయకుడు పుల్ల మల్లయ్య* కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులను కోరారు శమనవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో మల్లయ్య మాట్లాడుతూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు అన్ని రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తూన్నాయని అన్నారు . ఈ ప్రభుత్వాలు కొత్త పించలు సంక్షేమ పథకాలు, , అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు , భూమి కొనుగోలు పథకాలు వికలాంగులకు రావలసిన అనేక పథకాలలో అన్యాయం జరుగుతుందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బంధులను, అవస్తలను ప్రభుత్వాలు గుర్తించి 5% శాతం రిజర్వేషన్లు కల్పించారని ,త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ 5 శాతం రిజర్వేషన్లు సంబంధించిన కేంద్ర , రాష్ట్ర జిల్లా ఎన్నికల అధికారులు అమలు చేసి వికలాంగుందరికి అవకాశం కల్పించాలని కోరారు
ఐటీడీఏ ద్వారా గిరిజన కుటుంబాలకు అదనంగా మంజూరు అయిన 280 ఇళ్లను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి అర్హులైన ఎస్టీ కుటుంబాలకు మజురు చేయాలిని అల కాకుండా అధికార పార్టీ నాయకుల అనుచరులకు కానీ కమిటీలు సూచించిన లిస్ట్ ప్రకారం అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తే బిఆర్ఎస్ పార్టీ తరుపున కచ్చితంగా నిలదీస్తాం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా వెనకడబోము అని బిఆర్ యస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ ఎస్టీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు తుర్రం రవి కారం కన్నారావు తెలియజేసారు మొదటి విడతలో అధికార పార్టీ నాయకులే బహిరంగంగా లబ్ధిదారుల జాబితాలో కొంతమంది అనర్హులకు ఇల్లు కేటాయించారు అని విమర్శలు చేసుకున్న ఇళ్లు ఉన్న వారికే ఇళ్లు కేటాయించిన అధికారులు ఏమి పట్టనట్టే వున్నారు కనీసం ఈసారైనా మండలంలో వున్న నిరుపేద ఎస్టీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి అని బిఆర్ఎస్ పార్టీ తరుపున అధికారులకు తెలియజేస్తున్నామని ఈ విషయంలో గిరిజన నాయకులు కూడా కలిగించుకొని బీద గిరిజనులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నామని పత్రికా ప్రకటనలో తెలిపారు
విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలి -విద్యార్థులకు బ్యాగ్స్,పుస్తకాలు,ఆట వస్తువులు పంపిణీ -ఆధార్ స్వచ్ఛంద సంస్థ అభినందనీయం -కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు
విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు ఉజ్వల భవిష్యత్తు అందించాలని కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు అన్నారు. గురువారం ‘గూంజ్ సంస్థ సహకారంతో ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు’తోలెం రమేష్ ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని గొల్లగూడెం,కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బ్యాగ్స్,నోటు పుస్తకాలు,ఆట వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై పివిఎన్ రావు మాట్లాడుతూ…. ప్రభుత్వ పాఠశాలలో అనుభవిజ్ఞాన ఉపాధ్యాయులు అభ్యసించడం వలన విద్యార్థులు ప్రతి రంగంలో ముందుంటున్నారు.విద్యార్థులు మంచి మార్గంలో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.సమాజ సేవలో ఎనలేని సంతృప్తి దాగివుంటుందని ప్రతీ ఒక్కరూ భాగ్యస్వాములు కావాలని పేర్కొన్నారు.విద్యార్థుల కోసం ఆధార్ స్వచ్ఛంద సంస్థ చేసిన సేవ అభినందనీయమని ప్రసంసించారు.ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు ఎస్సై గారు సంస్థ నిర్వహకులు రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటర్లు విజయ్,సురేష్,ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరావు,రాధ,శ్రీను,సంస్థ సభ్యులు బట్ట బిక్షపతి,గుడ్ల రంజిత్,ఇర్ప కుశేలుడు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
రైతులందరికీ సకాలంలో యూరియా కొరత లేకుండా అందించాలని గురువారం గుండాల తహసిల్దార్ రంగు రమేష్ కు వినతి పత్రం ఇచ్చి ప్రాథమిక సహకార పరపతి సంఘం(పిఎసిఎస్)ముందు సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టి పంటలు వేస్తే ఆ పంటలకు మందులు వేయాలంటే యూరియా కొరత తీవ్రంగా ఉందని జిల్లా వ్యవసాయ శాఖఅధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. రోజుల తరబడి ప్రాథమిక సహకార పరపతి సంఘం (పిఎసిఎస్) ముందు క్యూలో నిలబడాల్సి వస్తుందని అయినా యూరియా దొరకడం లేదని వాపోయారు.ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పటికీ రైతులకు యూరియా అందించటంలో పూర్తిగావిఫలమయ్యారని అన్నారు.ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి యూరియా కొరత తీర్చకుంటే త్వరలో జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు యాసారపు వెంకన్న, పర్శక రవి,ఈసం కృష్ణన్న, మానాల ఉపేందర్, వాగబోయిన సుందర్ రావు, ఈసం మల్లయ్య, రైతులు పాల్గొన్నారు.
‘ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి’
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ-జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మ్యాతారి మహేందర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ప్రతి 30 మందికి ఒక బస్సు ఏర్పాటు చేసి స్కూలుకు తీసుకెళ్లాల్సిందిగా కోరారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐఎఫ్ డిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు అన్నారు.గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ , ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.మార్త నాగరాజు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న విద్యాసంస్థల్లో సమస్యలు పేరుకుపోయాయని,విద్యాశాఖ అధికారులు , ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యల సాధన కోసం కృషి చేయాలని కోరారు.డివిజన్ కేంద్రంలో ఉన్న ఎస్సి,ఎస్టీ,బీసీ మైనారిటీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గర్ల్స్ కన్వీనర్ గణిపాక బిందు,జిల్లా కమిటీ సభ్యులు సాగర్ ,అజయ్ తదితరులు పాల్గొన్నారు.
చర్చలకు తమ వంతు ఆర్థికసాయం అందజేసిన బొల్లారం రత్నం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో నూతనంగా నిర్మిస్తున్న చర్చీలకు దేవుని ప్రేమనుబట్టి మన బొల్లారం,రత్నం తమ వంతు ఆర్థికసాయం అందజేయడం జరిగింది. అల్గోల్,ఖానాపూర్,బిడెకన్య ,ఇటికేపల్లి,ఈదులపల్లి,జహీరాబాద్,మహేంద్ర కాలనీ,తుమ్మన్ పల్లి ఏడాకులపల్లి,హత్నూర,కుప్పనగర్.ఇట్టి గ్రామాలకు దేవుని ప్రేమనుబట్టి వివిధ గ్రామ సంగ కాపరులకు అందజేయడం జరిగింది రత్నం మాట్లాడుతూ ఇంకా రాబోయే కాలంలో దేవుని ప్రేమఅనుబట్టి ఇంకా కొన్ని సంగాలకు కూడా సహకారం అందిస్తాను అని సానుకూలంగా స్పందించి తన ప్రేమను తెలియజేశారు ఇట్టి కార్యక్రమములో వివిధ గ్రామాల నాయకులు పాల్గొనడం జరిగింది.
ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి
ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దూడపాక రాజు
మొగులపల్లి నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 22 లక్షల మంది పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 60% విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్న వారు.
కాబట్టి, ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో & ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు ఏర్పాటు చేసి విద్యార్థులను స్కూల్స్ కు తీసుకెళ్లాలి. దీని ద్వారా వారి సమయం, శక్తి వృధా కాకుండా ఉంటుంది. చదువుపై మరింత శ్రద్ధ పెడతారు, ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి. కొంత మేరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది.
తప్పకుండా ఈ డిమాండ్ ను నెరవేర్చాలని మీ ద్వారా తెలంగాణ | రాష్ట్ర ప్రభుత్వానికి BC, SC, ST JAC తరపున డిమాండ్ చేస్తున్నాం. లేని క్రమంలో ప్రభుత్వంపై అనేక రకాలుగా దశలవారీగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో స్త్రీలకు ఏ విధంగా అయితే ఉచిత బస్సు అందించారు అదేవిధంగా స్థానిక ప్రభుత్వ స్కూలు ప్రైమరీ, ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు గ్రామాల నుండి పాఠశాల వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని మరొక విధంగా దీనిని సెమీ రెసిడెన్షియల్ గా అనుకోవచ్చు. అలాగే పిల్లలకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ తో వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు దూడపాక రాజు ఉపాధ్యక్షులు బండారి కుమార్ ధర్మ స్టూడెంట్స్ యూనియన్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ దూడపాక శ్రీక్రిష్ణ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు శ్రీధర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు
కార్పొరేట్, ప్రైవేటు విద్య సంస్థల ఫీజు దోపిడీని అరికట్టాలి
విద్యాసంస్థల్లో స్టేషనరీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలి
గుండాల మండల కార్యదర్శి గడ్డం వరుణ్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
మండల లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మౌలికవసతులు కల్పించాలని,ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలి. ఫీజు దోపిడీని అరికట్టాలినీ, విద్యాసంస్థల్లో స్టేషనరీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలినీ డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఏంఈఓ కి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గుండాల మండల కార్యదర్శి వరుణ్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం పున ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నసందంగా కనిపించడం బాధాకరం అని అన్నారు. తక్షణమే పాఠ్యపుస్తకాలు యూనిఫాంలో విద్యార్థులకు అందజేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కొన్నిచోట్ల అరకొర వసతులు మాత్రమే ఉన్నాయని సరిపడ గదులు లేక విద్యార్థుల అవస్థలు పడుతున్నారని . ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునిస్తామని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో తరుణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా జేఏసీ కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26వేలపైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.
వీరిలో 90% విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్నవారు.కాబట్టి ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేసి, విద్యార్థులను స్కూల్స్ కు తీసుకెళ్లాలి. దీని ద్వారా వారి సమయం, శక్తి వృధా కాకుండా ఉంటుంది చదువుపై మరింత శ్రద్ధ పెడతారు, ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి.
ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల భారం మోయలేనటువంటి పరిస్థితి, అదే విధంగా ఇప్పుడు వర్షాకాలం సీసన్ గనుక ఒకవేళ వర్షం పడితే స్కూల్ కి వెళ్లలేనటువంటి పరిస్థితి మరియు చిన్నపిల్లలకు బుక్స్ మోయడం భారం అవుతుంది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.కొంతమేరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది తప్పకుండా ఈ డిమాండ్ ను నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో భీమనాధుని సత్యనారాయణ బిసి సంఘం జిల్లా అధ్యక్షులు, వైనాల శోభన్ బాబు రజక సంఘం, వైనాల శంకర్ రజక సంఘం, సంతోష్ ముదిరాజ్ సంఘం, ముత్యాల రవికుమార్ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, మరియు ధర్మ స్టూడెంట్ యూనియన్ జిల్లా కన్వీనర్ దూడపాక శ్రీకృష్ణ, జేఏసీ సభ్యులు మంద రమేష్, కండె రవి బొజ్జ పెళ్లి మహర్షి, పుల్ల అశోక్, కుర్రి స్వామినాథన్, దూడపాక రాజు నేరెళ్ల రమేష్ పర్లపల్లి కుమార్ దాసరపు భాస్కర్, మట్టవాడ కుమార్, లాపాక రవి, ఎంజలా శ్రీనివాస్, పందిళ్ళ రమేష్,గుండ్ల రాజకుమార్,సంజీవ్ పాల్గొన్నారు.
పేద పిల్లలకు ప్రవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్యను అందించాలి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం వద్ద ప్రైవేటు పాఠశాలల్లో విద్య హక్కు చట్టం ప్రకారం బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు 25% ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లో పొందుపరిచిన ఆర్టికల్ 12 (1) సి విద్య హక్కు చట్టం ప్రకారం 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలని రాశారు కేంద్ర ప్రభుత్వం 2009 నుండి అమలులోకి తేవడం జరిగింది ఈ విద్య హక్కు చట్టాన్ని ప్రతి ప్రైవేటు పాఠశాల బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు కట్ల శంకరయ్య దూడపాక దుర్గయ్య అంబేద్కర్ వాదులు ఇమ్మడి వెంకటేశ్వర్లు దూడపాక శ్రీనివాస్ మైనార్టీ సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి సైదుల్ గడ్డం సదయ్య చిలువేరు దయాకర్ ఊరడి మురళి రత్నం రామకృష్ణ శనిగరపు ఆనందం ఎండి లాలు పాల్గొన్నారు
జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి:
ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ చాంబర్ లో ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల సౌకర్యార్థం కనీస మౌలిక సదుపాయాలు కల్పనపై విద్యా, టిజిడబ్ల్యూఐడిసి ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు కల్పనకు జిల్లాలోని 5 జూనియర్ కళాశాలలకు 41.07 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఇట్టి నిధులతో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రతిపాదనలు అందచేయాలని ప్రిన్సిపాల్స్ ను ఆదేశించారు. ఈ నిధులతో సివిల్ మరమ్మతులు, ఎలక్ట్రికల్, మంచినీరు, పారిశుధ్య కార్యక్రమాలు వంటి సదుపాయాలపై ఫోకస్ చేయాలని, ఇట్టి పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకన్న డీఈఓ రాజేందర్ టీజడబ్ల్యూఐడిసి డిఈ రామకృష్ణ ఏఈ మహేందర్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.
దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మెన్ బాడిశ నాగరమేష్ ఆర్ధిక సహాయం
మంగపేట నేటిధాత్రి:
ములుగు జిల్లా మంగపేట మండలం ప్రొద్దుమూర్ గ్రానానికి చెందిన బద్ది పాపారావు ఇటీవల రోడ్ ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబం తీవ్ర దుఃఖం లో వున్నారు.రోజు వారి పనులకు వెళ్లి జీవనం సాగించే ఇంటి పెద్ద అనుకోని ప్రమాదం లో చనిపోవడం ,మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉండటం ఏం చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్న వారి కుటుంబ పరిస్థితి ని స్థానికులు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారికి తెలియజేయగా దశదినకర్మల నిమిత్తం (4000 రూపాయలవిలువైన)50 కేజీల బియ్యం,నిత్యవసర సరుకులు స్థానికులు చే వారి కుటుంబానికి అందజేశారు.అడగగానే సహాయం అందజేసిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ కు మరియు ట్రస్ట్ సభ్యులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియచేసారు .ఈ కార్యక్రమంలో మాను పెళ్లి. వేణు,కలల రాంబాబు,గుగ్గిల సురేష్,బద్ది రఘుబాబు,మానపల్లి రోహిత్. బద్ది సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ బాధితునికి ఫోన్ అందించిన పోలీసులు
జైపూర్ నేటి ధాత్రి:
shine junior college
జైపూర్ మండలం ఇందారం దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న బానోతు సురేష్ జూన్ 5వ తేదీన తన మొబైల్ ఫోన్ ఎక్కడో పోయినట్లు తెలిపారు. ఆందోళన చెందిన బాధితుడు జైపూర్ పోలీస్ స్టేషన్ లో జూన్ 13వ తేదీన తన మొబైల్ ఫోన్ పోయిందని దరఖాస్తు ఇవ్వగా పోలీస్ వారు సిఈఐఆర్ పోర్టల్ కంప్లైంట్ నమోదు చేసుకొని ట్రేస్ చేసి తన మొబైల్ 17వ తేదీ మంగళవారం బానోత్ సురేష్ కి జైపూర్ పోలీసులు అందజేయడం జరిగింది.ఎవరి ఫోను చోరీకి గురైన ఎక్కడైనా ఫోన్ మిస్సయిన ఆందోళన చెందకుండా సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా తమ మొబైల్ ఫోన్ తిరిగి పొందే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామానికి చెందిన బంధు ప్రవీణ్ అనే యువకుడు ప్రమాదంలో గాయపడి భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లి యువకుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొని తనవంతుగా ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన బంట్రోజు లక్ష్మీపతి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి బియ్యం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి పరామర్శించి నా వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందచేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారుఈ o దుకుగాను వారి కుటుంబ సభ్యులు బియ్యం అందజేసినందుకు గాను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల ఎఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. కృష్ణారెడ్డి. తిరుపతి. మనోజ్ శ్రీనివాస్ గౌడ్. నర్సింలు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం వెంటనే అమలు చేయాలని మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు సివిల్ స్కోర్ ఎలాంటి షరతులు విధించకుండా అర్హులైన వారికి పథకము అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు మాత్రమే కేటాయించాలని,అనర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బాల్యమిత్రులు ..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:-
చిన్ననాటి కాలంలో వారితో పాటు చదువుకున్న మిత్రుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి తోటి విద్యార్థులు గురువారం ఆర్థిక సహాయం అందజేశారు. పొత్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సరంలో వారితోపాటు విద్యను అభ్యసించిన ఎనగందుల రాజు ఇటీవల మల్లయ్య పల్లె గ్రామంలో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అప్పట్లో రాజు తో చదువుకున్న మిత్రులందరూ రాజు కుమార్తె పేరు మీద ఉన్నత చదువులు కొరకు రూ. ఇరవై ఐదు వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడిదుల రవీ గుండ్లపల్లి శ్రీనివాస్ వంగ కుమార్ గడ్డం ఉపేందర్ ఐలయ్య రవి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చుడాలి
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి : ఏఐఎస్ఎఫ్
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్
కరీంనగర్, నేటిధాత్రి:
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈవో) మొండయ్యకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరించిందని రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు కొమ్ము కాస్తుందని తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువు అందని ద్రాక్షలా మారుతుందని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు వూర్తిస్థాయిలో అందివ్వాలని పాఠశాలలో సబ్జెక్టు వైస్ గా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు మరియు స్కావెంజర్ పోస్టులు, ప్రతి పాఠశాలకు గ్రంథాలయం, డిజిటల్ క్లాసులకు అవసరమయ్యే ఎక్విప్మెంట్స్ మరియు ఎన్విరాల్న్మెంట్, ఎక్విప్మెంట్స్ పెంచుకునేందుకు ప్రతి పాఠశాలకు జిల్లా వ్యాప్తంగా సరిపడ గ్రాండ్స్ విడుదల చేయాలని అన్నారు. జిల్లావ్యాప్తంగా కొన్ని పాఠశాలలో కనీసం టాయిలెట్స్, పాఠశాల కాంపౌండ్ వాల్, కరెంటు, వాటర్ సదుపాయం కల్పించాలని అదేవిధంగా కాలిగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని, ఈఅంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకాన్ని కల్పించేలా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని రమేష్ హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర్ నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, మచ్చ పవణ్, సాయి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.