ప్రభుత్వాలు మారిన పేదల బతుకులు అంతే.

ప్రభుత్వాలు మారిన పేదల బతుకులు అంతే

◆ 70 ఏళ్లుగా పూరిగుడిసెల్లోనే జీవనం కొనసాగింపు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. గడిచిన 18 నెలల అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాను విడుదల చేశారు. అందులో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను ఎంపిక చేసిన ఇల్లు ఉన్న వారికే ఇల్లు రావడంతో నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరిగింది. వారి పక్షాన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పే నాయకులే లేకపోయారు. దీనికి నిదర్శనం మండల కేంద్రమైన మొగుడంపల్లి లోని వృద్ధురాని నీ ఉదాహరణగా తీసుకుంటే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక జాబితా ఎలా జరిగిందో అర్ధం అవుతుంది. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఏ ప్రభుత్వం కూడా నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే అవకాశం లేదు. ఫలితంగా పేదలు పేదలుగానే గుడిసెల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. 70 సంవత్సరాల వృద్ధు రాలుని పుట్టక ముందు నుంచి వారి తల్లిదండ్రులు సైతం అదే గుడిసెలో కాపురం చేశారు. ఈసారైనా ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడ్డారు. కానీ స్థానిక నాయకుల పక్షపాతమో.. అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ మొగుడంపల్లి మండల కేంద్రమైన గుడుపల్లి కు మంజూరైన 35 ఇండ్లలో 18 రిటన్ పంపుతున్నారని దాంట్లో ఎవరికైనా బీదవారి అవసరం ఉన్నవారికి మంజూరు చేయాలని కోరారు. ఇండ్లలో అత్యధికంగా ఉన్న వారికే ఇండ్ల జాబితాలో పేర్లు వచ్చాయన్నారు. గుడుపల్లి గ్రామానికి చెందిన ఖైరున్ బీ, భర్త ఇబ్రహీం షా. వీరికి ఆరు గురు కుమారుడు ఐదు గురు కూతురు ఉన్నారని కానీ పూరి గుడిసెలోనే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ నాయకులకు, అధికారులకు మాత్రం బీద వారి ముసలి వయసు ఉండే చేయించే బాధ్యత పూరి గుడిసె కనిపించలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారితోపాటు ఎకరాల కొద్ది భూములు ఉన్న వారికి సైతం ఇల్లు ఇచ్చారు. కానీ అలాంటిది నిరుపేదకు -మాత్రం మొండి చేయి చూపించారు. ఇది కేవలం ఒక గుడుపల్లి గ్రామంలోనే కాదు ప్రతి గ్రామంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు,అధికార పార్టీ చెందిన నాయకులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఇలాంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 ఓటీటీలో మాధవన్ మూవీ ఎప్పటి నుండంటే…

 ఓటీటీలో మాధవన్ మూవీ ఎప్పటి నుండంటే…

 

 

 


వైవిధ్యమైన పాత్రలు చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చకున్న మాధవన్ చాలా కాలం తర్వాత మరోసారి రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు.

 

ఫాతిమా సనా షేక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

 

ప్రముఖ నటుడు మాధవన్ (Madhava) కు గతంలో రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉండేది.

కానీ కొంతకాలంగా అందుకు భిన్నమైన పాత్రలను చేస్తున్నాడు.

కొన్ని హిందీ సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలు చేయడానికి కూడా మాధవన్ వెనుకాడలేదు.

 

తెలుగులో ఆ మధ్య వచ్చిన అనుష్క ‘నిశ్శబ్దం’ (Nishabdham) లో అలాంటి భిన్నమైన పాత్రనే మాధవన్ చేశాడు.

సైంటిస్ట్ నంబి నారాయణన్ బయోపిక్ ‘రాకెట్రీ’ (Rocketry) తో మాధవన్ దర్శకుడిగానూ మారిపోయాడు.

ఆ బయోపిక్ అతనికి నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

అలానే గత యేడాది మాధవన్ నటించిన ‘సైతాన్’ (Saitaan) కూడా కమర్షియల్ హిట్ అయ్యి, మాధవన్ లోని నటుడిని వెలికి తీసింది.

ఈ యేడాది ఇప్పటికే మాధవన్ నటించిన ‘హిసాబ్ బరాబర్,’ ‘టెస్ట్’ చిత్రాలు వచ్చాయి.

అయితే ఈ రెండు కూడా ఓటీటీలోనే విడుదల కావడం విశేషం.

ఇక అక్షయ్ కుమార్ తో కలిసి మాధవన్ నటించిన కోర్ట్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2’ థియేటర్లలో సందడి చేసింది.

తాజాగా మాధవన్ నటించి మరో చిత్రం ‘ఆప్ జైసా కోయి’ మూవీ సైతం ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాలో మాధవన్ సరసన ఫాతిమా సనా షేక్ నటిస్తోంది.

మాధవన్ ఈ రొమాంటిక్ లవ్ డ్రామాలో సంస్కృతం లెక్చరర్ గా నటిస్తుంటే, సనా ఫ్రెంచ్ టీచర్ పాత్రను పోషిస్తోంది.

రెండు భిన్న ధృవాలకు చెందిన వీరిద్దరూ కలిసి జీవితం సాగించాల్సి వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నదే ‘ఆప్ జైసా కోయీ’ సినిమా.

 

ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాను వివేక్ సోని డైరెక్ట్ చేశారు.

 

ఇది జూలై 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version