నిరుపేద విద్యార్థికి సహాయం అందించిన ఎన్నారై.

నిరుపేద విద్యార్థికి సహాయం అందించిన ఎన్నారై

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణనికి చెందిన చేనేత కార్మికుడు కొండి సత్యం కుమార్తె కొండి వర్షిత తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల కళాశాలలోఎం.పీ.సీ గ్రూపులో వేయికి గాను సుమారు 976 మార్కులతో కళాశాల తృతీయ స్థానంలో మార్కులు సాధించడం జరిగినది. నిరుపేద విద్యార్థి అయిన వర్షితకు పై చదువుల కోసం ప్రముఖ ఎన్నారై సిరిసిల్ల అశోక నగర్ చెందిన గడ్డం భానుచంధర్(NRI)s/o సత్తయ్య మరియు వివేక వర్ధిని స్కూల్ 10వ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థి కొండి వర్షిత 40 వేల రూపాయలు పై చదువుల కోసం సహాయం అందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు గుగ్గిల్లా అభినయ్ గౌడ్,బద్దెనపల్లి మాజీ సర్పంచ్ గుగ్గిళ్ల అంజయ్య,మాజీ ఎంపీటీసీ సిలువెరీ ప్రసూన-నర్సయ్య, కొండ రాజేశం, కొండ రమేష్ లు పాల్గొన్నారు..

అనారోగ్య బాధితురాలికి యువజన కాంగ్రెస్ నాయకుడి.

అనారోగ్య బాధితురాలికి యువజన కాంగ్రెస్ నాయకుడి సాయం

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

 

 

 

 

 

ఓదెల మండలం పొత్కపల్లి గ్రామానికి చెందిన గంగారపు రాజమ్మ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను హాస్పిటల్ లో చేర్చగా ఆక్సిజన్ తప్పని సరిగా ఉపయోగించాలని చెప్పారు. అయితే బాధితురాలి ఆర్దికస్థితి సరిగా లేనందున రాజమ్మను ఇంటికి తీసుకవచ్చారు. ఆమె నిరుపేద దీనస్థితికి చలించిపోయిన ఓదెల మండల న్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిసేటి రాహుల్ గౌడ్ తన సొంత ఖర్చుతో ఆక్సిజన్ యంత్రాన్ని కొనివ్వడం జరిగింది. రాహుల్ గౌడ్ దాతృత్వానికి రాజమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా యువజన నాయకుడు రాహుల్ గౌడ్ మాట్లాడుతూ.. తన శక్తి మేరకు బాధితురాలికి వైద్య సహాయం అందజేశానని ప్రభుత్వపరంగా అవకాశాలుంటే రాజమ్మకు మెరుగైన వైద్య సహాయం అందజేయగలమని తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version