నిరుపేద విద్యార్థికి సహాయం అందించిన ఎన్నారై.

నిరుపేద విద్యార్థికి సహాయం అందించిన ఎన్నారై

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణనికి చెందిన చేనేత కార్మికుడు కొండి సత్యం కుమార్తె కొండి వర్షిత తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల కళాశాలలోఎం.పీ.సీ గ్రూపులో వేయికి గాను సుమారు 976 మార్కులతో కళాశాల తృతీయ స్థానంలో మార్కులు సాధించడం జరిగినది. నిరుపేద విద్యార్థి అయిన వర్షితకు పై చదువుల కోసం ప్రముఖ ఎన్నారై సిరిసిల్ల అశోక నగర్ చెందిన గడ్డం భానుచంధర్(NRI)s/o సత్తయ్య మరియు వివేక వర్ధిని స్కూల్ 10వ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థి కొండి వర్షిత 40 వేల రూపాయలు పై చదువుల కోసం సహాయం అందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు గుగ్గిల్లా అభినయ్ గౌడ్,బద్దెనపల్లి మాజీ సర్పంచ్ గుగ్గిళ్ల అంజయ్య,మాజీ ఎంపీటీసీ సిలువెరీ ప్రసూన-నర్సయ్య, కొండ రాజేశం, కొండ రమేష్ లు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version