మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం.

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ప్రవీణ్.ఆధ్వర్యంలో పాత్రికేయుల.సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకొచ్చిందా. ప్రజల మధ్యలో ఉంటున్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని. తోట ఆగయ్య. కొండూరి రవీందర్ రావులపై ఆగ్రహం వ్యక్తం చేస్తే. 2002. 2003. వ. సంవత్సరంలో 36. లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే . ఇప్పుడు. ఇప్పుడు అలాగే 2024. 2025. సంవత్సరానికి. 68 . లక్షల మెట్రిక్. తన్నుల. ధాన్యాన్ని కొనుగోలు చేసిన.ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని. చివరికి గింజ.వరకు కొంటామని చెప్పాము మీరు అధికారంలో ఉన్నప్పుడు. ప్రోటోకాల్ పాటించారా. టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ ఫోటోకాల్ ప్రకారం అధికార కార్యక్రమంలో పాల్గొని కూర్చున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడే ఉంటానని చెప్పి కేటీఆర్.ఎక్కడికి పోయిందో చెప్పాలి. ఏ ఒక్కరోజు ప్రజల పక్షాన పోరాడని. ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటు. పదవి లేకున్నా ఉన్న ప్రజల్లో ఉన్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని ప్రజలను దోపి ది. చేసి.దోచుకున్న మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం సిగ్గుచేటు. మీరు చేసిన తప్పులను అక్రమాలను దాచిపెట్టి వేదాలు వల్లిస్తామంటే ఎవరు నమ్మరు. రైతు రుణమాఫీ రైతు భరోసా ఇచ్చాం మీలాగా గుట్టలకు బూట్టలకు ప్రజాధనాన్ని దోచుకోలేదు. ప్రజా ప్రభుత్వంలో నిజమైన లబ్ధిదారుల కు.పథకాలను. అందిస్తున్నామని. ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ ధాన్యం. కొనడం లేదని చెప్పడం సిగ్గుచేటు అని. మీరు ఎన్ని చేసినా ప్రజలే వారు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు అని. తెలియజేస్తూ. ప్రజలేతన ప్రోటోకాల్ గా. ప్రజల మధ్యలో ఉంటున్న ఏకైక వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని. అధికారం పోయాక . మతిభ్రమించి. మాట్లాడుతున్నారని. దయచేసి ఇప్పటికైనా. ప్రజలకు మేలు చేయాలి తప్ప. తప్పుడు సంకేతాలు పంపకుండా. ప్రజల గురించి పోరాడాలని. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ. ఉపాధ్యక్షులు. నేరెళ్ల నర్సింగ్ గౌడ్. జిల్లాప్రధాన కార్యదర్శి. లింగాల భూపతి. విద్యార్థి జిల్లా అధ్యక్షులు. వెలుపుల సాయి ప్రసాద్.. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. కటకం రాజశేఖర్. శ్రీకాంత్ గౌడ్. సత్తు శ్రీనివాస్ రెడ్డి. కొత్త రవి గౌడ్. ఇటికల మహేందర్. బండి పరశురాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి.

ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంట నీళ్ల పాలైతే పట్టించుకోని ప్రభుత్వం

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బిఆర్ఎస్ నాయకులుఈ సందర్బంగా భూపాలపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ
అకాల వర్షాలకు అన్నదాత ఆగమైతుంటే, ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీళ్ల పాలైతే, పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు. మండలం గాంధీనగర్ గ్రామ రైతుల పరిస్థితి మాత్రమే కాదు దాదాపు రాష్ట్రమంతా ఇదే దుస్థితి. ములుగే నక్కపై తాటి పండు పడ్డట్టు రైతు పరిస్థితి ఉంది.
ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది.
సొంత మండలం అని గొప్పలు చెప్పుకునే స్థానిక శాసనసభ్యులు కొనుగోల కేంద్రాల్లో కాంటాలు అయి 4,5 రోజుల నుండి ధాన్య బస్తాలు కల్లాలో ఉన్న వాటిని మిల్లు లకు తరలించంచడానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ లారీలను కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.గత 4,5 రోజుల నుండి వర్షాలు పడుతు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిచి రైతులు బాధ పడుతుంటే స్థానిక శాసనసభ్యులు కనీసం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల యొక్క వడ్లను కటింగ్ లేకుంటే కొంటామని ధైర్యాన్ని ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారు.కేసీఆర్ ఉన్నపుడు ఎప్పుడూ వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదు తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, రైతుల బతుకులు కాపాడాలని మంత్ర ఉత్తంకుమార్ సివిల్ సప్లయిస్ కమిషనర్ , భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వారిని కోరుతున్నాం బి ఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులకు తోడుగా ఉంటామని తెలియజేశారు 2, 3 రోజుల్లో వడ్లను పూర్తిగా మిల్లులకు తరలించకపోతే బిఆర్ఎస్ పార్టీ తరపున భారీ ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భైరగాని కుమారస్వామి గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు మామడి రమేష్, ఉపాధ్యక్షుడు రాము , నాయకులు బోట్ల స్వామి, రవి, వాజిత్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు

మండలంలో అధికారులు నాయకుల.!

మండలంలో అధికారులు నాయకుల చే. ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ….

తంగళ్ళపల్లి నేటీ ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల. నిర్మాణానికి మొదటిగా సారిగా మండలంలోని సారం పెళ్లి గ్రామంలో అధికారులచే నాయకులచే భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడం ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని కలిగి ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల అన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తుందని. మండలంలో మొట్టమొదటిసారిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారంచుట్టిందని అలాగే ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుందని నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తుందనినిర్మాణంలో నిధులు మంజూరుకు లబ్ధిదారులు అధికారులను. దళారులను ఆశ్రయించవద్దని లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం చేపట్టి పనులు వేగవతం చేసి ఇందిరమ్మ ఇంటి కల సాకారం చేసుకోవాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ల దోపిడీకి తెర లేపారని ప్రజా ప్రభుత్వంలో అటువంటి వాటికి తావు లేదని ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో ప్రభుత్వం విడు
త ల. వారీగా రుణాలు మంజూరు చేస్తారని.ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ . సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి . చిత్రపటాలకు లబ్ధిదారుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగల.రాజు ఆధ్వర్యంలో మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసినారు. ఇట్టి కార్యక్రమంలో . పంచాయతీ సెక్రెటరీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్. ఏఎంసీ డైరెక్టర్ గుగ్గిల. రాములు. ఎండి హనీ. గడ్డమీది శ్రీనివాస్. సుంచుల కిషన్. సిరిసిల్ల దేవదాస్. బాలరాజు. అంజయ్య. పురుషోత్తం. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ .!

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి. షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది… సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పలు గ్రామాలకు. సంబంధించి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్. చెక్కులను తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక మార్కండేయ భవన్ లో ఏర్పాటుచేసిన. దానిలో భాగంగా మండలంలో పలు గ్రామాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి . షాది ముబారక్. చెక్కుల పంపిణీలను. స్థానిక. ప్రభుత్వ ఆదేశాల మేరకు. తంగళ్ళపల్లి ఎమ్మార్వో సంబంధిత అధికారుల. చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా. కొంచెం ఆలస్యం.అయిన అర్హులందరికీ. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా కళ్యాణ్ లక్ష్మి. షాదీ ముబారక్. చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి. ఎమ్మార్వో . జయత్ కుమార్. జిల్లా గ్రంధాల చైర్మన్ నాగుల సత్య నారాయణ గౌడ్. సిరిసిల్ల ఏఎంసి. చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరాల శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల చెక్కుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

నిజాంపేట మండల అధ్యక్షునికిగా చంద్రశేఖర్ .

నిజాంపేట మండల అధ్యక్షునికిగా చంద్రశేఖర్

నిజాంపేట: నేటి ధాత్రి 

 

 

భారతీయ జనత పార్టీ మండల మండల అధ్యక్షునిగా చిన్మనమైన చంద్రశేఖర్ ను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మరోసారి మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ కి, జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

ఝరాసంగం మండల కేంద్రంలో లీగల్ అవేర్నెస్ క్యాంపు .

ఝరాసంగం మండల కేంద్రంలో లీగల్ అవేర్నెస్ క్యాంపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలో గల ఎంపిడిఓ కార్యాలయంలో లీగల్ అవేర్నెస్ క్యాంపును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ శ్రీమతి కవిత దేవి నిర్వహించి మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించి, తగు సూచనలు చేశారు. న్యాయమూర్తి మరియు న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతీ మహిళ సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నిత్యజీవితంలో మహిళలు ఎన్నో కష్టాలకు గురివుతున్నారని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురుకాకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలువస్తే వాటిని.

Camp

అధిగమించడానికి చట్టాలు తొడ్పాడుతాయని సూచించారు. కార్యక్రమంలో నిజజీవితంలో మహిళల పాత్ర, గృహహింస నిరోధకత, మహిళా సాధికారత, పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, బాల్య వివాహ నిరోధక చట్టం, ఉచిత న్యాయసేవా సహాయంపై క్షుణ్ణంగా వివరించారు. ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బార్ వైస్ ప్రెసిడెంట్ మానెన్న, ప్యానెల్ న్యాయ వాదులు రుద్రయ్య స్వామి, సామజిక కార్యకర్త కోట ధనరాజ్ గారు, ఎంపిడిఓ సుధాకర్, తహసీల్దార్ తిరుమల రావు, ఎస్సై సాయి తేజ, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు  పాల్గొన్నారు.

బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ .

బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బుర్ర వెంకటేష్ గౌడ్ జాతీయ సమైక్యతే లక్ష్యంగా..హిందూ భావజాల వ్యాప్తికై విద్యార్థి దశలోనే జాతీయ భావాలను అలవర్చుకొని..దేశ సమైక్యతే లక్ష్యంగా పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత చేరి..అనేకమంది విద్యార్థులను..ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్ది..విద్యారంగ సమస్యలపై అనేకమైన పోరాటాలు చేశాడు. ఈ క్రమంలో విద్యార్థి పరిషత్ నాయకత్వం ఆయనకు వివిధ హోదాల్లో పని చేయడానికి అవకాశం కల్పించింది. అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ పటిష్టతకు విశేష కృషి చేస్తూ..ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ..ప్రభుత్వంపై పోరాటం చేస్తూ పార్టీ ఎదుగుదలకు విశేష కృషి చేస్తున్న క్రమంలో ఆయనను బిజెపి చిట్యాల మండల ప్రధాన కార్యదర్శిగా, అనంతరం బిజెపి మండల అధ్యక్షుడిగా నియమించింది. కాగా రెండవసారి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల సంస్థగత ఎన్నికల బుర్ర వెంకటేష్ గౌడ్ ను రెండవసారి భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి, నాగపురి రాజమౌళి గౌడ్ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్ రెడ్డి వెన్నంపల్లి పాపయ్యా ,కన్నం యుగదిశ్వర్, దొంగల రాజేందర్ ,మరియు జిల్లా మండల నాయకులకు వెంకటేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తనపై నమ్మకంతో ఈ బృహత్తరమైన బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టాన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ బలోపితానికి నిరంతరం కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాలలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తానన్నారు.

బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక.

బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బుర్ర వెంకటేష్ గౌడ్ జాతీయ సమైక్యతే లక్ష్యంగా..హిందూ భావజాల వ్యాప్తికై విద్యార్థి దశలోనే జాతీయ భావాలను అలవర్చుకొని..దేశ సమైక్యతే లక్ష్యంగా పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత చేరి..అనేకమంది విద్యార్థులను..ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్ది..విద్యారంగ సమస్యలపై అనేకమైన పోరాటాలు చేశాడు. ఈ క్రమంలో విద్యార్థి పరిషత్ నాయకత్వం ఆయనకు వివిధ హోదాల్లో పని చేయడానికి అవకాశం కల్పించింది. అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ పటిష్టతకు విశేష కృషి చేస్తూ..ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ..ప్రభుత్వంపై పోరాటం చేస్తూ పార్టీ ఎదుగుదలకు విశేష కృషి చేస్తున్న క్రమంలో ఆయనను బిజెపి చిట్యాల మండల ప్రధాన కార్యదర్శిగా, అనంతరం బిజెపి మండల అధ్యక్షుడిగా నియమించింది. కాగా రెండవసారి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల సంస్థగత ఎన్నికల బుర్ర వెంకటేష్ గౌడ్ ను రెండవసారి భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి, నాగపురి రాజమౌళి గౌడ్ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్ రెడ్డి వెన్నంపల్లి పాపయ్యా ,కన్నం యుగదిశ్వర్, దొంగల రాజేందర్ ,మరియు జిల్లా మండల నాయకులకు వెంకటేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తనపై నమ్మకంతో ఈ బృహత్తరమైన బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టాన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ బలోపితానికి నిరంతరం కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాలలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తానన్నారు.

గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ.

గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ శ్రీపతి బాబురావు

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం పెగడపల్లి గ్రామపంచాయతీని మొబైల్ యాప్ ఇన్స్పెక్షన్ లో భాగంగా శనివారం ఎంపీఓ శ్రీపతి బాబురావు సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్ధాలు లేకుండా చూసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అలాగే గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అన్నారు. వాటర్ అండ్ శానిటేషన్ కు సంబంధించిన 7 రిజిస్టర్ లను పరిశీలించి సిగ్రిగేషన్ షెడ్డు లో కంపోస్ట్ ఎరువు తయారు చేయాలని సూచించారు. నర్సరీని పరిశీలించి మొక్కలు 100% పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. వేసవికాలం తాగునీరు సరఫరా లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటూ పైపు లైన్లు లీకేజీలు ఉంటే వెంటనే సరి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి పావని,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రామిక్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న.!

శ్రామిక్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న శిక్ష శిఖిరన్ని కమిటి చైర్మన్ రాజేశ్వరి సద్వినియోగం చేసుకోవాలన్నారు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

వేసవి పిల్లల శిభిరం విద్యార్థులకు మంచి వరంలోఉందన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుప్పానగర్ లో 24/04/2025 నుండి 14/05/2025 20 రోజులపాటలు స్వచ్చంద సంస్థ మయిన శ్రామిక్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న శిక్ష శిఖిరన్ని అమ్మ అద పాఠశాలల కమిటి చైర్మన్ రాజేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ శిక్షణా శిఖరం విద్యార్థులకు వరం లాంటింది దీనిని అందరు విద్యార్ధులు సద్వనియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ శిభిరం నిర్వహకులు ఆయేషా సిద్దిఖీ శిభిరం కో ఆర్డినేటర్లు, రాంచెందర్, అశోక్ సి ఆర్ పి షఫీయుద్దీన్ & యోజ్బెన్, అంగన్ వాడి టీచర్. శక్తిమంతులు పాల్గొన్నారు.aa

వెలుగు మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక.!

వెలుగు మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల వెలుగు సమాఖ్య పాలకవర్గ సభ్యుల ఎన్నిక కార్యదర్శి కొండ్ర శోభ సమక్షంలో నిర్వహించారు. బాగా నూతన అధ్యక్షురాలుగా రంగాపురం గ్రామానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు కొలిపాక రమాదేవి, కార్యదర్శిగా పర్లపల్లి గ్రామానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు రేళ్ల సునీత, కోశాధికారిగా మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన నాయకురాలు బత్తిని శిరీష లను నియమించినట్లు ఏపిఎం రవివర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ సంఘాల నుండి వచ్చిన ప్రతినిధులు, సీసీలు గాజుల బాబురావు, బత్తిని ప్రవీణ్, మహిళా సమాఖ్య సిబ్బంది పాల్గొన్నారు.

శాయంపేట మండల సమస్య తీరేది ఎన్నాడో!

శాయంపేట మండల సమస్య తీరేది ఎన్నాడో!

ఆర్టీసీ బస్సు రాదు.. అవస్థలు తీరవు

ప్రభుత్వం స్పందించి బస్సు సౌకర్యాన్ని కల్పించాలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి బస్సు సౌకర్యం లేకపోవడం వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలామంది విద్యార్థులు మహిళలు ఉద్యోగాలు కూలీల ఇతర అవసరాల నిమిత్తం ప్రయాణం చేస్తే ప్రజలు బస్సు సౌకర్యం లేక అవస్థలు అనుభవిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులు మహిళలు ఇతర ముఖ్యమైన పనులకు వెళ్లాలంటే మండల కేంద్రం నుండి జిల్లాకు పోవడానికి 30 కిలోమీటర్ల దూరానికి పోవుట గూర్చి ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల ప్రయాణం భారంగా మారింది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తించని మండలం

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆడబిడ్డల కళ నెరవేర్చిన ప్రభుత్వం వెంటనే బస్సు సర్వీస్ లను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

బస్సులు నడిపితేనే ప్రయాణం సులువు

శాయంపేట మండల కేంద్రం నుంచి హన్మకొండకు వెళ్లా లంటే ఆటోలో ప్రయాణిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లే ప్రజలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పిస్తుంది బస్సులు నడిపితేనే ఆర్థిక భారం తగ్గుతుందని ప్రజలు కోరడమైనది.

మారుమూల గ్రామాలకు లేని బస్సు సర్వీసులు

శాయంపేట మండలంలోని మారుమూల గ్రామాలకు లేని బస్సు సర్వీసులు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ప్రజలు 8,000 మంది నివసిస్తారు. 24 గ్రామ పంచాయతీలోని ప్రజలు సుమారుగా 30 వేల మందికి పైగా ఉంటారు జిల్లా నుండి మండలానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు అవస్థల పాలవు తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి వెంటనే పాత బస్సు సర్వీసులను పునరుద్ధరించాలి.

కోహిర్ మండలంలోని పిచారగడి గ్రామంలో.!

కోహిర్ మండలంలోని పిచారగడి గ్రామంలో వాటర్ షెడ్ ప్రారంభోత్సవా కార్యక్రమంలో పాల్గొన్న.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

➡ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ
➡ జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్
➡ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్

inauguration ceremony of a water

 

శనివారం నాడు, కోహిర్ మండలంలోని పిచారగడి గ్రామంలో వాటర్ షెడ్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ తన్వీర్,కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ గారు,మహిళ సంఘాల అధ్యక్షులు&సభ్యులు, మరియు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కోహిర్ మండల్లో భారీ వర్షం మరియు వడగళ్ల వాన.!

కోహిర్ మండల్లో భారీ వర్షం మరియు వడగళ్ల వాన కారణంగా మామిడి పంటకు భారీ నష్టం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

కోహిర్ మండల్ మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని గ్రామాలను భారీ వర్షం మరియు వడగళ్ల వాన ముంచెత్తింది, దీనితో ప్రజలు వేడి నుండి ఉపశమనం పొందారు. మరోవైపు, చెరకు, టమటా, మామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లడంతో రైతులు, మామిడి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం మరియు గురువారం సాయంత్రం, అకస్మాత్తుగా భారీ వర్షం మరియు బలమైన గాలులతో కూడిన వడగళ్ళు పడ్డాయి, దీని ఫలితంగా పీడ్ కమల్, బిలాల్ పూర్, మన్యార్ పల్లి మరియు బేడంపేట్ గ్రామాలలో భారీ వడగళ్ళు పడటంతో నేలపై మంచు పలక కనిపించింది మరియు మామిడి తోటలలోని మామిడి చెట్ల కింద అనేక టన్నుల మామిడి కాయలు పడి ఉన్నాయి. మరియు మామిడి వ్యాపారులతో మాట్లాడినప్పుడు, వారు మిలియన్ల నష్టాలను నివేదించారు మరియు వర్షం మరియు వడగళ్ల వాన కారణంగా సంభవించిన నష్టాన్ని మరమ్మతు చేయడానికి లేదా భర్తీ చేయడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోసం సిఫార్సు చేయాలని వ్యవసాయం మరియు ఉద్యానవన శాఖ, కోహిర్ మండల్ అధికారులు మరియు సీనియర్ అధికారులను కోరారు.

మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

నీలికుర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ PACS ఏర్పాటు చేయాలి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

మరిపెడ నేటిధాత్రి.

 

 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు వ్యాపారులకు అమ్మకుండా కనీస మద్దతు ధర బోనస్ లభించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి ప్యాక్స్ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసింది మరిపెడ మండలంలోని అన్ని గ్రామాలలో ఐకెపి ప్యాక్స్ సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రారంభించడం జరుగుతుంది. నీలికుర్తి గ్రామంలో ప్యాక్స్ సెంటర్ ఏర్పాటుచేసి ఇక్కడ ఉన్నటువంటి 2500 మంది వరి ధాన్యం పండించే రైతుకు కనీస మద్దతు ద్వారా బోనస్ లభించే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు తక్షణమే నీలికుర్తి గ్రామంలో ఫ్యాక్ సెంటర్ ఏర్పాటుచేసి కొనుగోలు ప్రారంభించాలని ఎమ్మార్వో గారికి డిమాండ్లతో కూడిన వినపత్రాన్ని అందజేయడం జరిగింది
గత కొన్ని సంవత్సరాలుగా నీలి కుర్తి గ్రామంలో ప్యాక్ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు జరిగింది గత రబీ కాలంలో ప్యాక్ సెంటర్ కొనుగోలు వ్యాపారులు దళారులు ప్రమేయాన్ని అరికట్టాలని నీరుకుర్తి గ్రామస్తుల ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే దానిని సాకుగా చూసుకొని అధికారులు ప్రజాప్రతినిధులు అక్కడ సెంటర్ ని ఎత్తివేయడం వలన రైతులు కనీస మద్దతు ధర బోనస్ను పొందలేకపోతున్నారు కాబట్టి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే ఫ్యాక్స్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని వినపత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్,యాకన్న,అంజి,వస్త్రం తదితరులు పాల్గొన్నారు

ఝరాసంగం మండలంలో చల్లబడిన వాతావరణం

ఝరాసంగం మండలంలో చల్లబడిన వాతావరణం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల కేంద్రంలో గురువారము సాయంత్రం ఒక్కసారిగా మోస్తారు వర్షం కురిసింది. మండల పరిధిలోని ఝరాసంగం, కుప్ప నగర్ సిద్ధాపూర్ బొప్పనపల్లి, తదితర గ్రామాలలో మోస్తారు. వర్షం కురిసింది. వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది.

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన మండల మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని సాధనపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగా పద్మ సమ్మయ్య దంపతుల కుమార్తె నిత్యశ్రీ వివాహమునకు పాల్గొ ని నూతన వధూవరులను ఆశీర్వదించి ,శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ దూదిపాల రాజిరెడ్డి, మైలారం ఎంపీటీసీ గడిపే విజయ కుమార్ శాయంపేట ఉప సర్పంచ్ సుమన్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, బత్తిని తిరుపతి, మండల నాయకులు పాల్గొన్నారు.

హరిత సేన నియోజకవర్గం మండల కమిటీల నియామకం.

హరిత సేన నియోజకవర్గం, మండల కమిటీల నియామకం

గంగాధర నేటిధాత్రి:

 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నెపథ్యంలో, చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీ సభ్యులను మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వగృహంలో సోమవారం ప్రకటించారు.
మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జిగా మామిడిపెల్లి అఖిల్, గంగాధర మండల అధ్యక్షుడిగా జెలెందర్ రెడ్డి, రామడుగు మండల అధ్యక్షుడిగా బైండ్ల మధు, బోయినిపల్లి మండల అధ్యక్షుడిగా కన్నం సాగర్, మల్యాల మండల అధ్యక్షుడిగా అరుణ్, కొడిమ్యాల్ మండల అధ్యక్షుడిగా ఇంతియాజ్, చొప్పదండి మండల అధ్యక్షుడిగా భక్తు విజయ్ కుమార్ ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ఇనుగుర్తి శ్రీనివాస్, గర్రెపల్లి సతీష్, నూతికడి బోజనరాయణ, కమల్ గౌడ్ తదితరులు నూతన కమిటీకి దిశానిర్దేశం చేశారు. సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించాలి అని, మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి ప్రపంచాన్ని అందించవచ్చని తెలియజేశారు. ఆఖరులో కమిటీ సభ్యులు మొక్కలు నాటడమ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరితసేన సభ్యులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గీసుకొండ మండలం లో ఎక్సైజ్ దాడులు 5 అరెస్ట్.

గీసుకొండ మండలం లో ఎక్సైజ్ దాడులు ఐదుగురు అరెస్ట్

పరకాల నేటిధాత్రి

 

 

ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశానూసారం గుడుంబా నిర్మూలన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారంరోజున పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గీసుకొండ,మనుగొండ,ఎలుకుర్తి ల లో దాడులు నిర్వహించి గీసుకొండ కు చెందిన పోలేపాక సబిత,కోట స్రవంతి,ఎలుకుర్తి కి చెందిన బొడిగే దేవేంద్ర,బొల్లు సాంబ లక్ష్మి,మనుగొండ కు చెందిన ఎంబడి మల్లమ్మ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి (25) లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడులలో ఎస్ఐ జ్యోతి,సిబ్బంది లక్ష్మణ చారి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

జై బాపు. జై భీమ్. జై సంవిధాన్.!

జై బాపు. జై భీమ్. జై సంవిధాన్. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం చిర్రావంచ చింతల్ తనా పద్మ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు సంవత్సరం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నమన్నారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ ఈరోజు 05.04.2025. రోజున తంగళ్ళపల్లి మండలంలో జై బాపు. జై భీమ్. జై సంవిధాన్.. కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేపట్టడం జరిగిందని దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాపాడాలని రాజ్యాంగ విలువలను కాపాడాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని మహాత్మా గాంధీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు వివరించాలని తెలియజేశారు భారత దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి. 75. సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నేడు పేద బలహీన వర్గాల ప్రజల వృద్ధిపై ఆకాంక్ష లేదని ప్రధాని పేద ప్రజల కంటే బడా బాబులకు ముఖ్యమన్నారు రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు అంబేద్కర్ గాంధీ పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బిజెపి పార్టీ అనగదొక్కలని చూస్తుందనీ అమిత్ షాఅంబేద్కర్ నీ పార్లమెంటు సాక్షిగా అవమానించారని గ్రామ మండల స్థాయిలో కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని కోరారు గాంధీ అంబేడ్కర్ ఆశయాల సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ గత బి.ఆర్.ఎస్ పార్టీ అందజేసిన పథకాలు కూడా కొనసాగిస్తున్నామన్నారు కానీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న పనులుఓ ర్వలేక వ్యతిరేక అంశాలను సోషల్ మీడియా ద్వారా పలు విషయాలు పై విషం చిమ్ముతుందని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో విజయాన్ని సాధించేందుకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగం అని దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిపరుడుపై ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version