బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి

“బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి”

బాలానగర్ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో భవానిమాత దేవాలయంలో సోమవారం మండల బీజేవైఎం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల బీజేవైఎం అధ్యక్షులుగా కుమార్ నాయక్, ఉపాధ్యక్షులుగా శ్రీరామ్, నవీన్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా భరత సింహాచారి, సందీప్ కుమార్, ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమార్ నాయక్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

నర్సంపేట మండల బిఆర్ఎస్ యూత్ కమిటీ ఎన్నిక.

నర్సంపేట మండల బిఆర్ఎస్ యూత్ కమిటీ ఎన్నిక

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట రూరల్ మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ నూతన కమిటీని ఎంపిక చేసినట్లు పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక చేసినట్లు తెలిపారు.బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడుగా గన్న రాజేష్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్స్,మంచిక హరీష్,పెండ్యాల స్వామి,ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీకాంత్,అధికార ప్రతిధులుగా బుస శ్రీశైలం,దారావత్ మహేందర్,ఉపాధ్యక్షులు భాషబోయిన ప్రవీణ్,కర్దూరి హరీష్,కొంగర మురళీ,ఆల్లె రాజు,గజ్జి రాము,సహాయ కార్యదర్శులు జినుకల అఖిల్,పుట్ట అఖిల్,బయ్య నవీన్,చెరిపెల్లి రాజు,కోశాధికారి అజ్మీర నరేష్,కార్యవర్గ సభ్యులు చిలుక నరేందర్,దరావత్ రాజు,వాంకుడోతు అక్షయ్ కుమార్,
మోటం హరీష్,నునావత్ పవన్ కుమార్,భూక్య సుమన్ లు ఎన్నికైనట్లు ప్రకటించారు.మండలం లోని అన్ని గ్రామాల నుండి ఎన్నిక చేయడం జరిగిందని మండల పార్టి అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరములు,క్లస్టర్ ఇన్చార్జి మోటురి రవి,సీనియర్ నాయకులు బోల్లం బక్కయ్య,గడ్డం రాజు,బగ్గి రాజు,జై కిసాన్,బాణోత్ రవి,చిప్ప ప్రశాంత్,సమ్మెట రంగయ్య తదతరులు ఉన్నారు.

ఎరువుల షాపులను తనిఖీ.!

ఎరువుల షాపులను తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి

రైతులకు ఎరువుల కొరత ఉండదు… ఏ ఓ వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న కేసముద్రం మండలంలోని పలు ఎరువుల దుకాణాలు, మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సెంటర్ లను తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ ప్రతి ఎరువుల డీలరు యూరియా మరియు ఇతర ఎరువులను ఈపాస్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని, స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్ మరియు, గోదాం బ్యాలెన్స్, ఈపాస్ బ్యాలెన్స్ సమానంగా ఉండేటట్లు ప్రతిరోజు చూసుకోవాలని వారు సూచించారు, స్టాక్ బోర్డులు, ఇన్వైస్లు, ఓ ఫామ్సు ప్రాపర్ గా మెయింటైన్ చేయాలని వారు సూచించారు, ఎవరైనా డీలరు ఎరువుల కొరత సృష్టించిన, అధిక ధరలకు విక్రయించిన, ఎరువులు నియంత్రణ చట్టం 1985 ప్రకారం, మరియు నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం చర్యలు తీసుకుంటామని, వారు సూచించారు.

వారు మాట్లాడుతూ కేసముద్రము మండలంలో, ప్రైవేటు ఎరువుల దుకాణాలు మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా 323 మెట్రిక్ టన్నులు, డిఏపి 53 మెట్రిక్ టన్నులు ,పోటాష్ 44 మెట్రిక్ టన్నులు, సూపర్ 115 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 534 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నది కావున రైతు సోదరులు ఎటువంటి అధైర్యపడవద్దని వారు సూచించారు, కావలసిన రైతులు ఆధార్ కార్డు తీసుకువెళ్లి, యూరియా మరియు ఇతర ఎరువులను పొందాలని వారు సూచించారు, వారు మాట్లాడుతూ ప్రస్తుతము పత్తి మరియు మొక్కజొన్న పంట 25 నుంచి 30 రోజుల వయసులో ఉన్నందున పంటలలో మోతాదుకు మించి యూరియా వాడినట్లయితే రసం పీల్చే పురుగుల బెడద, కలుపు బెడద ఎక్కువై పంటకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున, యూరియా మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువులను మొక్కకు కావలసిన మోతాదులోనే అందియాలని వారు సూచించారు , అదేవిధంగా వ్యవసాయ అధికారి రైతులకు నానో యూరియా మీద అవగాహన కల్పించడం జరిగింది.

చనిపోయిన కుటుంబానికి అండగా నిలిచిన.!

 

చనిపోయిన కుటుంబానికి అండగా నిలిచిన మాజీ ఉపసర్పంచ్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ని. గ్రామానికి చెందిన బాష్మియా ఇటీవల గుత్తి తెలియని వాహనం ఢీకొనడంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో. వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యంచెప్పి. తమ వంతుగా 50 కేజీల బియ్యం వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన. తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరు తిరుపతి. ఈ సందర్భంగా. మాట్లాడుతూ వారి కుటుంబంలోని పెద్దదిక్కును కోల్పోవడం చాలా బాధాకరమని. వారి కుటుంబం చాలా పేదరికంతో ఉందని త్వరలో సంబంధిత అధికారుల నాయకులతో మాట్లాడి వారికి అర్హతలు ఉన్న దాని ప్రకారం అన్ని సదుపాయాలు అందించే విధంగా. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారికి తగిన న్యాయం జరిగేలా. చేయిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్. నేరెళ్ల నర్సింగం గౌడ్. కాంగ్రెస్ నాయకులు హమీద్. రెడ్డి పరశురాములు. ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి మండల కేంద్రములో పట్ట పగలే అక్రమ మట్టి తోలకాలదందా.

సింగరేణి మండల కేంద్రములో పట్ట పగలే అక్రమ మట్టి తోలకాలదందా.

పట్టించుకోని అధికారులు.

కారేపల్లి నేటి ధాత్రి

ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రము లో యదేశ్య గా పట్ట పగలే ప్రతిరోజు జేసీబి తో మట్టిని తవ్వి అనేక ట్రాక్టర్ల తో ఉదయం నుండి సాయంత్రం వరకు కారేపల్లి లో చుట్టూ పక్కల ఉన్న గ్రామాల్లో ప్రతినిత్యం అక్రమ మట్టి తోలకాలు జోరుగా కోనసాగిస్తున్నారు ఎవ్వరైనా ప్రజలు అడిగితె ఇందిరమ్మ ఇళ్ల కు అని చెప్పి పబ్లిక్ గానే ప్రతిరోజూ అక్రమ మట్టి తోలకాల దందా జోరుగా కోనసాగిస్తున్నారు.సింగరేణి మండల కేంద్రములో కూత వేటు దూరంలోనే ప్రభుత్వ అధికారులు ఉన్న కానీ ప్రతిరోజు అక్రమ మట్టి తోలకాల దందా జోరుగా కోనసాగిస్తున్నారు ఒక్క ట్రాక్టర్ మట్టి ఆరు వందల నుండి ఎనిమిది వందల వరకు బైట వెంచర్ల లో కూడా మట్టి విక్రయాలు కోనసాగిస్తు మట్టి మాఫియా దారులు లక్షలు గడిస్తున్నారు.మట్టితోలకాలపై ప్రజల్లో అనేక అనుమానాలు తావేత్తుతున్నాయి. మైనింగ్ అనుమతులు ప్రభుత్వ అధికారుల అనుమతులు ఉండాలని అవి ఉన్న లేకున్నా కాని అదికారుల అండదండలతో వారి కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి తోలకాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోందని ప్రజలు అనుకుంటున్నారు. కావున ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ మట్టి తోలకాల దందాను ఆపాలని ప్రజలు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

మండలస్థాయి సమావేశం విజయవంతం చేయాలి.

బిఆర్ఎస్ మండలస్థాయి సమావేశం విజయవంతం చేయాలి

మండల అధ్యక్షులు,వైస్.ఎంపీపి చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-5-2.wav?_=1

పరకాల నేటిధాత్రి
18 జులై శుక్రవారంరోజున పరకాల పట్టణంలో స్థానిక పద్మశాలి భవన్ లో బిఆర్ఎస్ మండల మరియు గ్రామస్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని,ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిధులుగా హాజరువ్వానున్నారని మాజీ వైస్ ఎంపీపి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశానికి పట్టణ మరియు మండల,గ్రామ పార్టీ,మరియు అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు,మాజీ జెడ్పిటీసి,ఎంపిటిసి,సర్పంచ్ లు,కోఅప్షన్ సభ్యులు,సోసైటీ ఛైర్మెన్లు,కమిటీ సభ్యులు,యూత్ విభాగం,పార్టీ శ్రేణులు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలని కోరారు.

గంగవరం మండలంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న.

గంగవరం మండలంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న అక్రమ లేఔట్ లు

నోటీసులకే పరిమితమైన అధికారులు

గంగవరం(నేటి ధాత్రి) జూలై 16:

పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో అక్రమాలకు అడ్డాగా మారిపోయింది, అక్రమ కట్టడాలు ఒకవైపు ఉంటే మరోవైపు అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి, అధికారులు నోటీసులు ఇవ్వడం వరకే పరిమితమై పూర్తిస్థాయిలో అరికట్టడంలో విఫలమయ్యారు,ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి అక్రమాలు చేస్తుంటే నోటీసులు ఇస్తుంటే ఉంటే లాభం ఏమిటి అని ఇప్పటికే ఎన్నో వార్తా కథనాలు రూపంలో అధికారుల నిర్లక్ష్యం చూపుతున్న కూడా అధికారులు పట్టించుకోవడం లేదు, ఇందుకు కారణం రాజకీయ ఒత్తుల్లా ? లేక ఏదైనా ప్రలోభాలకు లోబడి ఈ విధంగా చేస్తున్నారా అని సందేహాలు కూడా వస్తున్నాయి, ఇదే క్రమంలో భాగంగా గంగవరం మండలంలో దాదాపు 20 నుంచి 25 లేఔట్ లు అనుమతులు లేకుండా ప్రభుత్వ నియమాలు పట్టించుకోకుండా వేశారు,
అయిన కూడా అధికారులు ఏ విధమైనటువంటి స్పందన లేదు అంటే ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది, ఇదే క్రమంలో భాగంగా ఈ విషయంపై గంగవరం పంచాయతీ కార్యదర్శి సుధాకర్ వివరణ కోరగా అక్రమ కట్టడాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని అయినా కూడా నిర్లక్ష్యప్రయంగా నిర్మిస్తున్నారని వారిపై చర్యలు కచ్చితంగా తీసుకుంటామని
ఈ సందర్భంగా ఆయన
తెలిపారు,అదే విధంగా లేఔట్ విషయంలో కూడా నోటీసులు ఇచ్చామని వారిపై కూడా ప్రభుత్వ నియమాల పరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు,ఏది ఏమైనా అగ్రికల్చర్ భూములను మార్చి ఎటువంటి అనుమతులు లేకుండా కమర్షియల్ గా మార్చుకుంటున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోకుంటే రాబోవు రోజుల్లో పూర్తిస్థాయిలో అగ్రికల్చర్ భూములన్ని లేఔట్ గా మారి పూర్తిస్థాయిలో వ్యవసాయం దూరమయ్యే అవకాశాలు లేకపోలేదు, మరి ఇన్ని జరుగుతున్నా కూడా గంగవరం మండలం పై అధికారులు పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోలేదంటే అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి, అలాగే కొన్ని విద్యాసంస్థలు కూడా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు నిర్మించినట్లు కూడా వెలుగులోకి వచ్చింది,
మరి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది…

బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు.

బిఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితమే వ్యవసాయ రైతులకు సాగునీరు విడుదల

బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు

నేటిధాత్రి చర్ల

బిఆర్ఎస్ పార్టీ ఉద్యమం వలన ఈరోజు రైతులకు తాలిపేరు కాలవల నుండి నీరు విడుదల చేసారు అని బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ ఒక ప్రకటనలో తెలిపారు జూలై 6 తేదీన డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానెం రామకృష్ణ చర్ల మండల బిఆర్ యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రాజెక్ట్ నిండా నీరు ఉన్న నీరు విడుదల చేయడం లేదని రైతులు ఆందోళన చెందారు వెంటనే నీరు రైతులకు విడుదల చేయాలని డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు దాని పలితమే ఈ రోజు రైతులకు నీరు విడుదల చేసారు చాలా సంతోషం అదే విధంగా కాలువలకు పడిన గండ్లను కూడ పూడ్చే కార్యక్రమాన్ని కూడ చేపడితే కింది ప్రాంత రైతుల కూడా న్యాయం జరుగుతుంది దుమ్ముగూడెం మండలంలో తూరుబాక వద్ద కల్వర్టు కృంగి పోయి ఉంటే బిఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు మండల నాయకులు ఉద్యమాన్ని చేపడితే వెంటనే బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు బిఆర్ఎస్ పార్టీ ఏప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం రైతుల కోసం నిరంతరం పోరాటం చేస్తుందని తెలియజేసారు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చుక్క రమేష్ గౌడ్.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చుక్క రమేష్ గౌడ్.

నర్సంపేట,నేటిధాత్రి:

దుగ్గొండి మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లంపల్లి గ్రామానికి చెందిన చుక్క రమేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఎన్నిక చేశారు. మండల అధ్యక్షులుగా చుక్క రమేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా చెన్నూరి కిరణ్ రెడ్డి, ఒలిగె నరసింగారావు, ఇంగోలి రాజేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి అజ్మీర రవీందర్ నాయక్, ఉపాధ్యక్షులు కామశోభన్ బాబు, నల్ల వెంకటయ్య, కార్యదర్శి అమ్మ రోహిత్, ప్రచార కార్యదర్శి కూరతోట సురేష్, కోశాధికారి జంగిలి రవి, కార్యవర్గ సభ్యులు హుస్సేన్ పల్లి విరాట్, గిన్నె స్వామి,రేవూరి వెంకట్ రెడ్డి,యార రవి, నల్ల యాదవ రెడ్డి, ఎర్ర ఆదిరెడ్డి, వేములపల్లి ఓదేలు, పుపాల శ్రీను, పరుపాటి ప్రభాకర్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ గుర్తింపు..

గత 30 సంవత్సరాలుగా వివిధ పార్టీలకు మండల స్థాయి బాధ్యతలు చేపట్టి ఎంపీపీ,సర్పంచ్ పదవులను చేపట్టి సేవలను అనుభవం కలిగిన వ్యక్తిగా దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన చుక్క రమేష్ గౌడ్ కు గుర్తింపు పొందాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హాయంలో దుగ్గొండి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.అలాగే తెలుగుదేశం పార్టీ దుగ్గొండి మండలం అధ్యక్షుడిగా సుమారు 15 ఏళ్ల పాటు పనిచేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా భాజపాకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గెలుపు కృషి చేశారు. కాగా చుక్క రమేష్ గౌడ్ దుగ్గొండి మండలంలో అన్ని గ్రామాలలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రజలకు సన్నిహితంగా ఉంటారు. గత శాసనసభ ఎన్నికల్లో రమేష్ గౌడ్ చేసిన కృషి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పైస్థాయి సీట్లను సాధించగలిగే సత్తా ఉండడంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
గుర్తించి దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షునిగా ఎంపిక చేసినట్లు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్..

అనతి కాలంలోనే తనపై నమ్మకంతో దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అవకాశం కల్పించారని,కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుల సహకారంతో పార్టీని దుగ్గొండి మండలంలో పూర్తిస్థాయిలో బలోపేతం చేయడానికి
తన వంతుగా కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ హామీ ఇచ్చారు. దేశంలోని ఎక్కడలేని విధంగా కులగనన చేపట్టి 42 శాతం బీసీ రిజర్వేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసిందని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రల బాబు పలువురు నాయకులకు చుక్క రమేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు మంజూరు.

మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు మంజూరు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం స్థానిక ఎంపీడీవో ఆఫీస్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. చేతుల మీదుగా జిల్లెల్ల గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన 26 మందికి పత్రాలు మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. మండలంలో గృహ అవసరాల నిమిత్తం ఇసుక కొరత లేదని అలాగే గృహ నిర్మాణాల కొరకు తమకు సంబంధించి పంట పొలాల నుంచి ఊరి చెరువుల నుంచి గాని. సంబంధిత గ్రామ కార్యదర్శి ద్వారా మండల. ఎమ్మార్వో.ద్వారా గాని పర్మిషన్ తీసుకొని ఇంటి నిర్మాణానికి వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా ప్రజలు మట్టి విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే జిల్లెల్ల గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు చెప్పిన మా పేరు ఉన్నది అని తీరా సమయానికి వచ్చేసరికి మా పేరు లేకపోవడంతో జిల్లెల్ల.గ్రామ క్రాసింగ్ లో చౌరస్తాలో.నడిరోడ్డుపై నివసిస్తున్న మా ఇల్లు 70 శాతానికి . పైగా రోడ్డు వెడల్పు కార్యక్రమాల్లో. ప్రభుత్వ అధికారులు తీసుకున్నారని దానికి అనుగుణంగా మీకు డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చేయడం జరుగుతుందని మాట ఇచ్చి ఇప్పుడు మా పేరు లేదని చెప్పడం ఎంతవరకు న్యాయమని అటువంటి వారం చాలామంది ఉన్నామని మా పిల్లల ఆరోగ్యలు బాలేకున్న కొన్ని సంవత్సరాల నుండి కిరాయిల. ఇండ్లలోబతుకుతూ జీవనం గడుపుతున్నామని దయచేసి సరైన లబ్ధిదారులు గుర్తించి మాకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేవిధంగా. మాపై దయవుంచి మాకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా జిల్లెల్ల గ్రామస్తులు తెలిపారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా.రాళ్ల పేట గ్రామంలో డబుల్ బెడ్ రూమ్. తుది దశలో ఉన్నందున పిడి హౌసింగ్ ఎంపీడీవోను అభినందిస్తూ లబ్ధిదారులు పారదర్శకంగా ఎంపిక చేసి వారికి తగిన న్యాయం చేకూరుస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. ఎంపీడీవో. ఎమ్మార్వో. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సిబ్బంది. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. ఏఎంసీ. మార్కెట్ చైర్మన్ స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్ నర్సింగ్ పిడి ఎంపీడీవో లక్ష్మీనారాయణ.తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. పూర్మాని లింగారెడ్డి. మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు లబ్ధిదారులు ప్రజలు పాల్గొన్నారు

కేంద్రమంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.

తంగళ్ళపల్లి మండల బిజెపి ఆధ్వర్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక బిజెపి మండలపార్టీ కార్యాలయంలో. తంగళ్ళపల్లి బిజెపి మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ బర్త్డే వేడుకలు పురస్కరించుకొని తంగళ్ళపల్లి మండల పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం నిర్వహించి తద్వారా మండల కేంద్రంలోని శ్రీ రామాలయ టెంపుల్ లో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక మండపల్లి చౌరస్తాలో గల బండి సంజయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ప్రత్యేకంగా బిజెపి రాష్ట్ర నాయకులు విచ్చేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి మాట్లాడుతూ ఆయన చదువుకునే వయసునుండే హిందుత్వంపై వ్యక్తిగతంగా ప్రత్యేక ఆకర్షితుడై విద్యార్థి దశలో ఉండే ఎన్నో పదవులు అనుభవించి నగరపాలక సంస్థ కార్పొరేటర్ గా రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఇంకా ఎన్నో పదవులు అనుభవిస్తూ ఆయన పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆయన చేసిన దానికి యువత ఆకర్షితులై ముందు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారుఈ కార్యక్రమంలో బిజెపి మండల జనరల్ సెక్రెటరీ రాజు ఇటుకల. కోసిని వినయ్ రెడ్డి మల్ల ఆశీర్వాదం. చిలువేరి ప్రశాంత్. పోకల శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు మేకల సురేష్. జంగం కిషన్ కిషన్ మూర్చ మండల అధ్యక్షుడు.నాగుల బొజ్జ బలగం భాస్కర్ రెడ్డి మల్ల అమరగుండ సురేష్. జలపతి మధుసూదన్.మహిళ పార్టీ నాయకురాలు కోడం భవిత. కటకం పల్లవి. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సొంత నిధులతో వీధి లైట్లు ఏర్పాటు చేసిన రమేష్ నాయక్…

నేటి ధాత్రి -గార్ల :-మండల పరిధిలోని, సత్యనారాయణపురం గ్రామపంచాయతీ ఇందిరానగర్ తండ గ్రామానికి చెందిన భూక్యా రమేష్ నాయక్ చిమ్మచీకట్లో ఉన్న పల్లెల్లో వీధి లైట్లు ఏర్పాటు చేసి వెలుగు నింపారు. వర్షాకాలంలో గ్రామాల్లో వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు పాము, తెలు కాట్లకు గురవుతారేమోనని ఆందోళన చెందిన రమేష్ వీధి లైట్లు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం. కొందరు రాజకీయాలు చేయడమే పనిగా, తమ స్వార్థం కోసం పని చేస్తుంటే ఇతను మాత్రం తన సొంత డబ్బులతో సమస్య పరిష్కరానికి కృషి చేయడాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. వీధి లైట్లు ఏర్పాటు చేసిన రమేష్ నాయక్ ను ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

 

street lights with own money

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర…

. మొగుళ్లపల్లి నేటి ధాత్రి

భూపాలపల్లి జిల్లామొగుళ్ళపల్లి మండల వాస్తవ్యులు బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి రామస్వామి విజయ గార్ల కుమారుడు చి||వినయ్ -చి||ల||సౌ శ్రీజ గార్ల వివాహ వేడుకల్లో పాల్గొన్ని వధూ వరులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సి ఎస్ ఐ సెయింట్ థామస్ చర్చ్ ఫాదర్స్
అనంతరం మొగుళ్ళపల్లి మండలం,పర్లపల్లి గ్రామ వాస్తవ్యులు కాల్వ రాములు -రజిత గార్ల కుమార్తె అక్షిత నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వారి వెంట ప్రజా ప్రతినిధులుమండలకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మహముత్తారంలో సమ్మె విజయవంతం

మహముత్తారంలో సమ్మె విజయవంతం

భూపాలపల్లి నేటిధాత్రి

మహాముత్తారం మండల కేంద్రంలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పోలం రాజేందర్ మాట్లాడుతూ
దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని ఈ సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా సంపూర్ణ మద్దతును ప్రకటించిందని వారు అన్నారు సమ్మె రోజున గ్రామీణ బందుకు పిలుపునిచ్చింది కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింత దూకుడు అమలు చేస్తుందన్నారు కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడులను ముందుకు తెచ్చింది అన్నారు

కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా రాస్తారోకో…

కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా రాస్తారోకో…

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లో అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు అమలు చేసిన విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు రాస్తారోకో నిర్వహించారు భారతదేశంలో కార్మికులందరూ జూలై 9న సార్వత్రిక సమ్మెను పిలుపులో భాగంగా కొత్తగూడ లో నిర్వహించారు పలువురు నాయకులు మాట్లాడుతూ కార్మికులపై పాలక -పెట్టు బడి దారి వర్గాలు మోపుతున్న వేతన బానిసత్వం పని గంటల పెంచిందని . కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కార్మిక చట్టాలను వెంటనే విరమించుకోవాలని కార్మికులకు కనీస వేతనాలు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ(న్యూ) బిఆర్ఎస్. నాయకులు అంగన్వాడి కార్యకర్తలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు,,

మొక్కులు సమర్పించుకున్న యువజన కాంగ్రెస్

మొక్కులు సమర్పించుకున్న యువజన కాంగ్రెస్ మంగపేట మండల నాయకులు.

మంత్రి సీతక్క నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యాంగా ఉండాలని ప్రత్యేక పూజలు.

మంగపేట- నేటిధాత్రి

మంగపేట మండల కేంద్రములోని శ్రీ ముక్కుడు పోచమ్మతల్లి ఆలయములో మంత్రి సీతక్క పుట్టిన రోజు ని పురస్కరించుకుని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ ఆధ్వర్యములో సమాజ సేవలో అహర్నిశలు కష్టపడుతూ ప్రజల సంక్షేమము కోసం కష్టపడుతున్న సీతక్క నిండు నూరేళ్లు సంతోషంగ ఆరోగ్యాంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజకీయ జీవితములో తాను చేస్తున్న అభివృద్ధి పనులు చాలా గొప్పవని వంధ సంవత్సరాలకు సరిపడా అభివ్రుద్ది చేస్తూ ఆలోచనలు చేస్తున్న సీతక్క బాగుండాలని కోరుకున్నారు..
కార్యక్రమములో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు…

శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా జాతర

*తిరుపతి రూరల్ మండలం తిరుమలనగర్ పంచాయతీలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా జాతర..

*అమ్మవారి జాతరకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేకి కర్పూర హారతులతో ఘనస్వాగతం పలికిన.‌

మహిళలు, గ్రామస్తులు.

*జాతరలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పులివర్తి నాని.

ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే..

తిరుపతి రూరల్(నేటి ధాత్రి) 

తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలోని తిరుమల నగర్ పంచాయతీలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా గంగమ్మ జాతరను నిర్వహించారుజాతరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని కి కర్పూర హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు, గ్రామస్తులు . జాతరలో అమ్మవారికి ఎమ్మెల్యే పులివర్తి నాని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గంగ జాతరకు విచ్చేసిన ప్రజలను, భక్తులను ఆప్యాయంగా పలకరించారు. ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలోని ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

జులై 9 జరిగే కార్మికుల సమ్మె విజయవంతం చేయండి

జులై 9 జరిగే కార్మికుల సమ్మె విజయవంతం చేయండి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని బుద్దారం గ్రామ పంచాయతీ సిబ్బంది తో జులై 9 న జరిగే దేశ వ్యాప్త కార్మికుల సమ్మె లో పాల్గొని విజయవంతం చేయుటకు, సమ్మె ఎందుకో వివరిస్తున్న సిఐటియు మండల కార్మిక నాయకులు దాసరి నితీష్, బోడ నర్సింగ్, ఈ కార్యక్రమం లో బుద్దారం గ్రామ పంచాయతీ కార్మిక నాయకులు బొచ్చు భద్రయ్య, సోమిడీ సమ్మక్క, సుధాకర్ రావు, కొలిపాక సులోచన, బొచ్చు రజిత, నిర్మాణ కార్మికులు దాసరి అజయ్, బోడ సయ్యయ్య తదితరులు పాల్గొన్నారు.

చలో హైదరాబాద్ కు తరలి వెళ్ళిన..

చలో హైదరాబాద్ కు
తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

కొత్తగూడ, నేటిధాత్రి:

గ్రామ కమిటీ అధ్యక్షుల మరియు క్రియాశీల కార్యకర్తల సమ్మేళనానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు విచ్చేసిన
ఏఐసీసీ అధ్యక్షుడు గౌరవ శ్రీ మల్లిఖార్జున ఖర్గే గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ…
ములుగు నియోజకవర్గ
మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు నియోజకవర్గ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ సూచనల మేరకు… కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి జేజేలు పలుకుతూ… కార్యకర్తలను చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు తరలించారు
ఈ కార్యక్రమంలో
కొత్తగూడ మండల అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు , మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు సోషల్ మీడియా విభాగం యువజన నాయకులు తరలి వెళ్లారు.

తల్లిదండ్రులరా జెర్ర ఆలోచించండి……!!!

తల్లిదండ్రులరా జెర్ర ఆలోచించండి……!!!*

◆:- ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్/ఝరాసంగం: ఝరాసంగం ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ మాట్లాడుతూ తల్లిదండ్రులరా జెర్ర ఆలోచించండి.. సర్కార్ బడులల్లో సదువుతున్న మీ పిల్లలకు సౌలతులు ఎట్లున్నాయో అరా తీయుర్రి.. రాష్ట్ర సంపాదనలో సగం వాట మీరు పన్నుల రూపంలో కట్టిన సొమ్ములే..ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాల కోసం పని చేయాలి..నాయకులు, ఓట్లేసిన జనాలకు జీతగాళ్లు.ఇంకా నాయకులు ముందు సంకల చేతులు కట్టుకోని నిలబడడం బంద్ చెయ్యాలి.. బజాప్తాగా సర్కార్ స్కూళ్ళను సందర్శించి,మధ్యాహ్న భోజనాన్నిరుచిచూడండి..విద్యార్థులకు సరిపోయే టీచర్లు ఉన్నారో, లేరో తెలుసుకోవాల్సిన ఉంది,ఆడపిల్లలకు సరిపోయేన్ని టాయిలెట్లు,మరుగుదొడ్లు ఉన్నాయో లేవో అడిగితేల్సుకోండి,రేపు మాపో సర్పంచ్ ఎన్నికల ప్రచారాలకు నాయకులు వస్తే,మీ ఊరి గవర్నమెంట్ బడులల్లో ఏదైనా సమస్యలు ఉంటే ఎక్కడికక్కడ నిలదీయండి..పేద పిల్లలు చదువుకుంటే ప్రభుత్వాలను ప్రశ్నిస్తారని, పేదోళ్లకు సదువు అందియకుండా, అగ్రవర్ణాల నాయకులు ప్రభుత్వ ఉద్యోగస్తులను సంకల పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు..పొమ్మనలేక పొగబెట్టినట్టు సర్కార్ స్కూళ్ళను సర్వనాశనం చేస్తున్న పలుకుబడి నాయకులు. జర జాగ్రత్త వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఓట్లు డిగే వారిని ప్రశ్నించలని. మనకు ఎవరు అందుబాటులో ఉండి పనిచేస్తారో ఆ నాయకుని దృష్టిలో పెట్టుకుని లేక మనకు వెనుకుండి కత్తి పోర్చు పొడిచే నాయకుని దృష్టిలో పెట్టుకొని వాళ్లను రాబోయే స్థానిక ఎన్నికలో గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.మండల పరిధిలోని అన్ని గ్రామాల యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కూడా యువత ఐక్యమత్యంగా ఉండి ఎన్నికల్లో పోటీ చేసి యువత గెలిచేల పనిచేస్తామని,గ్రామ అభివృద్ధే దేశాభివృద్ధికి దోహదపడుతుందని,గ్రామఅభివృద్ధి యువతతోనే సాధ్యమని రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎలక్షన్లను తప్పకుండా యువత గెలుస్తుందని మండల పరిపాలన మొత్తం యువత చేతుల్లో ఉంటుందని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version