మొగడంపల్లీ మండలం మోతిమాత అమ్మ వారి ఆలయ.

మొగడంపల్లీ మండలం మోతిమాత అమ్మ వారి ఆలయ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం మంజూరు

◆:- హర్షవ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు*

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: పట్టణంలోని ఉజ్వల్ రెడ్డి గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రిక సమావేశం నిర్వహించారు.ఈసమావేశంలో డిసిసి ప్రధాన కార్యదర్శి ధనసిరి.మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో మొదటి సారిగా ఉప్పర్ పల్లీ తండా గ్రామంలో మోతిమాత అమ్మ వారి ఆలయ కేంద్రానికి వచ్చారు.స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం మంజూరుకి కృషి చేయ్యాలని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడంతో వారు సానుకూలంగా స్పందించి మంజూరు కి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మంజూరు చేశారు అని వారు తెలిపారు.మొగడంపల్లీ మండలంలోని ఉప్పర్ పల్లీ తండా గ్రామంలో మోతిమాత అమ్మ వారి ఆలయ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం మంజూరుకి కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,ఎం.పి.సురేష్ శెట్కార్,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి హర్షవ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈకార్యక్రమంలో మాజీ యం.పి.పి.ప్రియాంక గుండా రెడ్డి,జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,SC సెల్ అధ్యక్షుడు గోపాల్,ST సెల్ అధ్యక్షుడు చందర్,గోవర్ధన్ రెడ్డి,రూప్ సింగ్,రాజు పవార్, కన్నా నాయక్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version