పరిశుభ్రత పై నగరం పాఠశాల
మండలంలోనే మొదటి స్థానం..
నిజాంపేట ,నేటి ధాత్రి
స్వచ్చత పరిశుభ్రత హరిత పాఠశాల కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరానికి గాను నిజాంపేట మండలం నగరం ప్రభుత్వ పాఠశాల మొదటి స్థానాన్ని దక్కించుకుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. పాఠశాల పరిశుభ్రత విషయం లో 61 అంశాల్లో పాఠశాల పురోగతిని పరిశీలించి రేటింగ్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రేటింగ్స్ లో మండలంలోని నగరం తండా గ్రామంలో గల పాఠశాల ఫైవ్ స్టార్ రేటింగ్ తో మొదటి స్థానం లో నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన ఉన్నారు.
