బాలాజీ విద్యాసంస్థల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

బాలాజీ విద్యాసంస్థల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

బాలాజీ విద్యాసంస్థల్లో ఒకటైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ పాఠశాల,అక్షర పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు.బాలాజీ విద్యాసంస్థల్లో నెలకొని ఉన్న శ్రీ సరస్వతిదేవి ఆలయంలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.ఈ వేడుకలలో బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ వనజ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్
వనజ సరస్వతిదేవి యొక్క విశిష్టతను తెలియజేశారు.సకల విద్యా స్వరూపిణి సరస్వతిదేవి అని ఆమె కృపా కటాక్షములు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేసి ఓంకారాన్ని దిద్దించారు. విద్యార్థులందరూ పుస్తకాలను ,కళములను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజించారు.
ఈ కార్యక్రమంలో విద్యాలయాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి గౌడ్,భవాని,ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ముత్యంపేట అంగన్వాడిలో వసంత పంచమి సామూహిక అక్షరాభ్యాసాలు

ముత్యంపేటలో వసంత పంచమి పురస్కరించుకొని అంగన్వాడి పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసాలు
మల్లాపూర్ జనవరి 23 నేటి ధాత్రి

 

మండలంలోని ముత్యంపేట అంగన్వాడి పాఠశాలలో శుక్రవారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. అంగన్వాడి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సర్పంచ్ తేలు నరేష్ పలకలు,బలపాలు నోట్ బుక్స్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, సర్పంచు తేలు నరేష్, ఉపసర్పంచ్ వంగ పోతయ్య, పంచాయతీ కార్యదర్శి మోబిన్, హనుమాన్ల అభిలాష్, అంగన్వాడి టీచర్లు ఆమెటి శ్రీలత, దాసరి లక్ష్మి, సుద్దాల కృష్ణవేణి తోపాటు పలువురు పాల్గొన్నారు.

కేసముద్రంలో ఘనంగా నేతాజీ జయంతి

ఘనంగా నేతాజీ జయంతి

కేసముద్రం/ నేటి ధాత్రి

మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ లో శుక్రవారం స్వామి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ నేతాజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన అపూర్వ త్యాగాలను గుర్తు చేశారు. స్వాతంత్ర పోరాటంలో ఆయన చూపిన ధైర్యసాహసాలు, దేశభక్తి, నాయకత్వ గుణాలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. విద్యార్థులు నేతాజీ ఆశయాలను జీవితంలో ఆచరించాలని సూచించారు.
వసంత పంచమి సందర్భంగా పాఠశాలలో సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రాయికల్ పాఠశాలలో వైభవంగా సరస్వతీదేవి అర్చన

వైభవంగా సరస్వతీదేవి అర్చన

వసంత పంచమి ఉత్సవాలు

రాయికల్ జనవరి 23 నేటి ధాత్రి:

రాయికల్.పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు లో నెలకొల్పిన శ్రీ సరస్వతీ దేవి మండపం వద్ద శుక్రవారం దేవికి పూజలు నిర్వహించారు. వివిధ రకాల పువ్వులచే సరస్వతీ దేవి అర్చన పూజలు చేశారు. అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులచే సరస్వతీ దేవికి ప్రత్యేక ప్రార్థనలు చేయించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గట్టు రమేష్ నర్సయ్య ఉపాధ్యాయులు చెరుకు మహేశ్వర శర్మ లక్కాడి రాజరెడ్డి, పి.శ్రీనివాస్, వి.గంగరాజం, రవీందర్, పి. రాజశేఖర్ పి.రమేష్,యండి రాజమహ్మద్, ఎ.పద్మ.జి.తరంగిణి,ఎ.రజిత, యస్.శోభ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

కేసముద్రంలో వసంత పంచమి ఉత్సవాలు

వసంత పంచమి… శ్రీ సరస్వతీ మాత పూజా అభిషేకం

చిన్నారులకు సామూహిక అక్షరభ్యాసం

కేసముద్రం/ నేటి ధాత్రి

సమత ఇంటిగ్రేటెడ్ ప్లేవె స్కూల్ నందు వసంత పంచమి పునరస్కరించుకొని శ్రీ సరస్వతి మాత పూజ అభిషేకం మరియు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరామయ్య ఆచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమాలు మరియు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించడం జరిగింది. చిన్నారులు, స్కూల్ పిల్లలు సరస్వతి మాత శ్లోకాలు వల్లవేస్తూ సరస్వతి మాత గేయాలనుపాడడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బాణాల నాగరాజు మాట్లాడుతూ సరస్వతి మాత కృపా కటాక్షాలు ప్రతి ఒక్క విద్యార్థి మీద ఉండి భవిష్యత్తులో ఉన్నత శిఖరాల అధిరోహించాలని ఆకాంక్షించారు. దీంతోపాటు ఈ సంవత్సరం నర్సరీలో అడ్మిషన్ పొందే ప్రతి ఒక్క విద్యార్థికి పూర్తిగా ఉచిత విద్యను అందిస్తామని తెలపడం జరిగింది. కావున ప్రతి తల్లిదండ్రులు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడవలసిందిగా యాజమాన్యం కోరుకుంది. ఈ కార్యక్రమంలో పండితుల కరుణాకర్ రావు,బేబీ సరోజినీ, అల్లం జ్యోతి, ముత్యాల ప్రజ్ఞ శ్రీ,, లలిత పద్మ,సిమ్రాన్ , భాగ్యలక్ష్మి మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కల్వకుర్తిలో ఘన వసంత పంచమి వేడుకలు

కల్వకుర్తిలో ఘనంగా వసంత పంచమి వేడుకలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి పట్టణంలో సుభాష్‌నగర్‌లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమం హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 77 మంది చిన్నారులు అక్షరాభ్యాసం చేయించుకోగా, సుమారు 250 మంది తల్లిదండ్రులు, పోషకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రబంధకారిణి సభ్యురాలు శ్రీమతి నిర్మల అక్షరాభ్యాసం ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు సేవకుల రాజు, విద్వత్ సమితి సభ్యులు సూరం తిరుపతి రెడ్డి దామోదర్ రెడ్డి ,ప్రబంధ కారిణి సభ్యులు కూన కిశోర్ ఆచార్యులు, మాతాజీలు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం

నడికూడ,నేటిధాత్రి:

మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో వసంత పంచమి పురస్కరించుకుని అంగన్వాడీ టీచర్లు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలో అంగన్వాడీ టీచర్లు ఎన్.అనిత,డి.సంపూర్ణ, డి.వినోద,ఆయాలు,పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version