కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టింది.

కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టింది.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టింది స్వాతంత్ర్య ఉద్యమం నుండి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో ప్రజా పోరాటలలో పోరాడిన మన ప్రో. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో,అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క దీరత్వాన్ని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ భావితరానికి గుర్తుండిపోయేలా ట్యాంక్ బండ్ మీద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, వారి పేరు హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టి గౌరవించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి పోరాట స్ఫూర్తిని భావితరాల యువత పునికి పుచ్చుకుని ఆదిశగా పని చేయాలని కోరిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కి శాలువ కప్పి స్వాగతం పలికిన శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ కన్వీనర్ ఎలగొండ రాజేంద్రప్రసాద్,కో కన్వీనర్, అడ్డగట్ల శ్రీధర్,గొర్లవీడు గ్రామ సీనియర్ నాయకులు నరసయ్య పద్మశాలి కుల పెద్దలు.
బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బాపూజీ ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగుదాం…

బాపూజీ ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగుదాం

దశాబ్దాల పోరాటాలకు నిలువెత్తు నిదర్శనం కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు మహేష్ వర్మ

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బాపూజీ 110 వ జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మహేష్ వర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం టీఆర్పీ మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ మాట్లాడుతూ.. తెలంగాణ మొదటి ఉద్యమకారుడు బాపూజీ అని అన్నారు. తెలంగాణ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయులని,బడుగు బలహీన వర్గాల చైతన్యానికి, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగాలు, సేవలను గుర్తు చేసారు. తెలంగాణ తొలి,మలి దశ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించి తెలంగాణ జాతిపితగా కీర్తిని గడించారని అన్నారు.పదవులకన్నా ప్రాంతానికే మొదటి ప్రాధాన్యతను ఇచ్చి,తన పదవులను వదులుకుని ఉద్యమాన్ని ఉదృతం చేసి, ప్రజలను చైతన్యం చేసారని అన్నారు.వారి జయంతి సందర్భంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముద్దు బిడ్డ, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ ని స్పూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో మన రాజ్యాధికారం సాధించుకునేందుకు అధికారం,ఆత్మగౌరవం,వాటా నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తుందని, దీనికి అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాకాల దినకర్, దాస్యపు దీపక్,పడాల శివతేజ,కొత్తూరి సంతోష్, కుంట రాజేంద్రప్రసాద్, నామాల తిరుపతి,అకెనపల్లి మధు,పెట్టం రాజేష్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ…

కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితాంతం కృషి చేశారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు.శనివారం భూపాలపల్లి మంజూరునగర్ లోని పాత కలెక్టరేట్ కూడలిలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ తొలితరం ఉద్యమనాయకుడిగా, నిబద్దత కలిగిన గొప్ప రాజకీయవేత్తగా ఎంతో పేరు తెచ్చుకున్న బాపూజీ జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. బహుజన నేతగా పద్మశాలీలను సంఘటితం చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం నాడు మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి కలిగించారని పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని ఐడీవోసీ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి కలెక్టర్ తో కలిసి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి ఇందిర పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి అప్పం కిషన్ అంబాల శీను ముంజల రవీందర్ పద్మశాలి కుల సంఘ నాయకులు ప్రసాద్ శ్రీధర్ శ్రీనివాస్ సతీష్ భాస్కర్ కార్యకర్తలు పాల్గొన్నారు

జిల్లా కలెక్టర్ కార్యాలయం లోకొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

జిల్లా కలెక్టర్ కార్యాలయం లోకొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
వనపర్తి నేటిదాత్రి .   

 

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన కోసం తెలంగాణలోని  ప్రతి పౌరుడు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ  జయంతి వేడుకలను జిల్లా బి.సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపి శంకర్ నాయక్ రాజేంద్రప్రసాద్, బీసి. సంక్షేమ శాఖాధికారి ముజాహిద్దీన్, జిల్లా అధికారులు పద్మశాలి సంఘం నాయకులు.సామాజికవేత్త రాజారాం ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version