మైసూర్ లో వెస్టీజ్ కంపెనీ మైండ్ సెట్ శిక్షణ ఏర్పాటు…

మైసూర్ లో వెస్టీజ్ కంపెనీ మైండ్ సెట్ శిక్షణ ఏర్పాటు

విజయవంతం చేసిన మంచిర్యాల టీం

హైదరాబాద్,నేటి ధాత్రి:

 

 

మైసూర్ లో వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ మైండ్ సెట్ శిక్షణ క్లాసులు మంగళవారం,బుధవారం రెండు రోజులుగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వి.ఎం.సి.ఎం సుబ్బయ్య శెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని వి.ఎం.సి.ఎం ఎం.ఎస్.ఆర్ తో కలసి మైండ్ సెట్ శిక్షణ క్లాసులు 300 మందికి పైగా మైసూర్ ప్రెసిడెంట్ హోటల్ లో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వి.ఎం.సి.ఎం సుబ్బయ్య శెట్టి మాట్లాడుతూ.. మైండ్ సెట్ క్లాస్ అంటే ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి మనస్తత్వాన్ని ఎలా మార్చుకోవాలి అనే దానిపై శిక్షణ,విధివిధానాలు తెలిపారు.సుబ్బయ్య శెట్టి మాటలు విన్న చాలా మంది నిరు పేదలు వారి మైండ్ సెట్ మార్చుకొని వెస్టీజ్ కంపెనీలో నిలబడి పనిచేస్తూ వాళ్ళ జీవితాలను మార్చుకొని గొప్పగా జీవిస్తూ వారి ఆశయాలను సాధిస్తున్నారని అన్నారు.

మన జీవనశైలి విధానంలో మార్పు రావాలి

ప్రతి ఒక్క వ్యక్తి తన జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్న వారి ఆర్థిక ఇబ్బందులను,సమస్యలను నిలుదొక్కుకొని వేస్టేజ్ సిస్టం ను ఫాలో అవ్వడం వల్ల వారి లక్ష్యాన్ని చేరుకుంటారని అన్నారు.

ప్రతి పనిలో పట్టుదలతో పనిచేయాలి

మానవ జీవన విధానంలో ఏ పని చేసిన పట్టుదలతో,ఒక సంకల్పం లాగా పని చేసినప్పుడే విజయాలు చేకూర్తాయని అన్నారు.అలాగే నీతి,నిజాయితీ,ఏకాగ్రత,నిబంధనతో పనిచేస్తూ తోటి వారికి సహాయం చేస్తూ ప్రేమగా,ఆప్యాయంగా ఉంటూ విజయాలను సాధించాలని తెలిపారు.

అడవి తల్లి బాటపై ప్రత్యేక ఫోకస్..

అడవి తల్లి బాటపై ప్రత్యేక ఫోకస్.. అధికారులకు పవన్ కళ్యాణ్ సూచనలు

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.

అమరావతి: రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆయన సూచించారు. పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందని తెలిపారు.

సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి.

సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి
• పిచ్చి మొక్కలకు గడ్డి మందు పిచ్కారి.

నిజాంపేట: నేటి ధాత్రి

వర్షాకాలం సీజనల్ వ్యాధులను నేపథ్యంలో పారిశుద్ధ్యం పై గ్రామస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామ కార్యదర్శి మమత ఆదేశాల మేరకు పారిశుద్ధ కార్మికులు కలుపు మొక్కలకు గడ్డి మందు పిచికారి చేస్తున్నారు. కార్యక్రమంలో నర్సిములు, కొమ్మట రాజు, పోచవ్వ, ఎల్లవ్వ, జామున, ఎల్లయ్య లు ఉన్నారు.

పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి.

పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి
• జాగ్రత్తలు పాటించాలి
• కార్యదర్శి చంద్రహాస్..

నిజాంపేట: నేటి ధాత్రి

పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి వహించాలని గ్రామ కార్యదర్శి చంద్రహాస్ అన్నారు. ఈ మేరకు మండలంలోని రాంపూర్ గ్రామంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం లో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యం పై తనిఖీలు నిర్వహించారు. ఇంటి ఆరు బయట నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల దృశ్య ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి ఆరు బయట కలుపు మొక్కలు లేకుండా చూడాలన్నారు. గ్రామంలో వైద్య చికిత్స నిమిత్తం ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

విద్య వైద్యంపై కాంగ్రెస్ దృష్టి.

— విద్య వైద్యంపై కాంగ్రెస్ దృష్టి
• ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి
• ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

నిజాంపేట నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో 32 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. అనంతరం రాంపూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మునిరాజు ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందివ్వడం జరిగిందన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుప్రభాతరావు, నిజాంపేట మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, మండల తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో రాజిరెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ రమ్య శ్రీ, ఆర్ఐ ప్రీతీ, హిమాద్, ఎంపీవో ప్రవీణ్ నాయకులు అమర్సేనారెడ్డి, సిద్ధ రాములు, పంజా మహేందర్, నజీరుద్దీన్, సత్యనారాయణ, లక్ష్మా గౌడ్ , ఆకుల బాలయ్య,గుమ్ముల అజయ్, శ్యామల మహేష్ తదితరులు ఉన్నారు.

ఆదివాసి యువత విద్య, క్రీడల పై దృష్టి పెట్టాలి.

ఆదివాసి యువత విద్య, క్రీడల పై దృష్టి పెట్టాలి

గుండాల సిఐ రవీందర్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏస్ పి రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు, ఇల్లందు డి ఏస్ పి చంద్రభాను సూచన మేరకు బుధవారం గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని శంబుని గూడెం గ్రామంను గుండాల సిఐ లోడిగ రవీందర్, కొమరారం ఎస్ఐ సోమేశ్వర్ సందర్శించి వారికి వాలీబాల్ కిట్టు ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ ఆదివాసి యువత నక్సలిజానికి, అసాంఘిక శక్తులకి దూరంగా ఉండాలని, అభివృద్ధి దిశగా పయనించాలని తెలిపినారు. యువత చెడు వ్యసానాలకు దూరంగా ఉంటూ విద్య వైపు తమ దృష్టిని మళ్ళించాలని, అప్పుడే ఆదివాసి గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపపారు. అదేవిధంగా క్రీడలను తమ దైనందిక కార్యక్రమాలలో భాగంగా చేసుకోవాలని, దాని ద్వారా శారీరకకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు. గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చిన, అనుమానస్పద వ్యక్తులు వచ్చిన పోలీస్ వారికి వెంటనే తెలియజేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, బండి నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, అన్ని డాక్యూమెంట్స్ కలిగి ఉండాలని, మద్యం త్రాగి వాహనాలు నడపారాదని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలని, అపరిచితులకు తమ యొక్క బ్యాంకు వివరాలు, ఓటీపీ నెంబర్ లు తెలుపవద్దని చెప్పారు. శంబుని గూడెం గ్రామస్తులు తమకు వాలీబాల్ కిట్టు ఇవ్వడం ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మంచినీటిపై ప్రత్యేక దృష్టి.

• ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నీటి పరీక్షలు

నిజాంపేట: నేటి ధాత్రి

వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో నీటిని వృధా చేయవద్దని మిషన్ భగీరథ అధికారులు సూచించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఉదయం మిషన్ భగీరథ అధికారులు ఇంటింటికి వెళ్లి నీటి నమూనాలను సేకరించి క్లోరోస్కోప్ అనే పరికరం తో పరీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ఏఈ ఆదేశాల మేరకు మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసి ప్రజలకు నీటిని అందించడం జరుగుతుందన్నారు. బ్లీచింగ్ పౌడర్ ట్యాంక్ కెపాసిటీ 10 వేలు ఉంటే 40 గ్రాములు కలపడం జరుగుతుందన్నారు. ట్యాంక్ నుండి నీటిని విడుదల చేసే 30 నిమిషాల ముందు పౌడర్ ను కలపడం జరుగుతుందన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి మంచి నీటిని అందించడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పరశురాములు, నర్సింలు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version