టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అమర హాస్పిటల్ లో మెగా మెడికల్ చెకప్..

టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అమర హాస్పిటల్ లో మెగా మెడికల్ చెకప్

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 26:

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) సిబ్బందికి అమర హాస్పిటల్ లో శనివారం మెగా మెడికల్ చెకప్ ప్రారంభమయ్యింది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్త ఉత్తర్వులు మేరకు, టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు గారి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ లోని పోలీసులు, అటవీ శాఖ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పూర్తి స్థాయి మెడికల్ చెకప్ లు చేపట్టారు. శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ గౌరినేని రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారుఈ సందర్భంగా

ఎస్పీ పీ శ్రీనివాస్ మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి వార్షిక మెడికల్ చెకప్ చేయడానికి ఈ ఏడాది అమర హాస్పిటల్ ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది యావన్మందికి రెండు రోజులు పాటు మెడికల్ చెకప్ చేస్తున్నారని తెలిపారు. అమర ఎండీ రమాదేవి మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్ల తనకు ప్రత్యేక గౌరవం ఉందని అన్నారు. పుష్ప సినిమాలో ఉన్నది సినిమా హీరో అయితే, రియల్ హీరోలు టాస్క్ ఫోర్స్ సిబ్బందే నని కొనియాడారు. మున్ముందు అవసరమైన ఇతర చికిత్సలు కూడా అందజేస్తామని చెప్పారు. అమర చైర్మన్ డాక్టర్ గౌరినేని ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యం గా ఉండటమే జీవితంలో నిజమైన విజయం సాధించడమని తెలిపారు. మెడికల్ చెకప్ లో భాగంగా రక్త పరీక్షలు, బీపీ, ఈసీజీ లాంటి టెస్ట్ లు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు జి. బాలిరెడ్డి. వీ. శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్, ఆర్ఐలు కృపానంద, సాయి గిరిధర్, సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ, ఇంకా ఆర్ఎస్ఐలు, ఇతర సిబ్బందితో పాటు హాస్పిటల్ జీఎం ఆనంద్, సీఈఓ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

స్థలం కబ్జా ను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది.!

జర్నలిస్టు కాలనీ స్థలం కబ్జా ను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్య
లు తప్పవు బెల్లంపల్లి తహసిల్దార్ జోష్ణ.

బెల్లంపల్లి నేటిధాత్రి:

 

 

బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదా
రిని ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీ స్థలంలో కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ప్లాటింగ్ చేసి హద్దు రాళ్ళను ఏర్పాటు చేయడంతో రెవె
న్యూ అధికారులు బుధవారం తొలగిం
చారు. వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజుల కిందట జర్నలిస్టు కాలనీ లోని స్థలంలోకొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా సిమెంటు పోల్స్ పాతిస్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు(టేకు
లబస్తీ) జర్నలిస్టు కాలనీకి వెళ్లి క్షేత్ర
స్థాయిలో పరిశీలించి సంబంధిత తహసిల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్లను విషయాన్ని వివరించి స్థలాన్ని రక్షించి అర్హులైన జర్నలిస్టులకు సంబంధిత స్థలాన్ని కేటాయించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేయడం జరి
గింది. స్పందించిన బెల్లంపల్లి తహసీల్ జోష్ణ ఆదేశాల మేరకు బెల్లంపల్లి రెవెన్యూ ఆర్ఐ మురళీదర్ రెవెన్యూ సిబ్బంది సహాయంతో స్థలంలో పాతిన సిమెంట్ పోల్స్ ను తొలగించారు. ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి జర్నలిస్టు కాలనీ స్థలాన్ని రక్షించినందుకు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సదానందం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ జోష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా హామీ హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలను వెలికి తీసుకున్న వర్కింగ్ జర్నలిస్టు
లందరికీ జర్నలిస్టు కాలనీలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version