కట్ర్యాల గ్రామం నుంచి వంద పడకల ఆసుపత్రిని తరలిస్తే ఊరుకునేదే లేదు..

కట్ర్యాల గ్రామం నుంచి వంద పడకల ఆసుపత్రిని తరలిస్తే ఊరుకునేదే లేదు

భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట.(నేటిధాత్రి):

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామం ఉప్పరపల్లి క్రాస్ వద్ద నిర్మించ తలపెట్టిన వంద పడకల ఆసుపత్రిని వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రానికి తరలిస్తే ఊరుకునేది లేదని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారిని హెచ్చరించారు. మూడు మండలాల ప్రజలకు అందుబాటులో విధంగా నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిని నియోజకవర్గ కేంద్రం వర్ధన్నపేటకు తరలించడం ద్వారా మూడు మండలాలకు చెందిన గ్రామాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని దానిని గుర్తుంచుకొని ఎక్కడైతే వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు అక్కడే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తగిలిందని ఇప్పటికైనా ఆ పార్టీ బుద్ధి తెచ్చుకొని నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్య విద్య అందించడం కోసం ప్రజలకు అనువైన సౌకర్యాలను కల్పించడం కోసం పని చేస్తే బాగా ఉంటుందని మహేందర్ రెడ్డి అన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం లోని గ్రామాలకు ఎటువంటి అభివృద్ధి చేపట్టని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఖాళీ శంకుస్థాపనలతో కాలయాపన చేస్తూ కాంగ్రెస్ నేతల జేబులు నింపుకోవడం కోసం కొన్ని మాఫియాలను పెంచుకుంటూ పోతూ వారి స్వలాభం కోసం వారి కుటుంబ స్వలాభం కోసం పనిచేస్తూ ఉన్నారని అది గమనించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరియు ఎమ్మెల్యేకి గట్టిగా బుద్ధి చెప్పారనేది వర్ధన్నపేట నియోజకవర్గంలో నిరూపణ జరిగిందని అని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని మేజర్ గ్రామపంచాయతీలు అయిన పంతిని .కట్ర్యాల. గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా పార్టీ జెండా ఎగరవేసిందని అలాగే కక్కిరాలపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఉపసర్పంచ్ చేజిక్కించుకోవడం జరిగిందని ఇల్లంద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయడం కడారి గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం జరిగిందని దీన్ని ఆలోచించి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుద్ధి తెచ్చుకోవాలని గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉప్పరపల్లి అయినవోలు పున్నేలు గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకుండా ప్రతిపక్షాలు పనిచేశాయని అదేవిధంగా పర్వతగిరి మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ తన జెండా ఎగరవేసిందని తెలియజేశారు ఈ విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ప్రజలు అధికార పార్టీకి గట్టి బుద్ధి చెప్పారని కావున ప్రజలకు అవసరమైన పనులను అతి త్వరలో చేపట్టి వారికి అవసరమైన అన్ని విధాల విద్య వైద్య నీటి సౌకర్యం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి రావలసిన దేవాదుల కాలువ ద్వారా నీరు నీరు ఇప్పటికీ తేకపోవడం ఎంత విడ్డూరంగా ఉంది అంటే ఇచ్చిన హామీలను మరిచిపోయి నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ప్రజలకు న్యాయం చేయకపోతే నిత్యం ప్రభుత్వం ప్రజల వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని ప్రజల సహకారంతో ఉప్పరపల్లి క్రాస్ వద్ద నిర్మించ తలపెట్టిన 100 పడకల ఆసుపత్రిని తరలిస్తే పెద్ద ఉద్యమాన్నిగా నిర్మించి గట్టిగా బుద్ధి చెప్తామని వచ్చే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేస్తామని మహేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హెచ్చరించారు.

విద్య, వైద్యరంగంపై ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ఫోకస్..

విద్య, వైద్యరంగంపై ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ఫోకస్..

 

గత ప్రభుత్వ హయాంలో వర్ధన్నపేట అభివృద్ధికి నోచుకోలేదు..

ప్రజలు సమీప ప్రాంతాల్లోనే నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందేలా ఆధునిక పరికరాలు, ప్రత్యేక వైద్య విభాగాలు, సిబ్బంది నియామకాలు అన్నింటినీ ప్రాధాన్యతతో అమలు చేస్తాం…

గత ప్రభుత్వంలో శిలాఫలకాలు వేశారే తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని, ప్రజా ప్రభుత్వంలో చిత్తశుద్ధితో వర్ధన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి…

వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు ఈ ఆస్పత్రి ఎంతో మేలు చేస్తుంది..

వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ 100 పడకల ఆస్పత్రికి నేడు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు కలెక్టర్ సత్య శారద దేవి

వర్ధన్నపేట( నేటిధాత్రి)
పర్వతగిరి, ఐనవోలు మండలాల ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని, ఉప్పరపల్లి క్రాస్‌ రోడ్ వద్ద 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి నేడు సుమారు రూ. 28 కోట్ల నిధులతో నిర్మించబడనున్న ఈ ఆసుపత్రికి భూమిపూజను గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, టీజీ క్యాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు గారితో కలిసి శంకుస్థాపన చేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ
గత ప్రభుత్వ హయాంలో వర్ధన్నపేట అభివృద్ధికి నోచుకోలేదని, గత ప్రభుత్వంలో శిలాఫలకాలు వేశారే తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని, ప్రజా ప్రభుత్వంలో చిత్తశుద్ధితో వర్ధన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. విద్య, వైద్యరంగంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, వంద పడకల ఆసుపత్రి ఈ ప్రాంత ప్రజల కళ అని, అన్ని మండలాల ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఉప్పరపల్లి వద్ద వంద పడకల ఆసుపత్రి పనులను చేపడుతున్నామని, వీలైనంత త్వరగా ఆసుపత్రి పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలోని డయాలసిస్ పేషెంట్లు వైద్యం కోసం ఎంజీఎం వెళ్లాల్సి వస్తుందని, వర్ధన్నపేట నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ మంజూరు అయిందని, డయాలసిస్ సెంటర్ మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహలకు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. త్వరలోనే మున్సిఫ్ కోర్టు ప్రారంభమవుతుందని, కోర్టు ఏర్పాటు అయితే ఈ ప్రాంత ప్రజలకు హనుమకొండకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో విద్య, వైద్యం, క్రీడారంగ బలోపేతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని, త్వరలోనే నియోజకవర్గానికి స్టేడియం మంజూరు అవుతుందన్నారు. ఇటీవలే వరంగల్ జిల్లా కలెక్టర్ జల సంరక్షణలో అవార్డును అందుకున్నారని, కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. మహిళా కలెక్టర్ అయిన అనునిత్యం ప్రజల్లో ఉంటూ మెరుగ్గా పనిచేస్తున్నారని, వరంగల్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా కలెక్టర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు….

“వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ప్రజలు సమీప ప్రాంతాల్లోనే నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందేలా ఆధునిక పరికరాలు, ప్రత్యేక వైద్య విభాగాలు, సిబ్బంది నియామకాలు అన్నింటినీ ప్రాధాన్యతతో అమలు చేస్తాం.
ఈ ఆసుపత్రి ద్వారా అత్యవసర సేవలు, ప్రసూతి సేవలు, శస్త్రచికిత్సలు, పిల్లల వైద్య సేవలు వంటి సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అంబులెన్స్ సేవలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు త్వరితగతిన చికిత్స అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తాము.
వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు ఈ ఆస్పత్రి ఎంతో మేలు చేస్తుంది. ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం. ప్రజల విశ్వాసానికి తగిన విధంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తాం” అని అన్నారు.ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి మాట్లాడుతూ.
వర్ధన్నపేట నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుతో ఎంజీఎం ఆస్పత్రిపై భారం తగ్గుతుందని, 1-2 సంవత్సరాలు ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ప్రస్తుతం 300, 400 ఓపి పేషెంట్లు వస్తున్నారని, భవిష్యత్తులో ఒపీ పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, మెడికల్ హబ్ గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు…
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి, వరంగల్ జిల్లా DM&HO సాంబ శివరావు, DCH రామ్మూర్తి, సూపర్డెంట్ నరసింహ స్వామి, ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు….

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యం — గ్రామాల సమగ్ర అభివృద్ధి…

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యం — గ్రామాల సమగ్ర అభివృద్ధి
ఐనవోలు మండలంలో రూ. 7.5 కోట్ల పనులకు ఎమ్మెల్యే నాగరాజు శంకుస్థాపన
అయినవోలు మండల కేంద్రంలో ఎమ్మెల్యేకు నిరసన సెగ
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపికలో పారదర్శకత లేదు
ఎమ్మెల్యేను నిలదీసిన సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు

నేటి ధాత్రి అయినవోలు :-

 

ఐనవోలు, ఒంటిమామిడిపల్లి, పున్నెల్ గ్రామాల్లో సిఆర్ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ మరియు పంచాయతీరాజ్ నిధుల ద్వారా రూ. 7.5 కోట్ల వ్యయంతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కే.ఆర్. నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీజీ క్యాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు పాల్గొన్నారు.గ్రామీణ అభివృద్ధే నిజమైన ప్రజా సేవ” — ఎమ్మెల్యే నాగరాజు

ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ,ప్రతీ గ్రామంలో ప్రాథమిక వసతుల మెరుగుదలే మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రహదారులు, డ్రైనేజీలు బాగుంటే ప్రజల జీవన ప్రమాణాలు ఎత్తుకు చేరతాయి. ప్రజలు నమ్మి ఇచ్చిన ప్రతి రూపాయిని పారదర్శకంగా, నాణ్యతగా వినియోగిస్తాం. అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాల నిజమైన అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నామని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ కాలనీలకు ప్రత్యేక నిధులు కేటాయించారని,
సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందిస్తున్నామని తెలిపారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపాటు

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో భారీ దోపిడీ చేసిందని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు.ప్రస్తుతం ప్రజలకు అందుతున్న పథకాలు అన్ని బలహీన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం” అని స్పష్టం చేశారు.

ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర — ఏర్పాట్లపై సమీక్ష

సమీపిస్తున్న ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర సందర్బంగా ఎమ్మెల్యే స్వయంగా శాఖల వారీగా అధికారులతో సోమవారం సమావేశమై జాతరకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి

ఉప్పరపల్లి క్రాస్ రోడ్డులో 100 పడకల ఆస్పత్రి కోసం స్థల సేకరణ జరుగుతోందని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.దీనివల్ల వర్ధన్నపేట, పర్వతగిరి ఐనవోలు మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు నిరసన నిరసన సెగ

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికపై సొంత కార్యకర్తలే నిలదీశారు

ఐనవోలులో ఇందిరమ్మ కమిటీ ఎంపిక పట్ల తీవ్ర అసంతృప్తి చెలరేగింది. కమిటీ ఎంపికలో పారదర్శకత లేకుండా సొంత అర్హులను పక్కనపెట్టి, అనర్హులకు అవకాశాలు కల్పించారని మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో నిజమైన అర్హులైన లబ్ధిదారుల పేర్లు గాలిలో కలిసిపోయి, రాజకీయంగానో, వ్యక్తిగత పరిచయంగానో ఉన్న వారికి మాత్రమే అందలమెత్తారని ఆరోపిస్తూ కార్యకర్తలు ఎమ్మెల్యేను ఎదిరించారు. “మేమే పార్టీ కోసం కష్టపడ్డాం… కానీ ఇళ్లు మాత్రం తగిన వారికి రాకుండా అనర్హులకు ఎందుకు?” అంటూ ఎమ్మెల్యే వద్దే ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపికలు ఎలా జరిగాయి? ఎవరి ఆధారంగా జాబితా ఖరారు చేశారు? గ్రామస్థాయిలో పరిశీలన ఎందుకు జరగలేదని వారు వివరణ డిమాండ్ చేశారు.ఈ నిరసనతో నియోజకవర్గ రాజకీయాల్లో వేడి చెలరేగగా… కమిటీ ఎంపికను పునర్విమర్శించాలని, న్యాయపూర్వకంగా అర్హుల జాబితా ప్రకటించాలని కార్యకర్తలు స్పష్టంగా హెచ్చరించారు.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు…

ఘనంగా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు

పరకాల నేటిధాత్రి

 

 

 

మాజీ ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని భవానీ సమేత కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బస్టాండ్ కూడలిలో బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ చేసి ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించారు.అనంతరం స్థానిక ప్రభుత్వ దవాఖానలో రోగులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ పరకాల అభివృద్ధి పదంలోకి వచ్చింది అంటే అది ధర్మారెడ్డి గతంలో పట్టణానికి తీసుకువచ్చిన 100 పడకల ఆసుపత్రి,ప్రభుత్వ కార్యాలయాలు,టెక్సటైల్ పార్క్ ఇవన్నీ నిదర్శమని మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీల తరుపున నియోజకవర్గ ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు,మహిళా నాయకురాళ్లు,యూత్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version