కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్

వనపర్తి నేటిధాత్రి:

కొత్తకోట.మండల కేంద్రంలో 5 కోట్ల 75 లక్షలతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజలో కార్యక్రమంలో జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కొత్తకోట మండల కేంద్రంలో ప్రజల అవసరాల నిమిత్తంఆసుపత్రిని నిర్మించలేక పోయిందని అన్నారు ఎన్నికల తరుణంలో హడావుడిగా హాస్పిటల్ నిర్మాణ భూమి పూజ పేరుతో హంగామా చేశారని ఎమ్మెల్యే అన్నారు
కొత్తకోట లో గతంలో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన ఆరుపడకల ఆసుపత్రిలోనే ఇప్పటికీ ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయనిఅన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామనిఅన్నారు హాస్పటల్ నిర్మాణాన్ని పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే జి మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు.

30 పడకల హాస్పటల్ పై స్పందించని మంత్రి పొన్నం.

30 పడకల హాస్పటల్ పై స్పందించని మంత్రి పొన్నం

 

నేటిధాత్రి:హన్మకొండ

 

పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ సంస్థగత సిద్ధిపేట జిల్లా కౌన్సిల్ మెంబర్

భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో
గత బిఆర్ఎస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కూడా 30 పడకల హాస్పటల్ గురించి అనేక సార్లు ఉద్యమాలు నిరాహార దీక్షలు చేపట్టి కరోనా సమయం లో మండలం లో అంబులెన్సు లేకపోతే పోరాడి ఆ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి అంబులెన్సు తెచ్చింది బీజేపీ భీమదేవరపల్లి మండల శాఖ అని మరిచిపోవద్దు అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి 15 నెలలు అవుతున్నా భీమదేవరపల్లి మండల ప్రజల కోసం కనీసం 30 పడకల హాస్పటల్ ను కేటాయించాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్యకాలం లో హన్మకొండ సిద్ధిపేట హైవే రోడ్డు పై మండల ప్రజలకు హాస్పటల్ కావాలని ధర్నా కార్యక్రమం చేయడం జరిగినది. అయినా ఇప్పటి వరకు కూడా
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించడం లేదు. మండల పేద బడుగు బలహీన వర్గాలు దాదాపు 50 వేల జనాభా ఉన్నా మండలానికి ఒక ఎండి డాక్టర్ కానీ. ఒక గైనాకలాజిస్ట్ కానీ ఎమర్జెన్సీ డాక్టర్ లేకుండా మండల ప్రజలు అల్లాడిపోతున్నారు

మెరుగైన వైద్యం అందించాలి.

వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి.

ఎం ఎం ఆర్ ఐ, సిటీ స్కానింగ్ ఏర్పాటు చేయాలని ఎం ఎస్ ఎఫ్ డిమాండ్.

చిట్యాల:నేటి ధాత్రి 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చెయ్యగ ఈ సమావేశంలో పాల్గొన్న అంబాల అనిల్ కుమార్ మాదిగ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్బండ వర్గాల ప్రజలకు పేద వర్గాల ప్రజలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు దళిత వర్గాల ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ బహుజన వర్గాల ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అడవి ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్న ఆదివాసులకు గోండు కోయ లంబాడి యానాది కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ బతుకుతున్న ప్రజలందరికీ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందుబాటులో లేక అనారోగ్య సమస్యలతో బాధపడే పేద వర్గాల ప్రజలకు సరైన మార్గం చూపాలని అంబాల అనిల్ కుమార్ అన్నారు భూపాలపల్లి జిల్లాలో ఉన్న వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందించకపోవడం సమస్యలకు అనుగుణంగా పరికరాలు లేకపోవడం చాలా బాధాకరమని మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఇతర దూర ప్రాంతానుంచి కనీసం ఆసుపత్రికి రావడానికి కూడా ప్రజల దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రోగులను ఎంజీఎం కి తరలించడం చాలా బాధాకరం అని ఆయన అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఇతర ప్రాంతాల్లో నుంచి జిల్లా కేంద్రానికి రావడానికి ఆర్థికంగా డబ్బు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న ప్రజలు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరియు ఇతర హైదరాబాదులో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ వైద్యం కోసం సమస్యను బట్టి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు జిల్లా కేంద్రానికి రావడానికె తీవ్రమైన ఇబ్బంది పడుతున్న ప్రజలు భూపాలపల్లి జిల్లా వంద పడకల హాస్పిటల్ లో సరైన వైద్యం లేక సిటీ స్కానింగ్ ఎమ్మారై స్కానింగ్ మరియు సరైన ఆపరేషన్ థియేటర్ లేక అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపడానికి తక్షణమే జిల్లా కేంద్రంలో ఉన్నా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్మెంట్ చేయాలని ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉండే విధంగా ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్మెంట్ చేసి జిల్లాలో ఉన్న ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకున్న సమస్యలు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ని హాస్పటల్ సూపర్డెంట్ ని జిల్లా డిఎంహెచ్వో ని మరియు జిల్లాలో ఉన్న వైద్యాధికారులను కోరుతున్నాము, వారం పది రోజుల్లో సమస్యలకు పరిష్కార మార్గం చూపకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమస్యలను ఉద్దేశించి కలెక్టరేట్ ముందు సమస్యలు పరిష్కరించేదాకా ధర్నాలు చేపడతామని సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం చేస్తామని పిలుపునిస్తున్నాము అని అన్నారు, అనిల్ కుమార్ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు రాజేందర్ నాగరాజు రాజకుమార్ గణేష్ రాజు రణధీర్ రామంజు లక్ష్మీ సాయి మరియు తదితర మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version