మద్యం మత్తులో నీటిలో మునిగి వ్యక్తి మృతి..

మద్యం మత్తులో నీటిలో మునిగి వ్యక్తి మృతి..

ఓదెల (పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండలం గుంపుల మానేరు వాగులో మద్యం మత్తులో మునిగి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన ఎస్సై దీకొండ రమేష్ ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన ఆరెళ్ళి రవీందర్ (51) హమాలీ వృత్తి చేస్తున్న రవీందర్ తరచుగా మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడని పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం కూడా మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య, కుమారుడు మందలించగా గుంపులలో గల రామభద్ర ఆలయ సమీపానికి వెళ్లాడు. అనంతరం తన కుమారుడికి ఫోన్ చేసి అక్కడ ఉన్నానని తెలిపాడు. కుమారుడు దిలీప్, బంధువు రాజు అక్కడికి చేరుకోగా ఒడ్డున బట్టలు ఉండగా, రవీందర్ నీటిలో కనిపించాడు. బయటకు రావాలని కుమారుడు పిలవగా ప్రమాదవశాత్తు లోతైన నీటిలో కొట్టుకుపోయాడు. వెంటనే కుమారుడు బయటకు తీసుకురాగా అప్పటికే స్పృహ తప్పి ఉండడంతో 108 అంబులెన్స్ ద్వారా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందాడని ధృవీకరించారు. ఈ ఘటనపై దిలీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.

కలగా మిగిలిపోయిన ఓడేడు వాగు బ్రిడ్జి నిర్మాణం…

కలగా మిగిలిపోయిన ఓడేడు వాగు బ్రిడ్జి నిర్మాణం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

గత కొన్ని సంవత్సరాలు గడుస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయని రాజకీయ నాయకులు అధికారులు అని సిపిఐ ఎంఎల్. జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమిళ్ళపల్లి పెద్దపెల్లి జిల్లా మహా ముత్తారం మండలం ఓడేడు మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగు
ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే రెండు జిల్లాల ప్రజలు అటు పోవాలన్నా ఇటు రావాలన్నా ప్రాణాల అరిచేతుల పెట్టుకోవాల్సిందే ఓడేడు గర్మిళ్లపల్లి మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగు విస్తృతంగా రావడంతో ఇంద్రమ్మ ఇండ్లకు ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు అందులోనే ఉండిపోయినవి మానేరు వాగును సందర్శించడం జరిగింది . 2016 సంవత్సరంలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం సరిపడే బడ్జెట్ లేక పాలకుల నిర్లక్ష్యం మూలంగా మధ్యలోనే ఆగిపోయినది బ్రిడ్జి పూర్తి కాలేదు రెండు జిల్లాల ప్రజలు రాకపోకలు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు ప్రతి వర్షాకాల సీజన్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిందే ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకుండా ఉన్నాయి . ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైన రెండు జిల్లాల పాలకులు స్పందించి నిర్మాణ పనులు చేపట్టే విధంగా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించి బ్రిడ్జి పనులు ప్రారంభించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజుజిల్లా ఉన్నతాధికారులు సందర్శించినారు తక్షణమే ప్రభుత్వాన్ని నివేదిక పంపి బ్రిడ్జి పనులు ప్రారంభించే..దిశగా ప్రజల కోరికను నెరవేర్చాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలనిఅన్నారు రాజు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version