30 ఏళ్ళ పెదరాయుడు.

30 ఏళ్ళ పెదరాయుడు…

నటప్రపూర్ణ మోహన్ బాబు నటజీవితంలో మరపురాని మరచిపోలేని చిత్రం ‘పెదరాయుడు’… ఈ చిత్రం జూన్ 15తో 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.

నటప్రపూర్ణ మోహన్ బాబు నటజీవితంలో మరపురాని మరచిపోలేని చిత్రం ‘పెదరాయుడు'(Pedarayudu)… ఈ చిత్రం జూన్ 15తో 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది…
మోహన్ బాబు (mohanbabu)నటజీవితాన్ని ‘పెదరాయుడు’కు ముందు – ‘పెదరాయుడు’ తరువాత అన్న రీతిలో విడదీయవలసి ఉంటుంది… అంతకు ముందు మోహన్ బాబు వందల చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి అలరించారు… ‘ప్రతిజ్ఞ’తో నటనిర్మాతగా మారి ప్రయాణం సాగించారు… సొంత చిత్రాల నిర్మాణంలో మోహన్ బాబు ఎన్నెన్నో వడిదుడుకులు ఎదుర్కొన్నారు… ఆయన నటించి నిర్మించిన చిత్రాల్లో కొన్ని అఖండ విజయాలను నమోదు చేశాయి… మరికొన్ని అపజయాల బాట పట్టాయి… ఈ నేపథ్యంలో యన్టీఆర్ ప్రధాన పాత్రలో మోహన్ బాబు నిర్మించిన ‘మేజర్ చంద్రకాంత్’ బంపర్ హిట్ గా నిలచింది… ఆ సినిమా తరువాత మళ్ళీ కొంత నిరాశ! ఆ సమయంలో మోహన్ బాబు నిర్మించి నటించిన ‘పెదరాయుడు’ అనూహ్య విజయం సాధించింది… 1995 జూన్ 15న విడుదలైన ‘పెదరాయుడు’ ముందు పోటీ చిత్రాలు నిలవలేకపోయాయి… ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా బాక్సాఫీస్ రేసు గెలవడమే కాదు ఆల్ టైమ్ హిట్ గానూ ‘పెదరాయుడు’ నిలచింది…
సినిమా థియేటర్‌లు

తమిళంలో శరత్ కుమార్ హీరోగా రూపొందిన ‘నాటామై’ మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని చూసిన రజనీకాంత్ , దానిని తెలుగులో రీమేక్ చేయమని మోహన్ బాబుకు సూచించారు. అలాగే అందులో పాపారాయుడు పాత్రలో రజనీకాంత్ నటిస్తానని మాటిచ్చారు… అదే తీరున నటించి అలరించారు… యన్టీఆర్, ఏయన్నార్, దాసరి వంటి ప్రముఖుల సమక్షంలో ఆరంభమైన ‘పెదరాయుడు’ సాధించిన ఘనవిజయంతో మోహన్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్ళింది… భానుప్రియ, సౌందర్య నాయికలుగా నటించిన ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు… కోటి సంగీతం సమకూర్చారు… సీతారామశాస్త్రి, భువనచంద్ర, శ్రీహర్ష రాసిన పాటలు జనాన్ని ఆకట్టుకున్నాయి… ఈ నాటికీ మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రాలలో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం చూసిన సినిమాగా ‘పెదరాయుడు’ నిలచే ఉంది… ఇప్పటికీ ‘పెదరాయుడు’ బుల్లితెరపై కనిపిస్తే జనం ఆసక్తిగా చూస్తూనే ఉండడం విశేషం!

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్

వనపర్తి నేటిధాత్రి:

కొత్తకోట.మండల కేంద్రంలో 5 కోట్ల 75 లక్షలతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజలో కార్యక్రమంలో జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కొత్తకోట మండల కేంద్రంలో ప్రజల అవసరాల నిమిత్తంఆసుపత్రిని నిర్మించలేక పోయిందని అన్నారు ఎన్నికల తరుణంలో హడావుడిగా హాస్పిటల్ నిర్మాణ భూమి పూజ పేరుతో హంగామా చేశారని ఎమ్మెల్యే అన్నారు
కొత్తకోట లో గతంలో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన ఆరుపడకల ఆసుపత్రిలోనే ఇప్పటికీ ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయనిఅన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామనిఅన్నారు హాస్పటల్ నిర్మాణాన్ని పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే జి మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులు 30 రోజుల్లో గా ప్రారంభించాలి.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులు 30 రోజుల్లో గా ప్రారంభించాలి.

జిల్లా కలెక్టర్..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. మండలంలో. పలు గ్రామాలకు చెందిన. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు రెండో విడత కింద 500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే దసరా దీపావళి పండుగలకు నూతన గృహప్రవేశం జరుపుకోవాలని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండలంలో ప్రజలకు రెండో విడత ఇండ్ల మంజూరు జారీచేశామని పెట్టుబడి లేని నిరుపేదలకు స్వయం మహిళ సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం మంజూరు చేశామని. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. లబ్ధిదారులు విడుదల విధిగా నిర్మించుకోవాలని. ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. ఏఎంసీ చైర్మన్ స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్. నేరెళ్ల నర్సింగం గౌడ్. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 30న.!

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 30న జరిగే నిరసనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ముఫ్తీ మౌలానా అబ్దుల్ సబూర్ ఖాస్మీ అధ్యక్షతన జహీరాబాద్‌లోని ఇస్లామిక్ సెంటర్ లతీఫ్ రోడ్‌లో విలేకరుల సమావేశం జరిగింది. స్థానిక జమాతే-ఇ-ఇస్లామీకి చెందిన మౌలానా అతిక్ అహ్మద్ ఖాస్మీ, ముఫ్తీ నజీర్ అహ్మద్ హసమి, ముఫ్తీ ఉబైద్-ఉర్-రెహ్మాన్, ముహమ్మద్ నజీముద్దీన్ ఘౌరి, అమీర్ సంయుక్తంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్వహించిన నిరసన కార్యక్రమం ప్రకారం, ఏప్రిల్ 30 బుధవారం రాత్రి 9 గంటల నుండి రాత్రి 9:15 గంటల వరకు, అంటే 15 నిమిషాల పాటు “బాతి గుల్ ప్రచారం” కింద ముస్లింలందరూ తమ ఇళ్ళు, దుకాణాలు, కర్మాగారాలు మరియు ఇతర వ్యాపార సంస్థలలో లైట్లు ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన ద్వారా, కేంద్ర ప్రభుత్వ వక్ఫ్ సవరణ చట్టం, 2025పై మీ అసంతృప్తిని నమోదు చేయండి. ఈ బ్లాక్ వక్ఫ్ సవరణ చట్టం ద్వారా, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను ఆక్రమించడం ద్వారా మరియు ఇతర వర్గాల సంక్షేమం పేరుతో వివక్ష చూపడం ద్వారా భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన ప్రాథమిక హక్కులతో ఆడుకోవడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది, ఇది వాస్తవాలకు విరుద్ధం. ఈ సందర్భంగా, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, తీవ్రంగా ఖండించారు మరియు ఈ సంఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించి, నిందితులను న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బతిగుల్ ప్రచారం సందర్భంగా, ఎలాంటి శబ్దం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ముహమ్మద్ మజీద్ ముహమ్మద్ మొయిజుద్దీన్, హఫీజ్ ముహమ్మద్ అక్బర్ ముహమ్మద్ మొయినుద్దీన్ ముహమ్మద్ ఖ్వాజా నిజాముద్దీన్ ముహమ్మద్ యూసుఫ్ ముహమ్మద్ అబ్దుల్ ఖదీర్, ముహమ్మద్ ఫిరోజ్, ముహమ్మద్ అయూబ్ ఖాన్ ముహమ్మద్ వసీం మరియు ఇతరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version