ఓదెల లో లారీ బైక్ డీ ఒకరు మృతి..

ఓదెల లో లారీ బైక్ డీ ఒకరు మృతి..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండల కేంద్రం లోని మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద ఓదెల నుండి పెగడపల్లి కి బైక్ పై వెళ్తున్న వ్యక్తిని సిమెంట్ లారీ బైక్ వెనక భాగం లో బలంగా ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.పోత్క పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెలితే బాధితులు,పోలీసుల కథనం మేరకు ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు యాదవ్ సుమారు 38 సం. కావేరి సీడ్స్ అగ్రి ఎంప్లాయ్ గా పని చేస్తున్నాడు.ఉద్యోగ రీత్య ఓదెల నుండి పెగడపల్లి కి వెళ్లే క్రమంలో ఉదయం 10:30 సుమారు లో ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్ సమీపంలో బైక్ పై వెళ్తుండగా సిమెంట్ లారీ వెనుక నుండి ఢీ కొట్టింది. దీంతో తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు రిషి కుమార్,లడ్డు ఉన్నారు. పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వహాస్పత్రి కి తరలించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version