ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసులు…

ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసులు…

సమిష్టి జీవన, పద్ధతులు, సహజీవనం,పారదర్శకతకు నిలువెత్తు సాక్షులు ఆదివాసులు…

బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసులే…

ఆదివాసులు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో కళకళలాడుతుండేవి…

ఆదివాసి ప్రాంతాల్లో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయి…

ఆదివాసుల హక్కులను పరిరక్షించాలి…

సనాతన ప్రజల తెగలు నేడు అంతరించిపోతున్నాయి…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-

ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసి ప్రజలు. సమిష్టి జీవన పద్ధతులు, సహజీవనం, పారదర్శకతకు నిలువెత్తు సాక్షులు వారు. పచ్చని ప్రకృతి ఒడిలో అడవి తల్లినే నమ్ముకుని తరతరాలుగా జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలే ఆదివాసులు. బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి బిడ్డలు తమ మనుగడను సాగిస్తున్నారు. వారికి అడవి అంటే ప్రాణం. ప్రకృతితో సహజీవనం చేస్తూ, సామూహిక జీవన విధానాలపై ఆధారపడి ఆదివాసులు అడవి బిడ్డలుగా దశాబ్దాలుగా పోడు వ్యవసాయంతో బ్రతుకుతున్నారు. విద్య వైద్యం అందని ఆదివాసీల జీవితాలు చాలా దుర్భరంగా మారాయి. అతి పురాతన సనాతన ప్రజల తెగలు అంతరించిపోతున్నాయి.సాటి మానవులుగా అనేక దేశాలలో వారికి తగిన గుర్తింపు, రక్షణ లేదు. ఆయా దేశాలలో కనీసపు చట్టాలు లేవు. ఫలితంగా వారు మానవులుగా జీవించడానికి పోరాడవలసిన స్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సనాతన ప్రజలను కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నది. దేశంలో ఆదివాసీ జనాభా 12 కోట్ల మంది ఉన్నారు. ఆదివాసి ప్రజలు ఐదు మరియు ఆరవ షెడ్యూల్ ఏజెన్సీ ఏరియాలో నివాసం ఉంటున్నారు. 20% పైగా భూభాగంలో విస్తరించి ఉన్నారు. ఆదివాసి ప్రజల పాదాల కింద 80% ఖనిజ సంపద నిక్షిప్తమై ఉన్నది. ఆదివాసుల జ్ఞానం,సంస్కృతి పాలన వ్యవస్థలపై ఆధారపడి అభివృద్ధి పథకాలు ఉండాలి. ఆదివాసీలు వారి పేరు ప్రతిబింబించే విధంగా ఉపఖండంలోని తొలి నివాసులు మరియు ఒకప్పుడు వారు ప్రస్తుతం ఉన్న దానికంటే చాలా పెద్ద ప్రాంతాల్లో నివసించారు. చుట్టూ దట్టమైన అరణ్యం. కొండకోనల మధ్య ఆవాసం. సంప్రదాయాలు,కట్టుబాట్లతో జీవనం. విలక్షణమైన అహార్యం. గొప్ప ఐక్యత. అడవి తల్లి ఒడిలో నిత్యం ఒదిగి సాగే పయనం. ఇలా ప్రత్యేక జీవనశైలి ఆదివాసుల సొంతం. వాళ్లే దేశానికి మూలవాసులు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న గిరి మాణిక్యాలు. ఆదివాసి ప్రజలు అనేక రకాలుగా అన్యాయాలకు గురయ్యారు. కానీ వారు తమ సంస్కృతిని మరియు హక్కులను కాపాడుకోవడానికి నిరంతరం ప్రతిఘటిస్తున్నారు. ఆదివాసి ప్రజలకు వారి సాంప్రదాయ భూములు, అడవులు మరియు సహజ వనరులపై యాజమాన్యం మరియు యాక్సెస్ హక్కులు ఉంటాయి. ఆదివాసులు బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు. అడవులతో సన్నిహిత సంబంధం కలిగి, ప్రకృతి వనరులపై ఆధారపడి జీవిస్తారు. తరతరాలుగా ప్రకృతితో మమేకమై జీవించడం వల్ల వారు బ్రతుకు పోరాటంలో నైపుణ్యం సాధించారు.

ఆదివాసి ప్రజలు అడవి ఆధారిత జీవనం సాగిస్తారు. మరియు వారి మనుగడ కోసం అటవీ ఉత్పత్తులపై ఆధారపడతారు. ఆదివాసి ప్రజలు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో నిండి ఉంటాయి. వీటిని వారు తరతరాలుగా వినియోగించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆదివాసీలు వనరుల దోపిడీ, గుర్తింపు లేకపోవడం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆదివాసి చట్టాలు అక్కరకు రాని చుట్టాలుగా మారాయి. ఆదివాసి తెగల వాయిద్య పరికరాలు వారి నృత్యాలు ప్రభుత్వం ప్రోత్సాహం లేక అంతరించిపోతున్నాయి. ఆదివాసీలు తమ హక్కులను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూమి హక్కు, అటవీ సంరక్షణ, విద్య, ఆరోగ్యం మరియు ఇతర సామాజిక సమస్యలు ఆదివాసీల హక్కులను కాపాడటం మరియు వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడం చాలా ముఖ్యం. ఇది సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం ఒక ముఖ్యమైన అడుగు. బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి బిడ్డలు తమ మనుగడను సాగిస్తూ అడవిని ప్రాణంగా ప్రేమిస్తూ వీరు వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, పొగాకు తదితర పంటలు ఎక్కువగా పండిస్తారు. అయినప్పటికీ దోపిడీకి గురవుతూనే ఉన్నారు. పాలకుల తీరుతో ఆదివాసీలు నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. చాలా గ్రామాలకు నేటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. వైద్య సదుపాయాలు మృగ్యం. ఏదైనా రోగం వస్తే డోలిమోతలే దిక్కవుతున్నాయి. ఆదివాసీలు విలక్షణమైన భాష, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి ఉన్నారు. వాటిని పరిరక్షించడం, గౌరవించడం, మరింత ముందుకు తీసుకుపోవడం మనందరి కర్తవ్యం.

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం :- సైనిక గ్రూప్

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం :- సైనిక గ్రూప్

రాయికల్ , జూలై 30, నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని ప్రణుతి జూనియర్ కళాశాలలో గంజాయి, మత్తు పదార్థాల పైన, బెట్టింగ్ యాప్స్, మొబైల్ పైన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా డ్రగ్స్ మాయలో పడకుండా ఉండాలి. మాదక ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లో సేవించరాదు. బెట్టింగ్ యాప్స్ కి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలి అని మరియు మన భారతదేశం ను డ్రగ్స్ లేని సమాజంగా మనమంతా కలిసి నిర్మిద్దాం. మీ దృష్టికి మత్తు పదార్థాలను స్వీకరిస్తున్నట్టు ఎవరైనా కనిపిస్తే వెంటనే మీ పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వండి లేదంటే డయల్ తెలంగాణ పోలీస్ 112 కాల్ చేసి సమాచారాన్ని తెలపండి. అలాగే మిలటరీ జాబ్స్ కి తెలంగాణ స్టేట్ పోలీస్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మా సైనిక గ్రూప్ అండగా ఉంటుంది అని జగిత్యాల ఇంచార్జ్ పంచతి బాలరాజు తెలిపారు.ఈ సదస్సును పురస్కరించుకొని ఇటీవలే ఆర్మీ నుండి రిటైర్డ్ అయిన మాజీ సైనిక అధికారి భూపతిపూర్ గ్రామానికి చెందిన నూకల మల్లేశం గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుపతి, మాజీ సైనిక అధికారి నూకల మల్లేష్, పోలీస్ కానిస్టేబుల్ మనోజ్, శ్రీ నేతాజీ యూత్ అధ్యక్షులు అస్లాం,నరేష్, మధు, రాజేందర్, వేణుగోపాల్, కే.శేఖర్, రాజశేఖర్, వినయ్, లెక్చరర్ బృందం పాల్గొన్నారు.

గిరిజన సహకార సంస్థలో అవినీతి అక్రమాల పర్వం..

గిరిజన సహకార సంస్థలో అవినీతి అక్రమాల పర్వం

* పట్టపగలే గోదాముల ముందు అమ్మకాల దందా
* పట్టించుకుని సంబంధిత ఉన్నతాధికారు

మహాదేవపూర్ జూలై 28 (నేటి ధాత్రి)
గిరిజనులను ప్రైవేటు వ్యాపారుల దోపిడి నుండి రక్షించాలని, గిరిజనులతో పాటు సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు వస్తుసేవలను అందించాలనే బృహత్తర లక్ష్యంతో ఏర్పడిన గిరిజన సహకార సంస్థ అవినీతికి అక్రమాలకు నిలయంగా మారింది. సంక్షేమ హాస్టళ్లకు సరుకులు సప్లై చేస్తామని జిసిసి చెప్పడంతోటే ప్రైవేటు టెండర్లు రద్దుచేసి జిసిసికి కాంట్రాక్టును కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఖరారు చేస్తుంది. జిసీసీ నుండి వచ్చిన సరుకులను మహాదేవపూర్ లో జిసిసి గోదాం అధికారులు పట్ట పగలే గోదాముల ముందు సరుకులను ఏదేచ్చగా అమ్ముతూ మరి కొంత సరుకులను హోల్ సేల్ దుకాణా దారులకు ఇష్టం వచ్చినట్లు కమిషన్ రూపం లో అమ్ముతూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. ఇదేం పనులు చేస్తున్నారు అని కొందరు వ్యక్తులు అడుగగా ఎవ్వరు ఏమి చెయ్యలేరు అని, ఎవ్వరికి చెప్తావో చెప్పుకో అని నేనొక్కడినే ఈ సొమ్ము తింటలేనని అందరి అధికారులకు ముట్టచెప్పుడే అని మాట్లాడటం విశేషం. గోదాముల దగ్గరనే సరుకులు మాయం కావడంతో హచ్చర్య పోతున్న మండల ప్రజలు హాస్టళ్లకు చేరక విద్యార్థులు ఏం తింటున్నారో ఏమి పెడుతున్నారో తెలియడం లేదని వాపోతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికైన ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి ప్రభుత్వ, సామాన్య ప్రజల సొమ్మును కాపాడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

స్థానిక ఎన్నికలతో పాటు చేనేత సహాకార సంఘ ఎన్నికలు నిర్వహించాలి.

స్థానిక ఎన్నికలతో పాటు చేనేత సహాకార సంఘ ఎన్నికలు నిర్వహించాలి

అఖిల భారత పద్మశాలి యువజన సంఘ మండల అధ్యక్షులు బాసాని సాయితేజ

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని చేనేత సహకార సంఘం స్థానిక ఎన్నికల్లో పాటు చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహించాలి. అఖిలభారత పద్మశాలి యువజన సంఘం మండల అధ్యక్షుడు బాసని సాయితేజ మాట్లాడుతూ గత 7 సంవత్స రాల నుండి చేనేత సంఘము ఎన్నికలు జరుగకా ఇంచార్జి లతో సంఘము నడుస్తుంది. సంఘలో సరైన ఉపాధి లేక చేనేత వస్త్ర పరిశ్రమ మరు గున పడుతుందని నాడు వస్త్ర పరిశ్రమల్లో అగ్రగామిగా ఉన్న శాయంపేట వస్త్ర పరిశ్రమనేడు మరుగున పడటం బాధాకరo ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించి పద్మశాలి కార్మికు లకు అండగా ఉండాలి. ఇప్ప టికైనా వెంటనే ఎన్నిక జరిగితే శాయంపేటను రాష్టంలో అగ్ర గామి వస్త్ర పరిశ్రమగ తీర్చిది ద్దచ్చు .త్వరగా ఎన్నికలు నిర్వ హించి పద్మశాలి కార్మికులను ఉపాధి కలిపించాలి అలాగే సంఘలో నూతన సభ్యతలు ఇవాలి మరియు పద్మశాలి యువతకి ఉపాధి కల్పిం చాలని కోరడమైనది.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ను ఆకస్మిక తనిఖీ..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ను ఆకస్మిక తనిఖీ

జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్.

ఇబ్రహీంపట్నం.నేటిధాత్రి

మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రాథమిక వ్యవసాయ సహకార
ఎరువుల సరఫరా పై పరిశీలించిన కలెక్టర్ పాక్స్ నిర్వహిస్తున్న ఎరువుల విక్రయాలుకు సంబందించిన రికార్డులను పరిశీలించారు యూరియా ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు యూరియా ఇచ్చుచున్నారో పరిశీలించి వారి భూమి వివరములు తనిఖీ చేసినారు తదుపరి కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం పంట వేసిన రైతులకి పంట కు అవసరమైన యూరియా మాత్రమే సరఫరా చేయవలెనని అధికారులకు ఆదేశించిన
ఎవరికైనా ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు పంపిణి చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బంది పై మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించాడు మరియు కలెక్టర్ వెంట మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్, ఇబ్రహీంపట్నం మండల్ తహసీల్దార్ వరప్రసాద్, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

గ్రంధాల సంస్థ చైర్మన్ గా కోట రాజబాబు..

గ్రంధాల సంస్థ చైర్మన్ గా కోట రాజబాబు

మహదేవ పూర్ జూలై19 (నేటి ధాత్రి )

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-40.wav?_=1

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన కోట రాజబాపు ను నియమిస్తూ రాష్ట్ర గ్రంధాలయ శాఖ శుక్రవారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సెక్రటేరియట్ ఆర్డర్ కాపీని తీసుకొని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గతం లొ కోట రాజబాబు మహాదేవపూర్ పాత సమితి తాలూకాకు రెండుసార్లు సర్పంచ్ గాను, కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ గా పని చేశారు. మండల స్థాయి కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా మన్నలను పొంది కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన వ్యక్తిగా పనిచేస్తూ ప్రస్తుతం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపైన నమ్మకంతో పదవి కట్టబెట్టిన మంత్రికి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లవేళలా పార్టీ అభివృద్ధికి, ఆశయాలకు కృషి చేస్తానని తెలుపుతూ తోటి మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల ఐ టి ఓ ఇండియన్.

మెట్ పల్లి జూలై 4 నేటి ధాత్రి
మెట్ పల్లి వినాయక్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల ఐ టి ఓ ఇండియన్ టాలెంటెడ్ ఒలంపియాడ్ 2024-25 సంవత్సరానికి బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డు ముంబాయి వారిచే వి బి మహర్షి స్వీకరించిన సందర్భంగా వినాయక నగర్ సొసైటీ అధ్యక్ష కార్యవర్గం సభ్యులు నిఖిల్ భరత్ కాన్వెంట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ వి బి మహర్షి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు తోట ప్రవీణ్ ఉపాధ్యక్షులు సాంబారి శ్రీనివాస్. క్యాషియర్ గిరి. తోట ప్రసాద్ భోగ మురళి మారుతి పర్రి శంకర్ కోరే రమేష్ గంగారెడ్డి నారాయణ శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు.

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు

-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి సమాజానికి, వెలిశాల గ్రామానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. ఈనెల 18న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు, ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. కాగా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి గత 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరి..పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన అమరుడు గాజర్ల రవి అని పోలినేని లింగారావు అన్నారు. శుక్రవారం ఆయన గాజర్ల రవి స్వగ్రామమైన వెలిశాలకు చేరుకొని గాజర్ల రవి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట వెంగల రమేష్, పెరుమాండ్ల మహేందర్, కుమార్ గౌడ్, తిరుపతిరెడ్డి, రామస్వామి తదితరులున్నారు.

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు

భూపాలపల్లి నేటిధాత్రి:

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి సమాజానికి, వెలిశాల గ్రామానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. ఈనెల 18న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు, ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. కాగా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి గత 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరి..పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన అమరుడు గాజర్ల రవి అని పోలినేని లింగారావు అన్నారు. శుక్రవారం ఆయన గాజర్ల రవి స్వగ్రామమైన వెలిశాలకు చేరుకొని గాజర్ల రవి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట వెంగల రమేష్, పెరుమాండ్ల మహేందర్, కుమార్ గౌడ్, తిరుపతిరెడ్డి, రామస్వామి తదితరులున్నారు.

భవిష్యత్తు తారల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం.

భవిష్యత్తు తారల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం..

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి..
– ఎస్సై దికొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం కలిసి రావాలని “ఇది ఒక వ్యక్తిని చంపడమే కాదు, సమాజంలోని అన్ని రకాల సమస్యలకు దారితీస్తుంది. డ్రగ్కు నో చెప్పడంలో యువత అప్రమత్తంగా ఉండాలి మరియు బాధ్యతగా ఉండాలి” అని పొత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ అన్నారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా ( సే నో టూ డ్రగ్స్ ) అనే నినాదం తో పొత్కపల్లి ఓదెల మోడల్ స్కూల్, హై స్కూల్, కస్తూర్బా విద్యార్థులతో విద్యార్థులతో కలిసి ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో ఓదెల సెంటర్లో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు మరియు ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా పొత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని విద్యార్థి దశలోనే పిల్లలను మంచి మార్గంలో నడిపించడం సమాజం యొక్క ప్రధాన బాధ్యత అని చుట్టూ జరుగుతున్న అనైతిక కార్యకలాపాల గురించి వారిలో అవగాహన పెంచాలి.డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల ప్రభావం ఇప్పుడు పల్లెప్రాంతాలకూ విస్తరించిందనీ,వీటి నుంచి యువతను కాపాడుకోవాలి” అని తెలిపారు.
గంజాయి వంటి మాదకద్రవ్యాలు రవాణాకు సులభ మార్గాలనీ, విద్యార్థులు,యువత వీటికి బలవుతున్నారనీ,మత్తులో ఉన్న వ్యక్తి తన చర్యల్ని గుర్తించలేని స్థితికి చేరతాడనీ,ఈ అలవాటు అనేక ఆరోగ్య సమస్యలతో పాటు నేరపూరిత జీవితానికి దారితీస్తుందని అన్నారు.
అంతేకాకుండా సరదా కోసం అయినా డ్రగ్స్ వైపు అడుగు వేయకండనీ,ఇవి కేవలం వ్యక్తిని కాదు, కుటుంబాన్నీ నాశనం చేస్తాయనితెలిపారు. డ్రగ్స్‌కి బలైపోకుండా మీ భవిష్యత్తును కాపాడుకోనీ విజేతలుగా ఎదగండి” అంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల విద్యాధికారి రమేష్, అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

భవిష్యత్తు తరాల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం.

భవిష్యత్తు తరాల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం.

యాంటీ డ్రగ్ డేలో భాగంగా విద్యార్థులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ.

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి. గితే, అధికారులు

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. (యాంటీ డ్రగ్ డే )సందర్భంగా మత్తుపదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే, విద్యార్థులు, పోలీస్ అధికారులతో కలిసి గురువారం సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ నుంచి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ తీశారు.

ప్రజలను ఆకట్టుకుంటూ ఆలోచింపచేసేలా ఉన్న గంజాయి రహిత సమాజం–మనందరిబాధ్యత డ్రగ్స్‌కి నో చెప్పండి,ఆరోగ్యమే అసలైన సంపద వంటి ఫ్లకార్డ్స్, నినాదాలు చేశారు.

డ్రగ్స్,గంజాయిని నిర్మూలించేందుకు బాధ్యత గల పౌరులుగా వ్యవహరించి డ్రగ్స్,గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలు,యువతకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ..

విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి  పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.

డ్రగ్స్ ను వినియోగించి సమాజానికి ఇబ్బంది కలిగించే పౌరులుగా మారవద్దని పేర్కొన్నారు.

డ్రగ్స్ వినియోగంతో మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయని రాను రాను ఆరోగ్యం  క్షీణిస్తుందని వివరించారు.

డ్రగ్స్ వినియోగంతో శారీరకంగానే కాకుండా మానసిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు.

విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన ఉండి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.

డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

Students as part of Anti-Drug Day.

అనంతరం ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ విద్యార్థులు, యువత తమ పరిసరాలు, విద్యాలయాలు ఇతర చోట్ల ఎక్కడైనా డ్రగ్స్ వినియోగించినా.. విక్రయించినా.. తరలించనా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

డ్రగ్స్ రహిత సమాజంతో మన రాష్ట్రం అలాగే దేశం ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు.

విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉంటూ యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారాలని ఆకాంక్షించారు.

యాంటీ డ్రగ్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన ఇతర పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, పతకాలను కలెక్టర్, ఎస్పి తదితరులు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులు అంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం ఫంక్షన్ హాల్ ఆవరణలో వివిధ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను పరిశీలించారు.

విద్యార్థులు గీసిన చిత్రాలు..

 

Students as part of Anti-Drug Day.

 

 

తయారు చేసిన పెయింటింగ్ లను చూసి కలెక్టర్, ఎస్పీ వారిని అభినందించారు.

అలాగే  యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ పై కలెక్టర్, ఎస్పీ, అధికారులు సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సి.ఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, నతేష్,మధుకర్, నాగేశ్వరరావు, ఆర్.ఐ లు రమేష్, మధుకర్, యాదగిరి, ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన.

ఘనంగా సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు…

నేటి ధాత్రి – బయ్యారం :-

 

 

బయ్యారం సొసైటీ చైర్మెన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలను యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా జరిపినారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తమ్మిశెట్టి వెంకటపతి మాట్లాడుతూ, ఎల్లప్పుడూ మండల అభివృద్ధి గురించి ఆలోచించించే మూల మధుకర్ రెడ్డి భవిష్యత్ లో మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.బయ్యారం ఏజెన్సీ అభివృద్ధి కై పాటుపడుతున్న ప్రజా నాయకుడని కొనియాడారు.అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు నాగరాజు,నిరంజన్, రాకేష కార్తీక్,జాన్,ప్రసన్నకుమార్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సమ సమాజాన్ని నిర్మించేది ఉపాధ్యాయులే..

సమ సమాజాన్ని నిర్మించేది ఉపాధ్యాయులే..

#శిక్షణ శిబిరాన్ని సందర్శించిన డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

సమ సమాజాన్ని నిర్మించే నిర్మాతలు ఉపాధ్యాయులే అని వరంగల్ డీ ఈ వో మామిడి జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరుగుతున్న 5 రోజులు ప్రైమరీ ఉపాధ్యాయుల శిక్షణను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ప్రక్రియ పెంచాలని కోరారు. ఐదు రోజులుగా ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాల గొప్పతనాన్ని గ్రామాల ప్రజలకు వివరించి పిల్లల నమోదును పెంచడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలని అన్నారు. పాఠశాలల్లో నమోదును ఎలా పెంచాలో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. రానున్న కాలంలో విద్యా రంగంలో మార్పులు రానున్న తరుణంలో ఆ దిశగా బోధనలో మార్పులు తీసుకురావాలని కోరారు. బెస్ట్ టీచర్స్ యొక్క పని విధానాన్ని అందరికీ వివరించారు. వృత్యుంతర శిక్షణను వినియోగించుకోవాలని అన్నారు.

Training Camp.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ అనురాధ,కాంప్లెక్స్ హెచ్ ఎం లు, ఎం ఆర్పిలు, ఎస్ఆర్పీలు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు, ఎం ఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రైతులను మోసం చేస్తున్న సొసైటీ చైర్మన్లు.

రైతులను మోసం చేస్తున్న సొసైటీ చైర్మన్లు…

* ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల ధర్నా…

*మొలకలు వస్తున్న ధాన్యం…

*పట్టించుకోని సొసైటీ పాలకవర్గం,
అధికార యంత్రాంగం…

*ధర్నా చేయుచున్న పైతర గ్రామ రైతులు…

కొల్చారం( మెదక్ )నేటి ధాత్రి:

రైతన్నలు కష్టపడి ఆరుగాలం పండించిన పంట అమ్ముకుందామంటే అన్నమో రామచంద్రా అంటూ బోరున విలపిస్తున్నారు. ధాన్యం తూకం కొనుగోలు కాకపోవడంతో వర్షానికి తడిసి మొలకలు వస్తున్న కూడా ఇటు సొసైటీ పాలకవర్గం మరియు అధికారులు పట్టించుకోకపోవడంతో పండించిన ధాన్యం.

cheating farmers

మొలకలు రావడంతో చివరికి మాకు పురులమందే దిక్క అంటూ కొల్చారం మండలంలోని పైతర గ్రామ రైతులు మెదక్ – సంగారెడ్డి ప్రధాన రహదారిపై వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ మొలకలు వచ్చిన ధాన్యమును చూపిస్తూ రైతులు ధర్నా చేయుచున్నారు ఒకవైపు తూకం వేసిన ధాన్యము లారీలు రాకపోవడంతో సొసైటీ పాలకవర్గం నురైతులు అడుగుచుండగా లారీలు వస్తలేవు మేమేం చేయాలి అని పాలకవర్గం తప్పించుకుంటున్నారు మా రైతుల గోడును అధికార యంత్రాంగం అర్థం.

cheating farmers

చేసుకొని మేము పండించిన ధాన్యమును కొనుగోలు చేసి లారీలు పంపించి తూకం వేసిన ధాన్యమును రైస్ మిల్లర్లకు చేరవేయాలని పైతర గ్రామ రైతులు రోడ్డుపైన మొలకలు వచ్చిన ధాన్యము చూపిస్తూ అధికారులను వేడుకొనుచున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

బడుగు బలహీన వర్గాల మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.

బడుగు బలహీన వర్గాల నాయకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు బడుగు బలహీన వర్గాల నాయకుడు నవభారత నిర్మాణ సృష్టికర్త దేశానికి దిశా నిర్దేశం చూపిన మార్గదర్శకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి కొమురయ్య అన్నారు బుధవారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికిపూలమాలవేసి నివాళి అర్పించారు వారు మాట్లాడుతూ దేశాన్ని టెక్నాలజీ రంగం వైపు తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు భారతదేశ ప్రధాన మంత్రిగా ప్రజలకు చేసిన సేవలు అభివృద్ధి గురించి గుర్తు చేశారు దేశానికి సాంకేతికతను తీసుకోవచ్చింది సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని అన్నారు అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశం నీ నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందని గుర్తు చేశారు దేశంలో బీదరికాన్ని పారదోలి సమ సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేమని కొనియాడాడు

పద్మశాలి శాశ్వత సభ్యత్వా ల నమోదు కార్యక్రమం .!

అఖిలభారత పద్మశాలి సంఘం శాశ్వత సభ్యత్వా ల నమోదు కార్యక్రమం

జై మార్కండేయ జై జై మార్కండేయ

జై పద్మశాలి జై జై పద్మశాలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని చేనేత సహకార సంఘం గ్రామ ఉపాధ్యక్షుడు తుమ్మ ప్రభాకర్ ఆధ్వర్యంలో చేనేత సహకార సంఘం నందు కార్మికులందరికీ నూతన శాశ్వత సభ్యత్వాలు ఇవ్వడం జరిగింది.

Registration

భవిష్య త్తులో పద్మశాలీలందరూ ఏకమై అఖిలభారత పద్మశాలి సంఘం ఎదుగుదలకు తోడ్పాటు చేసి భవిష్యత్తులో పద్మశాలీల అందరికీ సమన్యా యం జరిగే విధంగా కార్యవర్గం అందరం కృషి చేస్తారు. ఈ కార్యక్ర మంలో శాయంపేట మాజీ సర్పంచ్ వలుపదాసు చంద్రమౌళి ,చేనేత సహకార సంఘం డైరెక్టర్ బూరలక్ష్మీ, నారాయణ ,నాయకులు, కందగట్ల గోపి తదితరులు పాల్గొన్నారు.

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో.

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో..
వెంకటాపూర్ (ఆర్ )లో
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం..

రామాయంపేట మే 8 నేటి దాత్రి (మెదక్):

రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ ఆధ్వర్యంలో గురువారం నాడు ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హెన్రీ రోనాల్డ్ జన్మదినం పురస్కరించుకొని ఉచిత వైద్య మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వెంకటాపూర్ గ్రామంలో ఉన్న నిరుపేద ప్రజలందరికీ ఆరోగ్యం అందించే దిశగా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున తాము అన్ని పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఒకప్పుడు జిల్లాల్లో అక్కడక్కడ శిబిరాలు నిర్వహించి ప్రజలకు సేవలు అందించే వారమని ఇప్పుడైతే ప్రతి గ్రామంలో కూడా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Red Cross

అనంతరం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దేమె యాదగిరి మాట్లాడుతూ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మెగా వైద్య శిబిరాలతో పాటు, రక్త దాన శిబిరాలు, వివిధ రకాల వ్యాధులకు సంబంధించి క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు… ఆరోగ్య శిబిరాల చైర్మన్ దామోదర్ రావు మాట్లాడుతూ మల్లారెడ్డి ఆసుపత్రి సౌజన్యంతో విరివిగా మెగా వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులను ఇస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా
కోశాధికారి డి.జి శ్రీనివాస్ శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు మద్దెల సత్యనారాయణ,మద్దెల రమేష్,సభ్యులు వి.సతీష్ రావు,తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి సూరారం డాక్టర్ లు రాఘవేందర్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, మేఘాన, రవి కిరణ్ లు రోగులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.

దోపిడిలేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యం.

దోపిడిలేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యం.

సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దోపిడిలేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యమని సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి అన్నారు. నర్సంపేట మాదన్నపేట రోడ్ సిపిఐ కాలనీ వద్ద ఉన్న కామ్రేడ్ పంజాల చంద్రమౌళి 8 వ వర్ధంతి సందర్భంగా స్తూపం ఏర్పాటు చేశారు.కాగా స్థూపం వద్ద అరుణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మేకల రవి మాట్లాడారు.
అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి పేదప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించి

దున్నేవాడికి భూమి కావాలని నిలువ నీడలేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కావాలని అనేక భూ పోరాటాలు చేసి భూములను సాధించిన చరిత్ర కలిగిన పంజాల చంద్రమౌళిది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ సభకు అధ్యక్షత వహించగా సిపిఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శిలు ఎస్కే బాష్మియా పనస ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు లక్ష్మణ్ అక్క పెళ్లి రమేష్ తోట చంద్రకళ జిల్లా నాయకులు కందిక చెన్నకేశవులు గడ్డం యాకయ్య మియాపురం గోవర్ధన్ పాలక కవిత భానోతు వీరు నాయక్ చింతకింది కుమారస్వామి అయిత యాకయ్య గడ్డం నాగరాజు అక్బర్ ఇల్లందులసాంబయ్య యాదగిరి సతీష్ మమతా శైలజ తదితరులు పాల్గొన్నారు.

సమాజ అభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్ర.!

సమాజ అభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్ర -మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల

రామడుగు నేటిధాత్రి:

సమాజాభివృద్ధిలో కార్మికులదే కీలకపాత్రాని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్ అన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల చేత జెండా ఎగర వేయించారు. అనంతరం కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా చెర్మెన్ మాట్లాడుతూ కార్మికుల శ్రమకు గౌరవం కల్పించడమే మే డే ఉద్దేశమని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం మార్కెట్ కమిటీ ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ పిండి సత్యం రెడ్డి, డైరెక్టర్లు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మిద్దాం.!

పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మిద్దాం- 7 వ రాష్ట్రీయ పోషణ పక్షం

 

నడికూడ,నేటిధాత్రి:

స్వాతి సిడిపిఓ అధ్యక్షతన పరకాల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో నడికూడ మండలంలోని నర్సక్కపల్లి గ్రామంలో జాతీయ పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి జెట్టి జయంతి హాజరై మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లో ముఖ్యంగా నిర్వహించే కార్యక్రమాలు మొదటిది ఆరోగ్య లక్ష్మి, రెండవది ప్రీస్కూల్,మూడోది లోపోషణతో బాధ పడే పిల్లల పోషణస్థితిని మెరుగుపరిచే విధంగా అంగన్వాడి టీచర్స్ పని చేయాలని సూచించారు. పోషణ పక్షంలో భాగంగా ఏప్రిల్ 8 నుండి 22 వరకు ప్రతి గ్రామంలో పోషణ కార్యక్రమాలు నిర్వహించి పోషణ లోపం లేని సమాజం నిర్మించేలా కృషి చేయాలన్నారు.గర్భిణీలు, బాలింతలు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే ఒక్కపూట భోజనం సద్వినియోగం చేసుకోవాలి, పౌష్టిక ఆహారం తీసుకుంటేనే పుట్టే పిల్లలు ఆరోగ్యవంతంగా పుడతారన్నారు.ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీల కు శ్రీమంతాలు,6 నెలలు నిండిన పిల్లలకి అన్నప్రాసనలు,అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న
చిన్నారులకు గ్రాడ్యుయేషన్
డే,చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల తహసిల్దార్ టి. విజయలక్ష్మి,నడికూడ తహసిల్దార్ నాగరాజు, నడి కూడ మండల వైద్యాధికారి కే దివ్య,ఎంపీడీవో నడికూడ విమల,సఖి అడ్మిన్ హైమావతి,పోషణ అభియాన్ డిస్టిక్ కోఆర్డినేటర్ సుమల డిహెచ్ఈడబ్ల్యు కోఆర్డినేటర్ కళ్యాణి,ఐసిడిఎస్ సూపర్వైజర్లు శ్రీదేవి, హేమలత,పుణ్యవతి,రోజా రాణి,మంజుల,సునీత,రాణి, నజీమ,పర్వీన్,ఉమాదేవి, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ బిక్షపతి,జిల్లా బాలల పరిరక్షణ విభాగం విజయకుమార్,అంగన్వాడీ టీచర్స్,ఆశ వర్కర్స్,గర్భిణీ స్త్రీలు,పిల్లలు మొదలగు వారు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version