ప్రారంభమైన బతుకమ్మ..

ప్రారంభమైన బతుకమ్మ

అంబరాన్ని అంటిన సంబరాలు

నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

ఆదివారం (పితృ అమావాస్య )బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. ప్రతి గ్రామంలో వేద బ్రాహ్మణులకు తమ పితృదేవతల జ్ఞాపకార్థం బియ్యం తదితర వాస్తు సామాగ్రిని అప్పజెప్పి బ్రాహ్మణుల ఆశీర్వాదం పొందిన పలు వర్గాల ప్రజలు, ఇదిలా ఉండగా మహిళలు తంగేడు పువ్వు, గునుగు పువ్వు, తిరోక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి సాయంత్రం గ్రామ లలో నీ చెరువుగట్టులు, దేవాలయ ప్రాంగణాలలో, బతుకమ్మ ఆటపాటలతో అంగరంగ వైభవంగా నిర్వహించి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మెజారిటీ గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుడి, పదవులు ఆశిస్తున్న చోట నేతలు వారి శక్తి కొద్ది కొందరు డి జే లు, మరికొందరు కోలాటాలకు కోలలు , సమకూరు ఇస్తే, ఇంకొందరు మహిళలకు ఏక దుస్తులు అందించారు. దీంతో గ్రామాలలోని మహిళలు, చిన్నలు, పెద్దలు, అందరూ బతుకమ్మ సంబరాలను సంబరాన్ని అంటే మాదిరిగా నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version