పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పాపన్న గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలుగు ప్రజలు గర్వించదగ్గ మహానుభావులలో ఒకరని, ఆయన జీవితంలోని గొప్ప త్యాగాలు, పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని తెలిపారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడిగా ఆయన చరిత్రలో నిలిచారని గుర్తు చేశారు.
పాపన్న జీవితం మనకు ధైర్యం, నిబద్ధత, న్యాయ పోరాటం వంటి విలువలను నేర్పుతుందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను గుర్తించి, ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు.
యువత ఆయన జీవితం నుంచి ప్రేరణ తీసుకొని, సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, పాపన్న గౌడ్ అభిమానులు, యువత, గ్రామస్తులు పాల్గొని, మహానుభావుని సేవలను స్మరించుకున్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశమైన జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే ఐపిఎస్
సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )
సిరిసిల్ల జిల్లాలోని జిల్లా పోలీస్ అధికారులతో నేడు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలని ,పెండింగ్ కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని సూచించారు.పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల దర్యాప్తుల్లో మరింత నాణ్యత ప్రమాణాలను పాటించాలని, పెండింగ్ ఉన్న కేసులలో త్వరగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి నింధితులను అరెస్టు చేసి త్వరగా చార్జిషీట్ దఖాలు చేయాలని సూచించారు.శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు పగడ్భందీగా వ్యవహరించాలని,నేరాల చెదనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి డయల్ 100 కాల్స్ పట్ల తక్షణమే స్పందిస్తూ త్వరగతిన సంఘటన స్థలాలకు చేరుకొని సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు.ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి, పేకాట, పిడిఎస్ రైస్, గుడుంబా,ఇతర చట్ట వ్యతిరేకమైన నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలని, ఇతర చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని,ఓవర్ స్పీడ్,ట్రిపుల్ డ్రైవింగ్,మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, సదన్ కుమార్, మధుకర్, ఎస్.ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
ఎదురుదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కోని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన నిజాంపేట మండలం కె. వెంకటాపూర్ గ్రామ శివారులో జరిగింది. పోలిసుల వివరాలు.. పోతారెడ్డి కి చెందిన చింతకింది భాను పని నిమిత్తం పులిమామిడికి బైక్ పై వెళ్తున్న క్రమంలో నార్లపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ నిర్లక్ష్యం గా డ్రైవింగ్ చేస్తూ టక్కరి చేసినట్లు భాను చిన్నాన్న రాములు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గణపురం మండల కేంద్రంలో బుధవారం కల్లుగీత కార్మిక సొసైటీ ఆవరణలో మాదాసు రవి గౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు జయశంకర్ జిల్లా కేజీ కేఎస్ అధ్యక్షులు బత్తిని శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన మహనీయుడు మన పాపన్న గౌడ్ బహుజనుడు పూర్వంలో తురుష్క సైనికులు కల్లు మండవ లో పాపన్న స్నేహితుని కాలుతో తన్నబోయేది చూసి కోపంతో సైనికుల్ని మార్ కత్తితో మేడ నరికినాడు అప్పటి నుండి రాజ్యం లో విప్లవకారుడు అయ్యాడు పాపన్న పేరు జనగామ ప్రదేశములో మారుమోగింది యువకులు పాపన్న వద్ద సైనికులుగా చేరారు అతి తొందర్లోనే 3,000 మందిని సొంతంగా సైనికులుగా సమకూర్చారు 1675 సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు అని అన్నారు ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచులు నారగాని దేవేందర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ గౌడ సంగం జిల్లా నాయకులు ల్యాదళ్ల సమ్మయ్య గౌడ్ గుర్రం తిరుపతి గౌడ్ పాలకవర్గ ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు మాజీ సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు
కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలో బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు..
బత్తుల బాల కుమార్ గౌడ్, తాలూకా ఉపాధ్యక్షులు శ్రీశైలం గౌడ్, పాలకోవు యువజన ఉపాధ్యక్షులు ధర్మని రవి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గౌడ్ ప్రచార కార్యదర్శి విష్ణు గౌడ్, ప్రధాన కార్యదర్శి గణేష్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ పద్మ అనిల్, జంగయ్య, కృష్ణా, నరేందర్ గౌడ్, పాండు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీకాంత్ గౌడ్ ,అల్లాజీ గౌడ్,సురేష్ గౌడ్, రాకేష్ గౌడ్, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు
ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన మాట నెరవేర్చిన రేవంతన్న సీతక్క కొత్తగూడ,నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన రేషన్ షాప్ లో సన్నాబియ్యం కార్యక్రమం కొత్తగూడ గ్రామం లో జరిగింది ముఖ్య అతిధిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ప్రియతమ నాయకురాలు బడుగు బలహీన వర్గాల ఆశ ద్విపం మన ప్రాంత అభివృద్ధి ప్రధాత ధనసరి సీతక్క ప్రజలందరూ సన్నబియ్యం పంపిణి చేస్తే సంతోషం గా ఉంటారని భావించి నేడు అమలు చేస్తున్న శుభ సందర్బంలో గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఆ విధంగా ఇచ్చేసేది అలాంటిది కాకుంటా ప్రజలందరూ కూడా సన్నబియ్యం ఇయ్యాలని సన్నబియ్యం తినాలని ఉద్దేశంతోనే మన తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇవాళ మన ఉగాది రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి మన పార్టీ మన ప్రభుత్వం ఇవాళ ఈ యొక్క సంగతి కార్యక్రమాన్ని మన స్టార్ట్ చేయడం జరిగింది. పేదలందరికీ కూడా ఇవాళ సన్న బియ్యం పంపిణి జరుగుతుంది గత ప్రభుత్వం లో బియ్యం తీసుకున్న గాని మళ్లీ వేరే బయట దళారుల అమ్ముకొని పరిస్థితి కనపడే ఇప్పుడు మాత్రం అలాంటిది లేదు మీ అందరూ కూడా తీసుకొని వినియోగించుకోవాలి అనే ఉద్దేశం ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన పథకాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హామీ ఇచ్చిందా అవన్నీ కూడా పేద ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం అమలు చేస్తది కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఆ మాట కట్టుబడి అమలు చేస్తుంది అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారంజక పరి పాలన కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి మన పేద ప్రజలు ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఓల్దార్లు అందరు కూడా దీని ఉపయోగించుకొని మరిన్ని సంక్షేమ పథకం లు ఉన్నాయి కనుక కార్యక్రమాన్ని ఇంకా ముందుకు జరిగే విధంగా మీరందరూ కూడా ప్రభుత్వానికి సాయ సహకారాలు అందించి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికి వెన్నంటే ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కూడా మనస్పూర్తిగా కోరడం జరుగుతోంది ఇందులో భాగంగానే ఇవాళ మాటిచ్చిన ప్రకారంగా ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో పించన్స్ గాని విద్యార్థులు కానీ ఇవన్నీ కూడా మళ్లీ కొనసాగిస్తుంది కూడా మన పార్టీ మన ప్రభుత్వం మన నాయకురాలు ఇప్పటికే కొందరికి మంజురి చేసినవి అవి కూడా ఈ మధ్యకాలంలోనే స్టార్ట్ అయితాయి ఇవన్నీ కూడా మీరందరూ దగ్గరుండి వినియోగించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వం పక్షాన అదే విధంగా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మీ అందరిని కూడా పేదలందరికీ కూడా కోరాడం జరుగుతోంది మన పార్టీ పేదల పార్టీ మన పార్టీ ప్రజలకు కోసం పనిచేసేది ప్రజలకు సేవ చేసే పార్టీ మన నాయకురాలు కూడా నిత్యం అనునిత్యం పేద ప్రజల కోసం పేద ప్రజలు ఎక్కడ ఏ పని కావాలన్న గాని మనకు అందుబాటులో ఉంటుంది మన నాయకురాలు సీతక్క గారు ఉన్నారు కాబట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి గాని మనకొచ్చేస్తుంటే సంక్షేమ ఫలాలు గాని మన నాయకురాలు సీతక్క ఆధ్వర్యంలో మనం మన నాయకురాలకు తోడు నీడగా ఉండి మనందరం కూడా మన నాయకురాలు ఇచ్చేస్తుంటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి మన ప్రభుత్వం పథకాలను మీరు భవిష్యత్తులో ఉపయోగించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కోరడం జరుగుతోంది.అనిఅన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ సుంకర బోయిన మొగిలి, డీసీసీ సభ్యులు వీరనేని వెంకటేశ్వర్రావు, మండల అధికార ప్రతినిధి ఈర్ప రాజేశ్వర్, కొత్తగూడ మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్, టౌన్ ఉపాధ్యక్షులు వెలుదండి వేణు,సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, డోనాల లక్ష్మి నారాయణ, మహేందర్, రవీందర్, గ్రామస్తులు, మహిళాలు తదితరులు పాల్గొన్నారు…
సిరిసిల్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిన్నటి రోజున గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లకు వచ్చి సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి.ఏదో కాగితాలు తెచ్చాడు.
అవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని. అంతేకాకుండా నిన్న ప్రారంభించినటువంటి సన్న బియ్యం కార్యక్రమం కోట సంవత్సరానికి అయ్యే ఖర్చు పదివేల కోట్ల రూపాయలు అందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ మైనటువంటి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు.
అంతేకాకుండా కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రాష్ట్రం వాటాన చెల్లిస్తుందని తెలియజేశారు.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గరీబ్ యోజన కింద ప్రతి మనిషికి ఐదు కిలోల బియ్యం కేంద్రం నుండి లభిస్తుంది మిగిలిన ఒక కిల బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుండి లభిస్తుందని తెలియజేశారు.
BJP
మంత్రి పొన్నం తేవాల్సింది సన్న బియ్యం కాగితాలు తేక బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందో అని వేరే ముచ్చట్లు చెయ్యడం కరెక్ట్ కాదు.
అని సిరిసిల్ల బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, ఉరవకొండ రాజు,మెరుగు శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.
నేడు సిరిసిల్ల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలల పుస్తక దినోత్సవం
సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )
సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ లోని బాలల పుస్తక దినోత్సవం (Children’s Book Day) ప్రతి ఏడాది ఏప్రిల్ 2న జరుపుకుంటారు.
ఈ రోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సిరిసిల్ల లో బాల చెలిమి గ్రంథాలయములో , చదవడం, గ్రంథాలయ ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది.
ఈ రోజు విద్యార్థులు చవిచూసి, కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి పెంచేందుకు ఉద్దేశ్యమైంది.
అలాగే పుస్తకాలు చదివిన తరువాత కథ పై సమీక్షా రాయలని చెప్పడం జరిగింది.
Children’s
ఇది హాన్సా క్రిస్టియన్ ఆండర్సన్ యొక్క జయంతి సందర్భంగా, అతను పిల్లల కథలను రచించడం మరియు ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు మంచి పుస్తకాలు అందించడం ద్వారా ప్రసిద్ధి చెందాడు.
ప్రధానోపాధ్యాయులు L. శారదా మాట్లాడుతూ ఈ రోజు పిల్లలు పుస్తకాల మధ్య ప్రయాణం చేస్తూ, కొత్త కథలు చదవడానికి, అక్షరాల మహిమను తెలుసుకునేందుకు ప్రేరణ పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమం లో బాల చెలిమి గ్రంధాలయం ఇంచార్జ్ ఎలగొండ రవి పాల్గొన్నారు.
రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్న బియ్యం అందుబాటులో ఉండాలి పేదలకు పౌష్టిగా ఆహారం అందాలని వచ్చే నాలుగు సంవత్సరాలు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం పేద ప్రజల మేలు కోరే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకు సన్నబియ్యం పంపిణీ ఈ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు,18వ వార్డు, 8వ వార్డులలో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పేదలకు సన్నబియ్యం పంపిణీలు చేసిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉగాది కానుకగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు శ్రీమంతుల తరహాలో సన్నబియ్యం పేదలకు కూడా అందాలని దేశంలో ఎక్కడా లేని విధంగాతెలంగాణ రాష్ట్రంలో సీఎం సన్న బియ్యం పంపిణి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే చేస్తుందని అందుకే వారి ఆకలి తీర్చేందుకు ఈ పథకాన్ని తేవడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
బాక్స్ డ్రైన్ పనులు ప్రారంభించిన. కార్పొరేటర్, ఎమ్మెల్యే
మల్కాజిగిరి నేటిధాత్రి 02:
నేరేడ్మెట్ డివిజన్ లోని ఎంప్లాయీస్ కాలనీ నుంచి సాయికృష్ణ ఎన్క్లేవ్కి 2 ఏళ్ల క్రితం పెట్టిన బాక్స్ డ్రైన్ పనులకు అనుమతి రావడంతో, 6.2 కోట్లు ఎన్డీపీ కింద ఇవ్వాల కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన. స్థానిక కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి , మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.
గతంలో ఎస్ఎన్డీపీ కింద 40 కోట్లతో యాప్రాల్లో పనులు పూర్తి చేసి యాప్రాల్కి వర్షాకాలంలో 20 సంవత్సరాల నుండి పెద్ద సమస్య పరిష్కరించడం జరిగింది
MLA
అలాగే ఈ పనులు కుడా పూర్తి అయిపోతే ఇక్కడ కాలనీ వాళ్ళకి కూడా వర్ష కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు అని స్థానిక కార్పొరేటర్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆదిత్య, పరమేష్, శర్మ, సత్యనారాయణ, రాజి రెడ్డి, పర్వతాలు,శ్యామ్, అకారం సాయి, పవన్, నవీన్ గౌడ్, ఆల్బర్ట్, పంకజం, సుదర్శిని, షాలిని, ఎస్ఎన్డీపీ అధికారులు, కాలనీ సభ్యులు మరియు పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
`ఒక్కడుగా మొదలై కోట్ల మందికి గర్జన నేర్పిన నేత కేసిఆర్.
`‘‘పుబ్బ’’ లో పుట్టి ‘‘మగ’’ లో మాడిపోతుందన్న వారిని ఎదిరించి నిలిచిన పార్టీ టిఆర్ఎస్.
`తెలంగాణ సాధించే వరకు పద్నాలుగేళ్ల అవిశ్రాంత పోరాటం టిఆర్ఎస్.
`పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ ఆవిష్కృతం బిఆర్ఎస్.
`తెలంగాణ చీకట్లను పారదోలిన పార్టీ బిఆర్ఎస్.
`మోడువాడిన తెలంగాణను చిగురింపజేసిన పార్టీ బిఆర్ఎస్.
`ఎడారి లాంటి తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన పార్టీ బిఆర్ఎస్.
`అన్నమో రామచంద్రా అనే ఆకలి కేకల నుంచి దేశానికి అన్నం పెట్టిన పాలన బిఆర్ఎస్.
`తెలంగాణ రైతును రాజును చేసిన పార్టీ బిఆర్ఎస్.
`తెలంగాణ తెచ్చింది ‘‘టిఆర్ఎస్’’… బంగారు తెలంగాణ చేసింది ‘‘బిఆర్ఎస్’’.
తెలంగాణ ఉద్యమ సృష్టికి మూలమైన బిఆర్ఎస్ పార్టీ ఎవరూ ఊహించనటు వంటి ఉద్యమాలకు, పోరాటాలకే కాదు, సభలకు, సమావేశాలకు కూడా పెట్టింది పేరు. రాజకీయ పార్టీల చరిత్రలో బిఆర్ఎస్పార్టీ నిర్వహించినన్ని సభలో ఏ పార్టీ నిర్వహించి వుండకపోవచ్చు. పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్తానంలో కొన్ని వందల సభలు నిర్వహించిన ఘనత ఒక్క బి ఆర్ఎస్కే దక్కుతుంది. సభలల్లో చిన్న చిన్న సభలే కాదు, ఎవరి ఊహకందనటు భారీ భహిరంగ సభల నిర్వహణలో బిఆర్ఎస్దే పై చేయి. అలాంటి భారీ రాజకీయ, ఉద్యమ సభలు దేశంలో ఏ పార్టీ నిర్వహించలేదు. గతంలో హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో సభలు నిర్వహించి, వాటినే గొప్ప సభలుగా చెప్పుకున్న రోజులున్నాయి. ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహంచిన భారీ భహిరంగ సభలతో పరేడ్ గ్రౌండ్ సభలకు కాలం చెల్లినట్లైంది. తెలంగాణలో ఏ పార్టీ రాజకీయ సభ పెట్టినా, బిఆర్ఎస్ సభలతో పోల్చుకుంటూ, మీడియా అనేక చర్చా వేధికలు ఇప్పటీకీ ఏర్పాటు చేస్తుంటాయి. సభల్లో బిఆర్ఎస్ను బీట్ చేయడం ఎవరి వల్ల కాదని ఆఖరుకు తీర్పునిస్తుంటాయి. అంతగొప్పగా సభలు నిర్వహించడంలో బిఆర్ఎస్ నాయకుల వ్యూహం ముందు ఏ పార్టీ సభలైనా బలారూరే అని చెప్పాలి. ఉద్యమ సమయంలో బిఆర్ఎస్ సభ అంటే పుట్టలు పగలి చీమలు వచ్చినట్లు జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఎండా, వాన, చలిలను లెక్క చేయకుండా ఉద్యమ సభలను ప్రజలు విజయవంతం చేస్తుండేవారు. కరీంనగర్లో నిర్వహించిన సింహ గర్జనతో మొందలైన పెద్ద పెద్ద పెద్ద సభలు అప్పట్లో జిల్లాకొకటి జరగుతూ వుండేది. అప్పట్లో వరంగల్లో జరిగిన బిఆర్ఎస్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకున్నదంటే ఆశామాషీ కాదు. వరంగల్ సభకు పదిహేను లక్షలమంది హజరైనట్లు లెక్కలున్నాయి. ఆ తర్వాత కూడా అనేక సభలు నిర్వహించి, ప్రజల్లో తెలంగాణ ఉద్యమాన్ని సజీవం చేసిన ఘనత కేసిఆర్కే దక్కుతుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత గాని, అదికారంలో వున్న పదేళ్లలో గాని మళ్లీ అంత పెద్ద సభలు బిఆర్ఎస్ల నిర్వహణలు ఆపలేదు. 2014 ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల సభలు పెద్దఎత్తున నిర్వహించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసిఆర్ చేసిన బస్సుయాత్రకు కూడా ప్రజలు తండోపతండాలుగా కదలి వచ్చారు. అంతకు ముందు నిర్వహించిన నల్గొండ సభకు కూడా ప్రజలు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. బిఆర్ఎస్ పార్టీ పుట్టి 25 సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. ఆ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేసింది. అందులో భాగంగా తెలంగాణ ప్రజల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజాభిమానం చెక్కు చెదరలేదని నిరూపించేందుకు వరంగల్లో మరో భారీ భహిరంగ సభ నిర్వహించేందు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే గతంలో బిఆర్ఎస్సభలకు, ఈ నెల 27న వరంగల్లో జరిగే సభకు కొంత వ్యత్యాసముంది. గతంలో ఉద్యమ కోణంతోపాటు,రాజకీయ ఎన్నికల సభలు జరుగుతూ వుండేవి. కాని ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పుట్టి ఇప్పటికీ 25 ఏళ్లు పూర్తి కావస్తుండడంతో ఈ సభ కూడా చరిత్రలో నిలిచేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో బిఆర్ఎస్కున్న రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నారు. వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి సమీపంలో సుమారు 1200 ఎకరాలలో బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీసభ నిర్వహణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 15 లక్షల మందిని సమీకరించే పనిలో బిఆర్ఎస్ శ్రేణులున్నాయి. తెలంగాణలో అధికారంకోల్పోయినా సరే, బిఆర్ఎస్పై ప్రజలకు ఏ మాత్రం అభిమానం తగ్గలేదని నిరూపించాలంటే ఉద్యమ సమయంలో జరిగిన సభలను మించి నిర్వహించాలని చూస్తున్నారు. అందుకోసం బిఆర్ఎస్ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ఎప్పటికప్పుడు నాయకులతో చర్చలు జరుపుతున్నారు. సభ ఏర్పాట్లును ఎప్పటికికప్పుడు సమీక్షిస్తున్నారు. పనులు వేగం పెంచేందుకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ సభతో బిఆర్ఎస్ మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టేలా వుండనున్నది. బిఆర్ఎస్కు తెలంగాణలో ఎదురులేదని, తిరుగులేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాడిన్న కాలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా వుంటున్న కేసిఆర్ మొదటి సారి తన గళాన్ని వినిపించే వేదిక కావడంతో తెలంగాణ అంతా ఆ సభలో వుండేలా చూసుకుంటున్నారు. అందుకే 1200 ఎకరాల స్థలంలో సభ నిర్వహణను ఏర్పాటు చేస్తున్నారు.
బిఆర్ఎస్ అంటే రాజకీయాల కోసం పుట్టిన పార్టీ కాదు. ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ. కేసిఆర్ ఆలోచనతో మొగ్గ తొడిగిన పార్టీ. ప్రజల ఆవేదనల నుంచి పురుడు పోసుకున్న పార్టీ. ప్రజల ఆక్రందనల నుంచి మొలకెత్తిన పార్టీ. తెలంగాణ గోసలు తీర్చేందుకు ఏర్పాటైన పార్టీ. తెలంగాణ సాధన కోసం జ్వనించిన పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ధ్యేయంగా జ్వలించిన పార్టీ. ఉద్యమమై ఉరకలెత్తిన పార్టీ. పోరు దారిలో తెలంగాణ నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా వినిపించిన పార్టీ. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరులూదిన పార్టీ. తెలంగాణ అనే నినాదాన్ని ఆకాశాన్ని తాకేలా గర్జించిన పార్టీ. తెలంగాణ అనాలంటే ముందు,వెనుక ఒకటికిపదిసార్లు ఆలోచించేవారు కూడా పిడికిలి బిగించి జై తెలంగాణ అని ఎలిగెత్తేలా చేసిన పార్టీ. గొంతు సవరించుకొని అప్పటి పాలకుల గుండెలు అదిరేలా జై తెలంగాణ అని నినదించిన పార్టీ. సమైక్య పాలకులు గుండెలు అదిరేలా జై తెలంగాణ జపం చేసిన పార్టీ. తెలంగాణను అడ్డుకున్న వారి వెన్నులో వణుకుపుట్టించిన పార్టీ. తెలంగాణ వ్యతిరేకులను, సమైక్య వాదులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన పార్టీ. ఇక తెలంగాణ మనది కాదని సమైక్య వాదులు మూట ముల్లె సర్ధుకొని వెళ్లిపోయేలా చేసిన పార్టీ. ఇక ఎంత అడ్డుకున్నా తెలంగాణ ఆగేది లేదని, కాదని తెలుసుకొని సమైక్య వాదులచేత కూడా జై తెలంగాణ అని పించిన పార్టీ. తెలంగాణ నుంచి ఆకలి కేకలతో, బతుకెళ్లదీసుకునేందుకు వలసలు పోయిన ప్రజలు మళ్లీ ఆత్మగౌరవంతో బతికేలా చేసిన పార్టీ. వారి ఆకలి తీర్చి, అన్నం పెట్టిన పార్టీ. ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసిన పార్టీ. తెలంగాణలో నీటి పరవళ్లు నింపిన పార్టీ. ఎప్పుడో దశాబ్దాల తరబడి ఎండిపోయిన వాగుల్లో , వంకల్లో, ఒర్రెల్లో కూడా నీరు పారించిన పార్టీ. ఎప్పుడో ఎండిపోయి, తుమ్మలు మొలిచి ఆనవాలు లేకుండాపోయిన చెరువులను బాగు చేసి, ఊరుకు కల్పతరువు చేసిన పార్టీ. ఊరుకు చెరువే ఆదరవని నిరూపించిన పార్టీ. పదేళ్ల పాటు చెరులన్నీ గంగాళలంలా కళకళలాడేలా చేసిన పార్టీ. ఎండా కాలంలో కూడా చెరువులు మత్తళ్లు దుంకేలా చేసిన పార్టీ. పాడి పండలతో తెలంగాణ సిరి సంపదలతో తులతూగేలా చేసిన పార్టీ. ఇదంతా ఒక్క కేసిఆర్ సృష్టి. తెలంగాణ సాధనలో కేసిఆర్ కలలుగన్న ఆర్తి. తన కలలను తానే నిజం చేసి, తెలంగాణకు సిరుల తెలంగాణ చేసిన కీర్తీ కేసిఆర్. తెలంగాణను బంగారు తెలంగాణ చేసి సుసంపన్నం చేసిన ఘణకీర్తి కేసిఆర్. పద్నాలుగేళ్లపాటు అలుపెరగని పోరాటం చేసి, లక్ష్యం ముద్దాడిన పార్టీ. తెలంగాణ తెచ్చిన చరిత్రకు కీర్తి కిరీటం కేసిఆర్. తెచ్చిన తెలంగాణలో బంగారు సిరి రాసులను పండిరచేలా ప్రాజెక్టులను నిర్మాణం చేసిన అపర భగీరధుడు కేసిఆర్. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు తెలంగాణ రాకపోతే కలలో కూడా ఊహించలేం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్ లాంటి నాయకుడు లేకపోతే తెలంగాణలో జలసిరులు చూడలేకపోయేవాళ్లం. అందుకే కేసిఆర్ అనే మూడక్షరాల పదమే తెలంగాణకు జీవం. తెలంగాణ ప్రగతి వేదం. ఆయన చూపే ప్రజలకు వరం. ఆయన నవ్వే బంగారం. తెలంగాణ కోసం ఆయన జీవితమే ఒక త్యాగం. ఆ త్యాగ ఫలాలే మనం అనుభవిస్తున్న జీవితాలు అర్ధం…పరమార్ధం. పదేళ్లతో తెలంగాణ తల రాత మార్చిన ముక్కంటి శివునికి ప్రతిరూపం. తెలంగాణ భవిష్యత్తును తీర్చి బ్రహ్మరాతకు కేసిఆర్ జలయజ్ఞం నిదర్శనం. తెలంగాణను అన్ని రంగాలలో పదేళ్లల పరుగులు పెట్టించిన ఆధునిక ఆర్దిక వేత్త కేసిఆర్. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందేలా చేసిన వైతాళికుడు కేసిఆర్. తెలంగాణ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జాతి పిత కేసిఆర్.
తెలంగాణ రాష్ట్రము లోని ఆదివాసీలు తమ అస్తిత్వం ను,కోల్పోయి బ్రతుకు జీవుడా అంటూ అభివృద్ధి కి దూరంగా,ప్రభుత్వ, సంక్షేమ పధకాలకు నోచుకోకుండా,ఆదివాసీ నిరుద్యోగ యువత కు ఉద్యోగ కల్పన,ఉపాధి,లేక పోవడం తో,తీవ్ర మనో వేదనకు గురౌ తున్నారని,రాష్ట్రము లోని ఆదివాసీల భూములు వలస వాదుల,అదీనం అక్రమంగా దోపిడీ కి గురైన విధానము ను గిరి గ్లాని కమీషన్ రిపోర్ట్ తేట తెల్లం చేసిన విషయం,ప్రభుత్వా లకు తెలిసినా ఆదివాసీల దోపిడీ చేసిన వర్గాలకే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు, వంతపాడుతున్నాయని,ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేకంగా స్వయం పాలన అధికారం అమలులో ఉందనే నిజo తెలిసినా పాలకులు తమ రాజకీయ అధికారం కోసం ఆదివాసీలను అణిచి వేసే ధోరణి తో ఆదివాసీల పై,కుట్ర పూరిత విధానాలు అనుసరించి చొర బాటుదారుల తో ఆదివాసీ ప్రాంతం ను చిన్నా భిన్నం చేస్తూ ఆదివాసీ ల మనుగడ కు తీవ్ర ఆటంకం కల్గిస్తున్న భూర్జవ రాజకీయ పార్టీలు,వలసవాద గిర్జనేతరుల,భారీ నుండి ఆదివాసీలను కాపాడు కునేందుకు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ,రాష్ట్ర మహాసభ లను ,చలో జోడెన్ ఘాట్ ఏప్రిల్ 12,13, 14 తేదీలలో రాష్ట్ర మహా సభలు, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,కెరమేరి మండలం, కొమురం భీమ్ యుద్ధ భూమి అయిన జోడెన్ ఘాట్ లో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది, ఈ రాష్ట్ర మహాసభల కు వక్తలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత MLC ప్రొపెసర్ ఆచార్య కోదండరాం, ఓయూ ప్రిన్సిపాల్ ప్రొపెసర్ కాశిం, విశ్రాంత ప్రొపెసర్ హరగోపాల్ లు హాజరై ప్రసంగిస్తారాని,ఈ మహా సభల విజవంతం కోసం తుడుందెబ్బ రాష్ట్ర,జిల్లా మండల ముఖ్య నాయకత్వం హాజరై విజయవంతం చేయాలనీ తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ ఆగబోయిన రవి, ఈ రోజు కొత్తగూడ గ్రామ పంచాయితీ,అవరణం లో జిల్లా అధ్యక్షులు కుంజ నర్సింగ రావు అధ్యక్షతన జరిగిన సమావేశం లో పిలుపునిచ్చారు,సమావేశం లో అల్లెం జంపయ్య,సిడం రమేష్,సిద్దబోయిన లక్ష్మీ నారాయణ,సతీష్,తదితరులు పాల్గొన్నారు…
వనపర్తి కాంగ్రెస్ నేత న్యాయవాది బార్ కౌన్సిల్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ను సన్మానం చేసిన మిత్రులు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత డి కిరణ్ కుమార్ వనపర్తి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు న్యాయవాది కిరణ్ బాల్య మిత్రులు వై వెంకటేష్ మెడి కల్ ఏజెన్సీ నిర్వహికులు కె బి శ్రీనివాసులు శెట్టి పంపు కటకం చందు గట్టు రవి సాగర్ కొండూరు ప్రవీణ్ కుమార్ శాలువతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా వై వెంకటేష్ మాట్లాడుతూ మిత్రుడు న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నేత డి కిరణ్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో పదవులు ఆకాంక్షించాలని కోరారు
తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు చెట్టు పై నుండి పడి మృతి చెందిన బంటు ఆనందంకి 50 కిలోల బియ్యం అందజేసిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య సందర్భంగా మాట్లాడుతూ బస్వాపూర్ గ్రామంలో కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని నా వంతు సహాయంగా అందజేశానని తెలియజేశారు అలాగే బస్వాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి కనక లక్ష్మి లక్ష్మారెడ్డికి 2500 శ్రీనివాస్ రెడ్డికి 2500 చొప్పున నిరుపేద కుటుంబాలకు సహాయం అందజేశామని అంత్యక్రియలు చేసుకొని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం తక్షణం సహాయం కింద 20 వేల రూపాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కర్నె బాలయ్య మాజీ సర్పంచ్ గుడిసెల నీరజ శ్రీనివాస్ గౌడ్ గుడిసెల తిరుపతి దేవయ్య రామ్ రెడ్డి చంద్రమౌళి సురేష్ మల్లయ్య బాబు కనకయ్య దేవయ్య తదితరులు పాల్గొన్నారు
బీజేపీ పార్టీ భారత రాజ్యాంగంన్ని మార్చే కుట్ర చేస్తోంది
కుల మత విద్వేషాలు రెచ్చగోడుతుంది
కొత్తగూడ,నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జై బాపు జై భీమ్ జై సంవిదన్ అను కార్యక్రమం న్ని కొత్తగూడ మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు..మండల కమిటీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య విచ్చేసి ముందుగా మండల కేంద్రం లోని బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహని కి పూలమాల వేసారు అనంతరం జెండా ఎగరేశారు కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ ఆల్ ఇండియా పార్టీ తీసుకున్న కార్యక్రమం లో భాగంగా ఈరోజు నుంచి దేశ వ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధన్ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పిలుపు నేడు కొత్తగూడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భారత రాజ్యాంగం నీకి అన్యాయం చేసే కుట్ర బీజేపీ చేస్తుందని రాజ్యాంగం ని నిర్లక్ష్యం చేస్తూ కులాల చిచ్చు మతాలరొచ్చు దేశం లో అలజడులు సృష్టి స్తుంది రాజ్యాంగం కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని.. జై బాపు జై భీమ్ జై సంవిధన్ అని అన్నారు..ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, టీపీసీసీ ఆర్గనైజ్ సెక్రటరీ చల్లా నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి ఇర్ఫా రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి, డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు బిట్ల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ కాడబోయిన జంపయ్య, యూత్ మండల అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి, యూత్ జిల్లా జనరల్ సెక్రెటరీ నోముల ప్రశాంత్, ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ మల్లెపూ రంజిత్, యూత్ మండల ఉపాధ్యక్షులు చొప్పారి కుమార్, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, వివిధ గ్రామా పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు…
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకమని క్యాతనపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పార్టీ సీనియర్ నాయకులు వొడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య లు అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణం లోని భగత్ సింగ్ నగర్ సింగరేణి క్వార్టర్స్ ఏరియాలో గల మధసూదన్ రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద ఇంటికి సన్న బియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకమని, పేద వారి ఇంట ప్రతిరోజు పండగ జరగాలన్న ఆలోచన, పేదవారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి రాజేష్, మహిళా నాయకురాలు పుష్ప,నాయకులు పాల్గొన్నారు.
సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 315 వర్థంతిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ పట్టణం లోని పద్మావతి కాలనీ లోని గ్రీన్ ఫీల్డ్ లో గల సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామాన్యుడు కూడా సంకల్పం ఉంటే చక్రవర్తి కావచ్చు అని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగల్ చక్రవర్తులను ఎదిరించి రుజువు చేశారని ఆయన గుర్తు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తి తో ప్రజా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. భావితరాలకు వారి చరిత్రను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇస్తున్న నిజమైన నివాళి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, ప్రవీణ్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తిరుమల వెంకటేష్, ఖాజా పాషా, మోసిన్, అంజద్, నాయకులు కిషన్ నాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్ ఇందిర తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో యాదవ సంఘం కమిటీ ఆధ్వర్వంలో శ్రీగంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ నూతన ఆలయ నిర్మాణానికి మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ను బుధవారం మరిపెడ మండలం బీచ్ రాజుపల్లి గ్రామంలో యాదవ సంఘం కమిటీ సభ్యులు కలిసి సహాయ సహకారాలు అందించాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన గుడిపూడి నవీన్ రావు గుడి నిర్మాణానికి రూ.30 వేలు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా గుడిపూడి నవీన్ రావుని యాదవ సంఘం కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ కొమ్ము నరేష్,కొమ్ము చంద్రశేఖర్,కోడి శ్రీకాంత్,వల్లపు లింగయ్య, కొమ్ము లింగయ్య,కొమ్ము ఉప్పలయ్య, కొమ్ము ఐలయ్య,కోడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
జై బాబు జై భీమ్ జై సంవిధన జోరుగా సాగిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర….
పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం….
పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు…
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు,జై భీమ్,జై సంవీదాన్ నినాదంతో ఉద్యమిద్దామని అన్న గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు .
వర్దన్నపేట( నేటిదాత్రి ):
రాజ్యంగ పరిరక్షణ లో భాగంగా జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు లోకసభ సభ్యులు శ్రీ.రాహూల్ గాంధీ , జాతీయ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే మరియు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన పాదయాత్ర లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు తో మరియు ఇంచార్జి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ * రాయల నాగేశ్వర రావు* మరియు జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ – రాజేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు , జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ * గారు స్టేట్ కో- ఆర్డినేటర్ *శ్రీ పులి అనిల్ * పాల్గొన్నారు.తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించి పరిరక్షణ యాత్ర ను ప్రారంభించి సుమారు 2 కిలోమీటర్ల ప్రజలకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ముఖ్య ఉదేశం ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లారు.*ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ.భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.నేడు పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని,ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యం అన్నారు.రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు,అంబెడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు.
పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా గారు అంబెడ్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు.గ్రామ మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కోరారు.గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఒక్కొకటి అమలుపరుస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన పథకాలను కూడా కొనసాగిస్తుందన్నారు. కానీ టిఆర్ఎస్ నాయకులు పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న పనులను ఓర్వలేక వ్యతిరేకమైన అంశాలను సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతుందని అన్నారు.గత పదేళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యంగాన్నీ అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ అప్రజాస్వామ్య పాలన సాగిస్తుంది,ప్రజల సమాన హక్కులు,సమ న్యాయం కల్పించాల్సిన పాలకులు రాజ్యాంగo ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తూన్న తీరు తీవ్ర ఆక్షేపనియంగా ఉంది ఇలాంటి తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు..అందుకే రాజ్యoగాన్ని రచించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు,జై భీమ్,జై సంవీదాన్ నినాదంతో ఉద్యమిద్దామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, డివిజన్ నాయకులు, కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు…
రాబోయే తరానికి స్ఫూర్తి కలిగించేలా అభివృద్ధి పనులు
గ్రామ అభివృద్ధికి పెద్దపీట
గ్రామ అభివృద్ధి కమిటీ- గట్లకానిపర్తి
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకా నిపర్తి గ్రామంలో రాబోయే తరానికి స్ఫూర్తి కలిగించేలా అభివృద్ధి పనులు చేస్తున్న గ్రామ అభివృద్ధికి పెద్దపీట.
ముళ్ల పొదలు/చెట్ల పొదలు తొలగింపు
శాయంపేట మండలం గట్ల కానిపర్తి నుండి నర్సిరావు పల్లె వెళ్లే రోడ్డు పైకి ఇరువైపులా ఉన్న ముళ్లపదలను/చెట్ల కొమ్మలను స్వచ్ఛందంగా తొలగించడం ద్వారా వాహనదారులకు డ్రైవర్ ముఖ్యంగా పల్లె వెలుగు బస్సు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చెట్ల కొమ్మలను తొలగించడం జరిగింది. అక్టోబర్ 2 2014 ప్రజలందరూ శ్రమదానం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఉదయం నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు శ్రమదానం గ్రామ ప్రజలు చేయడం అభినందన నియ మని కమిటీ పేర్కొన్నారు.
Development
ప్రధాన కూడలిలో డ్రైనేజీలు మరమ్మత్తులు
గట్లకానిపర్తి గ్రామంలో కీర్తిశేషులు నల్లెల్ల మహేందర్ ఇంటి దగ్గర లోని మూల మలుపు వద్ద డ్రైనేజీ ఒక చివర శిథిలమై ఉన్నదానిని వెళుతుంటే ప్రజలకు ఆసౌకర్యంగా ఉన్నదని గుర్తించి ప్రజాక్షేమం దుష్ట ముఖ్యంగా టు వీలర్, వాహనదారులకు, వృద్ధులకు, చిన్న పిల్లలకు ప్రమాదాలు జరగకుండా పారిశుద్ధ కార్యక్రమం ఇట్టి పనిని 13 జనవరి 2025 రోజున ఇట్టి పనిని సందర్భంగా పూర్తి చేయడం జరిగింది గ్రామ అభివృద్ధి కొరకు ముందుకు వచ్చిన దాతలు గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు అభినందించడం జరిగింది.
Development
వైకుంఠధామానికి విద్యుత్ సౌకర్యం తీసుకురావడం
గట్లకానిపర్తి గ్రామంలో ఉన్న వైకుంఠధామానికి దగ్గర స్నానం చేయడానికి వీలుగా గ్రామ ప్రజలు కొరకు విద్యు త్తును వాడుకునే సౌకర్యం కల్పించడం కోసం దాదాపు ఖర్చు అవుతుందని అంచనా వేసి దాతలు వస్తువులు రూపకంలో మాత్రమే సహకారం అందించాలని కోరారు.తప్పెట్ల పున్నం రాజ్ మాతృభూమి పై ఉన్న మమకారం కోసం తన తండ్రి గారైన తప్పెట్ల భద్రయ్య మీద ఉన్న ప్రేమతో వారి జ్ఞాపకార్థం మన గ్రామ ప్రజల సౌకర్యార్థం సామాజిక సేవ గ్రామ ప్రజల సౌకర్యం ముఖ్యంగా మన ఇంట ఆడబిడ్డల మహిళల ఆత్మగౌధం నిలబడ్డ దానికి సామాజిక సేవా కార్యక్రమంలో దాతగా ముందుకు రావడం జరిగింది దాతలు గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు అభినందించడం జరిగింది.
గ్రంథాలయ ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాతలు
గట్లకానిపర్తి గ్రామంలో ఏర్పాటు చేయడం గ్రంథాల యం కొరకు వస్తువులు పుస్తకాలు డబ్బాలు ఇవ్వడా నికి ముందుకు వచ్చిన దాతలు అభినందనీయం కనుక గ్రామంలో 2 అక్టోబర్ 2024 నుండి 21 ఫిబ్రవరి 2025 వరకు గ్రంథాలయ ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాతలు న్యూటoకి ప్రభాకర్ సీనియర్ జర్నలిస్ట్, భాస్కర్ సహకారం, బొమ్మ కంటి కుమారస్వామి గ్రంథాలయం కొరకు సీలింగ్ ఫ్యాన్స్, బొమ్మ కంటి రాజు రెండు సీలింగ్ ఫ్యాన్స్, పెద్దపల్లి సురేందర్ మహనీయుని కోడలపై అతికించడం, కక్కర్ల భారత్ గౌడ్ సైన్ బోర్డులు ఇస్తానని హామీ, క్రాంతి కుమార్ రంగులు సున్నాలు అయ్యే ఖర్చుకు హామీ,గ్రంథాలయానికి డబ్బులు మరియు దాతలు బొమ్మ కంటి బుచ్చయ్య పెయింటింగ్ ఎలక్ట్రిషన్ వగైరా అయ్యే ఖర్చు చేయడం, బాధ్యత రాజ్యాంగం పుస్తకం బహుకరించిన బొమ్మకంటి శ్యాంసుందర్, గడ్డం వెంకటేశ్వర్లు, కేశవమూర్తి (వరంగల్ వాయిస్ ఎడిటర్) 5000 రూపాయల ఆర్థిక సాయం మరియు 5 వేల రూపాయల విలువగల పుస్తకములు అందజేస్తానని తెలియజేయడం జరిగింది.. ఎండవల్లి స్నేహిత రెడ్డి సాఫ్ట్వేర్ ఆమె అందిస్తానని తెలిపారు బొమ్మ కంటి వెంకటేష్ పుస్తకాల నిమిత్తం 8 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. గ్రంధాలయ నిర్వాహన కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి గ్రామ అభివృద్ధి కమిటీ ధన్యవాదాలు తెలియజేశారు ఇంకా రేకులు ఐరన్ పైపులు సిమెంటు సిమెంటు ఇటుకలు కంకర డస్ట్ తలుపులు కిటికీలు ఎలక్ట్రిక్ సహాయం వంటివి అవసరం గ్రామ పెద్దలు మేధావులు ఉద్యోగస్తులు విద్యావంతులు వృత్తిని పనులు యువకులు వ్యాపారస్తులు ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్లు అన్ని వర్గాల ప్రజల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జండా ఏర్పాటుకు సహకరించాలని గట్ల కనపర్తి గ్రామ అభివృద్ధి కమిటీ ప్రజలను వేడుకున్నారు.
విజన్ డాక్యుమెంట్ గట్ల కనపర్తి
సమాజ సేవ చేయాలనే దృడ సంకల్పం, పట్టుదల నిజాయితీ ఆత్మవిశ్వాసం చర్యలకు పారదర్శకత సమిష్టి తత్వం తగ్గింపు తత్వం నిరాడంబరం మానవీయత వంటి ప్రధాన అంశాలలో లక్ష్యం వైపు సాగడం
చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడేలా గ్రంథాలయం ఏర్పాటు
సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం, స్మశాన వాటిక దగ్గర స్నానం కోసం షవర్లు ఏర్పాటు చేయడం
గ్రామానికి కైలాసరథం వచ్చేందుకు కృషి
గ్రామంలో అంగడి ఏర్పాటు చేయడం
గంగదేవిపల్లి మొలకనూర్ లాంటి ప్రేరణతో అభివృద్ధి పనులను, మహిళలు అభివృద్ధి పనులకు ఆలోచించి స్వయం ఉపాధి పథకాల వైపు ప్రోత్సహించడం
యువత చదువుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు అందించడం కోసం
గ్రామ విడతల వారీగా హెల్త్ క్యాంపులు రక్తదాన శిబిరాలు నిర్వహించడం
గ్రామానికి పేరు ప్రఖ్యాతలు గుర్తింపును తీసుకొచ్చిన వారిని గౌరవించడం, సన్మానించడం
ప్రజల్లో మానవత్వ విలువలు పెంపొందించే విధంగా కృషి చేయడం
*సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది
ఉపాధ్యాయులను సన్మానించడం
Development
దేశ భవిష్యత్తు తరగతిగది గో డల మధ్య నిర్మితమై ఉన్నది బావి భారత పౌరులను తయా రు చేయడంలో అనేకులను ప్రయోజకులను తయారు చేయడంలో గురువులది కీలక పాత్ర. వారి కృషి మరువలేనిది గురువులను గౌరవించి సన్మానం చేయటం ఆలోచన రావడం కారణం విద్యనే జ్ఞానానికి మూల స్తంభాలైన గురువులను రాబోయే రోజులలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడo జరుగు తుంది ఉపాధ్యాయ వృత్తి అనేది ఉన్నతమైనది దేశానికి మంచి పౌరులను అందించేదే కేవలం ఉపాధ్యాయులే. మన గ్రామంలో బోధించిన ఉపాధ్యా యుని, ఉపాధ్యాయులను గౌరవించడం కోసం గురువుల కు సన్మానం అనే మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాలని సంకల్పించడం జరిగింది. గ్రామంలో పాఠశాలలు స్థాపించినప్పటి నుండి 60 సంవత్సరాల కాలం నేటి వర కు ప్రాథమిక పాఠశాలలో ఉన్న త పాఠశాలలో బోధించే పదవి విరమణ పొందిన ఉపాధ్యా యిని, ఉపాధ్యాయులను గ్రామ అభివృద్ధి ఆధ్వర్యంలో మరియు గ్రామ ప్రజలు సమక్షంలో మెమొరంటోను, బహుకరించి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానిం చడానికి నిర్ణయిం చడం జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం 60 సంవత్సరాల కాలం నుండి 200 మందికి పైగా గురువులు గట్ల కనపర్తి గ్రామంలో విధులు నిర్వర్తించి ఉంటారు మరికొందరు బోధించే వృత్తిలో కొనసాగు తున్నారు. రాబోయే రోజుల్లో మన గ్రామంలో ఏర్పాటు చేయబడి గ్రంథాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించి గురువులను అందరిని ఒకే వేదిక మీద ఘనంగా సన్మానిద్దాం,
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.