ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయాలి.

ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయాలి

ఆర్ టి ఓ కు ఫిర్యాదు

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఫిట్నెస్ లేని ప్రైవేటు స్కూలు బస్ లను సిజ్ చేయాలని విద్యార్థుల యువజన సంఘాల అధ్యర్య ములో ఆర్ టి ఓ కు ఫిర్యాదు చేశారు
ఈ సందర్భంగా విద్యార్థుల సంఘాల నాయకులు రాఘవేంద్ర వెంకటే ష్ కుతుబ్ లు మాట్లాడుతూ
వనపర్తి పట్టణ ము జిల్లాలోని వివిధ మండల కేంద్రంలో ప్రైవేటు స్కూలలో పిట్నెస్ లేని బస్సులను లైసెన్స్ లేని డైవర్స్ ను తొలగించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశామని చెప్పారు
పిల్లలు భవిష్యత్ లో బాగా చదవాలని తమ విద్యార్థులను ప్రైవేటు స్కూల్ లో వేలకు వేలు డబ్బులు డొనేషన్ చేసి చదివిస్తూ ఉంటే అక్కడ ఉన్న స్కూల్ యాజమాన్యం వాళ్ళు లైసెన్స్ డ్రైవర్స్ కొనసాగిస్తూ వచ్చేరాని డ్రైవింగ్ చేస్తూ విద్యార్థుల మరణ ము కు కారణం అవుతున్నారని తెలిపారు

పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు.

పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు

*ఆర్టిసి టూర్ ప్యాకేజీలను వినియోగించుకోవాలి *

నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ టూర్ ప్యాకేజీలను ప్రజలు వినియోగించుకోవాలని నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట నుండి
1)భద్రాచలం-పర్ణశాల-కిన్నెరసాని-మల్లూరు-బొగత జలపాతం.
2)కొమురవెల్లి-వేములవాడ-కొండగట్టు-ధర్మపురి-గూడెంగుట్ట.
3)నాగార్జునసాగర్-స్వర్ణగిరి-యాదగిరిగుట్ట.
4)పంచారామాలు:అమరావతి, ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, మరియు విజయవాడ.
5)విజయవాడ, ద్వారాకాతిరుమల, భద్రాచలంకు మరియు 40మంది ప్రయాణకులు ఉంటే మీరు కోరుకున్న ప్రదేశాలకు బస్సులను నడుపబడునని తెలియజేసారు. వివరాలకు 9959226052,9866373825, 9989038476 నంబర్లను సంప్రదించగలరని డిపో మేనేజర్ కోరారు.

సరస్వతి పుష్కరాలకు బస్సుల ఏర్పాటు. !

సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు

రోజుకు 10 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి

పరకాల డిపో మేనేజర్ రవి చందర్

పరకాల నేటిధాత్రి :

 

ఈ నేల 15 నుండి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడువు తున్నట్టు డిపో మేనేజర్ రవిచందర్ ఓ ప్రకతనలో తెలిపారు.రోజుకు 10 ప్రత్యేక బస్సులు పరకాల నుండి కాళేశ్వరంకు నడుపుతున్నట్టు తెలిపారు.ఈ పుత్యేక బస్సులకు చార్జీలు పరకాల నుండి కాళీశ్వరంకు పెద్దలకు 190రూపాయలు పిల్లలకు 110రూపాయలు గా నిర్ణయించినట్టు తెలిపారు.ఏదైనా వివరాలకు 9705479088,7382 926774 నంబర్లను సంప్రదించాలని,భక్తులందరు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వనపర్తి నుండి పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాలి .

వనపర్తి నుండి పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాలి

డి ఎం కు వినతిపత్రం ఇచ్చిన ఐక్యవేదిక

వనపర్తి నేటిధాత్రి :

 

 

వనపర్తి బస్ డిపోలో బస్సుల సంఖ్య పెంచి వనపర్తి నుండి పుణ్యక్షేత్రలకు బస్ లను నడపాలని వనపర్తి జిల్లా
అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యర్య ములో వనపర్తి డి ఎం కు ఇచ్చామని ,అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఒక ప్రకటన లో.విలేకరుకు తెలిపారు దూర ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు వనపర్తి డి పో బస్ లు పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట, మంత్రాలయం, శ్రీశైలం, తిరుపతి భద్రాచలం అరుణచలం వెంటనే బస్సులు నడపాలని వనపర్తి , మాజీ బిసి ఎమ్మెల్యేల గ్రామాలకు జయరాములు గ్రామం గుమ్మడం కు బాలకృష్ణయ్య గ్రామం చిట్యాల పెద్దమందడి మీదుగా మహబూబ్ నగర్ , హైదరాబాద్ కు బస్సులు నడుపాలని, పాత బస్టాండు నిర్మాణం చేయించి, ప్రయాణికులకు అందుబాటులో కి తీసుక రావాలని బస్ లు పో నీ మారుమూల గ్రామాలకు బస్సులు నడపాలని కోరారు స్క్రాప్ బస్సులో స్థానంలో 20 బస్సులు వచ్చాయని అవి సరిపోక మరో 25 బస్సులు డిపోకు అవసరమని వెంటనే తెప్పించాలని ఎమ్మెల్యే మేగారెడ్డి, కలెక్టర్ ని ఒక ప్రకటన లో కోరారు
సతీష్ యాదవ్, వెంట వెంకటేశ్వర్లు, తెలుగుదేశం కొత్త గొల్ల శంకర్ గౌనికాడి యాదయ్య, రాజ్ కుమార్, మన్యం నాయక్, రాము యాదవ్, శివకుమార్, పుట్టపాక బాలు తదితరులు ఉన్నారు

గుజ్జ గ్రామానికి ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించాలి: సిపిఎం

గుజ్జ గ్రామానికి ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించాలి: సిపిఎం
.రీజనల్ మేనేజర్ కు సీపీఐ(ఎం) వినతి
నల్లగొండ జిల్లా, నేటిదాత్రి:
గుజ్జ గ్రామానికి నార్కట్ పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ను పునరుద్ధరించడంతోపాటు ప్రస్తుతం నడుస్తున్న నల్లగొండ డిపోకు చెందిన బస్సును గ్రామం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం సీపీఐ(ఎం)నాయకులు నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు నారి ఐలయ్య,బండ శ్రీశైలం మాట్లాడుతూ కరోనాకు ముందు నార్కట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉదయం 6.30 గంటలకు నార్కట్పల్లి నుంచి బయలుదేరి బ్రాహ్మణ వెల్లేముల,పలివెల,గుజ్జ, సర్వేలో గ్రామాల మీదగా చౌటుప్పల్ కు వెళ్లి తిరిగి అదే గ్రామాల మీదగా నార్కట్పల్లికి చేరుకునేది అన్నారు.ఉదయం సాయంత్రం ఇలా రోజుకు రెండు పర్యాయాలు తిరిగేదన్నారు.ప్రస్తుతం నడుస్తున్న నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గ్రామం లోపలికి వెళ్లి హైదరాబాదులోని దిల్సు ఖునగర్ వరకు పెళ్లి తిరిగి వచ్చేదన్నారు.కరోనా సమయంలో బంధయిన ఈ బస్సులు తిరిగి నల్లగొండ డిపోకు చెందిన బస్సు ప్రారంభమైనప్పటికీ నార్కట్పల్లి డిపోకు చెందిన బస్సు ప్రారంభం కాలేదన్నారు.వాణిజ్య పంటలకు కేంద్రమైన గుజ్జ గ్రామానికి బస్సు సౌకర్యాలు లేకపోవడం వల్ల పండించిన పంటలను అమ్ముకునేందుకు రైతులు, విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు,వివిధ అవసరాల కోసం వెళ్లే ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. నార్కట్ పల్లి ఆర్టీసీ బస్సులు తిరిగి పునరుద్ధరించాలని, నల్లగొండ నుంచి వస్తున్న బస్సులు గ్రామంలో పలికి రప్పించాలని కోరుతూ శుక్రవారం ఆరంభకు వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారీ ఐలయ్య,గుజ్జ గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, నారాయణపురం మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి, గుజ్జ మాజీ సర్పంచ్ చాడ నరసింహ,ఉప సర్పంచ్ వెలిజాల గోపిక,రైతు సంఘం నాయకులు బొమ్మగాని శంకరయ్య, మహిళా సంఘం నాయకురాలు కుకుడాల మంగమ్మ తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version