ముగిసిన కాలేశ్వరం సరస్వతి పుష్కరాలు.

ముగిసిన కాలేశ్వరం సరస్వతి పుష్కరాలు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద, ఆరోగ్యం, వృద్ధి, పాడిపంటల శుభఫలితాల కోసం కాలేశ్వరం సరస్వతి పుష్కరాలు 12 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన హోమాలు నేడు పూర్ణాహుతితో ముగిశాయి. సోమవారం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ మహా పర్వదినంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ వెంకటరావు, ఈఓ మహేష్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ 12 హోమాలు ప్రజల ఆర్థిక, శారీరక శ్రేయస్సు వ్యవసాయోత్పత్తి అభివృద్ధికి శుభపరిణామాలు కలగాలని ఆకాంక్షతో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. వేదపండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సందర్భంగా శాంతి, ఐశ్వర్యం, సమృద్ధిని కోరుతూ విశేష పూజలు చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

పుష్కరాలకు వెళ్లే భక్తులకు అన్నదానం.

పుష్కరాలకు వెళ్లే భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తులకు దాతల సహకారంతో కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వరుసగా పన్నెండు రోజుల పాటు ఉచిత అన్నదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరం వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాళేశ్వరం పుష్కరాలకు వచ్చి వెళ్లే భక్తులకు పన్నెండు రోజులు అన్నదానం చేయడం అభినందనీయమని, ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన దాతలకు, సేవా కార్యక్రమాలు చేసిన ప్రతీ ఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ సోలీస్ ఐకేర్ వారికి ఇతర దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా, వచ్చే ఏడాది మేడారం మహా జాతర జరిగినన్ని రోజులు కూడా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సరస్వతి పుష్కరాలలో విధులు నిర్వహిస్తున్న మంచిర్యాల జిల్లా.

సరస్వతి పుష్కరాలలో విధులు నిర్వహిస్తున్న మంచిర్యాల జిల్లా పంచాయతీ రాజ్ ఉద్యోగులు

మంచిర్యాల నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద మే 15 నుండి నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలలో పారిశుధ్య కార్యక్రమాలను మంచిర్యాల జిల్లా పంచాయితి రాజ్ ఉద్యోగులు పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా పంచాయితీ అధికారి డి.వేంకటేశ్వర రావు మాట్లాడుతూ..పుష్కరాలకు అశేష భక్తులు హాజరు అవుతున్నందువలన అక్కడి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్మికులతో తడి చెత్త,పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం జరుగుతుందని,ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడంతోపాటు అవసరం ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ చల్లించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం జరుగుతుందని,మండల పంచాయితీ అధికారులతో నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వర రావు,మండల పంచాయతీ అధికారులు సఫ్తర్ అలీ, ఇంచార్జీ డి ఎల్ పి ఓ,శ్రీపతి బాపు రావు ఎంపీఓ జైపూర్,సత్యనారాయణ, ఎంపీఓ మందమర్రి,అజ్మత్ అలీ ఎంపీఓ చెన్నూరు, బి.శ్రీనివాస్ ఎంపీఓ బెల్లంపల్లి, జి.అనిల్ కుమార్ ఎంపీఓ తాండూర్,ప్రసాద్ ఎంపీఓ దండేపల్లి తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

మంద మహేష్ బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్

గణపురం నేటి ధాత్రి :

 

గణపురం మండల పోలీసులు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ముందస్తు అక్రమ అరెస్టులను నిరసిస్తూ బి జే వైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం ఆరోగ్యం అనే ప్రజల యొక్క కనీస అవసరాలను మరిచిపోయి ప్రపంచ అందగత్తెల పోటీలు నిర్వహించడానికి ఉన్న సమయం చదువుకునే విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్స్ అకాల వానలతో చేతికొచ్చిన పంటలను కోల్పోతున్న రైతులను పరామర్శించడానికి సమయం ఉండాదని ఎద్దేవ చేశారు సరస్వతి పుష్కరాలకు కోట్ల రూపాయల డబ్బుతో భక్తుల సౌకర్యాలకు పూర్తిస్థాయిలో నిర్మాణాలు కాకపోయినా ఆగమేఘాల మీద పుష్కరాలు నిర్వహిస్తు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారని అన్నారు

పుష్కరాల్లో ఐదుగురు అస్తవ్యస్తకు గురి.

పుష్కరాల్లో ఐదుగురు అస్తవ్యస్తకు గురి.

అత్యవసర చికిత్స కేంద్రాలకు తరలింపు.

ఎండ తీవ్రతకు సరస్వతీ పుష్కరాల్లో ఎక్కడి వారు ఆక్కడే.

కిక్కిరిసిన సెలవ పందిర్లు.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

సరస్వతి పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాలు దర్శనాలకు వచ్చిన భక్తులు ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఇప్పటివరకు ఐదుగురు అస్తవ్యస్తకు గురికావడం జరిగింది. వీరిలో ఒకరు పారిశుద్ధ్య కార్మికుడు విధులు నిర్వహిస్తున్న క్రమంలో సొమ్మసిల్లి పడిపోవడం జరిగిందని సమాచారం. మిగతా నలుగురు భక్తులు కరీంనగర్ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాకు చెందిన వారిని తెలిసింది. అస్తవ్యస్తకు గురైన వారందరికీ ప్రధమ చికిత్స కేంద్రానికి తరలించి చికిత్సను అందించడం జరుగుతుందని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులందరూ చలవ పందిళ్లకు పరిమితం కావడంతో చలవ పందిళ్లు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం నాలుగు తర్వాత భక్తులు గోదావరి స్థానానికి వెళ్లే పరిస్థితి కనబడుతుంది.

సరస్వతి పుష్కరాలకు బస్సుల ఏర్పాటు. !

సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు

రోజుకు 10 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి

పరకాల డిపో మేనేజర్ రవి చందర్

పరకాల నేటిధాత్రి :

 

ఈ నేల 15 నుండి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడువు తున్నట్టు డిపో మేనేజర్ రవిచందర్ ఓ ప్రకతనలో తెలిపారు.రోజుకు 10 ప్రత్యేక బస్సులు పరకాల నుండి కాళేశ్వరంకు నడుపుతున్నట్టు తెలిపారు.ఈ పుత్యేక బస్సులకు చార్జీలు పరకాల నుండి కాళీశ్వరంకు పెద్దలకు 190రూపాయలు పిల్లలకు 110రూపాయలు గా నిర్ణయించినట్టు తెలిపారు.ఏదైనా వివరాలకు 9705479088,7382 926774 నంబర్లను సంప్రదించాలని,భక్తులందరు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version