ఘనంగా ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ వరంగల్ ముఖ్య నాయకుల సమావేశం.

ఘనంగా ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ వరంగల్ ముఖ్య నాయకుల సమావేశం

హాజరైన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

గ్రేటర్ వరంగల్, హనుమకొండ, వరంగల్ జిల్లా కమిటీల నియామకం

నేటిధాత్రి”,హనుమకొండ:

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ వరంగల్ ముఖ్య నాయకుల సమావేశం హనుమకొండ పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సార్ ముఖ్యఅతిథిగా హాజరై సంస్థ విధి విధానాలను తెలియజేశారు. అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాలలో విద్యావంతులు, మేధావులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ చట్టాలకు అనుగుణంగా రాజీలేని పోరాటాలు చేస్తూ అవినీతి అక్రమార్కులను సమాజంలో దోషులుగా చూపించడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. మంచిని పెంచడం మానవత్వాన్ని పంచడం వంటి కార్యక్రమాలు తమ సంస్థలో ప్రధాన అంశాలని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి, న్యాయవాది మాదాసు మొగిలయ్యతో కలిసి ఈ సందర్భంగా ఇటీవల రద్దు చేసిన గ్రేటర్ వరంగల్, హనుమకొండ, వరంగల్ జిల్లా నూతన కమిటీలను, పలు నియామకాలను ప్రకటించారు.

రాష్ట్ర కమిటీ సభ్యులుగా: ఉచత శ్రీకాంత్, విసంపెల్లి నగేష్, భానోత్ జవహర్లాల్ నెహ్రూ నాయక్

ఉమ్మడి వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా: ఆవునూరి కిషోర్

గ్రేటర్ వరంగల్ కమిటీ
గ్రేటర్ అధ్యక్షులుగా: కోమండ్ల శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శిగా: గూడూరు నరేందర్

హనుమకొండ జిల్లా కమిటీ:
జిల్లా అధ్యక్షులుగా: డాక్టర్ బండి సదానందం
ఉపాధ్యక్షులుగా: పడాల మురళీకృష్ణ
ప్రధాన కార్యదర్శిగా: పల్లెవేని మహేష్

వరంగల్ జిల్లా కమిటీ:
జిల్లా అధ్యక్షులుగా: మేరుగు రాంబాబు
ఉపాధ్యక్షులుగా: గుజ్జ సురేందర్
ప్రధాన కార్యదర్శిగా: సంగెం రమేష్
అధికార ప్రతినిధిగా: నర్మేట యాదగిరి

తదితరులను నియమించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పాక శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు మరియు ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ఊరేగింపు…

ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ఊరేగింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హనుమాన్ మందిరం నుంచి పోచమ్మ తల్లి మందిరం వరకు బాజా భజంత్రీలతో, కోలాటాలతో విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో కాలనీ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.

శేహజాద్ మెడికల్ ను ఘనంగా ప్రారంభించిన…

శేహజాద్ మెడికల్ ను ఘనంగా ప్రారంభించిన సర్కిల్ ఇన్స్పెక్టర్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-01T120100.135.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలోని భారత్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శేహజాద్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ప్రారంభోత్సవం భక్తిపూర్వక వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ జాహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం. టౌన్ ఎస్‌ఐ. వినయ్ కుమార్.జాహీరాబాద్ రురల్ ఎస్ ఐ కాశినాథ్. చరక్పల్లి ఎస్‌ఐ.హాజరై రిబ్బిన్ కట్ చేసి మెడికల్ స్టోర్‌ను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం మాట్లాడుతూ భారత్ నగర్ ప్రజలు అందుబాటులో ఉండేలా. పెట్టడం వలన కాలోని వాసుల తరుపున పోర్పొరేటర్ గారికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అభినందించారు
స్థానిక ప్రజలు పెద్దఎత్తున హాజరై ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. అద్భుతమైన సేవలతో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని యజమాని శేహజాద్ సయ్యద్ ఖాజా తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా కొంత మేరకు స్థానిక జనానికి ఉచిత మెడిసిన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సీపీఐ కార్యదర్శి.సయ్యద్ జలలుద్దీన్. అబ్జల్ ,తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా నాగుల పంచమి వేడుకలు..

వైభవంగా నాగుల పంచమి వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T151443.431.wav?_=2

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాత నమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో ఉన్న నాగేంద్ర స్వామి గుడిలో మంగళవారం నాగుల పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రావణమాసం పురస్కరించుకొని దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమా చారి నాగదేవతల విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించినారు. దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజ మణి దంపతులు పుట్టలో పాలు పోసి వెండి నాగమయ ప్రతిమను వస్త్రాలను సమ ర్పించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో నాగదేవతలను తమ కోరికలు నెరవేర్చాలని వేడుకున్నారు ఈ కార్యక్రమం లో బాసని రమేష్ ధనలక్ష్మి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా నాగుల చవితి వేడుకలు..

జహీరాబాద్ లో నాగుల చవితి వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T123835.900.wav?_=3

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాగదేవత ఆలయాలు, పుట్టల వద్ద పాలు పోసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పట్టణంలోని 1008 నాగదేవత ఆలయం, నాగుల కట్టలోని నాగదేవత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని పుట్టల వద్ద భక్షాలు, పాలు నైవేద్యంగా సమర్పించి మొక్కలు చెల్లించుకుంటున్నారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఘనంగా ప్రారంభమైన..

శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఘనంగా ప్రారంభమైన ఏ డే విత్ తుడా చైర్మన్ కార్యక్రమం..

*శ్రీకాళహస్తి శాసనసభ్యులతో కలసి శ్రీకాళహస్తి
నియోజకవర్గం లో పర్యటించిన తుడా చైర్మన్..

*ఎమ్మెల్యే నిధులు తుడా నిధులతో శ్రీకాళహస్తికి మహర్దశ..

*శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి..

*అభివృద్ధి అజెండాగా తుడా పని చేస్తుంది..

*తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 25:

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ డే విత్ తూడా చైర్మన్ అనే కార్యక్రమంలో భాగంగా తుడా పరిధిలోని 9 నియోజకవర్గాలలో స్థానిక శాసనసభ్యులతో కలిసి పర్యటించి సమస్యలను గుర్తించి వాటిని అక్కడే పరిష్కరించే విధంగా సరికొత్త కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా మొదటగా శుక్రవారం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తుడా అధికారులతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గం చేరుకున్నారు.అక్కడ స్థానిక శాసనసభ్యులు మున్సిపల్ అధికారులు అందరూ కలిసి నగరంలో సమస్యలను గుర్తించేందుకు పర్యటించారు. ముందుగా ఏపీ సీడ్స్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్న పార్కును అభివృద్ధి తుడా నిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.అక్కడే స్వర్ణముఖి ఈట్ ఫుడ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అనంతరం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఇరువురు బైక్ పైన నగరంలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఇరువురు అక్కడికక్కడే అధికారులను పిలిపించి. డ్రైనేజీ మరమ్మతులు, త్రాగునీటి పైప్లైన్ల కోసం ఎస్టిమేషన్లు తయారుచేసి ప్రతిపాదనలు సిద్ధం చేయమని ఆదేశించారు. అనంతరం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కి చేరుకొని అక్కడి మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా తుడా నిధులతో ఆస్పత్రి ఆవరణలో గ్రీనరీ ఏర్పాటు చేయాలని తుడా చైర్మన్ అధికారులకు ఆదేశించారు..జయ రామారావు వీధిలో పురాతన డ్రైనేజీ కాలువ ల ను ఆధునికరించి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల ను డ్రైనేజ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి తుడా అధికారులను సన్మానించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తుడా నిధులతో పట్టణాన్ని ఆకర్షణయంగా చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన జరినామాలు ఉంటాయని హెచ్చరించారుతుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో డ్రైనేజీ కాలువ ల అభివృద్ధికి ఐదు కోట్లు నిధులు మంజూరు చేస్తామని, గ్రీనరీ డెవలప్మెంట్ వివిధ ప్రాంతాల అభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం అందిస్తామని తెలిపారు.

గాంధారి మైసమ్మ జాతరకు సహకరించిన..

గాంధారి మైసమ్మ జాతరకు సహకరించిన అధికారులకు ఘన సన్మానం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

బొక్కలగుట్ట జాతీయ రహదారి పక్కనే గల గాంధారి మైసమ్మ బోనాల జాతర సజావుగా సాగేందుకు అహర్నిశలు కృషిచేసి, ఆలయ కమిటీకి ఎల్లవేళలా సహకరించిన మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు, రామకృష్ణాపూర్ ఎస్సై జి రాజశేఖర్, మందమర్రి ఎస్సై రాజశేఖర్ లను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసం చివరి ఆదివారం నిర్వహించే గాంధారి మైసమ్మ జాతరకు పోలీస్ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు జాతరను సజావుగా సాగించేందుకు కృషి చేస్తారని అందులో భాగంగానే ఈ సంవత్సరం జరిగిన ఆషాడ మాస బోనాల జాతరను దిగ్విజయంగా విజయవంతం చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులు అధికారులను ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జక్కుల సమ్మయ్య, సత్యనారాయణ, పారుపల్లి తిరుపతి, భీమ సుధాకర్, మొగిలి, కనకయ్య, రాజయ్య, కుమార్, తిరుపతి, ఓదెలు, మొండి, కుమార్ గౌడ్, శంకర్, ప్రధాన అర్చకులు రమణాచారి, లవ కుమార్ లు పాల్గొన్నారు.

ఘనంగా కేటీర్ జన్మదిన వేడుకలు..

ఘనంగా కేటీర్ జన్మదిన వేడుకలు..

ఏనుమాముల, నేటిధాత్రి

మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 49వ జన్మదిన వేడుకలను గురువారం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేతిరి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏల్లవుల కుమార్ యాదవ్ కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. కేతిరి రాజశేఖర్ మాట్లాడుతూ 18నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ,ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గండ్రాతి భాస్కర్ పత్రి సుభాష్ ఉద్యమకారుడు హస్తం యాదగిరి పసులాది మల్లయ్య కేతిరి సమ్మక్క రంగరాజు విజయ ఆటో యూనియన్ నాయకుడు ఎండి సలీం భామల పెళ్లి కిరణ్ పున్నం ప్రభాకర్ వీరాచారి గండ్రాతి నవీన్ సతీష్ కొత్తపెళ్లి సునీల్ ఆడేపు అశోక్ బొల్లె సాంబయ్య గుమలాపురం హైమావతి ఎండి గౌస్య కుడికాల పద్మ ఈరెల్లి రజిత, రంగు లక్ష్మి, ఎండి జావిద్, ఎండి ఫిరోజ్, గంధం కిషోర్, పస్తం రవి ప్రసాద్ శ్రీనివాస్ దామెర లెనిన్ తదితరులు పాల్గొనడం జరిగింది

కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహణ..

కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహణ

నేటిదాత్రి చర్ల

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా చర్ల పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ కుమార్ అధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సోయం రాజారావు మాజీ ఎంపీపీ గీద కోదండరామయ్య నియోజకవర్గ యూత్ నాయకులు కాకి అనిల్ బీసీ సెల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు ఎస్సీ సెల్ అధ్యక్షులు కోంభతిని రాంబాబు ఎస్టీ సెల్ కార్యదర్శి కారం కన్నారావు బీసీ సెల్ కార్యదర్శి కేప గణేష్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ ఇరసవడ్ల రాము పంజా రాజు తడికల బుల్లేబ్బాయి పాగా రాంప్రసాద్ బట్ట కొమరయ్య సంతపురి సతీష్ సిద్ది రాజశేఖర్ కట్టం కన్నారావు ఆలం బ్రహ్మనాయుడు గుమ్మల నరేంద్ర తడికల చంద్రశేఖర్ సృజన్ కుక్క డప్పు సాయి గాదం శెట్టి కిషోర్ గంపల రమేష్ కోటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

అమనగల్లు పట్టణంలో ఘనంగా కేటీఆర్ బర్త్డే వేడుకలు.

అమనగల్లు పట్టణంలో ఘనంగా కేటీఆర్ బర్త్డే వేడుకలు.

ఆమనగల్ / నేటి ధాత్రి :

ఆమనగల్ లో గురువారం బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పత్యానాయక్ ఆధ్వర్యంలో KTR పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరి పారు. మొక్కలు నాటే కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి , ఉప్పల వెంకటేష్ ,BRS పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి బర్త్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గంప వెంకటేష్, చుక్కనిరంజన్ గౌడ్, కమటం వెంకటయ్య, కృష్ణవేణి,దాబా శ్రీను,సరిత పంతు నాయక్,ఖలీల్ బాయ్, గుత్తి బాలస్వామి, ఉప్పల రాములు,వడ్డే వెంకటేష్,వసుపుల సాయిలు,లండo యాదయ్య, వడ్డేమోని శివకుమార్, వరికుప్పల గణేష్,సతీష్, సైదులు గౌడ్,సుమన్ నాయక్, శంకర్ నాయక్,NNR జగన్,కొమ్ము ప్రసాద్, వెంకటాపురం శివ, వెంకటయ్య,అబ్బు,అప్రోజ్, హేమలనాయక్,పంతు నాయక్, శ్రీకాంత్,మహేష్ నేత,గోపి, తదితరులు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-91-1.wav?_=4

రామడుగు, నేటిధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జన్మదినం సందర్బంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని ప్రశాంత్ భవన్ లో పిల్లలకు నిత్యవసర సరుకులు, బియ్యం, పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండలశాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు మార్కొండ కిష్టారెడ్డి, తౌటు మురళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు మామిడి తిరుపతి, గంట్ల వెంకటరెడ్డి, పూడూరు మల్లేశం, మాజీ మండల అధ్యక్షులు జూపాక కరుణాకర్, మాజీ జిల్లా రైతుబంధు సభ్యులు వీర్ల సంజీవరావు, నాయకులు నాగి శేఖర్, మాజీ సర్పంచులు చాడ చంద్రశేఖర్ రెడ్డి, పంజాల జగన్మోహన్ గౌడ్, వీర్ల రవీందర్రావు, సైండ్ల కరుణాకర్, గుండి ప్రవీణ్, జవ్వాజి శేఖర్, ఊగంటి చంద్రారెడ్డి, చిలుముల ప్రభాకర్, జూపాక మునిందర్, నాయకులు ఎల్లా జగన్ మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్లు శనిగరపు అనిల్, బత్తిని తిరుపతి గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు పెగడ శ్రీనివాస్, గునుకొండ తిరుపతి, దొడ్డ లచ్చిరెడ్డి, యూత్ అధ్యక్షులు ఆరపెళ్లి ప్రశాంత్, ఎస్సీసెల్ అధ్యక్షులు శనిగరపు అర్జున్, మినుకుల తిరుపతి, బీరెల్లి అనిల్ రావు,పురాణం రమేష్, కాడే అజయ్, యాచమునేని,నరేష్ విద్యాసాగర్, కట్ల అనిల్, దైవల నారాయణ, పోశెట్టి, తదితర నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా ఇందిరా భవన్ లో మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలు..

ఘనంగా
ఇందిరా భవన్ లో మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలు..

జగిత్యాల. రాయికల్. జులై 23, నేటి ధాత్రి:

 

కేక్ కట్ చేసి సంబురాలు..

ఏ ఐ సీ సీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలను మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీనాక్షి నటరాజన్ చిత్రం తో కూడిన కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి,జన్మదిన వేడుకలు నిర్వహించారు.

అనంతరం మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి తెలంగాణ ఇంచార్జి గా క్షేత్ర స్థాయిలో
పార్టీ బలోపేతమే ధ్యేయంగా పని చేస్తున్నారు.

రాహుల్ గాంధీ ను ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.

పదేళ్లు బీ ఆర్ ఎస్ అరాచకాలను ను ఎదురించి నిల్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని కార్యకర్తల్లో భరోసా నింపారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారు.

మహిళలకు ఉచిత రవాణా, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ప్రతి క్వింటాల్ పై రూ.500 బోనస్, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం..

గృహ అవసరాలకు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తున్న రాష్ట్రం ఒక్కటే అని స్పష్టం చేశారు.

జనాభా ప్రతిపాదకన రిజర్వేషన్ కల్పించాలనే రాహుల్ గాంధీ ఆలోచన తో
కుల గణన చేపట్టి,42 శాతం రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తున్నారు.

బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయడం తో పాటు విద్య, ఉద్యోగాలలో అమలు చేస్తాం.

2017 నాటికి కాంగ్రెస్ లో ఉన్న వారికి మాత్రమే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి, కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసం నింపారు.

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం గా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఘనంగా మడేలేశ్వర స్వామి బోనాల జాతర….

ఘనంగా మడేలేశ్వర స్వామి బోనాల జాతర….

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-86.wav?_=5

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని బిజొన్ రజక సంఘం అధ్యక్షులు నడిగోట తిరుపతి ఆధ్వర్యంలో రజకుల కుల దైవం మడేలేశ్వర స్వామి,సీతాలమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు.మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి రజక సంఘం కార్యాలయం నుండి అమరవాది చెరువు సమీపంలోని మడేలేశ్వర స్వామి గుడి వద్దకు పెద్ద ఎత్తున వెళ్లి బోనాలు సమర్పించారు. అనంతరం బిజొన్ రజక సంఘం అధ్యక్షుడు నడిగోట తిరుపతి మాట్లాడారు.

Seethalamma Bonala Jatara.

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో రజకుల కుల దైవం అయిన మడేలయ్య కు భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తామని అన్నారు.దేవుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు నడిగోట శంకర్, కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పున్నం సమ్మయ్య,తిరుపతి, కనకయ్య,రాజేశ్వరి, మాజీ కౌన్సిలర్ పోగుల మల్లయ్య, జిల్లా కార్యదర్శి రాములు, సహాయ కార్యదర్శి పైతరి ఓదెలు, సంఘం సభ్యులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బాలాజీ ఇంటిగ్రేటెడ్ అక్షరలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం.

బాలాజీ ఇంటిగ్రేటెడ్ అక్షరలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి:

బాలాజీ విద్యాసంస్థల్లో ఒక్కటైన అక్షర ద స్కూల్, బిట్స్ స్కూల్లో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

Dr. A. Rajendra Prasad Reddy, Head of Balaji Educational.

బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ వనజ పాల్గొని వన మహోత్సవం సందర్భంగా విద్యార్థులు గ్రీన్ కలర్ దుస్తులు ధరించి ఇంటి వద్ద నుండి తీసుకొచ్చిన మొక్కలను పాఠశాల ఆవరణలో పిల్లలతో మొక్కలు నాటించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదపడతాయని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని తెలిపారు.అనంతరం వన మహోత్సవం పై డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి,బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి,అక్షర స్కూల్ ప్రిన్సిపల్ జి. భవాని,ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా మాజీ సిఎం రోశయ్య జయంతి వేడుకలు..

ఘనంగా మాజీ సిఎం రోశయ్య జయంతి వేడుకలు

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ గా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలను జరిపారు రోశయ్య చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి, డిబిసిడిఓ పుష్పాలత, కలెక్టరేట్ ఏ.ఓ విశ్వ ప్రసాద్, ఇతర అధికారులు, సంఘ నాయకులు, కలెక్టరేట్ లోని వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

ఘనంగా జనసేన పార్టీ కిట్ల పంపిణి.

ఘనంగా జనసేన పార్టీ కిట్ల పంపిణి
మెట్ పల్లి జూలై 01 నేటి దాత్రి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కిట్ల పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి ఆర్ కే సాగర్ సూచనల మేరకు సీనియర్ నాయకులు కోరుట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి గంగం అజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రియాశీల కిట్ల పంపిణీ కార్యక్రమం నేడు మంగళవారం రోజున మెట్ పల్లి మండలం మారుతి నగర్ లో ఘనంగా జరిగింది . రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రాజకీయాల్లో క్రియా శీలకంగా పాల్గొంటుందని వారు అన్నారు .ఇట్టి కార్యక్రమంలో బోగ చక్రదర్, రాజోగి కార్తీక్, ప్రణయ్ కుమార్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు .

పదోన్నతి పై వెళ్తున్న అధికారికి ఘన సన్మానం.

పదోన్నతి పై వెళ్తున్న అధికారికి ఘన సన్మానం

జైపూర్ నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రంలో ఏఎస్ఓగా విధులు నిర్వహించి డివైఎస్ఓ గా పదోన్నతి పొంది భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్తున్న సతీష్ కుమార్ కి శనివారం రోజున తహసిల్దార్ వనజా రెడ్డి, కార్యాలయ సిబ్బందితో కలిసి పూలమాలతో,శాలువాతో సత్కరించి,వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించి సన్మానం చేశారు.తమతో పాటు విధి నిర్వహణలో చురుగ్గా,నైపుణ్యంతో కూడిన సేవలను అందించి పదోన్నతి పై వెళ్తున్న సతీష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మరింత శ్రమించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని తహసిల్దార్ వనజా రెడ్డి తెలిపారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి కి ఘన సన్మానం.

సిపిఐ జిల్లా కార్యదర్శి కి ఘన సన్మానం

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

 

 

సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మణ్ రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయిన నేపద్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సీపీఐ శ్రేణులు ఘనంగా సన్మానించారు.పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ ను సైతం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. జిల్లా మహాసభలో చేసిన తీర్మానాలను,పార్టీ ప్రజా సంఘాల నిర్మాణానికి స్థానిక సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇప్పకాయల లింగయ్య, మిట్టపల్లి పౌల్, వెంకటస్వామి, వనం సత్యనారాయణ, సాంబయ్య, గోపి, మణెమ్మ,శంకర్,రాములు, సత్తన్న, మొగిలి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఘన స్వాగతం పలికిన.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఘన స్వాగతం పలికిన సుజిత్ రావు

మెట్ పల్లి జూన్ 28 నేటిదాత్రి

 

 

 

కోరుట్ల నియోజవర్గానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ మైనార్టీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి ఘన స్వాగతం పలికిన టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు

ఈ కార్యక్రమంలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ సేల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఖుతుబ్భుదిన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి, ఏఎంసి డైరెక్టర్,కోరుట్ల నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందే భవిత రాణి, పాషా,నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెన్న మమత,నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ ఉప అధ్యక్షురాలు మైస లక్ష్మీ,నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యురాలు అందే లలిత,మహిళ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యురాలు చిప్ప సుభద్ర,కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోడిమ్యాల దీపక్ రాజ్,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గంధం రాజేశం,మల్లాపూర్ మండల ఫిషర్మాన్ అధ్యక్షులు రోడ్డ రాజు, ఇబ్రహీంపట్నం మండల సేవాదళ్ అధ్యక్షులు గూడా సొల్లు ,ముత్యం రెడ్డి,మల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మల రాజు,ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లూరి సాగర్,కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుంటాల వికాస్,కాంగ్రెస్ నాయకులు వెంకటగిరి,కల్లెడ గంగాధర్ మామిడి ,రాజశేఖర్ రెడ్డి ఇప్పపెల్లి గణేష్,మొగలి రాజేందర్ గోపిడి నరేశ్, మిట్ట పెల్లి మహేష్, మసూల చిన్నయ్య,బైండ్ల శ్రీకాంత్,పిట్టల వెంకటేష్ ,కోరే రాజ్ కుమార్, ముద్దం ప్రశాంత్,మజ్జు,వేల్పుల దాస్,కనుక దినేశ్,రెబ్బాస్ మల్లేష్ రమేష్,దాస్,బద్దం సుధాకర్ రెడ్డి, ఉప్పులుటి రమేశ్,బద్దం ఎల్లా రెడ్డి,పన్నాల జీవన్ రెడ్డి, నల్లపోతురాజు శ్రీకాంత్, జాకీర్,జగన్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు , మహిళా కాంగ్రెస్ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు.

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్ లు అన్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త, జయశంకర్ వర్ధంతి పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ శ్రేణులు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన నష్టాలను, కష్టాలను.. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని జయశంకర్ సార్ రగిలించారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా వారు నడిపిన పోరాటం, జీవితం మహోన్నతమైనదని, మీరు కలలుగన్న తెలంగాణ ప్రగతి సాక్షిగా మీకివే మా నివాళులు అని అన్నారు.తెలంగాణ ప్రాంతం ఆంధ్ర పాలకుల వల్ల అణగారిపోయి అభివృద్ధికి నోచుకోకుండా ఉందని వారి నుండి విముక్తి కోసం తెలంగాణ ఉద్యమ కర్త కెసిఆర్‌తో వెన్నంటి ఉండి తెలంగాణ ప్రాంతంలో మన నీళ్లు,మన నిధులు,మన ఉద్యోగాలు కావాలని, కోరుకునే వ్యక్తులలో మొదటి వ్యక్తి జయశంకర్ అని అన్నారు. ఆశయాలను బంగారు తెలంగాణ కోసం నిత్యం తపించే గొప్ప ఆదర్శవాది అని అన్నారు. వారి మరణం తెలంగాణ ప్రాంత ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు రెవెల్లి ఓదెలు, అనిల్ రావు, పోగుల మల్లయ్య, జాడి శ్రీనివాస్, జిలకర మహేష్, సీనియర్ నాయకులు అలుగుల సత్యం, జక్కన బోయిన కుమార్, రామిడి లక్ష్మి కాంత్, గోనె రాజేందర్, ఖలీం,చంద్రకిరణ్, కుర్మ దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version