మృతిని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి..

మృతిని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని చంద్రయ్య పల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఉపసర్పంచ్ భాషబోయిన రవి, శ్రీనివాస్ ల తండ్రి భాషబోయిన ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.కాగా గురువారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా మృతుడు ఐలయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, టి పి సి సి సభ్యులు పెండెం రామానంద్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, నర్సంపేట పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల మధు ముదిరాజ్, నర్సంపేట పిఎసిఎస్ చైర్మన్ రమణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి,మట్ట రాజు, భాషబోయిన పాపయ్య, సల్పాల ప్రభాకర్, జగన్మోహన్ రావు,ఆదిరెడ్డి, ఓర్సు తిరుపతి,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మల్లన్నను దర్శించుకున్న పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్ట్

మల్లన్నను దర్శించుకున్న పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్ట్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-31T132053.087.wav?_=1

నేటిధాత్రి ఐనవోలు :-

తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్ట్, ఐపీఎస్ గురువారం ఐనవోలు మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా జిల్లాకి అభిలాష్ బిస్ట్ వచ్చారు. ఈ సందర్భంగా మల్లన్న దర్శనానికి విచ్చేసిన వారిని దేవాలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికి, శ్రీ స్వామి వారి దర్శనం అనంతరం స్వామి వారి శేష వస్త్రములతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవాలయ ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ, వేద పారాయణ దారులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు పాతర్లపాటి నరేష్ ,నందనం మధు, ఉప్పుల శ్రీనివాస్,దేవేందర్ పోలీసు ఉన్నతాధికారులు, స్థానిక సీఐ రాజగోపాల్ గౌడ్ ఎస్ఐ పస్థం శ్రీనివాస్ పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు తెలిపారు.

కాళికా మాత అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మానిక్ రావు..

కాళికా మాత అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మానిక్ రావు, డీసీఎంస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి చౌరాస్త వద్ద గల కాళికా మాత అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుకు తట్టు నారాయణ,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్,మాజీ సర్పంచ్ లు బస్వరాజ్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు.

అర్షద్ జమా గారికి పరామర్శించిన టీజీఐడిసి…

అర్షద్ జమా గారికి పరామర్శించిన టీజీఐడిసి మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-70-1.wav?_=2

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండల్ మాడ్గి గ్రామానికి చెందిన హర్షద్ జమ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న సందర్భంగా టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ ఈరోజు జహీరాబాద్ పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ కుతుబుద్దీన్ మాజీ కౌన్సిలర్లు జాంగిర్ మోతిరామ్ రాములు నేత రంగ అరుణ్ కుమార్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి బాసిత్ బిజీ సందీప్ తదితరులు ఉన్నారు.

బాల్నే సర్వేశంను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

 

బాల్నే సర్వేశంను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు బాల్నే సర్వేశం సతీమణి బాల్నే చంద్రకళ సంవత్సరీకం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం బాల్నే సర్వేశంతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, పట్టణ ప్రచార కార్యదర్శి,మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఫోటో జర్నలిస్ట్ శివ కుమార్ ను పరామర్శించిన చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు

*ఫోటో జర్నలిస్ట్ శివ కుమార్ ను పరామర్శించిన చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు..

*ప్రభుత్వం అండగా ఉంటుందని శివకుమార్ కు భరోసానిచ్చిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు..

*దాడి ఘటనకు బాధ్యులైన వారి పై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎంపి దగ్గుమళ్ళ..

చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 10:

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన నేపథ్యంలో దాడికి గురై తీవ్రంగా గాయపడి, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటో జర్నలిస్ట్ శివకుమార్ను గురువారం చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పరామర్శించారు.
దాడి ఘటనకు సంబంధించిన వివరాలను శివకుమార్ ను అడిగి తెలుసుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.., ఫోటో జర్నలిస్ట్ కు అందుతున్న వైద్యసేవల గురించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పాత్రికేయుడు శివకుమార్
ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.., ప్రభుత్వం అన్ని రకాల ఆదుకుంటుందని భరోసానిచ్చారు.అదే సమయంలో శివకుమార్ పై దాడి పాల్పడ్డ వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడదన్నారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపడుతుందని ఎంపీ తెలిపారు.

మృతుని కుటుంబానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ.

మృతుని కుటుంబానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
అనారోగ్యంతో మృతి చెందిన లింగమోరి గూడెం మాజీ ఉప సర్పంచ్ శ్రీహరి

ఐనవోలు నేటిధాత్రి:

ఐనవోలు మండలంలోని లింగమొరిగూడెం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన మాజీ ఉప సర్పంచ్ బుర్ర శ్రీహరి గౌడ్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. శ్రీహరి గౌడ్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ, శ్రీహరి గతంలో బి. ఆర్. ఎస్ పార్టీ కి ఎనలేని సేవ చేశారని భవిష్యత్లో మృతుని కుటుంబానికి అండగా నిలబడతామని మాజీ మంత్రి దయాకర్ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బి. ఆర్. ఎస్ పార్టీ ఐనవోలు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపెల్లి చందర్ రావు జిల్లా నాయకులు మరుపట్ల దేవదాసు ఎస్. కె. జిందా ఎం.డి గ్రామ బి. ఆర్. ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన టిఎస్ఎస్.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోహిర్ మండలం పీచర్యాగడ్ గ్రామానికి చెందిన జి.శ్రీకాంత్,డి.సాయి హేమంత్ లను ఈ రోజు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు,పరామర్శించిన వారిలో చల్లా శ్రీనివాస్ రెడ్డి,శికారి గోపాల్,గాళ్ రెడ్డి,సి.యం.అశోక్ రెడ్డి,చిన్నా,దిలీప్, తదితరులు ఉన్నారు.

గ్రామపంచాయతీ సందర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

మర్యాదపూర్వకంగా గ్రామపంచాయతీ సందర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

 

తంగళ్ళపల్లి మండల నేరెళ్ల గ్రామపంచాయతీలో. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్. మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన. రైతు భరోసా. గ్రామంలో రైతులందరికీ సక్రమంగా పడుతుందా. ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారుల.దృష్టికి తీసుకెళ్లి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని. తరతరాలుగా పంటలు సాగు చేస్తూ జీవనోపాధి.పొందుతున్న రైతులకు రైతు భరోసా వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత. అధికారులకు.సూచించారు అలాగే మండలంలో రైతులు. ఎలాంటి మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే నేను రైతులను దృష్టిలో ఉంచుకొని వచ్చాను తప్ప అధికారికంగా కాదు దయచేసి ప్రజలు గమనించాలి. ఈయన వెంట ఏ ఎం సి వైస్ చైర్మన్ నేరెళ్ళ నరసింహ గౌడ్. ఆరేపల్లి బాలు. రైతులు నాయకులు తదితరులు ఉన్నారు

వివిధ మండలాలు సందర్శించిన రైతు సంఘం అధ్యక్షుడు.

వివిధ మండలాలు సందర్శించిన రైతు సంఘం అధ్యక్షుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజ్ న్యాల్కల్ మండలం వివిధ మండలాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్, రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి కార్యవర్గ సభ్యుడు సునీల్ ధత్, న్యాల్కల్ ఎంపీటీసీ శ్రీశైలం, గోపాలరెడ్డి, దేవదాస్, తుల్జారాం, తదితరులు పాల్గొన్నారు.

శ్రేయన్స్ తండ్రిని పరామర్శించిన ఎమ్మెల్యే.

శ్రేయన్స్ తండ్రిని పరామర్శించిన ఎమ్మెల్యే

జడ్చర్ల /నేటి ధాత్రి

 

జడ్చర్ల పట్టణంలోని మూడవ వార్డులో రెండు రోజుల క్రితం ఇంటి ముందు సైకిల్ పై వెళ్తుండగా.. విద్యుత్ వైరు తగిలి కరెంట్ షాక్ తో శ్రేయన్స్ (10) బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి శ్రేయాన్స్ తండ్రి బొక్క రాఘవేందర్ ను పరామర్శించారు. ధైర్యం కోల్పోకూడదని ఓదార్చారు. కరెంట్ షాక్ తో శ్రేయాన్స్ చనిపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

వీరస్వామి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సై..

వీరస్వామి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సై..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దుగ్గొండి మండలంలోని సీనియర్ ఈనాడు పత్రిక రిపోర్టర్ బైగాని వీరస్వామి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.కాగా బుదవారం దుగ్గొండి ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు మృతిని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత.

మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. శ్రీరాంపూర్ బస్టాండ్ లోని సింగరేణి కార్మికుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం తీగల్ పహాడ్ లోని జాగృతి కార్యకర్తలు కందుల ప్రశాంత్, నస్పూర్ తోళ్లవాగు సమీపంలోని శశి ఇళ్లకు వెళ్లారు.గౌతమి నగర్ లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు మునీర్ కుటుం బాన్ని పరామర్శించారు.అదేవిధంగా లక్షేట్ పెట్,పట్టణములో జాగృతి సోషల్ మీడియా కార్యకర్త నిశా,ఇంటికి వెళ్లడం జరిగింది.ఈ పర్యటనలో ఎమ్మెల్సీ కవితతో పాటు తన అనుచరులు కూడా ఉన్నారు.

ప్రభుత్వ యునాని వైద్యశాలను సందర్శించిన.!

ప్రభుత్వ యునాని వైద్యశాలను సందర్శించిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్

నేటిధాత్రి ఐనవోలు :-

 

 

 

ఐనవోలులోని ప్రభుత్వ యునాని వైద్యశాల నీ సందర్శించిన రిజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ (RDD) డాక్టర్. ప్రమీల దేవి సందర్శించారు. జూన్ 21 న జరిగే
అంతర్జాతీయ యోగ దినోత్సవ
దశబ్ది వేడుకలు – 2025 దినోత్సవాన్ని పురస్కరించుకొని 25 రోజుల పాటు నిర్వహించేలా యోగ దశబ్ది వేడుకల ప్రణాళికను రూపొందినట్లు ఐనవోలు యునాని ఆసుపత్రి డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.ఈ మేరకు ఆరోగ్య మందిరాలు, వైద్య సబ్బంది, అంగన్వాడీ టీచర్లు,పిల్లలు,పెద్దలు,
గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు,ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ ఏడాది ‘ యోగ ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ ‘అనే నినాదంతో యోగ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ భాను ప్రకాష్, ఫార్మాసిస్ట్ శంకర్, యోగ శిక్షకులు అర్చన, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి నరసింహస్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్.

యాదాద్రి నరసింహస్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి:

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.అంతకుముందు ఆలయ అధికారులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగాణంలో ఉన్న వేదాశీర్వచన మండపంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఆలయ అధికారులు, ప్రోటోకాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

దుర్గామాతను దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు.

దుర్గామాతను దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం జడిమల్కాపూర్‌లో ప్రసిద్ధి చెందిన దుర్గామాత ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఆలయా దుర్గామాత దేవిని దర్శించుకొని సందర్శించారు.

Former Minister Harish Rao

 

ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించి. గ్రామంలో హరీష్ రావుకు పూలమాలలతో భాజ భాజంత్రీలతో ఘన స్వాగతం పలికారు . గ్రామ నాయకులు భరత్ రెడ్డి ఆయనకు పూలమాలల వర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు.

ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్.

వనపర్తి లో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

వనపర్తి నేటిధాత్రి :

 

జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ సురభి మరియు విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ వనపర్తి లో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ శిబిరాన్ని సందర్శిం చారు. జిల్లా కలెక్టర్ మ్యాథమెటిక్స్ శిక్షణ శిబిరాన్ని సందర్శించి ఉపాధ్యాయులతో గణిత శాస్త్రం యొక్క లోటుపాట్లను చర్చిం చారు. వనపర్తి జిల్లాలో 450 పదవ తరగతి విద్యార్థులు గణిత శాస్త్రములో ఫెయిల్ అయినారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోనే వెనుకబడిన విద్యార్థులకు ప్రాథమిక గణిత శాస్త్రం యొక్క పద్ధతులను తార్కిక ఆలోచన పద్ధతులను కాన్సెప్ట్ వారిగా విద్యార్థులకు బోధించాలని సూచించారు. విద్యార్థులు గణిత శాస్త్రంలో తమ ప్రతిభను మెరుగుపరచుకుంటే మిగతా అన్ని సబ్జెక్టులలో గణితశాస్త్ర ప్రభావంతో అన్ని అంశాలలో చురుకుగా విద్యార్థులు ఉంటారని కలెక్టర్ సూచించారు. జిల్లాలో గణిత శాస్త్ర అభివృద్ధి కొరకు విద్యార్థులలో తగు మెలకువలు నేర్పించుట కొరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్క విద్యార్థి పదవ తరగతిలో ఉత్తీర్ణులు అగుటకు తన వంతు సహాయం చేస్తానని దానికి కొరకు ఉపాధ్యాయులు తగిన సమయం కేటాయించి విద్యార్థులకు గణితశాస్త్రం మెలకువలను నేర్పాలని సూచించినారు.
కలెక్టర్ వెంట రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి మేడం జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనీ గారు పరీక్షల నిర్వహణ విభాగం అధికారి గణేష్ జిల్లా సమన్వయకర్తలు శేఖర్ మహానంది యుగంధర్ సెంటర్ ఇన్చార్జిలు ఆనంద్ గురురాజు గారు జిల్లా రిసోర్స్ పర్సన్స్ లు పాల్గొన్నారు

బిఆర్ఎస్ నాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

బిఆర్ఎస్ నాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం రామ్ నగర్ కు చెందిన బిఆర్ఎస్ మండల నాయకులు ఆరెపల్లి సమ్మయ్యను హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం రోజు పరామర్శించి వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు , వారి వెంట బి ఆర్ఎస్ మండల అద్యక్షులు అల్లం రవీందర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు రాజిరెడ్డి గారు మండల నాయకులు పాండ్రాల వీరస్వామి పెరుమాండ్ల రవీందర్ గౌడ్  ఉన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన .!

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ జెడ్పిటిసి..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇటీవల ఆరోగ్యానికి గురై మృతి చెందగా ఆమె కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య అలాగే బాధిత మహిళ బుడిద పద్మ అనే మహిళ అనారోగ్యంతో మృతిచెందగా ఆరోగ్యం మెరుగుపరచడానికి సుమారు పది లక్షల వరకు ఖర్చుపెట్టి నిరుపేద కుటుంబాలు ప్రభుత్వం. ఎలాగైనా ఆదుకోవాలని పరామర్శిస్తూ మృతురాలికి భర్త లింగం కొడుకు చరణ్ బిడ్డ వైష్ణవి ఉన్నారని లాగైన ప్రభుత్వం స్పందిస్తూ వారికి. కుటుంబానికి ఆదుకోవాలని ఈ సందర్భంగా విన్నవించారుమండల కేంద్రంలో అలాగే గ్రామానికి చెందిన హెల్పుల కర్ణ అనే మహిళ ఇటీవల గుండెపోటుతో చనిపోగా ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించి మనోధైర్యాన్నిచ్చి చనిపోయిన బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు మాజీ జెడ్పిటిసి వెంటా కడారి నవీన్ రెడ్డి. బింద్రం పవన్. బురా సాయి. దోర్నాల నవీన్ రెడ్డి. రంగు మల్లేశం. తదితరులు పాల్గొన్నారు

ఎనుమాముల పోలీస్‌ స్టేషన్ ను సందర్శించిన.!

ఎనుమాముల పోలీస్‌ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
ఏనుమాముల, నేటిధాత్రి
https://youtu.be/GCpLX43wfVs?si=qoAdJYysMaLnnAWn
వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ మంగళవారం మామూనూర్ డివిజన్‌ పరిధిలోని ఏనుమాముల  పోలీస్‌ స్టేషన్ను సందర్శించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా  బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఎనుమాముల పోలీస్‌ స్టేషన్ను సందర్శించిన పోలీస్‌ కమిషనర్‌ ముందుగా పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు పరిశీలించారు. అనంతరం స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది వివరాలను సిపి సంబంధిత స్టేషన్‌ ఇన్స్‌స్పెక్టర్‌ రాఘవేందర్ ను అడిగి తెలుసుకొవడంతో పాటు, స్టేషన్‌ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి. 
Commissioner
స్టేషన్‌ పరిధిలో ఎన్నిసెక్టార్లు వున్నాయి, సెక్టార్‌వారిగా ఎస్‌.ఐలు నిర్వహిస్తున్న విధులు, వారి పరిధిలోని రౌడీ షీటర్లు, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత సెక్టార్‌ ఎస్‌.ఐని అడిగి తెలిసుకోవడంతో పాటు  స్టేషన్‌వారిగా బ్లూకోల్ట్స్‌ సిబ్బంది పనితీరుతో పాటు, వారు విధులు నిర్వహించే సమయాలను పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ అధికారులకు పలుసూచనలు చేస్తూ ప్రతి స్టేషన్‌ అధికారి తప్పనిసరిగా రౌడీ  షీటర్ ఇండ్లను సందర్శించి వారి స్థితిగతులపై ప్రత్యక్షంగా ఆరా తీయాలని, ఆర్థిక సైబర్‌ నేరాలకు సంబంధించి కేవలం కేసు నమోదు చేయడమే తమ బాధ్యతనే కాకుండా సైబర్‌ నేరాలకు సంబంధించి నేరానికి పాల్పడిన నేరస్థుల మూలాల కూడా దర్యాప్తు అధికారులు కనిపెట్టి నిందితులను అరెస్టు చేయాలని.
Commissioner
ట్రైసిటి పరిధిలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి క్రయ విక్రయాలపై స్టేషన్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మత్తు పదార్థాల నియంత్రణకై నిరంతరం పనిచేయాలని. నేరాల నియంత్రణకై విజుబుల్‌ పోలీసింగ్‌ అవసరమని, ఇందుకొసం నగరంలో నిరంతం పోలీసులు పెట్రొలింగ్‌ నిర్వహించాలని పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ అధికారులకు సూచించారు.
పోలీస్‌ కమిషనర్‌ వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామూనూర్ ఏసిపి తిరుపతి ఇన్స్‌స్పెక్టర్ రాఘవేందర్,  స్టేషన్‌ ఎస్‌.ఐ రాజు, పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version