బికినీలో.. మన్మథుడు అన్షు అందాల విందు..

బికినీలో.. మన్మథుడు అన్షు అందాల విందు

మన్మథుడు సినిమాలో మృదు మ‌ధుర స్వరం, అమాయ‌క‌త్వంతో ఆక‌ట్టుకున్న‌ అన్షు ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో గ్లామర్ షోతో నెట్టింట ర‌చ్చ చేస్తోంది.

‘తాగితే కదా.. నచ్చుతుందో లేదో తెలిసేది… అంటూ మన్మథుడు (Manmadhudu) సినిమాలో మృదు మ‌ధుర స్వరం, అమాయ‌క‌త్వంతో ఆక‌ట్టుకున్న‌ అన్షు (ANSHU) ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో గ్లామర్ షోతో నెట్టింట ర‌చ్చ చేస్తోంది. రెండు ద‌శాబ్దాల క్రితం నాగార్జున మ‌న్మ‌ధుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి చేసిన రెండు మూడు సినిమాల‌తోనే స్టార్ హీరోయిన్ స్టేట‌స్ తెచ్చుకున్న ఈ న‌టి ఆ చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్‌తో రాఘ‌వేంద్ర, త‌మిళంతో ప్ర‌శాంతో ఓ సినిమా తెలుగులో గెస్ట్ పాత్ర‌ల్లో మాత్ర‌మే న‌టించిన‌ ఈ ముద్దుగుమ్మ ఆపై రీర్ ఊపందుకుంటున్న స‌మయంలోనే పెళ్లి చేసుకుని విదేశాల‌కు వెళ్లి పోయింది.

ఇటీవ‌ల సందీప్ కిష‌న్‌, రావు ర‌మేశ్ మ‌జాకాతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ మూవీ అంత‌గా విజ‌య‌వంతం కాక‌పోవ‌డంతో ఏవైనా ఛాన్సులు వ‌స్తే వ‌స్తా అన్న‌ట్లు విదేశాల‌కు తిరిగి వెళ్లిపోయింది. అయితే పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లున్నా ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకుంది.

తాజాగా త‌న భ‌ర్త , పిల్ల‌ల‌తో క‌లిసి దుబాయ్ ట్రిప్‌కు వెళ్లిన ఈ భామ అక్క‌డ ఓ ఖ‌రీదైన హోట‌ల్‌లో బ‌స చేసి, స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతూ అందాలు ఆర‌బోస్తూ అభిమానుల‌కు స‌డ‌న్ షాక్ ఇచ్చింది.

ఆ ఫొటోలు చూసిన వారంతా అన్షును ఇంత హాట్‌గా ఎన్న‌డూ చూడ‌లేదంటు కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లోనూ ఎప్పుడూ అందాల ప్ర‌ద‌ర్శ‌ణ చేయ‌ని ఈ బ్యూటీ ఇప్పుడేంటీ ఇంత‌గా గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తుందంటూ అనుకుంటున్నారు.

వర్షాకాలంలో చూడాల్సిన ప్రదేశాలు..

వర్షాకాలంలో ఈ ప్రదేశాల అందం చూసేందుకు రెండు కళ్ళు చాలవు.. సేఫ్ అండ్ సెక్యూర్ పర్వత ప్రాంతాలు ఇవే..

కొత్త కొత్త ప్రదేశాల్లో పర్యటించడం ఇష్టమా..! అది కూడా వర్షాకాలంలో మన దేశంలోని పర్వత ప్రాంతాలను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే వర్షాకాలంలో కూడా మీరు ఎటువంటి భయం లేకుండా ప్రకృతిని ఆస్వాదించగల కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలకు భయపడితే ఈ ప్రదేశాలకు వెళ్లేందుకు ట్రై చేయండి.

వర్షాకాలంలో ప్రజలు తరచుగా పర్వత ప్రాంతాలకు వెళ్లడానికి వెనుకాడతారు. ఎందుకంటే ఈ సమయంలో పర్వతాలపై వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య ప్రాంతంలోని కొండ ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడే సంఘటనలు కనిపిస్తాయి. ఇది ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి మాత్రమే కాదు పర్యాటకుల సెలవులను కూడా పాడు చేస్తుంది.

అటువంటి పరిస్థితిలో.. వర్షాకాలంలో ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారికి.. ప్రమాదాలను నివారించాలనుకునే వారికి, కొండచరియలు విరిగిపడే ప్రమాదం చాలా తక్కువగా లేదా దాదాపుగా లేని కొన్ని హిల్ స్టేషన్లు ఉన్నాయి. కనుక ఈ రోజు భారతదేశంలోని నాలుగు ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. ఇవి వర్షాకాలంలో కూడా పూర్తిగా సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. సందర్శించడానికి కూడా చాలా అందంగా ఉంటాయి.మధ్యప్రదేశ్ లోని పంచమర్హి కొండచరియలు విరిగిపడకుండా ఉండాలనుకుంటే.. పంచమర్హి మంచి గమ్యస్థానం. ఇది మధ్యప్రదేశ్‌లోని సాత్పురా కొండలలో ఉన్న ఒక హిల్ స్టేషన్, ఇది అందంగా, సురక్షితంగా ఉంటుంది. ఇక్కడ భూమి రాతితో కూడుకున్నది. కనుక ఇక్కడ కొండచరియలు విరిగిపడే సంఘటనలు చాలా తక్కువ. వర్షాకాలంలో ఇక్కడి పచ్చదనం, జలపాతాలు, గుహలు చూడదగినవి. ప్రకృతిని ఆస్వాదించడానికి, తక్కువ జనసమ్మర్థం ఉన్న ప్రదేశం ఇది.

లోనావాలా మంచి ఎంపిక. పూణే, ముంబై మధ్య ఉన్న లోనావాలా వర్షాకాలంలో సందర్శించదగిన ప్రసిద్ధ వారాంతపు విహార ప్రదేశం. ఇది మీకు హిల్ స్టేషన్ పూర్తి వైబ్‌ను అందిస్తుంది. ఇక్కడ కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా చాలా తక్కువ. వర్షాకాలంలో ఇక్కడి జలపాతాలు, పచ్చదనం, భూషి ఆనకట్ట, రాజ్‌మాచి కోట చూడదగినవి. సురక్షితమైన రోడ్లు, మెరుగైన కనెక్టివిటీ దీనిని కుటుంబంతో సందర్శించడానికి సరైన ప్రదేశంగా చేస్తాయి.

హరిత భోజన సౌందర్యం.

హరిత భోజన సౌందర్యం…

‘సలాడ్‌’ అనే లాటిన్‌ పదంలో ‘సాల్‌’అంటే ఉప్పు. వండకుండా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని ఉప్పు, వెన్నతో కలిపి తినటాన్ని వాళ్లు ‘సలాడ్‌’ అనీ, మనవాళ్లు ‘హరితం’ లేదా ‘హరితకం’ అనీ అన్నారు.

సలాడ్‌’ అనే లాటిన్‌ పదంలో ‘సాల్‌’అంటే ఉప్పు. వండకుండా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని ఉప్పు, వెన్నతో కలిపి తినటాన్ని వాళ్లు ‘సలాడ్‌’ అనీ, మనవాళ్లు ‘హరితం’ లేదా ‘హరితకం’ అనీ అన్నారు. భారతీయమైన సలాడ్లు అనేకం ఉన్నాయి. ‘భోజన కుతూహ లం’ పాకశాస్త్ర గ్రంథంలో సలాదుల అధ్యా యమే ఉంది! కొన్ని సలాదుల్ని పరిశీలిద్దాం.

ఆమ్ర హరితం (మామిడిపండు సలాడ్‌): రుచికరం. వాతాన్ని తగ్గిస్తుంది. కఫాన్ని, వేడినీ పెంచుతుంది. జీర్ణశక్తిని తగ్గిస్తుంది.

బింబీ హరితం (దొండపండు సలాడ్‌): శరీరం బరువుని పెంచుతుంది. కాంతినిస్తుంది. వాతాన్ని వేడినీ తగ్గిస్తుంది.

మూలక హరితం (ముల్లంగి సలాడ్‌): తేలికగా అరుగుతుంది. జీర్ణకోశ వ్యాధుల్ని తగ్గిస్తుంది. త్రిదోషాల్ని సమంగా ఉంచుతుంది కారవేల్లక హరితం (కాకరకాయ సలాడ్‌): జాఠరాగ్ని పెరుగుతుంది. షుగరు వ్యాధిలో తినదగింది. నులిపురుగులు పోతాయి.

రంభాకాండ హరితం: (అరటిదూట – కాం డం, ఊచ): శరీరంలో వేడి, మంటలు, రక్త స్రావం తగ్గుతాయి. ఆలస్యంగా అరుగుతుంది.

కైదర్య హరితం (కరివేపాకు సలాడ్‌): రుచి, సుగంధ భరితం, త్రిదోషాల్ని హరిస్తుంది. క్షయ కుష్టు, జీర్ణకోశ వ్యాధుల్ని తగ్గిస్తుంది.

శృంగవేర హరితం (అల్లం సలాడ్‌): ఉప్పుతో నూరిన అల్లంముద్దని మొదటిముద్దగా తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. నాలుకపైన జిగురు పోతుంది. త్రిదోషనివారకం, వాపు, ఉబ్బరం, క్షయ, నిమ్ము తగ్గుతాయి. బలకరం. శుక్ర వర్ధకం. నిమ్మరసంలో ఊరబెట్టిన అల్లంసలాడ్‌ కఫాన్ని వేడినీ తగ్గిస్తుంది కంఠరోగాలు పోతాయి. లివర్‌, స్లీ ్పన్‌ వ్యాధుల్లో మంచిది. అల్లం+బెల్లం సలాడ్‌ బలకరం. వాతం కఫం తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. చింతపండు రసంతో అల్లం సలాడ్‌ కఫాన్ని పెంచుతుంది.

గజకర్ణీకందమూల సలాడ్‌ (సారచేమదుంప సలాడ్‌): ఏనుగు చెవి లాగా పెద్దపెద్ద ఆకులుండే మొక్క దుంప వేడి చేస్తుంది. కఫాన్ని వాతాల్ని, పాము విషాన్ని హరిస్తుంది. కుష్ఠు, రక్త హీనతల్ని తగ్గిస్తుంది.

కూష్మాండ హరితం (బూడిద గుమ్మడి సలాడ్‌): జలుబు, పడిశభారం, వేడి వీటిని తగ్గిస్తుంది. బలకరం. లైంగిక శక్తిపెరుగుతుంది.

అసిశింబి హరితం (చెమ్మకాయ – స్వోర్డ్‌ బీన్‌) సలాడ్‌: ఆలస్యంగా అరుగుతుంది. వాతాన్ని తగ్గిస్తుంది

వృంతాక హరితం (వంకాయ సలాడ్‌): వంకాయ ముక్కలు అల్లం, నిమ్మరసం,ఇంగువ, మిరియాలు కలిపిన సలాద్‌ కఫహరం.

మాకందికా హరితం (నల్ల ఆవాల మొక్క ఆకులతో సలాడ్‌): కఫవ్యాధుల్ని, అజీర్ణ వ్యాధుల్ని వాత వ్యాధుల్ని తగ్గిస్తుంది.బలకరం.

పారేవత హరితం (జామపండు సలాడ్‌): జామపండు ముక్కల్ని మసాలాలతో చేసిన సలాడ్‌ బలకరం, జీర్ణశక్తిని పెంచుతుంది.

తోయమాగధిక హరితం (జలపిప్పలి – బొక్కెన సలాడ్‌):దీని ఆకులు, ఫలాలు, ఫూలుసలాడ్‌కు అనుకూలంగా ఉంటాయి. కారంగా ఉంటుంది. దప్పికని కలిగిస్తుంది. జఠరాగ్నిని ఉత్తేజితం చేస్తుంది. విరేచనాల వ్యాధిని తగ్గిస్తుంది.

కదళీఫ లహరితం (అరటిపండు సలాడ్‌): తగిన మసాలాలతో అరటిపండు ముక్కల సలాడ్‌ వాతాన్ని వేడినీ తగ్గిస్తుంది. బలకరం.

శారిబ హరితం (సుగంధిపాల వేళ్ళ సలాడ్‌): కఫ వ్యాఽధులు, వేడివలన కలిగే వ్యాధులు, అజీర్తివ్యాధులు చర్మవ్యాధుల్ని తగ్గిస్తుంది.

త్రపుస హరితకం (కీరదోస సలాడ్‌): తగిన మసాలాలతో తీసుకుంటే మూత్ర వ్యాధుల్ని నివారిస్తుంది. వేడిని తగ్గిస్తుంది.

మహాబదర హరితకం (యాపిల్‌ సలాడ్‌): రుచికరం, బలకరం, శిరో రోగాలను తగ్గిస్తుంది.

కోశాతకీ హరితకం (బీరకాయ సలాడ్‌): హృదయానికి మంచిది. అన్ని వ్యాధుల్లో హితకరం.

పటోలా హరితకం (తియ్యపొట్ల సలాడ్‌): తగిన సంబారాలతో పొట్లముక్కల సలాడ్‌ వాత కఫ దోషాల్ని హరించి చలవనిస్తుంది.

సలాడ్‌ కోసం బ్రొకోలీ లాంటి ఖరీదైనవే కావాలని లేదు. వండనవసరం లేకుండా, కొన్ని నేరుగా, కొన్ని అన్నంలో ఆధరవుగా, కొన్ని పచ్చళ్లుగా, కొన్ని మసాలాలతో, కొన్ని పెరుగుతో తినదగినవి మన కూరగాయల్లో ఉన్నాయి. తాలింపు అదనపు రుచినిస్తుంది!

– డా. జి వి పూర్ణచందు, 94401 72642

మసాలా పనియారం

కావలసిన పదార్థాలు: రవ్వ – కప్పు, పెరుగు – ముప్పావు కప్పు, శనగలు- అర స్పూను, మినప్పప్పు-అర స్పూను, ఆవాలు – స్పూను, జీలకర్ర – అర స్పూను, కరివేపాకు రెబ్బలు-రెండు, స్వీట్‌ కార్న్‌ – రెండు స్పూన్లు, క్యాప్సికమ్‌, క్యారెట్‌, ఉల్లి ముక్కలు- ముప్పావు కప్పు, కొత్తిమీర – రెండు స్పూన్లు, అల్లం – ముక్క, పచ్చి కొబ్బరి తురుము – రెండు స్పూన్లు, ఈనో ఫ్రూట్‌ సాల్ట్‌ – అర స్పూను, నీళ్లు, నూనె – తగినంత.

 

తయారుచేసే విధానం: ఓ గిన్నెలో రవ్వ, పెరుగు, కాస్త నీళ్లు కలిపి పావుగంట పాటు నానబెట్టాలి. ఓ ప్యాన్‌లో కాస్త నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, శనగలు, మినప్పప్పు వేసి చిటపటలాడించాలి. కరివేపాకునూ చేర్చాలి. ఇంకా ఉల్లి, మిగతా కూరగాయల ముక్కలు, కొత్తిమీర, అల్లం, కొబ్బరి తురుము చేర్చాలి. ఈనో ఫ్రూట్‌ సాల్ట్‌, తగినంత నీళ్లని కలిపి కాస్త జారు పిండిలా చేసుకోవాలి. గుంత పెనంలో నూనె వేసి రవ్వ పిండిని వేసి అటూ ఇటూ దోరగా ఉడికిస్తే మసాలా పనియారం తయారు.

అలసందల వడ

కావలసిన పదార్థాలు: అలసందలు – కప్పు, అల్లం – చిన్న ముక్క, పచ్చి మిర్చి-మూడు, జీలకర్ర – స్పూను, ఉల్లి -అర కప్పు, ఉల్లి కాడలు – రెండు స్పూన్లు, కరివేపాకు రెబ్బలు- కొన్ని, ఇంగువ-కాస్త, కారం-పావు స్పూను, ఉప్పు, నీళ్లు – తగినంత.

తయారుచేసే విధానం: అయిదు గంటల పాటు నీళ్లలో నానబెట్టిన అలసందలను మిక్సీలోకి తీసుకోవాలి. పచ్చి మిర్చి. అల్లం, జీలకర్రను కూడా చేర్చి రుబ్బాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త గరకుగా రుబ్బు ఉండేలా చూసుకోవాలి. ఈ రుబ్బును ఓ గిన్నెలోకి తీసుకుని ఉల్లి, కరివేపాకు, ఉల్లి కాడలు, ఉప్పు, ఇంగువ, కారం వేసి బాగా కలపాలి. చేతికి నూనె పూసుకుని ఈ మిశ్రమాన్ని ముద్దలుగా చేసి నూనెలో వేయిస్తే అలసందల వడలు సిద్ధం. అయితే తక్కువ మంటమీదే కాల్చడం ఉత్తమం.

మ‌రోసారి.. ఫుల్‌గా ఓపెన్ అయిన తెలుగు బ్యూటీ.

మ‌రోసారి.. ఫుల్‌గా ఓపెన్ అయిన తెలుగు బ్యూటీ..

 

 

నేటిధాత్రి:

 

 

 

 

సుప్రీతా నాయుడు సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌, న‌టి.

సుప్రీతా నాయుడు (Supritha Bandaru Naidu) సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌, న‌టి. ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ఒక సినిమా చేయ‌కున్నా బ‌డా హీరోయిన్లను త‌ల‌న్నేలా అందాల‌తో హోయ‌లు బోతూ త‌న ఫ్యాన్స్‌కు నిత్యం త‌నివితీరా ఫుల్ మీల్స్ పెడుతోంది.

 

స‌మ‌యం దొరికితే విదేశాలు, బీచులు, ప‌బ్‌లు తిరుగుతూ అందాల‌ను వ‌డ్డిస్తోంది. తాజాగా త‌ను హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ న‌టించిన సినిమా ప్ర‌మోష‌న్‌లో పాల్గొన్న ఆమె నా ఇష్ట ప్ర‌కారమే నా డ్రెస్సింగ్ ఉంటుందంటూ బోల్డ్ కామెంట్లు చేసింది.

 

అది మ‌ర‌కువ‌కు ముందే తాజాగా త‌న ఎద అందాల‌న్నింటినా ఒపెన్‌గా ప్ర‌ద‌ర్శిస్తూ మ‌రోసారి చూసే వారికి క‌నుల వింతు చేసింది.

 

ఇప్పుడు ఈ పొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

అందాల పోటీలను రద్దుకు కోసం అడిగితే అరెస్టులా.

అందాల పోటీలను రద్దుకు కోసం అడిగితే అరెస్టులా..

ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత

హైదారాబాద్ నేటిధాత్రి:

ప్రపంచ సుందరి అందాల పోటీలను రద్దు చేయాలని అడిగినందుకు మహిళా సంఘాల నాయకుల హౌస్ అరెస్టులతో నిర్బంధించడం అప్రజాస్వామికమని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత పేర్కొన్నారు.మహిళా నేతల హౌస్ అరెస్టుల పట్ల వై గీత ఖండించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల యొక్క అంగంగా ప్రదర్శన ప్రపంచస్థాయి పోటీలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రపంచ సుందరి అందాల పోటీలు ఉంటాయని అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండే ఈ పోటీలను ఇక్కడ నిర్వహించకూడదని కోరారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికంగా దివాల తీస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికే ఇబ్బందిగా ఉందని చెప్తూ ప్రపంచ సుందరి అందాల పోటీలకు 300 కోట్లు రూపాయలు ఖర్చు చేయడం సరైనది కాదని ఆరోపించారు. ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో పిఓడబ్ల్యు జాతీయ నాయకురాలు సంధ్యతోపాటు ఐద్వా నాయకురాలు మల్లు లక్ష్మి,ఇతర జిల్లాలలో నాయకులను ఇళ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్టులు చేయడం అప్రాజస్వామిక చర్యగా భావిస్తున్నట్లు పేర్కొంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గీత ప్రభుత్వాన్ని వేడుకొన్నారు.

వేసవి కాలంలో ప్రకృతి సోయగం.

వేసవి కాలంలో ప్రకృతి సోయగం

కనువిందు చేస్తున్న ముదిగుంట రహదారి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట, కాన్కూర్ మార్గంలో కనువిందు చేస్తున్న రహదారి వనాలు.

ముదిగుంట రహదారి నుండి ప్రయాణించే వాహనాదారులు ఈ ప్రకృతి వనాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలు దిగుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఇంత మండు వేసవి కాలంలో కూడా ఈ చెట్లు ఒకదానికి ఒకటి అల్లుకొని చల్లదనాన్ని ఇస్తూ రహదారి వెంట పూలవనంతో చూపరులను అబ్బురపరుస్తున్నాయి. ఇలాంటి ఆహ్లదమైన వాతావరణాన్ని పకృతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version