‘తడిసిన ధాన్యం.. ఇబ్బందుల్లో రైతులు’
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరి, చిన్నరేవల్లి, మోదంపల్లి, హేమాజీ పూర్ తదితర గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్దరేవల్లి రైతు వేదిక వద్ద ఈదురు గాలులకు ఆరబెట్టిన ధాన్యం స్వల్పంగా తడిసింది. ఈదురు గాలులకు కుప్పలపై కప్పిన టార్పలిన్లు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిందని రైతులన్నారు. తాత్కాలికంగా నిర్మించిన టెంట్ సైతం కూలిపోయిందన్నారు.