మహోత్సవానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం.!

ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/నేటి ధాత్రి :

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మున్సిపల్ పట్టణానికి చెందిన భగత్ సింగ్ తండాలోని నూతన దేవాలయంలోని విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ & ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ రూ.25 వేల ఆర్థిక సహకారం అందించారు. ఈనెల 16,17,18,19 తేదీలలో జరిగే బ్రహ్మోత్సవాలకు కూడా రావలసిందిగా ఉప్పల వెంకటేష్ ఆహ్వానం అందించిన భగత్ సింగ్ తండా ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు.ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకటేష్ సైన్యం & తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధమోని రమేష్ గౌడ్ ,భగత్ సింగ్ తండా నాయకులు రాజు నాయక్, బాలు నాయక్, హర్యా నాయక్, దేవేందర్ నాయక్, భాస్కర్ నాయక్, బోడు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

విగ్రహ ప్రతిష్ట మహోత్సవా నికి హాజరైన గండ్రజ్యోతి

కన్నులపండుగలా విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం ప్రతిపాక గ్రామంలో జరుగు తున్న ఆదిత్యాది నవగ్రహ పునః ప్రతిష్ట మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన భూపాలపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిని పత్తిపాక భక్త బృందం వారికి ఘన స్వాగతం పలికారు, అనంతరం దేవతామూర్తుల దర్శనం చేసుకుని, భక్తులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు పసుల ప్రవీణ్ కుమార్, గాదె రాజేందర్, దాసి శ్రావణ్ కుమార్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి నందం, ముఖ్య నాయకులు గంటా శ్యాంసుందర్ రెడ్డి దంపతులు, సావుళ్ళ కిష్టయ్య, కరుణ్ బాబు, బండ నారాయణరెడ్డి, పల్లవేనా రామరాజు గజ్జిరాజు, పోతుగంటి సుభాష్, మాందాడి రాజు, కుసుమ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version